విభజన హామీల అమలు.. సమస్యల పరిష్కారంపై మరోసారి కేంద్ర ప్రభుత్వం బంతాట ప్రారంభించింది. మీరే తేల్చుకోండి! అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఎవరికి వారు పైచేయి మాదంటే మాదని లడాయించుకుంటే.. నష్టం మీకే అని హెచ్చరించడం గమనార్హం. వాస్తవానికి 2012-14 మధ్య రాష్ట్ర విభజన తర్వాత.. అనేక సమస్యలు ఉన్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపైనా రెండు తెలుగు రాష్ట్రాలు విభేదించుకుంటున్నాయి. ఇప్పటికి సుమారు పదేళ్లు దాటినా.. విభజన చట్టంలో …
Read More »జగన్ మాదిరి తప్పించుకోం: నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి.. ఏపీ విధ్వంసకారి అంటూ వైసీపీ అధినేత జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు.. తప్పులు చేసి.. తప్పించుకునే ప్రయత్నం చేశారని.. వైసీపీ మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆయన(జగన్) లాగా మేం తప్పులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేయం. మేం ఏదైనా తప్పులు చేస్తే.. వాటిని గౌరవంగా అంగీకరిస్తాం. తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు మేం …
Read More »ఔను.. మేం తప్పు చేశాం.. మోడీ ముందు ఒప్పుకొన్న రాహుల్!
అధికార పక్షం ముందు ప్రతిపక్షం బింకంగానే ఉంటుంది. అది కేంద్రమైనా.. రాష్ట్రమైనా.. ఒక్కటే రాజకీయం. మంచి చేసినా.. చెడు చేసినా.. అధికార పక్షంపై ప్రతిపక్షం సహజంగానే నిప్పులు చెరుగుతుంది. ఒకవేళ తమ తప్పే ఉన్నా.. ప్రతిపక్షాలు అంగీకరించ వు.పైగా ఎదురుదాడి చేస్తాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజకీయమే జరుగుతోంది. అంతెందుకు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజకీయాలు సహజం. అసలు ప్రతిపక్షం ఉన్నదే సర్కారు తప్పులు ఎత్తి చూపేందుకు …
Read More »ఈ రెడ్డి గారికి ఎవరితోనూ పొసగట్లేదు!
చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి… ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం జమ్లమడుగు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేత. ఆదిలో కాంగ్రెస్, వైసీపీల్లో కొనసాగిన ఆయన ఆ తర్వాత టీడీపీలో కూడా కొనసాగారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రెడ్డి… మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగానే విజయం సాదించారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అడుగులు పెట్టిన ఈయనకు… ఆయా పార్టీలతో మంచి సంబంధాలే ఉంటాయిలే అనుకుంటాం. అయితే ఏ ఒక్క పార్టీకి …
Read More »ఢిల్లీ పొలిటికల్ ఫైట్.. ఎగ్జిట్ పోల్స్ నిషేధం!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫిబ్రవరి 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉండడంతో పార్టీలు చివరి క్షణం వరకు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అధికారంలో కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుండగా, బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించింది. ప్రచారంలో …
Read More »స్వామి కార్యం-స్వకార్యం.. అందుకే బాబు గ్రేట్ లీడర్!
ఏపీ సీఎం చంద్రబాబు ఒక పని పెట్టుకున్నారంటే.. దాంతోనే సరిపుచ్చుకోరు. దానికి అనుబంధంగా ఉన్న ఇతర పనులను కూడా సర్దుకుని వస్తుంటారు. ఉన్న సమయాన్ని.. ఉన్న అవకాశాలను ఆయన ఎట్టి పరిస్థితిలోనూ వదులుకునే ప్రయత్నం చేయరు. అందుకే.. బాబు గ్రేట్ లీడర్ అనే టాక్ తెచ్చుకున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ఆయన ఎందుకు వెళ్లారంటే.. కూటమిలో పెద్దన్నగా ఉన్న బీజేపీ తరఫున ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు …
Read More »పెమ్మసాని ఎత్తులకు అంబటి చిత్తు
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యూహాల రచన, వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో తల పండినట్టుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యూహాలు పెమ్మసాని ముందు చిత్తు అయ్యాయని కూడా …
Read More »కోడెల కరుణించకుంటే… సాయిరెడ్డి పరిస్థితేంటి?
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం నిజంగానే అమితాసక్తి రేకెత్తిస్తోంది. పల్నాడు పులిగా పేరుగాంచిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు… సాయిరెడ్డికి చేసిన సాయం గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది. కోడెల నుంచి సాయం అందుకున్న సాయిరెడ్డి…అదే కోడెల కష్టాల్లో ఉన్నప్పుడు …
Read More »బాబొచ్చారు కదా… సోనూ కూడా వచ్చేశారు
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర నూతన రాజదాని అమరావతి వచ్చారు. ప్రపంచ దేశాలను హడలెత్తించడంతో పాటుగా కోట్లాది మంది జీవితాలనే సమూలంగా మార్చేసిన క్లిష్ట పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి సూద్ దేవుడిలా కనిపించారు. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు తన శక్తికి మించి సాయం చేసిన సూద్… ఆ …
Read More »ఆ సందర్భంలో జగన్ ను డిస్ క్వాలిఫై చేయొచ్చు: రఘురామ
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామపై కక్షగట్టి టార్చర్ పెట్టిన ఆనాటి జగన్ ప్రభుత్వం వైఖరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆనాడు కస్టడీలో జరిగిన టార్చర్ …
Read More »ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న మాటల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఒక్క పోలవరం పేరు మాత్రమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వినిపించినా… చాలా అంశాల్లో ఏపీకి కేటాయింపులు ఉన్న విషయం బయటకు రావడంతో విపక్షాల వాదనలు తేలిపోయాయి. అంతేకాకుండా అటు కేంద్రంతో పాటుగా ఇటు రాష్ట్రంలోనూ కూటమి సర్కారే ఉన్న నేపథ్యంలో ఏపీకి బడ్జెట్ లో …
Read More »ఆ ఎమ్మెల్యే… అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నారే!
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థల్లో పాలక పక్షాలు మారిపోతున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అటుఇటూ మారిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీలో చైర్ పర్సన్ ఎన్నిక అనివార్యంగా మారగా…అది టీడీపీ ఖాతాలో చేరిపోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా వైరి వర్గాల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates