Political News

కేజ్రీ అరెస్టు తప్పదా ?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తప్పదనే ప్రచారం రాజకీయ సర్కిళ్ళల్లో పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నరేంద్రమోడీకి కంట్లో నలుసులాగ, పంటికింద రాయిలాగ తయారయ్యారు కేజ్రీవాల్. దేశంలోని చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీ ఏలుబడిలోకి వస్తున్నా ఢిల్లీలో పాగా వేయటం మాత్రం సాధ్యంకావటంలేదు. ఎంతగా పోరాడినా, ఏ పద్దతిలో పోరాటాలు చేస్తున్నా కేజ్రీవాల్ ను ఓడించటం నరేంద్రమోడీ వల్ల కావటంలేదు. ఇక్కడ బీజేపీ అని కాకుండా మోడీ పేరును …

Read More »

వైఎస్ భాస్క‌ర‌రెడ్డి అరెస్టు-అవినాష్ రెడ్డి విమ‌ర్శ‌లు: కిష‌న్‌రెడ్డి కౌంట‌ర్‌

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయ‌డం.. చంచ‌ల‌గూడ జైలుకు త‌ర‌లించ‌డం జ‌రిగిపోయాయి. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై భాస్క‌ర‌రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ సీబీఐపై విరుచుకుప‌డ్డారు. వివేకా కేసులో సీబీఐ విచారణ సరిగ్గా జరగట్లేదన్నారు. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. త‌న తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై మాట్లాడటానికి మాటలు రావట్లేదని వ్యాఖ్యానించారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను ఊహించని …

Read More »

భాస్క‌ర‌రెడ్డి అరెస్టుపై వైసీపీలో త‌లో మాట‌!

సీఎం జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. పులివెందులలోని ఆయ‌న నివాస గృహంలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. వెంట‌నే ఆయ‌న‌ను పులివెందుల నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అక్క‌డ నుంచి సీబీఐ న్యాయ‌మూర్తి ఇంటికి త‌రలించారు. దీంతో విచారించిన న్యాయ‌మూర్తి.. భాస్క‌ర‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.దీంతో ఆయ‌న‌ను చంచ‌ల్ …

Read More »

జేడీ లక్ష్మీనారాయణ.. ఇలా తయారయ్యాడేంటి?

సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అవినీతి కేసులను డీల్ చేయడం, ఆయన్ని అరెస్టు చేయడం ద్వారా జనాల్లో పెద్ద హీరో అయిపోయారు లక్ష్మీ నారాయణ. నిజానిని ఇనిషియల్ వి.వి. అయినప్పటికీ సీబీఐ పదవి అయిన ‘జేడీ’నే తర్వాతి కాలంలో ఆయన ఇంటి పేరుగా మారింది. నిజానికి లక్ష్మీనారాయణ చట్ట ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏం చేయాలో అది చేశారు తప్పితే.. …

Read More »

చంచ‌ల్ గూడ జైలుకు వైఎస్ భాస్క‌ర‌రెడ్డి.. రిమాండ్ ఎన్ని రోజులంటే!

తెలుగు రాష్ట్రాల‌ను తీవ్ర‌స్థాయిలో కుదిపేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి దారుణ‌ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ అధికారులు హైద‌రాబాద్‌లోని చంచ‌ల‌గూడ జైలుకు త‌ర‌లించారు. దీనికి ముందు భాస్క‌ర‌రెడ్డిని నాంప‌ల్లిలోని సీబీఐ మేజిస్ట్రేట్ కోర్టుకు అధికారులు త‌ర‌లించారు. అయితే.. ఆదివారం కావ‌డంతో మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన న్యాయ‌మూర్తి భాస్కర్ రెడ్డికి 14 రోజుల …

Read More »

హు కిల్డ్ బాబాయ్‌! 48 గంట‌ల్లో మ‌రో అరెస్టు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర రెడ్డిని సీబీఐ అరెస్టు చేయ‌డం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాలపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ స‌టైరిక‌ల్‌గా స్పందించారు. ‘సీబీఐ జోరు మా పార్టీ వైసీపీ బేజారు.. హూ కిల్డ్‌ బాబాయ్’ అని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. అంతేకాదు.. 48 గంట‌ల్లో మ‌రో అరెస్టు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తేల్చి చెప్పారు. అది మ‌రింత‌గా త‌మ …

Read More »

చంద్రబాబు దూకుడుగా వెళుతున్నారా ?

