Political News

ఈ ‘తొంద‌ర’ కూడా ప్ర‌మాద‌మే జ‌గ‌న్ స‌ర్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో సీఎం జ‌గ‌న్ తొంద‌ర చూస్తే.. ఇది మ‌రింత ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌రిశీల‌న‌లో ఉన్న విష‌యంపై జ‌గ‌న్ చాలా తొంద‌ర‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు ఇంత తొంద‌ర అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానులను ఏర్పాటు చేసేసి, ఈ నెల‌లో వ‌చ్చే నూతన తెలుగు సంవ‌త్స‌రాది నుంచి వాటిని లైన్‌లో పెట్టేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో …

Read More »

రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్…

తెలంగాణలో రెండు భవన్ల మధ్య వివాదం బాగా ముదిరిపోయింది. అందుకనే రాజ్ భవన్ మీద ప్రగతి భవన్ సుప్రీంకోర్టులో కేసువేసింది. రాజ్ భవన్ అంటే గవర్నర్ నివాసమని, ప్రగతి భవన్ అంటే కేసీయార్ నివాసమని అందరికీ తెలిసిందే. వ్యక్తుల హోదాలో కాకుండా గవర్నర్-సీఎం మధ్య వివాదాలు బాగా ముదిరిపోయాయి. దీంతో మధ్యలో ఉన్నతాదికారులు నలిగిపోతున్నారు. ఇపుడు పెండింగ్ బిల్లులను గవర్నర్ క్లియర్ చేయటం లేదని చెప్పి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి …

Read More »

విశాఖే పాల‌నా రాజ‌ధాని.. కేంద్ర మంత్రి స‌మ‌క్షంలోనే జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌

విశాఖ‌ప‌ట్న‌మే పాల‌నా రాజ‌ధాని అని సీఎం జ‌గ‌న్ మరోసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు.. తా ను త్వ‌ర‌లోనే విశాఖ‌కు వ‌చ్చేస్తున్న‌ట్టు చెప్పారు. త‌న మ‌కాం.. పాల‌న అంతా కూడా .. విశాఖ నుంచే జ‌రు గుతుంద‌ని తేల్చి చెప్పారు. విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని …

Read More »

బీజేపీపై కవిత గేమ్ ప్లాన్

దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి ప్లీజ్…. ఈ కొటేషన్ కొంత ఎబ్బెట్టుగా ఉన్నా కల్వకుంట్ల వారమ్మాయి కవిత పరోక్షంగా బీజేపీకి చేస్తున్న సవాలు ఇదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుపై ‘మర్యాదగా ఉండదు’.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ దిశగానే సంకేతాలిస్తున్నాయి.. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆమె అరెస్టుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిసోడియా అరెస్టు తర్వాత ఇక కవిత, కేజ్రీవాల్ …

Read More »

విశాఖ సమ్మిట్ లో ముఖేష్ అంబానీ…

ఎంతో అట్టహాసంగా విశాఖపట్నంలో ప్రారంభమైన రెండురోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు గేమ్ ఛేంజర్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి రు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అందుకనే ప్రపంచంలోనే కాకుండా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ సదస్సుకు ఆహ్వానించింది ప్రభుత్వం. నిజంగానే అంచనా వేసినట్లు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందిస్తే అంతకన్నా రాష్ట్రానికి కావాల్సింది ఏముంటుంది ? ఆపిల్, టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్, …

Read More »

తుమ్మల, దాసోజులకు ఎమ్మెల్సీ?

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారుచేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకస్థానం సిటింగ్ ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ రావుకే తిరిగి ఇవ్వనున్నారని.. మిగతా రెండు ఎమ్మెల్సీలలో ఒకటి తుమ్మల నాగేశ్వరరావు, ఇంకోటి దాసోజు శ్రవణ్‌కు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ రావు 2019లో ఆ పదవిలోకి వచ్చారు. …

Read More »

ఆ ముగ్గురికి టికెట్ ఖాయం !

వైసీపీ నుంచి బయటపడేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కొంతమంది బయటకు చెప్పడం లేదు. మరికొంత మంది మాత్రం వైసీపీ అధిష్టానాన్ని నేరుగానే విమర్శిస్తూ బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీలైతే జగనే తమను వెలివేయాలని తద్వారా కొంత రాజకీయ ప్రయోజనం పొందొచ్చని ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మారుతున్న సమీకరణాలను చూసుకుని కొందరు వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానితో …

Read More »

శభాష్ కేటీఆర్‌‌.. ట్విట్టర్లో ప్రశంసల జల్లు  

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియాలో చాలా మంచి ఫాలోయింగే ఉంది. అక్కడ ఆయనకు రోజూ బోలెడన్ని కంప్లైంట్లు, రిక్వెస్ట్‌లు వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఎవరో ఏదో అడిగితే ఏం చేస్తాం అనుకోకుండా.. అందులో వీలైనన్ని అడ్రస్ చేస్తుంటాడు కేటీఆర్. కొన్ని సమస్యల్ని నేరుగా పరిష్కరించే ఆయన.. కొన్నింటిని సంబంధిత అధికారుల దృష్టికి తెస్తుంటాడు.  ఇలా సోషల్ మీడియాలో విజ్ఞప్తులను పట్టించుకుని పరిష్కరించే రాజకీయ నాయకులు దేశంలో కొద్దిమందే ఉంటారు. …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల మృతి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరి 28న హఠాత్తుగా గుండెపోటుకు గురైన అర్జునుడు అప్పటి నుంచి విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్జునుడిని బతికించేందుకు కొన్ని వారాలుగా నిపుణులైన వైద్యుల బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం అర్జునుడు తుది శ్వాస విడిచారు. జనవరి 28న హఠాత్తుగా గుండెపోటుకు గురైన అర్జునుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని …

Read More »

ఎక్కువ చేసిన పేర్ని నాని బుక్కయిపోతున్నాడా

జగన్ తొలి కేబినెట్లో ఉన్న కాలంలో కానీ, మంత్రి పదవి ఊడిపోయిన తరువాత కానీ ఎప్పుడైనా సరే పవన్ కల్యాణ్‌ను విమర్శించడంలో పేర్ని నాని ఏమాత్రం తగ్గలేదు. కోట్లాది మంది అభిమానులున్న పవన్ కల్యాణ్‌ను అరేయ్, ఒరేయ్ అంటూ మాట్లాడేవారు పేర్ని నాని. పవన్ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన్ను కాపులతో విమర్శించాలనే జగన్ వ్యూహంలో పేర్ని పావుగా మారిపోయారు. అయితే, అదే కాపు సామాజికవర్గానికి చెందిన …

Read More »

తెలంగాణలో మరో టీఆర్ఎస్?

రెండు దశాబ్దాలపాటు తెలంగాణ ప్రజల నోళ్లలో నానిన టీఆర్ఎస్ అనే మాట ఇప్పుడు వినిపించడం లేదు. టీఆర్ఎస్‌లోని తెలంగాణ పేరు పోయి భారత్ రావడంతో బీఆర్ఎస్‌గా మారి టీఆర్ఎస్‌ను తుడిచేసింది. కానీ, టీఆర్ఎస్‌ అనేది మళ్లీ ప్రజల నోట వినిపించేలా తెలంగాణకు చెందిన ఓ నేత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా బీఆర్ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎన్నికల్లో దెబ్బతీయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ వర్గాలు దీన్ని …

Read More »

అమరావతి కేసుల్లో జగన్ కు ఎదురుగాలి

ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. శుక్ర, శనివారాల్లో నిర్వహించే సదస్సు కోసం విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిధులకు విశాఖ విశిష్టతను చెప్పడంతో పాటు, కాబోయే రాజధానిగా పరిచయం చేయాలని జగన్ అనుకుంటున్నారు. ఆ దిశగా కొంత సాహిత్యం కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. విశాఖకున్న ప్రయోజనాలను వివరించేందుకు వీడియోలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అమరావతి …

Read More »