Political News

మెడిక‌ల్ స‌ర్వీసులో ఏఐ ప‌రిమ‌ళాలు.. బాబు దూర‌దృష్టి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సాంకేతిక‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రైతుల‌కు సంబంధించిన అనేక విష‌యాల్లో డ్రోన్ల‌ను వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఐటీ రంగంలో ఏఐని ప్రోత్స‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఏఐ యూని వర్సిటీని కూడా విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఇలా.. ప్ర‌తి రంగంలోనూ సాంకేతిక ప‌రిమ‌ణాలు వెద‌జ‌ల్లేలా చేస్తు న్నారు. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని వైద్య సేవ‌ల్లోనూ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించా రు. …

Read More »

కేటీఆర్ కు ఈడీ పిలుపు.. నెక్ట్స్ అరెస్టేనా?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు కేటీఆర్‌కు ‘ఫార్ములా ఈ – రేస్’ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్ప‌టికే ద‌ర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు దీనిపై విచార‌ణ‌కు ఈడీని కూడా కోరారు. దీంతో ఈడీ ఈ కేసు వివ‌రాల‌ను ప‌రిశీలించింది. ఈ క్ర‌మంలో తాజాగా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 7న విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో కేటీఆర్‌కు స్ప‌ష్టం చేసింది. అయితే.. విచార‌ణ సంద‌ర్భంగా కేటీఆర్‌ను …

Read More »

ప‌వ‌న్ పర్యటనలో… నకిలీ ఐపీఎస్‌?

పేద్ద గ‌న్ ప‌ట్టుకుని.. ఆరు అడుగుల ఎత్తుతో చూడ‌గానే నేర‌స్తుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్న ఈ అధికారి.. ఐపీఎస్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఈయ‌న న‌కిలీ ఐపీఎస్‌. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇటీవ‌ల మ‌న్యంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. ఈయ‌న ఆసాంతం ఆయన ప‌ర్య‌ట‌న‌లోనే ఉన్నాడు. పైగా అధికారుల‌ను కూడా గ‌ద‌మాయించాడ‌ట‌. తాజాగా ఈ విష‌యం వెలుగు చూసింది. వాస్త‌వానికి ఈయ‌న న‌కిలీ అన్న విషయాన్ని సాధార‌ణ పోలీసులు …

Read More »

పవర్ స్టార్ వేరు – డిప్యూటీ సీఎం వేరు : ఫ్యాన్స్ అర్ధం చేసుకోవాలి!

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఈ ఇద్దరూ ఒక్కటేనా? పవన్ అభిమానులు అయితే ఈ ఇద్దరూ ఒక్కటే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం అలా అనుకోవడం లేదన్న విషయం ఫ్యాన్స్ గ్రహించాలి. సినీ హీరో పవన్ కల్యాణ్ ను, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ ను వేరు వేరుగా చూడాలని పవన్ ఇటీవల కాలంలో చాలాసార్లు చెప్పారు. అయినా …

Read More »

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి… మెమోరియల్ పై కేంద్రం క్లారిటీ

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అధికారికంగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ దిగ్గజ నేతకు పలువురు ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ పాల్గొన్నారు. వీరితోపాటు, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ …

Read More »

కొడాలి నాని రాజ‌కీయ స‌న్యాసం..!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రిగినా.. నాయ‌కులు త‌మ మంచికేన‌ని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి జ‌రిగే ప‌రిణామాలు సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి ప‌రిణామ‌మే వైసీపీలోనూ జ‌ర‌గ‌నుంది. కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. రాజ‌కీయంగా స‌న్యాసం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలిసింది. దీనిపై త్వ‌ర‌లోనే ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నట్టు గుడివాడలో చ‌ర్చ సాగుతోంది. రాజ‌కీయంగా కొడాలి నాని దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు కొడాలికి …

Read More »

టీటీడీ సరికొత్త పాలసీ.. విఐపీ బ్రేక్ దర్శనాలపై కీలక ప్రకటన!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను స్వీకరించకుండా ఉండాలని టీటీడీ స్పష్టం చేసింది. ప్రోటోకాల్ ప్రాముఖులు స్వయంగా దర్శనానికి వచ్చినప్పుడే బ్రేక్ దర్శనాలను అనుమతిస్తామని టీటీడీ ఈఓ శ్యామల రావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం జనవరి 10 నుంచి 19 వరకు …

Read More »

అమరావతి రయ్.. రయ్.. బిట్స్.. లా వర్సిటీ

ఆంధ్రుల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. 2014లో జరిగిన తప్పుల్ని రిపీట్ చేయని ఆయన.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజధాని అమరావతి విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో.. అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా రానున్న సంస్థల వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇన్ స్టిట్యూట్ …

Read More »

వైసీపీకి ఇంతియాజ్ గుడ్ బై.. జ‌గ‌నే రీజ‌న్‌!

కార‌ణాలు లేవ‌ని పేర్కొంటూనే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌. వైసీపీకి ఆయ‌న గుడ్ బై చెప్పారు. తాను స్వ‌చ్చందంగానే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎక్క‌డా ఎవ‌రినీ ఆయ‌న విమ‌ర్శించ‌లేదు. ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. తాను న‌మ్మిన ప్ర‌జాసేవ‌కు స్వ‌చ్ఛందంగానే అంకితం కావాల‌ని అనుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. సాహిత్య‌మంటే త‌న‌కు అభిలాష అని పేర్కొన్న ఇంతియాజ్‌.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కూడా తాను న‌డుంబిగించ‌నున్న‌ట్టు తెలిపారు. …

Read More »

యువ ఎమ్మెల్యే దూకుడు: ప్ర‌చారం కాదు.. ప‌నిచేస్తున్నారు ..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న గాలి భానుప్ర‌కాష్ నాయుడు.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న వివాదాల‌కు క‌డు దూరంగా ఉంటున్నారు. నిజానికి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న రోజా.. ఫైర్ అన్న సంగ‌తి తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కంటే.. ఆమె మాట‌ల ద్వారానే.. ఎక్కువ‌గా మీడియా ముందుకు వ‌చ్చారు. వివాదాల‌కు కేంద్రంగా మారారు. కానీ, తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న …

Read More »

వైఎస్’ల వార‌స‌త్వం కోసం జ‌గ‌న్ ఆరాటం!

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఓ ప్ర‌శ్న సంధించారు. వైఎస్ వార‌సురాలిని నేనేన‌ని.. బీజేపీతో చేతులు క‌లిపిన జ‌గ‌న్ కానేకాద‌ని ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. ఎన్నిక‌ల త‌ర్వాత త‌మ పై జ‌గ‌న్ కేసు వేసిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. వైఎస్ వార‌సుడు.. అయి ఉంటే సొంత చెల్లి, త‌ల్లిపైనే కోర్టుకు ఎక్కుతాడా? అంటూ నిప్పులు చెరిగారు. మొత్తంగా వైఎస్ …

Read More »

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌కు హైకోర్టు ఊరట

తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా జరిగిన విచారణలో, కోర్టు కేటీఆర్‌పై ఎలాంటి అరెస్టు చర్యలు తీసుకోకూడదని ఏసీబీని ఆదేశించింది. …

Read More »