Political News

టీడీపీకి ఊహించని దెబ్బ  

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో సీనియర్ నేత వరుపుల రాజా మరణించటం టీడీపీకి పెద్ద లాసనే చెప్పాలి. ఈయన పోయిన ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో  పోటీచేసి చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. కాపు సామాజికవర్గంలోని ప్రముఖుల్లో రాజా కూడా ఒకళ్ళు. ఉత్తరాంధ్ర ఎంఎల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు  నియోజకవర్గాలకు రాజా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్ధుల గెలుపుకు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రచారానికి కాస్త విరామం ఇచ్చి శనివారం మధ్యాహ్నమే …

Read More »

ఈ సారి అరెస్టేనా …!

వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లే అనిపిస్తోంది. విపక్షాల ఆరోపణలు, ఆయనపై అనుమానాల మధ్య సీబీఐ మూడో సారి ఆయన్ను ప్రశ్నించబోతోంది. జనవరి 28, ఫిబ్రవరి 24న విచారించిన సీబీఐ మళ్లీ ఈ నెల 6న విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చింది. పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లి మరీ సీబీఐ అధికారులు నోటీసులు అందించి వచ్చారు. వరుసగా రెండు సార్లు ప్రశ్నించిన …

Read More »

ఆ మంత్రికి టికెట్ ఇస్తే అంతేన‌ట‌.. బీఆర్ఎస్ టాక్ గురూ!

రాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండ‌వు. డ‌బ్బు.. ప‌లుకుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు అన్నీకూడా అనుకూలించే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు తెలంగాణలో కీల‌క మంత్రి మల్లారెడ్డి ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2018 ఎన్ని క‌ల్లో విజ‌యంద‌క్కించుకున్న మ‌ల్లారెడ్డి కేసీఆర్ ప్ర‌భుత్వంలో మంత్రిగా అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ప్ర‌ముఖ విద్యాసంస్థ‌ల అధినేత‌గా ఆయ‌న సుప‌రిచితులే అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అంత‌గా సాన‌కూల ప‌వ‌నాలు, …

Read More »

మ‌రో సారి సెంటిమెంటును రగలాలా?

మ‌రో 10 మాసాల్లోనే తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు రానున్నాయి. మ‌రి ఇప్పుడు ఎన్నిస్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవాలి? ఎన్నిచోట్ల గెలుపుగుర్రం ఎక్కాలి..? ఇదీ.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌లో జ‌రుగుతున్న అంత‌ర్మ‌థ‌నం. గ‌త 2018లో వ‌చ్చిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అదే స‌మ‌యంలో 46.9 శాతం ఓటు బ్యాంకు ను సొంతం చేసుకుంది. అయితే..అప్ప‌టికి ఇప్ప‌టికి ప‌రిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజ‌కీయాల‌కు …

Read More »

ధర్మాన ప్రసాదరావు పై జగన్ సీరియస్?

శ్రీకాకుళానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు వింటే చాలు సీఎం జగన్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. గతంలోనూ ధర్మాన తీరు జగన్‌కు నచ్చనప్పటికీ ఆ తరువాత కొంత సానుకూలత ఏర్పడడంతో మంత్రి పదవి కూడా ఇచ్చారు. కానీ… తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జగన్ చెప్పిన సమీకరణలను కాదని తన సొంత లెక్కలు వేసి మరీ ఆయన్ను ఒప్పించి తనకు కావాల్సిన నాయకుడికి టికెట్ తెచ్చుకున్న ధర్మాన ఇప్పుడా …

Read More »

ఐప్యాక్ ప్రతినిధులే ఇన్వెస్టర్లా?

