ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్నను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు గురువారం ఉదయం పోసాని అరెస్ట్ పై స్పందించిన జగన్… అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకండా పోసాని సతీమణికి జగన్ ఫోన్ చేశారు. పార్టీ మీ కుటుంబానికి అండగా …
Read More »పోసాని అరెస్టు.. తేదీ తప్పుగా పేర్కొన్నారు?
వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకోవడం ఖాయమేనా? అన్నదిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ సెలబ్రిటీని అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులు అన్ని అంశాలను పక్కాగా ఉన్నాయో, లేవో చూసుకుని మరీ ముందుకు సాగాల్సి ఉంది. అయితే ఏమరపాటుగా జరిగిందో… లేదంటే కావాలనే అలా చేశారో తెలియదు గానీ.. పోసాని అరెస్టు సందర్భంగా పోలీసులు ఓ తప్పు …
Read More »రిలయెన్స్తో `కూటమి` ఒప్పందం.. త్వరలోనే 2 లక్షల మందికి ఉద్యోగాలు!
ఏపీలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులు రాబట్టే క్రమంలో కీలక ముందడుగు వేసింది. తద్వారా ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలను సాధించే దిశగా ప్రభుత్వం వడివడిగా పరుగులు పెడుతోంది. తాజాగా అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ తో చేసుకున్న ఒప్పందం సాకారం దిశగా ముందుకు సాగుతోంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. …
Read More »నేతన్న కళాకృతి!.. వస్త్రంపై నారా ఫ్యామిలీ!
కుల వృత్తులకు మన సమాజంలో ఎనలేని గుర్తింపు ఉంది. ఒక్కో వృత్తిలో ఒక్కో రకమైన కళ దాగి ఉంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ కళలు అలా వినుతికెక్కుతూ ఉంటాయి. ఇలాంటి ఎప్పటికప్పుడు సరికొత్త కళాకృతులతో ఆకట్టుకుంటున్న వృత్తి చేనేత వృత్తి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి చేనేత కళకు కాణాచి. ఎన్నెన్నో కొత్త కళాకృతులు ఇక్కడి నేతన్న చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. …
Read More »మార్చి 15 నుంచి అమరావతి పనులు.. ఈలోగా కీలక నిర్మాణం పూర్తి!
ఏపీ రాజధాని అమరావతి పనులకు సంబంధించి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కీలక అప్డేట్ ఇచ్చారు. రాజధానికి సంబంధించిన పనులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. మరో 10 రోజుల్లో టెండర్లను ఖరారు చేసి, పనులు అప్పగించనున్నట్టు వెల్లడించారు. దీంతో మార్చి 15వ తేదీ నుంచి పనులు శరవేగంగా జరుగుతాయన్నారు. కేంద్రం నుంచి సాయం.. సహా.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంటున్న రుణాలతో …
Read More »పార్టీలు వేరైతే… బంధుత్వం ఉందిగా?
నిజమే.. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు నేతలను చూస్తుంటే… ఠక్కున ఇదే మాట గుర్తుకు వస్తోంది. ఈ ఫొటోలో చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చున్న నేత వైసీపీలో కీలక నేతగానే కాకుండా… ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్న తోట త్రిమూర్తులు. తోట పక్కన కూర్చున్న నేత మొన్నటిదాకా వైసీపీలో కొనసాగి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా.. ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ …
Read More »ఏబీఎన్ ను వెంకటకృష్ణ వీడారా..?
గడచిన కొన్ని రోజులుగా తెలుగు మీడియా సర్కిళ్లలో ఓ అంశం మీద ఆసక్తికర చర్చ నడుస్తోంఃది. టీడీపీ అనుకూల మీడియాగా ముద్ర పడిన ఏబీఎన్ ఆంధ్రజ్మోతి ఛానెల్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పర్వతనేని వెంకట కృష్ణ ఆ ఛానెల్ నుంచి తప్పుకున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు ఏబీఎన్ గానీ, ఇటు రాదాకృష్ణ గానీ నోరు మెదపలేదు. వాస్తవంగా ఇది వారి వ్యక్తిగత, …
Read More »సారీ చెప్పినా కుదర్లే… పోసాని అరెస్ట్
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మొన్నటిదాకా వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్ గా వ్యవహరించిన పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. ఏపీ నుంచి వచ్చిన పోలీసులు…హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోం భుజాలో నివాసం ఉంటున్న కృష్ణమురళి నివాసంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు …
Read More »వైఎస్సార్ పేరుతో కంటి ఆసుపత్రి.. విజయమ్మను పిలవని జగన్!
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్.. తన సొంత నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఖర్చు చేసి అత్యాధుని కంటి వైద్యశాలను నిర్మించారు. దీనిని తాజాగా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆయన ప్రారంభించారు. తొలుత ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిమితంగానే వైఎస్ కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు అందడం గమనార్హం. మరీ ముఖ్యంగా జగన్ తన మాతృమూర్తి విజయమ్మను పిలకపోవడం సర్వత్రా విస్మయానికి దారి తీసింది. ‘వైఎస్సార్ ఫౌండేషన్’ పేరుతో …
Read More »వైసీపీలో సలహాదారుల ముచ్చట..!
వైసీపీలో ఏం చేయాలి? నాయకులు ఎలా ఉండాలి? ఏ సమయానికి ఎలా మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? ఇలా.. ఇవన్నీ కూడా.. సలహాదారులే నిర్ణయించేవారు. గతంలో రాజకీయ సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు ఉండేవారు. వారు డిసైడ్ చేసేవారు. అయితే.. ఇప్పుడు వైసీపీ విపక్షంలోకి వచ్చింది. చాలా మంది సలహాదారులు వెళ్లిపోయారు. ఇక, ఉన్నవారు కూడా.. పార్టీలో అంతర్గతంగానే ఉంటున్నారు. కానీ.. ఇప్పుడు ఆ మిగిలిన నలుగురు సలహాదారుల ముచ్చట పార్టీలో ఆసక్తిగా …
Read More »గ్రేట్… యూపీలో తెలుగు సైన్ బోర్డులు
ఉత్తరాది అంటే దక్షిణాదికి పడదు. అదే సమయంలో దక్షిణాది అంటే ఉత్తరాదికి పడదు. హిందీ అంటే తమిళులకు పడదు. కన్నడ అంటే మరాఠాలకు అస్సలు పడదు. అయినా కూడా అందరూ కలిసే భారత్ లో నివసిస్తున్నారు. ఎప్పుడో అనుకోని పరిస్థితుల్లో కొందరు ఆకతాయిల కారణంగా ఈ తరహా విబేధాలు పొడచూపుతున్నాయి గానీ.. దేశంలో అన్ని ప్రాంతాల మధ్య సోదర భావం వెల్లి విరుస్తోంది. అందుకు నిదర్శనం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ …
Read More »పెట్టుబడి దారుల సదస్సులో పట్టెడన్నం కోసం ఫైటింగ్!
అది పెట్టుబడి దారుల సదస్సు. వేల కోట్ల రూపాయల నుంచి వందల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థలకు చెందిన ప్రతినిధులు.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఇలాంటి సదస్సులో నిర్వాహకులు వ్యవహరించిన తీరుతో వారు పట్టెడన్నం కోసం ఫైట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పైగా.. చాలా మందికి భోజనం లభించక.. తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఈ పరిణామం.. పెట్టుబడుల కంటే కూడా.. వివాదాలకు తావిచ్చేలా చేసింది. ఎక్కడ? …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates