Political News

కాంగ్రెస్ నేత‌ల‌కు రేవంత్ క్లాస్?

తెలంగాణ‌లో జ‌రుగుతున్న మునిసిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని క‌మిటీల‌ను నియ‌మించింది. మ‌రో నాలుగు రోజుల్లోనే ఈ ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యానికి తోడు మెజారిటీ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ నేత‌లు.. అసంతృప్తితో ఉన్నారు. త‌మ‌కు అవ‌కాశం చిక్క‌లేద‌ని భావిస్తున్నావారు.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అనుకుంటున్న‌వారు.. అల‌క వ‌హిస్తున్నారు. అయితే.. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి వారిని బుజ్జ‌గించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. …

Read More »

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి క‌ల్యాణ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్ నుంచి ఇత‌ర నాయ‌కుల వ‌ర‌కు కూడా ప‌వ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని దూకుడు వ్యాఖ్య‌లు చేశారు. దీనికి కార‌ణం.. తెలంగాణ‌లో జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేసేందుకు రెడీ కావ‌డ‌మేన‌ని తెలుస్తోంది.ఈ …

Read More »

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి పార్టీలు కలిసి కట్టుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పార్టీలు మంతనాలు చేశాయి. ప్రధానంగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన, చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అయినా వాటిని …

Read More »

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు కోర్టుకు స‌మ‌ర్పించింది. అయితే.. ఈ నివేదిక‌లో ప‌లు విష‌యాల‌ను విస్మ‌రించార‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అస‌లు దోషుల‌ను విస్మ‌రించార‌ని.. కేవ‌లం అధికారుల‌పైనే నివేదిక ఆరోప‌ణ‌లు చేసింద‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు దోషుల వ్య‌వ‌హారాన్ని కూడా తేల్చి తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సి ఉంద‌ని …

Read More »

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది? అనేది ఆయన వివరించారు. పాయింట్ల వారీగా చూస్తే సీఎం చంద్రబాబు లేవనెత్తిన అనేక అంశాలు వైసీపీని అత్యంత ఇరుకున పెట్టే అంశాలుగా మారాయి. ప్రధానంగా: 1) …

Read More »

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందా? అంటే మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఆరోపించారు కాబట్టి ఔననే అనాలా? లేక ప్రస్తుత, గత పరిణామాలను అంచనా వేస్తే కాదని అనాలా? అనేది ప్రశ్న. ఎందుకంటే క్రాంతి అనుకుంటున్నట్టుగా కాపులను అంతగా ప్రభావితం చేసే శక్తి అంబటికి లేదనే …

Read More »

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో పలు సందేహాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది. ముఖ్యంగా రెండు కీలక అంశాలపై ప్రజల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా రాజకీయ వివాదాలను ఎదుర్కొనాలన్నది ఇప్పుడు ప్రధాన లక్ష్యం. తిరుమల లడ్డూ వ్యవహారంపై …

Read More »

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది కామ‌న్‌. కానీ, బుధ‌వారం అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్వ‌యంగా కోర్టుకు హాజ‌రు కావ‌డం.. బ‌లంగా త‌న వాద‌న‌లు విన్న‌వించ‌డం.. దీనిని ప్ర‌త్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది సుప్రీకోర్టుకు హాజ‌రుకావ‌డం.. చివ‌ర‌కు గేట్ల‌ను మూసివేయ‌డం వంటివి దేశం మొత్తాన్నీ విస్మ‌యానికి గురి చేశారు. ఆ …

Read More »

రాజ్యసభలో కమల్ నోట తెలుగు మాట

తమిళ లెజెండరీ నటుడు కమల్ హాసన్.. కొన్నేళ్ల ముందు కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కానీ ఎన్నికల్లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కమల్ పార్టీ ‘మక్కల్ నీది మయం’ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయినా కమల్ ఏమీ పార్టీని మూసేయలేదు. రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి ఆయన మద్దతుదారుగా మారారు. ఆ పార్టీనే ఆయన్ని రాజ్యసభకు పంపింది. తాజాగా బడ్జెట్ …

Read More »

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి వ‌చ్చిన పవ‌న్ క‌ల్యాణ్‌.. సీఎంతో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన అనేక అంశాల‌పై వారు దృష్టి పెట్టారు. అదేస‌మ‌యంలో వైసీపీ కుల రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తుండ‌డంపైనా చ‌ర్చించారు. ఈ విష‌యాల‌ను ఆషామాషీగా వ‌దిలేయ‌డానికి వీల్లేద‌ని బ‌ల‌మైన ఎదురు దాడితోనే నిలువ‌రించాల‌ని ఇరువురు నిర్ణ‌యించారు. ఇవీ అంశాలు! 1) …

Read More »

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌జ‌లు ఛీత్క‌రించిన విష‌యంతెలిసిందే. దీంతో 151 స్థానాల నుంచి 11 స్థానాల‌కు వైసీపీ ప‌రిమితం అయింది. ఇలా ఎందుకు జ‌రిగింది? అనేది సుస్ప‌ష్టం. నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరు, దుర్భాష‌లు, అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు.. ఎక్క‌డిక‌క్క‌డ దౌర్జ‌న్యాలు, …

Read More »

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చేయడం వంటి చర్యలు ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదేం పద్ధతి? అంటూ హైకోర్టు పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులను నడిరోడ్డుపై నడిపించడం అంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత? …

Read More »