విశాఖ వేదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం చెప్తోంది. అంబానీ, జీఎంఆర్, జిందాల్ వంటి దేశ పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరై జగన్ పరువు నిలబెట్టారు. అయితే… అదేసమయంలో ఇతర చిన్నాచితకా ఇన్వెస్టర్లుగా హాజరైనవారిలో అత్యధికులు ఐప్యాక్ ప్రతినిధులేనన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఐప్యాక్‌లో పనిచేసేవారిలో చాలామంది ఎంబీఏలు చేసినవారు, సాఫ్ట్‌వేర్ కోర్సులు …

Read More »

ప్రతిష్ట పెరుగుతుందనుకుంటే పరువు పోతోందే..

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన దగ్గర్నుంచి పారిశ్రామిక విధానం విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పరిశ్రమలను బెదరగొట్టి తరలిపోయేలా చేయడం.. చెప్పుకోదగ్గ కొత్త పరిశ్రమలు ఏవీ తీసుకురాకపోవడం పట్ల ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని సింపుల్‌గా వైసీపీ నేతలు ఈ విషయంలో దాటవేయడానికి కూడా వీల్లేకపోతోంది. కళ్ల ముందు ఏం జరుగుతోందో జనాలకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో నెగెటివిటీ …

Read More »

లోకేష్ తీరుపై తిరుపతి టీడీపీ అసంతృప్తి

జనవరి 27న ప్రారంభమైన నారా లోకేష్, యువగళం పాదయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. నేడో రేపో 500 కిలోమీటర్ల మైలురాయిని దాటుతున్న తరుణంలో ఆయన రోజుకో హామీ ఇస్తున్నారు. తన హామీలను అమలు చేస్తానని భరోసా కల్పించే దిశగా అక్కడక్కడా శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానితో సామాన్య జనానికి లోకేష్ పై విశ్వాసం పెరుగుతోంది. లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాల పర్యటనలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. …

Read More »

పార్టీ మార‌తా.. ప‌ద‌వి ఇస్తారా?

ఆవిడ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క మ‌హిళా నాయ‌కురాలు. పైగా ఫైర్ బ్రాండ్‌. భారీ ఎత్తున కాదు లే కానీ.. ఓ రేంజ్‌లో ఆమె చేసే కామెంట్లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి. ఆమే.. ఏపీ కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు.. సుంక‌ర ప‌ద్మ‌శ్రీ. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. మ‌హిళ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయ‌కురాలు. పైగా, రాజ‌ధాని అమ‌రావ‌తిని …

Read More »

వేడెక్కిన స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రాజ‌కీయం..

తెలంగాణ‌లో మ‌రో 10 మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధికార పార్టీ బీఆర్ ఎస్ అన్ని అస్త్ర శ‌స్త్రాల‌తో రెడీ అవుతోంది. ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా విజ‌యం ద‌క్కించుకుని హ్యాట్రిక్ కొట్టాల‌నేది కేసీఆర్ వ్యూహం. అయితే.. ఆయ‌నఅనుకుంటున్న‌ట్టుగా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క విధంగా బీఆర్ ఎస్ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు జ‌నగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుంటే.. ఈ సీటును ఇద్ద‌రు …

Read More »

ఏం జరిగింది : ప్రముఖులతో ప్రత్యేక విందుకు సీఎం జగన్ డుమ్మా

Y S Jagan

ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వేళలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. పలువురు పారిశ్రామికవేత్తలు హాజరు కావాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సదస్సుల సందర్భంగా ఏర్పాటు చేసే విందునకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే.. ఈ ప్రత్యేక విందునకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడుచర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం …

Read More »

వైసీపీకి 157 ప‌క్కా.. మిగిలిన 18 లోనే పోటీ..

kodali

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌న‌దైన శైలిలో స‌ర్వే రిపోర్టు ను ఆవిష్క‌రించారు.(జాబితా కాదులేండి). వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. దీంతో నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్ర‌జాబాట ప‌డుతున్నారు. గ‌డ‌ప‌గ‌డ ప‌కు కార్య‌క్ర‌మంలో తిరుగుతున్నారు. అయితే.. ఎవ‌రూ కూడా త‌మ‌కు ఇన్ని సీట్లు వ‌స్తాయ‌ని కానీ, …

Read More »