తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవి ద్యాలయం పేరును మార్పు చేస్తూ.. కీలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి పేరుతో మార్చనుంది. దీనికి సంబంధించిన బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశ పెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బీజేపీ-కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం …
Read More »బీఆర్ఎస్ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న
తెలంగాణలో సోమవారం మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న… సోమవారం శాసన సభా ప్రాంగణంలో అందరి దృష్టిని ఆకర్షించారు. మండలి సమావేశాలకు మల్లన్న హాజరయ్యారో, లేదో తెలియదు గానీ… ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చెందిన పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ …
Read More »సజ్జల సైడయ్యే ఛాన్సే లేదబ్బా!
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీలో ఓ వింత పరిస్థితి కొనసాగుతోంది. పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుంచి…సామాన్య కార్యకర్త దాకా… పార్టీ రాష్ట్ర సమన్వయకర్త హోదాలో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిన సజ్జల…విపక్షాల చేత సకల శాఖా మంత్రిగా పిలిపించుకున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో సజ్జల జోక్యం అంతకంతకూ పెరిగిపోయిందని…పార్టీలో ఏం జరుగుతున్న …
Read More »అదేంటీ… సభకు రాకుండానే ప్రశ్నలు వేస్తున్నారా?
ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే సభలో అధికార కూటమి పక్షాన్ని మినహాయిస్తే… మిగిలింది ఒకే ఒక్క విపక్షం అయిన తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ హోదా వచ్చే దాకా సభకు వచ్చేది …
Read More »ఇదేం స్పీడండీ బాబూ!… ధ్యాంక్యూ నారా లోకేశ్!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో… టీడీపీ అభిమానులో, లేదంటే లోకేశ్ అంటే అభిమానం ఉన్న వారో చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న శ్రీ కాశినాయన ఆశ్రమ పూజారులు, ఆ మఠం భక్తులు చెబుతున్న మాట. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఏళ్ల తరబడి కాశినాయన ఆశ్రమం …
Read More »బాబు, జగన్ ల మధ్య తేడా ఇదే!
ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా చేసుకుంటాయి. భారీ ఏర్పాట్లు చేసుకున్నా బాబు సర్కారు అంతగా పట్టించుకోదు. సరే… వారేదో సంబరాలు చేసుకుంటున్నారు కదా. వారి సంతోషాన్ని మనమెందుకు తగ్గించాలి? అన్నట్లుగా సాగుతుంది. అంటే.. అధికారంలో ఉన్నా గానీ చంద్రబాబు సహనంతో సాగుతారు. అదే వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ …
Read More »లోకేష్కు కీలక పదవి: మహానాడు.. మామూలుగా ఉండేలా లేదే.. !
టీడీపీకి మహానాడు అనేది ప్రాణ ప్రదం. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అనేక సంస్కరణలకు పెద్దపీట వేసిన పార్టీలో మహానాడుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గతంలో అన్నగారు ప్రారంభించిన ఈ సంస్కృతిని ప్రస్తుతం చంద్రబాబు వరకు అందరూ పాటిస్తున్నారు. అయితే.. ఎప్పటికప్పుడు.. కీలక ప్రాంతాలను ఎంపిక చేసుకుని నిర్వహించే మహానాడుకు ఈ దఫా కడప వేదికగా మారనుంది. కడపలోనూ.. వైసీపీ అధినేత …
Read More »18న ఢిల్లీకి బాబు… అజెండా ఏంటంటే?
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవలి కాలంలో తరచూ ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు…కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పెద్దలతో వరుస భేటీలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏలో కీలక బాగస్వామిగా టీడీపీ కొనసాగుతున్నందున…ఏపీ కోసం చంద్రబాబు ఏం అడిగినా… ఇట్టే వచ్చి పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరోమారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారన్న మాట విన్నంతనే… …
Read More »మహిళలకు కూటమి అదిరే గిఫ్ట్!… అగ్రి ప్రోడక్ట్స్ కూ బూస్టే!
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తుల అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం… రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించే వ్యవసాయోత్పత్తులతో పాటుగా వారు తయారు చేసే వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువను జోడిండచంతో పాటుగా వాటిని ఆన్ లైన్ ద్వారా విశ్వవ్యాప్తంగా …
Read More »షాకింగ్: దస్తగిరి భార్యపై దాడి.. చంపుతామని బెదిరింపు!
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. అయితే.. ఈ విషయం ఆలస్యంగా ఆమె వెల్లడించారు. దాడి చేసిన వారు వైసీపీ మహిళా కార్యకర్తలని, వారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారేనని తెలిపారు. తనను బెదిరించి.. దాడి చేయడంతో పాటు.. జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల జోలికి వస్తే.. దస్తగిరిని కూడా …
Read More »ఎంపీ డీకే ఇంట్లోకి ఆగంతకుడు… కానీ చోరీ జరగలేదు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్ లో పెను కలకలమే రేపింది. అయితే ఆగంతకుడు ఇంటిలోకి ప్రవేశించిన సమయంలో ఎంపీ ఇంటిలో లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కట్టుదిట్టమైన భద్రత కలిగిన డీకే ఇంటిలోకి ఓ ఆగంతకుడు ఎంట్రీ ఇవ్వడం, ఆపై ఏకంగా గంటన్నరకు పైగా అతడు ఆ ఇంటిలో ఫ్రీగా సంచరించిన వైనం …
Read More »సౌత్ ఇండియన్ లీడర్గా పవన్ కళ్యాణ్ .. !
బీజేపీకి ఉత్తరాదిలో ఉన్న బలం.. దక్షిణాదికి వచ్చే సరికి లేకుండా పోయింది. నిజానికి బండి సంజయ్, కిషన్రెడ్డి, పురందేశ్వరి వంటివారు ఉన్నా.. వారు బలమైన గళం వినిపించలేక పోతున్నారు. బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ మాదిరిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు. కానీ, దక్షిణాదిలో చూస్తే.. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిని ఎదుర్కొని.. బీజేపీ ముందుకు సాగడం అత్యంత కీలకం. ఈ క్రమంలోనే జనసేన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates