టీడీపీ ఏంటీ… వైసీపీతో కలిసి పోటీ చేయడమేమిటి? వైసీపీ ఏంటీ…పోయిపోయి టీడీపీతో జత కట్టడేమేమిటి?. నిజమేనండోయ్.. ఈ ఈక్వేషన్ ఊహకే అందట్లేదు. అయితే ఖమ్మం జిల్లా సారపాక వెళితే… అక్కడ ఈ రెండు పార్టీలకు చెందిన జెడాలు కలిసిమెలిసి సాగుతున్న అరుదైన దృశ్యాలను చూడవచ్చు. అక్కడి ఐటీసీ కంపెనీలో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీడీపీ కార్మిక సంఘం …
Read More »వరద ఆగట్లేదు!… ఏపీకి మరో 15 ప్రాజెక్టులు!
నిజమేనండోయ్.. ఏపీకి పెట్టుబడుల వరద ఆగట్లేదు. కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ఏపీ దిశగా ఆసక్తిగా చూసిన బడా పారిశ్రామిక సంస్థలు… ఇలా పిలవంగానే అలా వచ్చి వాలిపోతున్నాయి. ఫలితంగా కేవలం 7 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. …
Read More »విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు, లోకేష్ కృషి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో విశాక ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానివ్వబోమని ఏపీతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి కూడా ప్రైవేటీకరణ లేదని తేల్చి చెప్పారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం అది అసత్యమంటూ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే …
Read More »గురువు బాటలో రేవంత్ ‘ఏఐ’ అడుగులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తన గురువు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయన దాదాపుగా 3 రోజుల పాటు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి పదే పదే వినిపించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆయనకూ మక్కువ ఏర్పడినట్టుంది. దావోస్ సదస్సు ముగించుకుని …
Read More »కూటమి ఘన విజయం!… ‘ఉక్కు’కు లేదిక ముప్పు!
ఏపీలో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి బయటపడిపోయింది. భవిష్యత్తుల్లో ఇక విశాఖ ఉక్కుకు ప్రైవేటీకరణ అన్న మాటే వినిపించని రీతిలో వరుస ప్రకటనలు వెలువడ్డాయి. అంతేకాకుండా సంస్థను లాభాల బాట పట్టించేందుకు పకడ్బందీ చర్యలకు ప్రణాళికలు కూడా సిద్ధమైపోయాయి.ఈ పరిణామాలు ఇటీవలే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమికి బిగ్ బూస్ట్ లభించిందని చెప్పక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో లభించిన …
Read More »నాడు ఈ గవర్నెన్స్… నేడు వాట్సాప్ గవర్నెన్స్
1995…ఉమ్మడి ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. టీడీపీలో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాల నేపథ్యంలో నాడు యువ నేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అప్పటిదాకా సీఎంగా వ్యవహరించిన వారంతా ఫక్తు రాజకీయ నాయకులే. పెద్దగా టెక్నాలజీపై అవగాహన లేని వారే. అయితే చంద్రబాబు ఏపీ ప్రజలకు సరికొత్త పాలనను అందించారు. అప్పటిదాకా కరెంటు బిల్లు కట్టేందుకు వచ్చిన వారితో విద్యుత్ శాఖ కార్యాలయాల …
Read More »బాలయ్య ఇలాకాలో టీడీపీ జెండా రెపరెపలు పక్కా
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పరిధిలో మరోమారు క్యాంపు రాజకీయాలకు తెర లేసింది. హిందూపురం మునిసిపాలిటీకి గత కొంతకాలంగా చైర్ పర్సన్ లేకుండానే కార్యకలాపాలను నెట్టుకువస్తున్నారు. ఈ మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 38 వార్డులకు గానూ 30 వార్డులను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది. వైసీపీ అదికారంలో ఉండగా ఈ మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అయితే మొన్నటి …
Read More »అవును, అవే వైసీపీని ముంచాయి- కేతిరెడ్డి
గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘోర పరాభవం చవిచూసిందో తెలిసిందే. వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికలకు ముందే సంకేతాలు కనిపించాయి కానీ.. మరీ ఆ స్థాయిలో చిత్తవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీంతో కొన్ని నెలల పాటు ఈవీఎం మాయాజాలం అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. కార్యకర్తలను కూడా అదే రకంగా నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. …
Read More »9552300009 నెంబర్తో ప్రభుత్వ సేవలు
ఏపీలో వాట్పాస్ గవర్నెన్స్ ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కొత్త తరహా సేవలను ప్రారంభించారు. ఈ సేవల కోసం ప్రభుత్వం తరఫున అధికారిక వాట్సాప్ నెంబరును లోకేశ్ విడుదల చేశారు.ఆ నెంబరు 9552300009 గా లోకేశ్ ప్రకటించారు. ఈ నెంబర్ కు సందేశం పంపడం ద్వారా మనకు కావాల్సిన సేవలను ఎంచుకుని పొందవచ్చని …
Read More »వర్మ వద్ద డబ్బుల్లేవట!… మరేటి సేత్తారు?
ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి సర్కారు కొట్టిన దెబ్బ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా గట్టిగానే తగిలింది. అప్పటిదాకా తనను ఎవరూ ఏమి చేయలేరన్నట్లుగా టేకిట్ ఈజీగా సాగిన వర్మ… సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కూడిన పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు కొరడా ఝుళిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి తాను తీసుకున్న రూ.1.15 కోట్ల నిధులను తిరిగి …
Read More »నిన్నటిదాకా ‘ఒకే’ మార్గం… ఇప్పుడు ‘మూడు’ దారులు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాలు చేశారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. వీరిలో బీద మస్తాన్ రావు(టీడీపీ), వల్లభనేని బాలశౌరి(జనసేన), పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి(వైసీపీ) ఉన్నారు. ఏపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన ఈ ముగ్గురిని చూసినంతనే ఏపీ జనం వారి మార్గాలపై ఆసక్తికర పయనాల …
Read More »ఇదే జరిగితే.. వైసీపీ విశ్వసనీయత మాటేంటి?: పొలిటికల్ డిబేట్
రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని.. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని.. పెద్ద ఎత్తున యాగీ చేస్తున్న విషయం రెండు రోజులుగా చర్చనీయాంశం అయింది. అయితే.. తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates