Political News

పీకేను బీజేపీ వాడేసుకుంటోందా?: జాతీయ మీడియా క‌థ‌నాలు!

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌, జ‌న సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ను బీజేపీ వాడుకుంటోందా? ఆయ‌న బీజేపీకి వ్య‌తిరేకంగా సొంత పార్టీ పెట్టుకున్నాన‌ని చెబుతున్నా.. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయా? వ‌చ్చే కొన్ని నెల‌ల్లోనే జ‌ర‌గ‌నున్న ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల వేళ‌.. బీజేపీ ఆయ‌న‌ను చాలా వ్యూహాత్మ‌కంగా వాడుకుంటోందా? అంటే..జాతీయ మీడియా క‌థ‌నాలు ఔన‌నే ఆన్స‌ర్ చెబుతున్నాయి. ప్ర‌ధానంగా బిహార్‌లో బీజేపీ ప‌ట్టు బిగించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే.. …

Read More »

డీలిమిటేష‌న్‌.. ద‌క్షిణాదికి న‌ష్ట‌మే: కేశినేని నాని

దేశంలో డీలిమిటేష‌న్ జ‌రిగితే(పార్ల‌మెంటు స్థానాల పున‌ర్విభ‌జ‌న‌) అది ద‌క్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ ల‌కు తీవ్ర న‌ష్టం తెస్తుంద‌ని మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న త‌న ఫేస్ బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. ప్ర‌పంచ‌ దేశాల్లో జ‌రిగిన డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా ఉద‌హ‌రించారు. పొరుగున ఉన్న పాకిస్థాన్‌, అమెరికా దేశాలు స‌హా ఇత‌ర దేశాల్లో జ‌రిగిన డీలిమిటేష‌న్ కార‌ణంగా.. …

Read More »

ఇకపై సినిమాలు ఆపేస్తారా? : పవన్ సమాధానం ఇదే!

అభిమానులతో సహా అందరిలోనూ ఉన్న సందేహం ఒకటే. ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఎడతెగని బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు చేస్తాడా లేదాని. హరిహర వీరమల్లు, ఓజిలు ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందో లేదోననే అనుమానాలు మొదలయ్యాయి. సురేందర్ రెడ్డికి గతంలో ఓకే చేసిన ప్రాజెక్టు క్యాన్సిలనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ స్వయంగా చెబితే తప్ప క్లారిటీ …

Read More »

‘అనంత’లో జేసీ… ‘గోదారి’లో ఆర్ఆర్ఆర్

రాజకీయాల్లో కొందరు నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు అన్నింటా ముందుండాలని కోరుకోని నేత ఉండరు గానీ… ఆ దిశగా మనమే అడుగులు ఎందకు వేయకూడదు అని భావించే వారు మాత్రం అరుదే. అలాంటి వారిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అందరికంటే ముందు ఉంటారు. ఇప్పుడు ఈ …

Read More »

జ‌గ‌న్ మాదిరిగా వ‌దిలేయ‌లేదు..

వైసీపీని, జ‌గ‌న్‌ను కూడా కాద‌నుకుని.. ఏపీ ప్ర‌జ‌లు కూట‌మికి ముఖ్యంగా చంద్ర‌బాబుకు భారీ మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపిం చారో.. ఇప్పుడు అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు మేధావులు. పాల‌న‌ప‌రంగానే కాకుండా.. శాఖ‌ల వారీగా కూడా.. చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనుక్ష‌ణం ఆయ‌న దృష్టి పెడుతున్న విధానాల‌ను వారు ప్ర‌స్తావిస్తున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. పాల‌న‌పై ప‌ట్టుక‌న్నా.. పేరుపై ప‌ట్టు పెంచుకునేందుకు.. త‌న పేరు వేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారన్న విష …

Read More »

స‌భ‌కు వెళ్ల‌ట్లేదు.. జనం రియాక్షన్ ఏంటి?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు వెళ్లేది లేద‌ని.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ భీష్మించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు కూడా మ‌న‌సులో ఏమున్నా.. వారు కూడా స‌భ‌కు డుమ్మా కొడుతున్నారు. అధినేత గీసిన గీత‌ను దాటితే.. ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యం కొంద‌రిని వెంటాడుతుంటే.. మ‌రికొంద‌రు వీర‌విధేయులు జ‌గ‌న్ వెంటే తాము ఉంటామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఫ‌లితంగా 11 మంది ఎమ్మెల్యేలు స‌భ‌కు …

Read More »

కేడర్ కష్టంలో ఉంటే యరపతినేని ఆగలేరు!

రాజకీయాల్లో కొన్ని ప్రాంతాల పేరు విన్నంతనే…కొన్ని పార్టీల పేర్లు, కొందరు రాజకీయ నేతల పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. ఆ ప్రాంతాల్లో ఆ పార్టీలే కాకుండా ఇతరత్రా పార్టీలు, నేతలు కూడా విజయం సాధించి ఉండవచ్చు. అయినా కూడా ఆ ప్రాంతాల పేర్లు వినిపించినంతనే… ఆ ఒక్క పార్టీ, ఆ ఒక్క నేత పేరే జనం మదిలో మెదులుతాయి. అలాంటి ప్రాంతమే గురజాల. పల్నాడు జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గం …

Read More »

కేటీఆర్ నోట జగన్ మార్కు డైలాగ్

ఏపీలో వైసీపీ విపక్ష స్థానంలోరి మారిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా 6 నెలలకు ముందుగానే విపక్షంలోనే మారిపోయింది. విడదీయ లేనంత మైత్రీబందంతో సాగుతున్న ఈ పార్టీలకు పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత అధిష్ఠానం మీదే ఉంటుంది. అందులో భాగంగా పెద్ద సంఘటన జరిగినప్పుడు ఆయా ఘటనలపై స్పందిస్తున్న ఇరు పార్టీల అధినేతలు ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. ప్రత్యేకించి తమ పార్టీ …

Read More »

స్వర్ణ దేవాలయంలో నారా లోకేశ్ ఫ్యామిలీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి ఉత్తర భారతం వెళ్లిన లోకేశ్… పంజాబ్ లోని సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అమృత్ సర్ లోని ఈ దేవాలయంలో భార్య, కుమారుడితో కలిసి ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఆధ్యాత్మిక …

Read More »

అనుకున్నట్టుగానే.. ఒకే బాటలో రేవంత్, కేటీఆర్

దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంలో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావులు అనుకున్నట్లుగానే ఒకే బాటలో సాగారు. రాజకీయంగా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టేశారు. దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ ను ఒకరు వినిపిస్తే… మరొకరు దానికి దన్నుగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ… అవసరం అయితే కలిసి పనిచేసేందుకు కూడా తాము వెనుకాడబోమని …

Read More »

జగన్ పై విరుచుకుపడ్డ సోము వీర్రాజు

Somu Veerraju

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు త‌గిన విధంగా శాస్తి చేస్తామ‌ని బీజేపీ ఏపీ కీల‌క నాయ‌కుడు, మాజీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. జ‌గ‌న్ మిడిసి ప‌డుతున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం త‌న‌దేన‌ని చెబుతున్నాడు. ఆయ‌న‌కు ఎలాంటి శాస్తి చేయాలో అదే చేస్తాం అని వ్యాఖ్యానించారు. తాజాగా విజ‌య వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పార్ల‌మెంటునియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న‌పై జ‌గ‌న్ దొంగాట ఆడుతున్నార‌ని అన్నారు. ఒక‌వైపు డీలిమిటేష‌న్ కావాల‌ని …

Read More »

కుట్రలు, కుతంత్రాలు… ఏసీబీ కేసుపై రజినీ ఫైరింగ్

వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజినీ ఇప్పుడు పెను కష్టాల్లో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై రజినీ, ఆమె మరిది గోపి, ఈ దందాలో ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, వ్యవహారాన్ని గుట్టుగా నడిపిన …

Read More »