సీఎం చంద్రబాబుతో బీజేపీ నాయకుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లో తాజాగా ఆదివారం ఇరువురు నాయకులు భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఈ భేటీ జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ఏం చర్చించారనే విషయాలపై రెండు కీలక అంశాలు తెరమీదికి వచ్చాయి. 1) పార్టీ మారి టీడీపీలోకి చేరడం. 2) టీటీడీ బోర్డు చైర్మన్ పదవి. ఈ రెండు అంశాలపైనే ఇరువురు చర్చించుకున్నారనేది రాజకీయ …
Read More »బీఆర్ఎస్కు వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయ్: రేవంత్రెడ్డి
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 10 ఏండ్ల కిందట కరపత్రాలకే సొమ్ములు లేవని చందాలు అడిగిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు 1500 కోట్ల రూపాయల పైగా నిధులు వచ్చాయన్నారు. ఈ సొమ్ముడు ఏడ నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. “అధికారంలో ఉండగా.. అదిలించి.. బెదిరించి.. రాబట్టుకున్న సొమ్ములు కాదా? కాదని చెప్పే ధైర్యం ఉందా?” అని నిలదీశారు. తెలంగాణ …
Read More »తీరు మార్చుకుంటానన్న కొలికపూడి?
తిరువూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కొంతకాలంగా పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్న సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ తో శ్రీనివాసరావుకు విభేదాలు రావడంపై కూడా టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే శ్రీనివాసరావుపై, ఆయన తీరుపై తిరువూరులోని పలువురు టీడీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ వివాదంపై పార్టీ అధిష్టానం …
Read More »మోడీ తరఫున కేజ్రీవాల్ ప్రచారం..కండిషన్స్ అప్లై!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టై ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా ప్రధాని మోడీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను చెప్పిన పని మోడీ చేస్తే బీజేపీ తరఫున తాను ప్రచారం చేస్తానని క్రేజీ ఆఫర్ ఇచ్చారు కేజ్రీవాల్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని …
Read More »ఉదయనిధికి ప్రశంసలు.. పవన్పై కౌంటర్లు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు మధ్య కొన్ని రోజులుగా ఆన్ లైన్లోనే కాక బయటా వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మం గురించి బలంగా గళం వినిపిస్తుండగా.. ఆయన తీరును ప్రకాష్ రాజ్ తప్పుబడుతున్నారు. సున్నితమైన అంశాన్ని జాతీయ స్థాయిలో బ్లో అప్ చేసి రాజకీయ ప్రయోజనానికి వాడుకుంటున్నారని, ప్రజలను విభజిస్తున్నారని పవన్ …
Read More »నేను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయింది: రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. “నేను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయింది. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి” అని పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి సీఎం అప్పాయింట్మెంట్ లెటర్లు అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయన్నారు. అందుకే అప్పట్లో తాను.. విద్యార్థి …
Read More »శ్రీకాకుళంలో వైసీపీ ధర్మాన చిచ్చు.. ఎప్పటికి చల్లారునో.. !
అధికారంలో ఉన్నప్పుడు అంతా నాదే అంటూ.. కొందరు వైసీపీ నేతలు చెలరేగిపోయారు. క్షేత్రస్థాయిలో నాయకులకు అవకాశం కూడా కల్పించలేదు. బలమైన వర్గాలను కూడా పార్టీకి దూరం చేశారు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా పార్టీని నడిపించారు. అయితే.. వారు అనుకున్నట్టుగా.. వారు ఊహించుకున్న ట్టుగా.. ఎన్నికల ఫలితం రాలేదు. అంతా తలకిందలు అయిపోయింది. ఈ పరిణామం.. సదరు చక్రం తిప్పిన నాయకులకు ఎలా ఉన్నా.. పార్టీకి మాత్రం తీవ్ర ఇబ్బందిగా …
Read More »మోడీకి ఎదురు దెబ్బ.. హరియాణాలో కాంగ్రెస్దే అధికారం!
తాజాగా రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలోనూ.. పదేళ్ల తర్వాత జమ్ము కశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు తాజాగా ముగిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ విజయం దక్కించుకోవడం ద్వారా మోడీ తన హవాను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక పథకాలు కూడా …
Read More »షర్మిల పై కేవీపీ గుర్రు..
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ స్టార్వార్ట్గా ఆయన ప్రసిద్ధి చెందారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్నీ తానై 2004-2009 వరకు ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా, పార్టీని పరోక్షంగా నడిపించారు. ఒకరకంగా చెప్పాలంటే.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీనేకుడి భుజం. అందుకే వైఎస్ ఎగస్పార్టీ మీడియా.. ఏకంగా కేవీపీని వైఎస్ ఆత్మగా సంబోధించింది. అంతలా వైఎస్ కుటుంబంతో పెనవేసుకున్న కేవీపీకి వైఎస్ మరణం తర్వాత పెద్దగా ఆదరణ దక్కలేదు. జగన్తో కేవీపీ …
Read More »సామాన్యుల శాటిస్ఫ్యాక్షన్.. బాబు సరికొత్త ప్లాన్.. !
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో `ప్రజా ప్రభుత్వం `పై సామాన్యుల టాక్ ఎలా ఉందనేది ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తి కేవలం మేధావులు, విశ్లేషకుల్లోనే కాదు.. కూటమి సర్కారులోనూ ఎక్కువగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన గ్రాఫ్ను అంచనా వేసుకునే సీఎం చంద్రబాబు.. ఇప్పుడు సామాన్యుల శాటిస్పాక్షన్పై దృష్టి పెట్టారు. ఈ వంద రోజుల పాలనలో తమ పరిస్థితిపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న …
Read More »పవన్ విమర్శలకు డీఎంకే కౌంటర్
తిరుమల లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ హిందువులు ఆచరించే సనాతన ధర్మం గురించి చాలా బలంగా గళాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడేవారిపై ఆయన విరుచుకుపడుతున్నారు. గట్టిగా హెచ్చరికలూ జారీ చేస్తున్నారు. తాజాగా తిరుపతి సభలో ఆయన పరోక్షంగా డీఎంకే నేత, ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మీద కూడా విమర్శలు గుప్పించారు. కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు …
Read More »తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలి
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సీబీఐ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్వాగతించారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates