ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోందని టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా ఆయన మంగళగిరిలో ఏర్పాటు చేసిన కియా కార్ల షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలన, పెట్టుబడులు, ప్రపంచ స్థాయి సంస్థల రాక వంటి కీలక విషయాలపై మీడియాతో మాట్లాడారు. “ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలుసుకున్నా.. చంద్రబాబు బ్రండ్ గురించే వారు చెబుతున్నారు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కియా …
Read More »‘సాక్షి’ యాడ్స్ పై విచారణ జరుపుతాం: పార్థ సారథి
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ ఉండేది కాదని, అప్పుల మీద అప్పులు చేసి పథకాలకు పప్పూ బెల్లాల్లాగా డబ్బులు పంచిపెట్టారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ చేస్తున్న అప్పులపై కాగ్ మొదలు కేంద్రం వరకు అందరూ హెచ్చరించినా పెడ చెవిన పెట్టి రాష్ట్రంపై పది లక్షల కోట్ల అప్పు జగన్ పెట్టారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి పార్ధసారధి …
Read More »ఏపీకి డబ్బే డబ్బు.. బాబు చింత తీరింది!
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరిన 100 రోజుల పాలనలో ఒకింత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనక తప్ప లేదు. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. తొలి నెల ఎలా ఉన్నా.. తర్వాత రెండు మాసాలు మాత్రం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో కేంద్రం నుంచి వచ్చే సొమ్ముల కోసం ఎదురు చూశారు. ఇదేసమయంలో వరదలు రావడంతో ప్రజలకు మరింత సాయం చేయాల్సి వచ్చింది. ఇక, పెంచిన పింఛన్లు, అన్న …
Read More »ఇచ్చింది పిసరంత.. కండిషన్లు కొండంత!
పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి. దీనిని పూర్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. కేంద్రంతో పెట్టుకుంటే ఆలస్యమవుతుందని భావించిన గత చంద్రబాబు సర్కారు దీనిని తామే వేగంగా పూర్తి చేసుకుంటామని.. నిధులు మీరిస్తే చాలని తేల్చి చెప్పారు. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టు విషయాన్ని ఏపీకే అప్పగించింది. అయితే.. నిధులు ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొర్రీలు వేస్తూనే ఉంది. ప్రాజెక్టు అంచనాలు తగ్గించడం.. నిధులు ఇచ్చేందుకు అనే …
Read More »ఆలయాల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సుప్రీం కోర్టు. మరోవైపు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ప్రసాదానికి జరిగిన అపచారంపై వేద పండితులు, అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ఏపీలో తిరుమలతోపాటు ఏ ఆలయంలోనూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా …
Read More »తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్లకు కేంద్రం భారీ షాక్.. ఏం జరిగిందంటే!
ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పనిచేస్తున్న పలువురు కేడర్ ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఏపీకి రాలేదు. తెలంగాణలోనే పనిచేస్తున్నారు. అయితే.. కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఏపీకి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్లను ఏపీకే పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో …
Read More »కాంగ్రెస్ పని అయిపోయిందా.. ఏపీలోనే కాదు..!
దేశవ్యాప్తంగా పుంజుకుంటున్నామని.. మోడీకి చెక్ పెడుతున్నామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించనంత స్థాయిలో దిగజారిపోయింది. తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ప్రధానంగా హర్యానాలో అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ హర్యానాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. అదేవిధంగా జమ్మూకాశ్మీర్ లో కూడా 12 స్థానాల నుంచి తాజాగా జరిగిన …
Read More »‘టాటా’ పేరుకు సార్థకత తెచ్చిన రతన్!!
రతన్.. ఇది వినేందుకు మూడు అక్షరాలే అయినా.. ఆయన కోసం దేశ ప్రధాని వేచి చూస్తారు. పుట్టి పెరిగారుకాబట్టి.. ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి.. భారత్లో ఆయనకు ఆ మాత్రం గౌరవం దక్కడం సహజమే. కానీ, ఎక్కడో ఉన్న దేశాలు.. ఖండ ఖండతారాల్లో ఉన్న దేశాల్లోనూ రతన్ టాటా అప్పాయింట్ మెంటు కోసం వేచి ఉండే దేశాధినేతలు.. అధ్యక్షులు ఉన్నారం టే ఆశ్చర్యం వేస్తుంది. మీరు తప్పకుండా రావాలి. మీకు …
Read More »సిగ్గుండాలి.. జగన్ ‘ఈవీఎం’ కామెంట్లపై చంద్రబాబు చురకలు
విజయదశమి సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీసమేతంగా దర్శించుకున్నారు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం నాడు సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి …
Read More »జమిలికి జై: చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జమిలి ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు జై కొట్టారు. తాము ఈ ఎన్నికలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం.. తీసుకువస్తున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్కు తాము అనుకూలమని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఏటా వస్తున్న ఎన్నికల కారణంగా అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రాల జీడీపీ సహా దేశ జీడీపీ కూడా ఇబ్బందిగా మారిందని …
Read More »రెడ్ బుక్ కాదు.. గుడ్ బుక్ పెడతాం
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాట్లాడితే.. రెడ్ బుక్.. రెడ్ బుక్ అంటూ భయాందోళనలను కలిగిస్తోందన్నారు. కానీ, ఇది మంచి పద్ధతి కాదని.. అధికారం ఇచ్చింది వేధించేందుకు కాదని చెప్పారు. తాము త్వరలోనే గుడ్ బుక్ ఏర్పాటు చేయనున్నట్టు జగన్ చెప్పారు. ప్రస్తుతం మంచి చేస్తున్న అధికారుల పేర్లు ఆ గుడ్బుక్లో రాసుకుంటామని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన …
Read More »మోడీని దేశం భుజాలకెత్తుకుంది..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశ ప్రజలు భుజాలకు ఎత్తుకున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం దీనికి నిదర్శనమన్నారు. సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. 90 స్థానా లున్న హరియాణాలో 48 స్థానాలు దక్కించుకోవడం, వరుసగా మూడో సారి అధికారంలోకి రావడం వంటివి మోడీ పాలన కే సాధ్యమైందని కొనియాడారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మోడీవైపే చూస్తోందని చెప్పారు. హరియాణాలో బీజేపీకి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates