Political News

గుండె తరలింపునకు లోకేశ్ ‘సొంత’ విమానం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సేవా కార్యక్రమాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తన మనసుకు నచ్చిన పలు కార్యక్రమాలకు తన సొంత నిధులను వెచ్చిస్తున్న లోకేశ్… గురువారం అవయవదానానికి దన్నుగా నిలిచి ఏకంగా తన సొంత ఖర్చుతో ఓ విమాన సర్వీసును ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి తిరుపతికి ఓ మహిళ గుండెను తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేయగా… అందుకు అవసరమైన విమాన సర్వీసును …

Read More »

దుర్గేశ్ ప్లాన్ సక్సెస్ .. ‘సూర్యలంక’కు రూ.97 కోట్లు

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ సత్తా చాటుతున్నారని చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యాటక శాఖలోకి పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టే దిశగా దుర్గేశ్ చేస్తున్న యత్నాలు ఫలిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్రం నుంచి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం ఏఏ పద్దులు ఉన్నాయి? వాటి కింద ఏఏ అంశాలకు ఎంత మేర నిధులను రాబట్టవచ్చు? అన్న అంశాలపై పట్టు సాదించిన దుర్గేశ్… తాజాగా …

Read More »

బాబుకు జయమంగళ పాదాభివందనం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన జయమంగళ వెంకట రమణ…చంద్రబాబుకు స్వాగతం పలికే సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ తర్వాత కూడా చంద్రబాబుతో జయమంగళ ఏదో చెబుతూ అలా ఉండిపోయారు. జయమంగళను అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. ఆయన చెప్పినదంతా సావదానంగా విన్నారు. అయినా ఇందులో …

Read More »

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అలా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదు. కేంద్రం నుంచి ఇతోదిక సహకారం కూడా లబిస్తోంది. అయినా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టును టీడీపీ అధినేత, ఏపీ సీఎం …

Read More »

టాస్క్ ఫోర్స్ ఎంట్రీ.. గేట్స్ సహకారానికి రూట్ క్లియర్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అలా ఒప్పందాలపై సంతకాలు కాగానే… ఇలా సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ సిద్ధమైపోయింది. అదే సమయంలో గట్స్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడెప్పుడు సహకారం లభిస్తుందా?అని ఎదురు చూసిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా…ఆ సంస్థ నుంచి సహకారం అందుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. …

Read More »

నీచ రాజకీయాలకు దూరం… లేదంటే వారు జైల్లో ఉండేవారు: రేవంత్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం నాటి సమావేశాల్లో బాగంగా కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న రేవంత్.. కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైనాన్ని రేవంత్ గుర్తు …

Read More »

జనసేన సత్తా.. కాకినాడ రూరల్ ఎంపీపీ కైవసం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటింది. వైసీపీకి గట్టి పట్టున్న కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) పదవిని జనసేన కైవసం చేసుకుంది. అది కూడా ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసేలా వ్యూహం రచించి పక్కాగా అమలు చేసి సత్తా చాటింది. ఫలితంగా కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేనకు చెందిన అనంత లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన దెబ్బకు …

Read More »

పవన్ ‘హిందూ ధర్మం’పై జగన్ ఘాటు విమర్శలు

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కు అసలు హిందూ ధర్మంపైనా, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే అర్హత ఉందా? అంటూ జగన్ ఫైరైపోయారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని కాశినాయన ఆశ్రమం కూల్చివేతలకు సంబంధించిన అంశాన్ని ఆసరా చేసుకుని జగన్ చేసిన విమర్శలు ఇఫ్పుడు …

Read More »

ఈ ఎంపీపీ ఎన్నిక చాలా కాస్ట్లీ గురూ!

ఏపీలో గురువారం వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇతర జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా… తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే…ఈ ఎంపీపీ గతంలో వైసీపీకి దక్కగా… దానిని నిలబెట్టుకునేందుకు వైసీపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని చెప్పాలి. మెజారిటీ వైసీపీకే ఉండగా..ఎక్కడ …

Read More »

విశాఖలో లులూ మాల్… 14 ఎకరాల భూమి కేటాయింపు

టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో ఏపీకి మహార్దశ పట్టిందనే చెప్పాలి. ఇప్పటికే గడచిన 9 నెలల కూటమి పాలనలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని గ్రౌండ్ కాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా కంపెనీలు రాష్ట్రానికి వస్తుండగా… అప్పటికే వచ్చి…వైసీపీ దౌర్జన్య కాండ కారణంగా ఏపీకి వదిలి పారిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. …

Read More »

రాజు తలచుకుంటే… పదవులకు కొదవా?

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నది పెద్దల సామెత. ఇప్పుడు వైసీపీని చూస్తుంటే… ఆ సామెత కాస్తా… రాజు తలచుకుంటే పదవులకు కొదవా? అని చెప్పుకోవాల్సిందే. అసలే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. పార్టీ ఘోర పరాజయాన్ని ముందే ఊహించిన కొందరు ఎన్నికలకు ముందే పార్టీని వీడితే…ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చాలా మంది …

Read More »

వైరల్ గా హోం మినిస్టర్ వీడియో… ఏముందంటే?

ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతేనా దానిని చూసిన వారంతా ఏపీ పోలీసు శాఖ తీరును అభినందించకుండా ఉండలేకపోతున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుబాటులోకి తీసుకువచ్చిన డ్రోన్ టెక్నాలజీని పోలీసు శాఖ ఇంత బాగా వినియోగించుకుంటుందా? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా …

Read More »