Political News

ఏపీకి మోడీ వ‌రాలు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించింది. శ‌నివారం జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సుదీర్ఘ కాలంగా ఏపీ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం కూడా ఎదురు చూస్తున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించింది. దీనిలో ప్ర‌ధానంగా రాజ‌మండ్రి-విశాఖ‌ల మ‌ధ్య రెండు రైల్వే లైన్ల‌ను నిర్మించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అలాగే.. ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల మ‌ధ్య ఉన్న నిడ‌ద‌వోలు-దువ్వాడల‌ను క‌లుపుతూ.. మ‌రో రైల్వే లైన్‌ను నిర్మించేందుకు …

Read More »

జ‌గ‌న్ న‌చ్చాడా ప్ర‌కాష్‌రాజ్?

ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై బ‌హుభాషా న‌టుడు.. ప్ర‌కాష్‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు.. ప్ర‌జ‌ల‌కు అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇది స‌రికాద‌న్నారు. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన వారు.. ఇలా కేంద్రాన్ని గుడ్డిగా స‌మ‌ర్థించ‌డం స‌రికాద‌ని తేల్చి చెప్పారు. అయితే.. ఇదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ప‌న్నెత్తు మాట అన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏం జ‌రిగింది? పార్ల‌మెంటులో 131వ రాజ్యాంగ …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శస్త్ర చికిత్స నిర్వహించారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఆయన ఆ రోజు అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా, ఎంఆర్‌ఐ స్కాన్ కూడా చేశారు. పరీక్షల నివేదికలను …

Read More »

బీజేపీకి బలం పెరిగితే టీడీపీని కూడా…

నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లు లోక్ సభలో వీగిపోయిన తర్వాత ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై తనదైన శైలి గళం విప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… తాజాగా శనివారం సంచలన కామెంట్లు చేశారు. ప్రత్యేకించి ఎన్డీఏ రథసారథిగా ఉన్న బీజేపీ తీరుపై ఆయన గతంలో ఎన్నడూ లేని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ …

Read More »

జగన్ ‘అక్రమ పొత్తు’పై విరుచుకుపడిన షర్మిల

బిల్లు ఏదైనా సరే.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాజకీయ వర్గాలు విస్తుపోయే విధంగా బీజేపీ భజనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో జగన్‌కు సిగ్గుండాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఘాటుగానే వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుగా ఎన్డీఏ పక్షాన జగన్ నిలబడినందుకు ఆమె ఫైర్ అయ్యారు. జగన్ వైఖరి ద్వారా బీజేపీతో ఉన్న “అక్రమ పొత్తు” బయటపడిందని …

Read More »

మృత్యుంజయురాలి పునర్జన్మ… మాట నిలబెట్టుకున్న లోకేష్

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు కొత్త జీవితం లభించింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాణరక్షక ఇంజెక్షన్ అందించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయించారు. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి అయిన స్పైనల్ మాస్క్యూలర్ ఆంట్రోఫీ తో బాధపడుతున్న పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ‘జోల్జెన్స్‌మా’ ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. చికిత్స కోసం ప్రజలు ముందుకు వచ్చి సుమారు రూ.10 …

Read More »

ప్రకాష్‌రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా?

సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తరఫున అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేయగా, క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవల కేరళలో జరిగిన సాహిత్య …

Read More »

ఎన్డీఏ నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి రేవంత్

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డీఏ నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, …

Read More »

బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ఇన్ని హామీలా?

ఎన్నిక‌లు అన‌గానే పార్టీలు ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించ‌డం కామ‌నే. అయితే.. ఒక‌ప్పుడు అంటే.. ప‌ది ప‌దిహేనేళ్ల కింద‌టి వ‌ర‌కు రాష్ట్రాల ఆర్థిక స్థితిగ‌తుల‌ను దృష్టిలో పెట్టుకుని నాయ‌కులు హామీలు గుప్పించేవారు. త‌ద్వారా.. ప‌రిమితంగానే ఉచితాల బాట ప‌ట్టేవారు. కానీ, త‌మిళ‌నాడు వంటి కీల‌క రాష్ట్రాల్లో ఈ ప‌రిమితి దాదాపు 40 ఏళ్లుగా క‌నిపించ‌డం లేదు. రాష్ట్రాల బ‌డ్జ‌ట్‌తో సంబంధం లేదు. కేవ‌లం ఓట‌ర్ల‌ను ఆ క్ష‌ణంలో మ‌చ్చిక …

Read More »

‘మోడీ – షా’లకు పరాభవం స్వయంకృతమే!

వరుసబెట్టి మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమికి శుక్రవారం గట్టి షాకే తగిలింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఏళ్ల తరబడి సాగుతున్న ప్రక్రియ. అదే సమయంలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన అంశం నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండింటినీ ఒకేసారి అమలు చేయాలని బీజేపీ కీలక నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తలచింది. వరుసగా మూడు పర్యాయాలు అధికారం దక్కించుకున్న తనకు ఇదేమీ పెద్ద పనే కాదని …

Read More »

మ‌హాసేన రాజేష్ వాట్ నెక్ట్స్‌… !

మహాసేన రాజేష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. యూట్యూబ‌ర్‌గా ప్రారంభమైన రాజేష్ ప్రస్థానం తర్వాత కాలంలో రాజకీయాల వైపు మళ్ళింది. ముఖ్యంగా టిడిపిని సమర్ధించే వ్యక్తుల్లో రాజేష్ ఒకరు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయ‌న‌ గత ఎన్నికల సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాలని కూడా భావించారు. టికెట్ కూడా ఖరారు అయినట్టు చర్చ కూడా నడిచింది. కానీ, అనూహ్యంగా ఒక …

Read More »

లోకేష్ టీం.. బ‌రువు బాధ్య‌త‌లు ఎక్కువే!

టీడీపీ రాష్ట్ర, జాతీయ క‌మిటీల‌ను తాజాగా ప్ర‌క‌టించారు. వీటిలో మెజారిటీ ప‌ద‌వుల‌ను యువ‌త‌కు కేటా యించారు. దీనినే పార్టీలో కొంద‌రు `లోకేష్ టీం`గా పేర్కొంటున్నారు. వీరంతా కూడా లోకేష్‌తో అనుబంధం ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. మంచిదే.. పార్టీలో అధినేత మొద‌లు ఎవ‌రో ఒక‌రితో అనుబంధం ఉండ‌డం త‌ప్పుకాదు. కానీ.. తాజాగా ఎంపికైన ప‌ద‌వుల‌ను గ‌మ‌నిస్తే.. కీల‌కంగా ఉన్న యువ నాయ‌కుల‌కు భారీ బ‌రువు బాధ్య‌త‌లే క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 రూపాల్లో …

Read More »