మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా అవినాశ్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించే వేళలో.. చివర్లో అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ప్రస్తావనను తీసుకొచ్చారు. సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్ రావు తన వాదననలు వినిపిస్తూ.. పిటిషనర్ తల్లి శ్రీలక్ష్మీ హైదరాబాద్ లోని …
Read More »జగన్ ఇచ్చిన `10 లక్షల పట్టా` వెనుక చంద్రబాబు ధైర్యమేనా?!
రెండు రోజుల కిందట వైసీపీ అధినేత, సీఎం జగన్ అమరావతిలోని ఆర్ – 5 జోన్లో పేదలకు పట్టాలు పంచారు. దాదాపు 1,486 ఎకరాల్లో నిర్మించిన 25 లే అవుట్లలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని లబ్ధిదారులైన పేదలకు సీఎం జగన్ స్వయంగా పట్టాలు అందించారు. అయితే..దీనిపై కోర్టు గతంలోనే ఆంక్షలు విధించింది. అమరావతి రాజధాని విషయంలో కోర్టులు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ పట్టాలు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. …
Read More »తమ్ముళ్లూ తెలుసుకోండి.. లోకేష్ మొత్తం చెప్పేశాడు!
ఏపీలో 2024లో వచ్చే ఎన్నికలు తెలుగు దేశం పార్టీకి అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. దీంతో పార్టీ అనేక రూపాల్లో పోరా టం చేస్తోంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తున్నా.. తమకు గుర్తింపులేదనే వారు ఉన్నారు. అదేసమయంలో ఇంచార్జ్లుగా ఉన్నవారు పనిచేయకపోయినా.. తమకే టికెట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నవారు కూడా ఉన్నారు. మరోవైపు.. గత ఎన్నికల వరకు పార్టీలో ఉండి తర్వాత ఇతర పార్టీల గూటికి చేరిపోయినవారు.. …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవితకు సీబీఐ ట్విస్ట్
దేశాన్ని.. ముఖ్యంగా తెలంగాణను భారీ రేంజ్లో కుదిపేసిన.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటివరకు తెలంగాణ సీఎం కుమార్తె, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసేస్తారనే వార్తలు వచ్చేశాయి. దీంతో ఇది పెను సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఈ కేసులో సీబీఐ సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో …
Read More »మోడీకి భారీ షాక్: భేటీకి 9 మంది సీఎంలు బై!
ప్రధాని నరేంద్ర మోడీపై కారాలు మిరియాలు నూరుతున్న ముఖ్యమంత్రుల జాబితా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం చేరువ అవుతుండడం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను పురుగొల్పుతూ.. తమ తమ రాష్ట్రాలపై దాడులు చేయిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రులకు.. ప్రధాని మోడీ పొడ అంటేనే గిట్టడం లేదు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన అత్యంత కీలకమైన నీతి ఆయోగ్ గవర్నింగ్ బాడీ సమావేశానికి ఆయా ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. నిన్న మొన్నటి …
Read More »జగన్ మాస్టర్ మైండ్: బాబు
తెలుగుజాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని, రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని, సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు తొలి రోజు శనివారం ప్రసంగించిన ఆయన ఆద్యంతం కార్యకర్తలను ఉత్సాహపరిచేలా మాట్లాడారు. కార్యకర్తల త్యాగాలు తాను మర్చిపోనని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు. సంపద సృష్టించడం తెలిసిన …
Read More »అవినాష్రెడ్డి విచారణకు సహకరించడం లేదు: సీబీఐ
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్రెడ్డిపై సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. అవినాష్రెడ్డి తమకు ఏమాత్రం సహకరించడం లేదని మరోసారి తేల్చి చెప్పింది. “కేసు దర్యాప్తులో మొదటినుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్లు కాదు” అని సీబీఐ చెప్పింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ …
Read More »జరిగేది కురుక్షేత్రం.. విశ్రాంతి వద్దు: చంద్రబాబు
రాజమహేంద్రవరంలో ప్రారంభమైన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానోప న్యాసం చేశారు. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలను ఆయన కురుక్షేత్రంగా అభివర్ణించారు. వచ్చేది కురుక్షే త్రమని, ఆ ఎన్నికల్లో వైసీపీ కౌరవ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా .. టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. …
Read More »వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు పక్కా
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాడు.. మహానాడులో హైలెట్ ప్రసంగం చేశారు. ప్రతి మాటలో నూ తూటా పేల్చారు. రెచ్చిపోయి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. టీడీపీది ఎప్పుడూ ప్రజాపక్షమే అన్నారు. 2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. …
Read More »వివేకా హత్య: నిజం చెబితే చంపేస్తా.. అన్నాడు
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో తవ్విన కొద్దీ అనేక సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో వివేకా ఇంటి వాచ్మెన్ రంగయ్యను ‘నిజం చెబితే చంపేస్తా’ అని ఏ1 గంగిరెడ్డి తీవ్రంగా బెదిరించిన విషయం తాజాగా వెలుగు చూసింది. వివేకా హత్య గురించి పోలీసులకు నిజాలు చెబితే చంపేస్తానని వాచ్మన్ రంగన్నను ఈ కేసులో ఏ–1 ఎర్ర గంగిరెడ్డి బెదిరించారని …
Read More »మహానాడు.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లా కేంద్రం రాజమండ్రి (రాజమహేంద్రవరం)లో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు దేశం పార్టీ ఏర్పడి 41 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలుగు వారి తెర వేల్పు అన్నగారు ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆతర్వాత.. కొన్నాళ్ల నుంచి మహానాడును పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే.. తాజా మహానాడు నేపథ్యంలో అసలు ఈ మహానాడు …
Read More »అవినాష్ చుట్టూ బంగార్రాజులు.. ఏం చేస్తున్నారంటే..!
ఏపీలో ఏం జరిగినా బెట్టింగు రాయళ్లు రంగంలోకి దిగుతున్నారు. కోడి పందేల నుంచి క్రికెట్ వరకు దేనినీ వారు వదిలి పెట్టడం లేదు. ఇలానే.. ఇప్పుడు సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ.. సీఎం జగన్కు తమ్ముడు వైఎస్ అవినాష్రెడ్డి వ్యవహారం కూడా .. బెట్టింగులకు దారి తీసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా? చేయరా? అనేది తీవ్ర …
Read More »