రాబోయే ఎన్నికల్లో అధికారం అందుకోవటమే టార్గెట్ గా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అధికారం అందుకోవాలంటే ముందు మెజారిటి సీట్లు గెలవాలి. మెజారిటి సీట్లు గెలవాలంటే అభ్యర్ధుల ఎంపికను పూర్తిచేసి వీలైనంత తొందరగా ప్రకటించేయాలి. అప్పుడే అభ్యర్ధులు జనాల్లో ఒకటికి రెండుమూడుసార్లు తిరిగి ప్రచారం చేసుకునేందుకు వీలవుతుంది. ఇదే సమయంలో తమపైన అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించి దారికి తెచ్చుకునే అవకాశాలుంటాయి. అలాకాకుండా గతంలో లాగే చివరి నిముషంలో అభ్యర్ధులను ప్రకటిస్తే …

Read More »

వైఎస్ భాస్క‌రరెడ్డి ‘దురాలోచ‌న‌’: సీబీఐ సంచ‌లన విష‌యాలు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి 72 ఏళ్ల వ‌య‌సున్న‌ వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు ఉదయం 7గంట‌ల స‌మ‌యంలో భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అరెస్ట్ మెమో అందజేసి 120బి రెడ్‌విత్‌ 302, 201 సెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్‌ చేశారు. భాస్కర్‌రెడ్డి …

Read More »

పవనే సీఎం కావాలి – నాగబాబు

జనసేనకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే నాగబాబు యాక్షన్ లోకి దిగారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఏముందంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితీరాలట. పవన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. పవన్ను సీఎం చేయటమే ధ్యేయంగా కార్యకర్తనుండి రాష్ట్ర నేతలవరకు అందరినీ సమన్వయం చేస్తానని ప్రతిజ్ఞచేశారు. పవన్ లాంటి రాజకీయ …

Read More »

అవినాష్ సరే సీబీఐ అసలు టార్గెట్ ఎవరూ.. ?

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రచారం జరిగినా పోగ పోగా అది గొడ్డలిపోటు అని తేలిపోయింది. అరెస్టు మెమోను భాస్కర్ రెడ్డి భార్యకు అందించిన సీబీఐ అధికారులు, ఆయన్ను హైదరాబాద్ తరలించారు. సాక్ష్యాలు చెరిపేయడంలో భాస్కర్‌ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అభియోగం మోపింది. వివేకా …

Read More »

ఉత్తరాంధ్రలో టీడీపీ రిలాక్స్

విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. పార్టీ కేడర్ నూతనోత్సాహంతో పనిచేయాలి. మాతృసంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి. ఉత్తరాంధ్ర టీడీపీలో మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టిడిపి గెలిచిన తర్వాత విశాఖ టిడిపి నేతలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. పనిచేయాల్సిందేముంది.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమన్న ధీమా వారిలో కనిపిస్తోంది. హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఊపుమీదున్న వైసీపీ రాష్ట్రంలోనూ, జీవీఎంసీ పీఠం మీద …

Read More »

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. దుమ్మురేపుతున్న‌ స్టిక్క‌ర్ల రాజ‌కీయం

రాష్ట్రంలో స్టిక్కర్ల రాజ‌కీయం దుమ్ము రేపుతోంది. అధికార పార్టీ వైసీపీ ‘జగనన్నే మా భవిష్యత్’ ‘మా న‌మ్మ కం నువ్వే జ‌గ‌న్‌’ పేరుతో ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తోంది. ఎమ్మెల్యేలు మంత్రులు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో స‌గం పూర్త‌యినట్టు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఈ స్టిక్క‌ర్ల కార్య‌క్ర‌మానికి కౌంట‌ర్‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం …

Read More »