కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మూడు రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్సభలో వీగిపోయాయి. వీటిలో ప్రధాన మైంది.. మహిళా రిజర్వేషన్ బిల్లు. వాస్తవానికి 2023లో చట్టం అయిన.. దీనిని మరోసారి సవరించడం ద్వారా నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం ప్రతిపాదించింది. ఇదే ఇప్పుడు ఈబిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనికి మరో కీలక కారణం.. `రాజకీయం`. ఎన్నికల వేళ మోడీ సర్కారు వ్యూహాత్మకంగా దీనిని తీసుకువచ్చిందన్న ప్రతిపక్షాలు.. అన్నంత పనీచేశాయి. …
Read More »కేంద్రంలోని విపక్షాలపై జగన్ ఫైర్
లోక్ సభలో ఒక చారిత్రాత్మక బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఎన్డీఏ ఓటింగ్ లో ఓటమి ఫాలయింది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, ఈ రెండు బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు తమ నిర్ణయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే …
Read More »కవిత ఫస్ట్ టార్గెట్ కారు వీరులే
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉండగా… ఆ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత… తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు. అయితే ఇప్పుడు తండ్రి పార్టీకే పోటీ అంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే …
Read More »‘ఉత్తరాది’పై ‘దక్షిణాది’దే విజయం!
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం యావత్తు దేశాన్ని తట్టి లేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేంటంటే… ఉత్తరాది ప్రాధాన్యాన్ని మరింతగా పెంచుతూ దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా జరుగుతున్న ఎన్డీఏ ఎత్తులన్నీ చిత్తు అయ్యాయయన్నదే ఆ విశ్లేషణ సారాంశం. మరింత సూటిగా చెప్పాలంటే.. ఉత్తరాది లాబీపై దక్షిణాది లాబీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ఎన్డీఏ ఆలోచనతో ఒక్కసారిగా …
Read More »వీగిపోయిన బిల్లులు… ఓట్లు ఇంత తక్కువా?
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం కోసం గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ఈ బిల్లులపై లోక్ సభలో సుదీర్ఘ చర్చ జరగగా… శుక్రవారం రాత్రి బిల్లులపై ఓటింగ్ జరిగింది. మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కాల్సి ఉండగా… అంతకంటే తక్కువ మంది ఎంపీలు మాత్రమే బిల్లుకు అనుకూలంగా …
Read More »మత పరమైన రిజర్వేషన్లు ఉంటాయా?
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు సహా.. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై శుక్రవారం సాయంత్రం ఏకబిగిన గంటా 40 నిమిషాల పాటు మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాలను.. ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలను తూర్పారబట్టారు. “తన మిత్రపక్షాలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్లను తీసుకురావాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలా మేం …
Read More »విజయ్… కొంతయినా జాలి కలిగేనా?
దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలనే బలమైన నిర్ణయం, మరోవైపు చుట్టూ అల్లుకున్న వివాదాలు ఆయన ప్రయాణాన్ని సవాల్ చేస్తున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో ఒంటరిగా పోరాడుతామని ప్రకటించిన విజయ్కు.. రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టకముందే వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వ్యక్తిగత జీవితంపై వస్తున్న …
Read More »ఎవరీ తేజస్వి..? ఎందుకింత రాజకీయ మంట!
ప్రస్తుతం తెలంగాణ సహా తమిళనాడు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ఏకైక పేరు తేజస్వి సూర్య. ఈయనను ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని.. పార్టీ నుంచి బయటకు గెంటాలని.. ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ తేజస్వికి వ్యతిరేకంగా ప్రకటనలే కాదు.. ఆయన దిష్టి బొమ్మ దహనాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ తేజస్వి? ఎందుకిలా రాజకీయ మంటలు చెలరేగాయి? …
Read More »`అమ్మా వణక్కం`- విజయ్ సంచలన మేనిఫెస్టో!
ఏపీలో `తల్లికి వందనం` పేరుతో పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లుల ఖాతాల్లో రూ.15000 జమ చేసే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పథకాన్ని తమిళనాడులోనూ అమలు చేయనున్నట్టు తమిళ వెట్రి కగళం(టీవీకే)పార్టీ చీఫ్, దళపతి విజయ్ ప్రకటించారు. “అమ్మా వణక్కం` పేరుతో ఆయన ఈ కీలక పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద.. ప్రభుత్వ స్కూళ్లకు తమ పిల్లలను పంపించే తల్లుల ఖాతాల్లో 15 వేల …
Read More »ఒక్కొక్క పార్టీకీ `3 గంటలు`…
పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజుజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చకు ఎంత సమయమైనా ఫర్వాలేదని.. స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే.. రాత్రివేళల్లోనూ చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. సభలో ఒక్కొక్క …
Read More »జగన్ మకాం మార్పు.. సెంటిమెంటా? రాజకీయ వ్యూహమా?
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై ఆలోచిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. బెంగళూరులోని యలహంక నివాసాన్ని పరిమితంగా ఉపయోగిస్తున్న ఆయనపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, పార్టీ వ్యవహారాల నిర్వహణకు మరింత అనుకూలమైన కేంద్రాన్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్లోని లోటస్పాండ్ మళ్లీ జగన్ రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా …
Read More »తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజమే..
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ ఒక ట్వీట్ చేశారు. ‘ దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు.. నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం.. కట్టినవన్నీ కూల్చేస్తాం.. కంపెనీలన్నీ వెళ్లగొడతాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జగన్ మోహన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates