Political News

చొక్కా విప్పి కొరడాతో కొట్టుకున్న అన్నామలై

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం తన నివాసం ముందు చొక్కా విప్పి, కొరడాతో ఆరు సార్లు స్వయంగా కొట్టుకున్న ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో అన్నామలై డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో …

Read More »

ఉపయోగం లేదని తెలిసినా వీల్ చెయిర్ లోనే రాజ్యసభకు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్య సమస్యల మధ్య కూడా దేశం కోసం తన బాధ్యతలను నిర్వర్తించిన వైనం నిజంగా స్ఫూర్తిదాయకం. గురువారం రోజు ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎంతోమంది మహోన్నత నాయకులతో కలిసి పని చేసిన అనుభవం, కఠిన సమయాల్లో కూడా ఎంతో నిబద్ధతో ఉండడం ఆయనకే చెల్లింది. విమర్శలు, ప్రశంసలపై ఏనాడు అతిగా ఉప్పొంగిపోలేదు. మన్మోహన్ గతంలో ఆయన అనారోగ్యం కారణంగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, …

Read More »

మోడీ కోసం బాబు: ఎన్ని భ‌రిస్తున్నారంటే.. !

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోడీతో ఉన్న గ్యాప్‌ను దాదాపు త‌గ్గించుకునే దిశ‌గా సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ ఏం చెప్పినా.. చంద్ర‌బాబు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అదానీతో ఉన్న సౌర విద్యుత్ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని అనుకున్నా.. మోడీ అనుచ‌రుడు కావ‌డంతో అదానీతో స‌ఖ్య‌త లేక‌పోయినా.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నా.. స‌ద‌రు ఒప్పందాల‌ను మాత్రం చంద్ర‌బాబు ర‌ద్దు చేసుకోలేక పోతున్నారు. అదేవిధంగా స్మార్టు మీట‌ర్ల విష‌యంలోనూ …

Read More »

‘విజ‌న్-2020’ రూప‌శిల్పి బాబు.. కార్య‌శిల్పి మ‌న్మోహ‌న్‌.. !

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకువ‌చ్చిన ‘విజ‌న్‌-2020’ – అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దీనికి ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. భ‌విష్య‌త్తు మార్గ‌నిర్దేశనం చేస్తూ.. చంద్ర‌బాబు వేసిన పునాదులు ప్ర‌స్తుతం తెలంగాణ‌కు వ‌రంగా మారాయి. జీనోం వ్యాలీ నుంచి సైబ‌రాబాద్ వ‌ర‌కు అనేక విధానాలు తీసుకువ‌చ్చారు. అభివృద్ధి బాట ప‌ట్టించారు. ఆర్థికంగా కొత్త పుంత‌లు తొక్కించారు. అయితే.. ఈ విజ‌న్‌-2020 ఆలోచ‌న వెనుక రూప‌శిల్పి చంద్ర‌బాబే …

Read More »

ఏపీలో సీత‌క్క‌లు.. చంద్ర‌బాబు ఛాన్సిస్తారా ..!

తెలంగాణ మంత్రి ధ‌ర‌స‌రి సీత‌క్క‌.. ఫైర్‌.. ఫైర్‌బ్రాండ్‌! కొన్ని కొన్ని విష‌యాల్లో ఆమె చేసిన, చేస్తున్న కామెంట్లు కూడా ఆలోచింప‌జేస్తున్నాయి. అలానే.. పుష్ప‌-2 వివాదంపైనా ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును ఇరుకున ప‌డేశారు. జైభీమ్‌-పుష్ప‌-2కు.. జాతీయ అవార్డుకు లింకు పెట్టి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోయింది. ఇదేకాదు.. అనేక విష‌యాల్లో సిత‌క్క బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తున్నారు. ఈ ప‌రిణామాలు చూసిన త‌ర్వాత‌.. సీత‌క్క లాంటి …

Read More »

‘ప‌ల్లె పండుగ ‘తో ప‌వ‌న్ మైలేజీ.. ఎలా ఉందో తెలుసా ..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్షేత్ర‌స్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీల‌క‌మైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయ‌న క‌న్నేశార‌న్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అండ‌గా ఉంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా వారే నిలిచారు. పార్టీ చిత్తుగా ఓడిపోయి 11 స్థానాల‌కే ప‌రిమిత‌మైనా.. ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే.. 37 శాతానికి పైగా ఓట్లు …

Read More »

చింత‌కాయ‌ల వ‌ర్సెస్ చిన్న‌మ్మ‌.. ఇంట్ర‌స్టింగ్ పాలిటిక్స్‌!

ఏపీలో వైసీపీ నాయ‌కుల‌ను కూట‌మి పార్టీలు చేర్చుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే..ఇప్ప‌టి వ‌ర‌కు కూట‌మిలోని టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్యే ఈ త‌ర‌హా రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల అధినేత‌లు.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఆలోచించి.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను చెరో పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారి గ్రాఫ్‌ను ప‌రిశీలిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య వివాదాల‌కు అవ‌కాశం లేకుండా.. …

Read More »

జ‌గ‌న్ ఎఫెక్ట్‌: 2 వేల లీట‌ర్ల డీజిల్‌.. 2 కోట్ల ఖ‌ర్చు.. నీళ్లు తోడుతున్నారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజ‌ధానుల పేరుతో ఆయ‌న న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్టిన ఫ‌లితంగా ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల చేతి చ‌మురు బాగానే వ‌దులుతోంది. ఇటీవ‌లే.. రాజ‌ధాని ప్రాంతంలో ఏపుగా పెరిగి.. అడ‌విని త‌ల‌పించిన‌.. పిచ్చి మొక్క‌లు, తుమ్మ మొక్క‌ల‌ను తొల‌గించేందుకు రూ.32 కోట్లను కూట‌మి స‌ర్కారు ఖ‌ర్చు చేసింది. ఇక‌, ఇప్పుడు మ‌రో తంటా ముందుకు …

Read More »

బ్రేకింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ ను గురువారం సాయంత్రం చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలిం చారు. ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మన్మోహన్ మృతి పట్ల పలువురు రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెర …

Read More »

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా ఉంటాయి. ఒక్కొక్క‌సారి వాటిని ప‌క్క‌న కూడా పెట్టేస్తారు. కానీ, త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై.. తాజాగా భీష‌ణ ప్ర‌తిజ్ఞే చేశారు. ప‌ట్టుమ‌ని 10 శాతం ఓటు బ్యాంకు కూడా లేని రాష్ట్రంలో ఆయ‌న బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు తాను చెప్పులు వేసుకునేది …

Read More »

అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం? : సిఎం రేవంత్!

టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ఉంచగా…కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు టాలీవుడ్ పెద్దలు ఉంచారు. సమావేశంలో హీరో అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చినపుడు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పై తనకు కోపం లేదని, తనకు చిన్నప్పటి నుంచి బన్నీ, చెర్రీ తెలుసని, వారితో …

Read More »

రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు చెప్పిందిదే…

టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు ఉండవని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ క్రమంలోనే సినీ పెద్దలు రేవంత్ తో భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. …

Read More »