టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి వ్యవహారం రెండు, మూడు రోజులుగా తెగ వైరల్ అవుతోంది. క్రిమినల్ లా చదివిన జీవీ రెడ్డి… ఆర్థికపరమైన అంశాలపై మంచి పట్టు కలిగి ఉన్నారు. ఈ కారణంగానే టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏరికోరి మరీ జీవీ రెడ్డికి ఫైబర్ నెట్ పగ్గాలు అప్పజెప్పారు. …
Read More »గ్రూప్ 2 వివాదం కూటమికి దెబ్బేస్తుందా…?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఓ గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా… ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. టీచర్స్ స్థానాల నుంచి ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు పోటీ చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఆ స్థానాల జయాపజయాలపై పెద్దగా ఇబ్బందేమీ ఉండదనే చెప్పాలి. అయితే గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు మాత్రం రాజకీయ పార్టీలకు కత్తి …
Read More »ఉచితాలు, రాయితీలతో ఆర్టీసీకి మూత తప్పదట
ఇప్పుడు ఎన్నికలు జరిగిన, జరుగుతున్న, జరగబోయే ఏ రాష్ట్రంలో చూసినా… మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఆయా రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఈ పథకాన్ని పట్టాలెక్కించాయి. ఏపీలో త్వరలోనే ఈ పథకం అమలులోకి రానుంది. ఇకపై ఎన్నికలు జరిగే ప్రతి దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తరహా హామీలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ హామీలు …
Read More »మీరు బాగా చెయ్యండి, జగన్ ను కుడా మేము ప్రశ్నిస్తాం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించకపోవడంపై లెక్కలేనన్ని విశ్లేషణలు, విమర్శలు, సమర్థంపులు వినిపిస్తున్నాయి. వీటిలో ఎవరి వాదన వారిదే. టీడీపీ వారేమో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారికి భద్రత ఎలా కల్పిస్తామని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి భద్రత కల్పించడానికి వీల్లేదు. మిర్చి రైతులను పరామర్శించడం చట్ట వ్యతిరేకమా? ఎన్నికల కోడ్ ఉంటే… రైతుల సమస్యలను గాలికి వదిలేయాలా? అని …
Read More »రేవంత్రెడ్డిపై పురందేశ్వరి హాట్ కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణనలో ముస్లింలను బీసీల్లో కలపడంపై ఆమె నిప్పులు చెరిగారు. తాజాగా కరీంనగర్లో పర్యటించిన పురందేశ్వరి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ మరింత వెనుకబాటుకు గురవుతోందన్నారు. పేదలు, వృద్ధులను కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వం వంచిస్తోందన్నారు. కులగణనను తప్పుడు విధానంతో చేశారని పురందేశ్వరి విమర్శించారు. బీసీల్లో ముస్లింలను ఎలా చేరు స్తారన్నారు. ఈ విషయంపై ఆలోచన చేయాల్సిన …
Read More »చంద్రబాబును తన్ని తరిమేశారట
తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల వివాదం రాజుకుంది. కృష్ణా జలాల్లో తన వాటాను ఇప్పటికే వాడేసుకున్న ఏపీ… తమకు చెందిన వాటాను కూడా దొంగచాటుగా వాడేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఆరోపణలతోనే సరిపెట్టని తెలంగాణ… ఈ ఏపీ నీటి చౌర్యాన్ని తక్షణమే ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలతో సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేయగా.. తమకు కొంత సమయం కావాలని …
Read More »ఇంకా నాలుగేళ్లకు పైగానే టైముంది గురూ…!
సోషల్ మీడియాలోకి గురువారం వచ్చి చేరిన ఓ ఫొటో పెద్దగా వైరలేమీ కాలేదు గానీ… దానిని చూసిన వారిలో మాత్రం అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. సదరు ఫొటోలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఏవో వివరాలు చెబుతుంటే… ఆ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కనక్నబాబు శ్రద్ధగా ఆ వివరాలను పెన్నుతో పేపర్ …
Read More »పవన్ ఫొటోల మార్ఫింగ్ పై కేసుల పరంపర
సోషల్ మీడియా యాక్టివిస్టులకు నిజంగానే ఎంత చెప్పినా… వారు చేస్తున్నతప్పేమిటన్నది తెలియరానట్టుంది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులు అవతలి వారిని ఎంతటి మానసిక వేదనకు గురి చేస్తున్నాయన్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసివచ్చింది. ఈ విషయాలపై స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా పలుమార్లు సంచలన వ్యాఖ్యలే చేసింది. అయినా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల వైఖరిలో లేశమాత్రం మార్పు కూడా రావట్లేదు. అందుకు నిదర్శనమే జనసేన …
Read More »జగన్ మారలేదు: ఈ స్క్రిప్టులు ఇంకెన్నాళ్లు.. ?
వైసీపీ అధినేత జగన్ లో మార్పు రావడం లేదని.. సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీ ఘోర పరాజయం తర్వాత.. ఆయన మారుతారని, మార్పు వస్తుందని అనుకున్నారు. నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోతారని ఆశించారు. అయితే.. ఈ విషయంపై జగన్ సానుకూలంగానే స్పందించారు. జగన్ 2.0లో మార్పులు ఖచ్చితంగా చూస్తారని చెప్పారు. ఇదిలావుంటే.. అసలు రావాల్సిన మార్పు.. జనం మనసులు ఆకట్టుకోవడం. ఈ విషయంలో జగన్లో మార్పు రావడం లేదు. …
Read More »ఒక్క రోజు లో పెద్ద సమస్యకు పరిష్కారం
ఏపీలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్న ఆరోపణలు నిన్నటిదాకా దాదాపుగా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేరుగానే రంగంలోకి దిగిపోవడంతో ఆ సమస్య కేవలం ఒక్కటంటే ఒక్క రోజులలోనే పరిష్కారం అయిపోయింది. నష్టాల బాటలో కొనసాగుతున్న అన్నదాతకు భారీ ఊరట లభించింది. ఒకటి, రెండు రోజుల్లో రైతులకు గిట్టుబాటు ధర లభించే దిశగా చర్యలు కూడా మొదలు …
Read More »తప్పు తెలుసుకున్న జగన్.. పవన్ ను వదిలేశారా?
కొన్నిసార్లు అంతే. తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళ.. చేయకూడని తప్పులు చేయటం.. వాటికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవటం చేస్తుంటారు. అధికారంలో ఉన్న వేళ.. తాము చేసే తప్పుల్ని గుర్తించేందుకు ఇష్టపడరు సరి కదా.. ఆ దిశగా ఎవరైనా సలహాలు.. సూచనలు ఇస్తే వాటిని పెద్దగా పట్టించుకోవటం చాలా సందర్భాల్లో జరిగేదే. అలాంటి తీరును ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారా? అంటే అవునని చెప్పాలి. తనకు …
Read More »కేసీఆర్ ను అసెంబ్లీ కి రప్పించాలని కోర్టులో పిటిషన్!
ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందరికీ టార్గెట్ గా మారిపోతున్నారు. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్… కామారెడ్డిలో ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎంగా కాకుండా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ముఖమే చూసింది …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates