పాకిస్థాన్కు దేశ రహస్యాలు అందజేస్తోందంటూ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ను తాజాగా హరియాణా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత కొన్ని వారాలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని చిన్నపాటి యుద్ధం కూడా జరిగిన నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. డానిష్ అనే పాకిస్థాన్ హై కమిషన్కు చెందిన అధికారితో జ్యోతి సంబంధాలు కలిగి ఉందని.. ఆమె దేశానికి సంబంధించిన ముఖ్యమైన …
Read More »జలీల్ ఖాన్.. పాలిటిక్స్ ఎండ్..!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బలమైన మైనారిటీ నాయకుడు జలీల్ ఖాన్ పాలిటిక్స్ దాదాపు ముగిసిపోయాయని ఆయన అనుచరులే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నా రు. అయితే.. ఎక్కడా ఉలుకు పలుకు లేదు. పైగా వయసు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. 2019 ఎన్నికల్లో కుమార్తకు టికెట్ ఇప్పించుకున్నా.. ఆమె పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అమెరికా కూడా వెళ్లిపోయారు. ఇక, గత ఎన్నికల్లో అసలు …
Read More »కొడాలి నాని అమెరికా వెళ్లిపోతున్నారా..?
వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని) ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే గుండె సంబంధిత సమస్యలతో సతమతమైన నాని..ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. ఇందుకోసం ముంబైలో చాలారోజులే ఉన్న నాని…ఇటివలే తిరిగివచ్చారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుండె వ్యాధులకు చికిత్స తర్వాత …
Read More »పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇంత దారుణంగా ఇరుక్కుంటోందా..?
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మొత్తం ఒకేసారి ఇరుక్కుంటోందా? ఫ్యామిలీ అంతా ఒకేసారి జైలుకు వెళ్లక తప్పదా? అనేది ఇప్పుడు చిత్తూరులోనేకాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్రెడ్డిపై మద్యం కేసు వేలాడుతోంది. ఆయనను ఇప్పటికే ఒకసారి విచారించారు. దీంతో ఈ కేసులో ఎప్పుడు ఏం జరుగు తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చే …
Read More »లోకేశ్ కు మోదీ ఆతిథ్యం అదిరిపోయింది!
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసంలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ ఫ్యామిలీ శనివారం సరదాగా గడిపింది. స్వయంగా మోదీ పలుమార్లు పిలవగా…లోేకేశ్ తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి శనివారం ఢిల్లీ వెళ్లారు. మోదీ తన అదికారిక నివాసం వేదికగా లోకేశ్ ఫ్యామిలీకి అదిరిపోయే విందు ఇచ్చారు. ప్రదాని నివాసంలో లోకేశ్ ఫ్యామిలీ …
Read More »బీజేపీతో దోస్తానాలో జగన్ ది ముమ్మాటికీ తప్పే!
2024 సార్వత్రిక ఎన్నికలు జరిగి అప్పుడే ఏడాది కావస్తోంది. అప్పటిదాకా 175 సీట్లలో 151 సీట్లతో బలంగా ఉన్న వైసీపీ… కూటమి కొట్టిన దెబ్బకు ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. సరే… ఇదంతా తెలిసిన భాగోతమే గానీ… ఈ భాగోతంలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు చేశారని ఇప్పుడు ఆయన పార్టీకే చెందిన ఓ కీలక నేత సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. …
Read More »సుజనాకు బాబు పరామర్శ… ఏం జరిగింది?
టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ లో బీజేపీ కీలక నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శరీరాన్ని శాలువాతో కప్పుకుని వచ్చిన సుజనాను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబు అడగడంతో తన శాలువాను కుడి చేతిపైకి ఎత్తి చూపుతున్న సుజనా అందులో కనిపిస్తున్నారు. పూర్వాశ్రమంలో …
Read More »‘తెలంగాణ రైజింగ్’కు ‘నోబెల్’ అభిజిత్ సారథ్యం!
అభివృద్ధిలో దూసుకెళ్లేందుకు అన్ని రకాల అవకాశాలు పుష్కలంగా కలిగిన రాష్ట్రంగా తెలంగాణను చెప్పుకోవాలి. అలాంటి రాష్ట్రానికి ఇప్పుడు మరో అదిరిపోయే మద్దతు లభించింది. ఆర్థిక శాస్త్రంలో ప్రఖ్యాత నోబెల్ బహుమతిని అందుకున్న విశ్వ విఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ తెలంగాణ అభివృద్దికి దిశానిర్దేశం చేయనున్నారు. వెరసి రానున్న కాలంలో తెలంగాణ అభివృద్ధి జెట్ స్పీడుతో దూసుకుపోతుందని చెప్పక తప్పదు. శనివారం హైదరాబాద్ వచ్చిన అభిజిత్ బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల …
Read More »ఆ అక్కకు మనం ఏం అన్యాయం చేశాం: జగన్
‘ఆ అక్కకు మనం ఏం అన్యాయం చేశాం. ఇలా ఎందుకు చేసింది? అసలు ఏం జరిగింది?’ ఇదీ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవికి, వైసీపీకి కూడా రాజీనామా చేసిన జకియా ఖానుం గురించి తీసిన ఆరా. ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్న జగన్.. పార్టీ నాయకులకు ముఖ్యంగా కడప జిల్లా నాయకులకు ఫోన్ చేసిన ఆరా తీసినట్టు తెలిసింది. అక్కకు ఏం …
Read More »మహిళలకు ఉచిత బస్సు, డేట్ చెప్పేసిన చంద్రబాబు
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్-6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీంతో, ఈ పథకం అమలు ఎప్పుడు అంటూ మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ ఏపీ సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఆ పథకం గురించి ఆలోచిస్తున్నానని, అవసరమైతే ఆగస్టు …
Read More »జగన్ లా ఆలోచించే ధనుంజయ రెడ్డి
ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారం నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అరెస్టు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో, అసలెవరీ ధనుంజయ రెడ్డి అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి…జగన్ జిరాక్స్ అని తెలుస్తోంది. రాజకీయ, పాలనాపరమైన వ్యవహారాల్లో …
Read More »కాంగ్రెస్ వద్దంటే మాత్రం థరూర్ కు అర్హత లేదా?
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే దిశగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష కమిటీకి కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ నియమితులు అయ్యారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన అనుమతి లేకుండా తన పార్టీ ఎంపీని అఖిల పక్షానికి ఎలా నేతృత్వం వహించమని చెబుతారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు నొసలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates