Political News

నేను పారిపోలేదు.. వెళ్లానంతే: ప్ర‌భాక‌ర్‌రావు

తెలంగాణ‌ను కొన్నాళ్ల పాటు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న అప్ప‌టి ఐపీఎస్ అధికారి ప్ర‌భాక‌ర్‌రావు.. తాజాగా త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ.. నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికాలో ఉన్న‌ట్టుగా ఈ కేసును విచారిస్తున్న అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను త‌మ‌కు అప్ప‌గించాలంటూ.. కేంద్రం ద్వారా రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎప్పుడు ఇండియాకు …

Read More »

నానాజీ పంతం.. ఆ ప‌ద‌వి జ‌న‌సేన సొంతం.. !

రాజ‌కీయ నాయ‌కులు పంతం ప‌డితే..కానిదేముంది? పైగా అధికారంలో ఉన్న పార్టీ ప‌ట్టుబ‌డితే సాధ్యం కానిది అంటూ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అదే జ‌రుగుతోంది కాకినాడ రూర‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో!. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గానికి చెందిన పంతం నానాజీ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కారు. వైసీపీ మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబును ఆయ‌న …

Read More »

‘విశాఖ’ కూడా వైసీపీ చేజారిపోయింది!

ఏపీలో విపక్షం వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు దక్కడం, ఆ తర్వాత పార్టీలో కీలక నేతలంతా క్యూ కట్టి బయటకు వెళ్లిపోతుండటం… అప్పటిదాకా తమ పాలనలో ఉన్న స్థానిక సంస్థలన్నీ ఒక్కొక్కటిగానే చేజారుతుండటంతో అసలు వైసీపీకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. ఇలాంటి నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ చేజారిపోయేందుకు రంగం సిద్ధమైంది. …

Read More »

‘హత్య’ మూవీ నిర్మాతదర్శకుడిపై వివేకా హత్య కేసులో ఏ2 కేసు

ఇటీవల కాలంలో ఏపీలో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. పులివెందుల వైసీపీకి వీర విధేయుడిగా.. దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా ఆయన తీరు ఉంది. తనతో పాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారి బండారాన్ని బయటపెడతానంటూ …

Read More »

రూ.2 కోట్లు లాగిన రజినీ… ఏసీబీ కేసు నమోదు

వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు అయ్యింది. ఎలాంటి తప్పు చేయని ఓ కంపెనీని కేవలం వసూళ్ల కోసం టార్గెట్ చేసిన రజినీ… దాని యాజమానుల నుంచి ఏకంగా రూ.2 కోట్లకు పైగా వసూళ్లను బలవంతంగా లాక్కున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రజినీ పాత్రను విజిలెన్స్ అండ్ ఎన్ …

Read More »

రిషికొండకు బ్లూఫాగ్ తిరిగొచ్చింది!

విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ బీచ్ కు బ్లూఫాగ్ గుర్తింపును పునరుద్ధరించడంలో ఏపీలోని కూటమి సర్కారు వేగంగా చర్యలు చేపట్టిందని చెప్పక తప్పదు. బ్లూఫాగ్ సర్టిఫికెట్ అంటేనే… అదో ప్రత్యేక గుర్తింపు కిందే లెక్క. ఈ గుర్తింపు ఉన్న బీచ్ లకు విదేశీ పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. ఫలితంగా ఆదాయం కూడా అదే …

Read More »

కూట‌మి మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌.. ఇప్పుడు సాధ్యమేనా?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తుందా? లేక‌.. మంత్రివ‌ర్గంలో కూర్పు వ‌ర‌కు ప‌రిమితం అవుతుందా? అంటే.. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. కూర్పు వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌న్న‌వాద‌న ఓ వైపు వినిపిస్తోంది. కానీ, నాణేనికి మ‌రో కోణం అన్న‌ట్టుగా.. ప్ర‌క్షాళ‌న చేయొచ్చ‌న్న స‌మాచారం కూడా వ‌స్తోంది. దీంతో మంత్రి ప‌దువులు ఆశించే సీనియ‌ర్ నాయ‌కులు.. జూనియ‌ర్ ఎమ్మెల్యేలు కూడా.. క్యూ క‌ట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీ …

Read More »

ట్రంప్ టార్గెట్10 లక్షలు!…ఒక్కరోజులో 1,000 విక్రయం!

అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే… గోల్డ్ కార్డ్ పేరిట అమెరికా పౌరసత్వం ఇట్టే దక్కిపోతుంది. ఎంచక్కా అమెరికాలో ఆ దేశ పౌరులుగా చెలామణి అయిపోవచ్చు. ఆ దేశ పౌరులు పొందుతున్న అన్ని రకాల సేవలనూ దర్జాగా పొందవచ్చు. ఈ కొత్త పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు జనం ఎగబడే అవకాశాలున్నాయన్న వాదనలు నిజమేనన్నట్లుగా… గోల్డ్ కార్డుల అమ్మకం మొదలైన …

Read More »

ష‌ర్మిలమ్మా.. రాజ‌కీయం ఎక్క‌డ‌మ్మా?!

కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి త‌ట్టుకోలేక‌.. ఇంటి ప‌ట్టునే ఉంటున్నారా? అంటే.. ఇంటి ప‌ట్టునే ఉంటున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ఇంకేముంది.. భూకంపం పుట్టిస్తాను.. కాంగ్రెస్ పార్టీని భూమార్గం ప‌ట్టిస్తాను.. అంటూ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి లో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన ష‌ర్మిల‌.. ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా వేసింది లేదు. పైగా.. తాను న‌మ్ముకున్న సెంటిమెంటు.. తాను …

Read More »

మా వోళ్లే పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేసిన్రు: ఎమ్మెల్యే

ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేత‌ల‌పై కా మెంట్లు కుమ్మ‌రించారు. “మా వోళ్లే గ్రూపులు క‌ట్టి.. పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేసిన్రు. లేకుంటే అధికారంలోకి ఎప్పు డో వ‌చ్చేటోళ్లం“ అని వ్యాఖ్యానించారు. గ్రూపులు క‌ట్టే నాయ‌కుల‌ను ప్రోత్స‌హించ‌రాద‌ని బీజేపీ అధిష్టానా నికి తాను ఎప్పుడో లేఖ రాసిన‌ట్టు చెప్పారు. త్వ‌రలోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపిక ఉంటుంద‌న్నా రు. అయితే.. …

Read More »

స‌ల‌హాదారులు కావ‌లెను.. బోర్డు పెట్టిన జ‌గ‌న్‌?

వైసీపీ ఇప్పుడున్న ప‌రిస్థితి నుంచి పైలేవాలంటే.. ఖ‌చ్చితంగా పార్టీని పూర్తిగా జీరో నుంచే మొద‌లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. 2012లో ఎక్క‌డ ఎలా పార్టీకి అంకురార్ప‌ణ జ‌రిగిందో ఇప్పుడు అదే రేంజ్‌లో పార్టీని వ్య‌వ‌స్థీకృత ద‌శ నుంచి అభివృద్ధి చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి 2019లో 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్న త‌ర్వాత‌.. పార్టీ నిర్మాణంపై జ‌గ‌న్ పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. పైగా.. వ‌లంటీర్ల‌ను న‌మ్ముకుని కార్య‌క‌ర్త‌ల‌ను వ‌దులుకున్నారు. ఇది …

Read More »

వీడియో : జైలు నుండి పోసాని విడుదల

టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల రోజులకు కాస్త అటుఇటుగా ఏపీలోని వివిధ జైళ్లలో కాలం వెళ్లదీయాల్సి వచ్చిన పోసాని… శనివారం సాయంత్రం బెయిల్ షరతుల మేరకు జామీన్లు సమర్పించి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానిని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ …

Read More »