ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ 2025లో ఏ విధంగా ముందుకు సాగింది? 2024లో 21 స్థానాల్లో విజయం దక్కించుకున్న దరిమిలా.. ఈ ఏడాది ఏవిధంగా పార్టీ అభివృధ్ధికి.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్లాన్ చేశారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. గత ఐదేళ్ల జనసేన పార్టీ గ్రాఫ్తో పోల్చుకుంటే.. 2025లో మాత్రం బలమైన పునాదులే పడ్డాయని చెప్పాలి. పార్టీ పరంగానే కాకుండా.. పార్టీ …
Read More »తిరుపతికి తెలంగాణ సీఎం – టీడీపీ మంత్రుల స్వాగతం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో సహా ఏపీకి వచ్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు.. కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు.. సహా స్థానిక ఎమ్మెల్యేలు.. పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా ఎస్. …
Read More »టాక్: విజయ్ కు రాజ్యసభ ఎంపీ సీటు?
ఏపీ అసెంబ్లీ స్పీకర్.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు.. యువ నేత, సీబీఎన్ ఆర్మీ, ఐటీడీపీలో గతంలో కీలక రోల్ పోషించిన చింతకాయల విజయ్కు కీలక పదవి దక్కనుందా? ఆయనను పెద్దల సభకు పంపించనున్నారా? అంటే.. తాజాగా ఔననే చర్చే టీడీపీలో సాగుతుండడం గమనార్హం. 2026, జూన్ 21న .. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో సానా సతీష్ బాబు …
Read More »పవన్కు మేలి మలుపుగా.. 2025.. !
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో 2025 మేలి మలుపు సంవత్సరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా 5 అంశాలు.. పవన్కు ఈ సంవత్సరం కలిసి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు.. పవన్ను ప్రజలు చూసిన కోణానికి భిన్నంగా ఆయన సామాన్యులకు చేరువ అయ్యారన్న చర్చ సాగుతోంది. 1)సనాతని: ఈ ఏడాది పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరు పూర్తి సనాతన వాదిగా ఆయన ప్రోజెక్టు అయ్యేలా …
Read More »చాగంటి తర్వాత మంతెన… చంద్రబాబు మార్క్
జగన్ హయాంలో ప్రభుత్వ సలహారులను లెక్కకు మించి నియమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా నియమించిన సలహాదారుల్లో మెజారిటీ సలహాదారులు రాజకీయాలకు సంబంధించిన వారే ఉన్నారని, జగన్ సన్నిహితులను సలహాదారులుగా నియమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే, కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సమాజ హితం కోరి ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తోంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావును ఏపీ ప్రభుత్వ విద్యార్థులు, నైతిక విలువల సలహాదారుగా ప్రభుత్వం …
Read More »మందుబాబులూ…సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!
మందుబాబులం మేము మందుబాబులం…మందుకొడితె మాకు మేమె మహారాజులం…నిజంగానే చాలామంది మందుబాబులు మందేయగా ఇలాగే ఫీలవుతుంటారు. అందుకే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగానే…మా నాన్నఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా? ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ…అంటూ ట్రాఫిక్ పోలీసులను, పోలీసులను బెదిరిస్తుంటారు. అయితే, ఇకపై అలా బెదిరించే బిల్డప్ బాబాయ్ ల ఆటలు చెల్లవంటున్నారు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్. వీసీ …
Read More »కాంగ్రెస్ `సెంటిమెంటు`పై… బీజేపీ ఫైట్!
2025లో జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంటుగా ఉన్న అనేక అంశాలపై .. కేంద్రంలోని బీజేపీ పెద్దలు దాడి చేస్తున్నారన్న వాదన స్పష్టంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తల పునాదులు ఉన్నప్పటికీ.. దీనికి తోడు.. అంతే బలమైన గాంధీ-నెహ్రూల వారసత్వ సెంటిమెంటు కూడా.. కలిసి వస్తోంది. కానీ, చిత్రంగా ఈ సెంటిమెంటుపైనే బీజేపీ ఈ ఏడాది మొత్తం దాడి చేసింది. ఇంటా బయటా కూడా.. కాంగ్రెస్ పార్టీని …
Read More »తెలంగాణ అసెంబ్లీలో ‘బాంబుల’ గోల
మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్లో పలు పిల్లర్లు కుంగిన వైనం తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికలకు ముందు చెలరేగిన రాజకీయ దుమారం ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రభావం చూపింది. పిల్లర్లు కుంగడానికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన కమిషన్ నివేదిక కూడా …
Read More »కేసీఆర్ వద్దకు రేవంత్, నిలబడని కేటీఆర్!
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలను పక్కనపెట్టి ప్రత్యర్థులను సైతం గౌరవించాల్సిన పరిస్థితులుంటాయి. పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదో…ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే అసలైన రాజకీయ నాయకుడు. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆ కోవలోకే వస్తానని నిరూపించుకొనీ ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినా సరే కనీస …
Read More »కేబినెట్ సమావేశంలో మంత్రి కన్నీరు, బాబు ఓదార్పు
రాయచోటి జిల్లా కేంద్రం మార్పు అంశం ఏపీ క్యాబినెట్ సమావేశంలో భావోద్వేగానికి దారితీసింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పాటవుతున్న మదనపల్లె జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాయచోటి అభివృద్ధి, ప్రజల భావోద్వేగాలను పరిగణన లోకి తీసుకోవాలని ఆయన క్యాబినెట్లో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాం ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం …
Read More »‘తెలంగాణ విడిపోయాక తిరుపతిలో ఇబ్బందులు’
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం సందర్భంగా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విషయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభలో ప్రస్తావించారు. అంతేకాదు, …
Read More »అసెంబ్లీలో: జగన్ ను ఫాలో అయిన కేసీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అని కేసీఆర్ చెప్పడంతో నేటి నుంచి జరగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ శాసన సభలో అడుగుపెట్టారు. అయితే, సమావేశాలు మొదలైన 10 నిమిషాలకే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates