దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు జ్యూరిచ్లో బిజీ బిజీగా గడిపారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లా తో సమావేశమైన ముఖ్యమంత్రి…ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీని ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా …
Read More »డౌట్ లేదు… బీజేపీ జాతీయ సారథి ఆయనే!
బీజేపీ జాతీయ సారథి ఎవరనే విషయంపై స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న బీహార్కు చెందిన నితిన్ నబీనే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానున్నారు. తాజాగా జాతీయ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీ ఎంపీ.. తెలంగాణకు చెందిన కె. లక్ష్మణ్ నేతృత్వంలో నామినేషన్ల స్వీకారం ప్రారంభమైంది. అయితే.. ఈ కార్యక్రమంలో నబీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట అగ్ర నాయకులు కేంద్రమంత్రులు అమిత్ …
Read More »బాబు సింగపూర్ లో దిగడమే ఆలస్యం…
దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. మార్గం మధ్యలో జ్యురిచ్లో ఆగారు. షెడ్యూల్లో భాగంగా జ్యూరిచ్లోనూ పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పాల్గొంటారు. జ్యూరిచ్కు చేరుకోగానే.. సీఎం చంద్రబాబుకు స్థానిక తెలుగు వారి నుంచి భారీ స్వాగతం లభించింది. 20కి పైగా యూరప్ దేశాలకు చెందిన ఎన్నారైలు.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చి.. సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం.. భారత …
Read More »కవిత ‘పీకే’ మంత్రం ఫలిస్తుందా?
సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. తన పార్టీకి సంబంధించిన పనిని ప్రారంభించేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇదేసమయంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలాంటి అడుగులు వేయాలి… ప్రజల నాడి ఎలా ఉంది? అనే అంశాలపై రాజకీయ మాజీ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ నుంచి ఆమె సలహాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు …
Read More »`పాలన కోసం పుస్తకం` పట్టనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రిగా నిత్యం ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి..పుస్తకాలు పట్టుకుని స్టూడెంట్ గా మారనున్నారు. నిజానికి తనకు ఒక్కరోజు సెలవు కూడా దక్కడం లేదని.. తీసుకుందామని అనుకున్నా..ఏదో ఒక పని ఉంటోందని ఇటీవల సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అంటే.. ఆయన ఎంత బిజీగా ఉన్నారోచెప్పడానికి ఇది ఉదాహరణ. అయినా.. ప్రజలకు మరింత సుపరిపాలనను చేరువ చేసేందుకు ఇప్పుడు ఆయన పుస్తకం-పెన్ను పట్టుకుని విద్యార్థిగా మారనున్నారు. 5 రోజుల పాటు …
Read More »నిన్న విజయ సాయి రెడ్డి… ఈరోజు మిథున్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్రెడ్డికీ నోటీసులు పంపింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతకుముందు 22న విజయసాయిరెడ్డి విచారణకు రావాలని కోరిన ఈడీ, వరుసగా మిథున్రెడ్డిని పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ పాలనలో …
Read More »వైసీపీ ఎత్తులు పారట్లేదు… కింకర్తవ్యం!
వైసీపీ ఎత్తులు పారడం లేదు. ఈ మాట ఆపార్టీ నాయకులే చెబుతున్నారు. కూటమి సర్కారుపై పైచేయి సాధించేందుకు ఎంచుకున్న అన్ని ప్రయోగాలు విఫలం అవుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులు.. చేస్తున్న సంక్షేమం వంటివాటిని తమ ఖాతాలో వేసుకుని.. అవి అప్పట్లో జగనే ప్రారంభించారని.. ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ.. ఇది ప్రజల్లోకి పెద్దగా ఎక్కడం …
Read More »రాజకీయం అంటే… అంతే కదా జగ్గారెడ్డీ?
రాజకీయాల గురించి సీనియర్ మోస్ట్ నాయకుడు.. తెలంగాణ కాంగ్రెస్ నేత.. జగ్గారెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన అన్నీ తెలిసి కూడా.. ఆయన ఇటీవల కాలంలో ఫ్రెస్ట్రేషన్కు గురవుతున్నారు. తాజాగా తన సొంత నియోజకవర్గంలోని మేధావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2023 ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. అనేక ఎన్నికలను చూసిన జగ్గారెడ్డికి.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమనే విజయం తెలియంది కాదు. పైగా …
Read More »అన్నగారే ఈ యుగానికి ఒక్కడు!
యుగానికి ఒక్కడు- అన్న నానుడి మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు విషయంలో అక్షరాలా నప్పుతుంది. చలన చిత్ర సీమలో అనేక మంది ఉద్ధండ నటులు వున్నప్పటికీ.. రాజకీయ రంగంలో కాకలు తీరిన నాయకులు ఉన్నప్పటికీ.. తనదైన శైలిలో వేసిన అడుగులతో తెలుగు వారి గుండెల్లో అన్నగారిగా పదిలమైన చోటు దక్కించుకున్నారు ఎన్టీఆర్. 1923, మే 28న ఉమ్మడి కృష్నాజిల్లాలోని నిమ్మకూరులో జన్మించిన రామారావు.. 1996, జనవరి 18న అమాభినిష్క్రమణం …
Read More »తెలంగాణలో `సికింద్రాబాద్` సెగ… అసలేంటిది?
తెలంగాణలో తాజాగా `సికింద్రాబాద్` కేంద్రంగా వివాదం తెరమీదకి వచ్చింది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు.. ప్రస్తుతం ఉన్న మండలాల పరిధిలను కూడా మార్చనున్నారు. అయితే.. దీనికి కొంత కసరత్తు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కీలకమైన జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్లోని ఉత్తర భాగం(నార్త్జోన్)లో ఉన్న కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కార్పొరేషన్లో కలిపేందుకు.. ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రచారం తెరమీదికి వచ్చింది. వాస్తవానికి దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి …
Read More »1996, జనవరి 18 … చరిత్రపై లిఖించని సంతకం!
కొన్ని తారీకులు.. సంవత్సరాలు.. కాలంతో పాటు కరిగిపోవు. అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి. సదరు తారీకులు.. సంవత్సరాలలో జరిగిన పెద్ద ఘటనలైనా..చిన్న ఘటనలైనా.. అశేష ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అలాంటి తారీకుల్లో జనవరి – 18, అలాంటి సంవత్సరాల్లో 1996 ఒకటి. ఆ రోజు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఆమాటకొస్తే.. అమెరికాకు చెందిన `వాషింగ్టన్ పోస్టు`.. సాధారణంగా.. వెలువరించే.. ఉదయం పత్రికకు ఆ రోజు అనుబంధం ప్రచురించింది. …
Read More »కొడాలి నానీకి ఈసారి టికెట్ లేనట్టేనా?
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం గుడివాడలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న కొడాలి నాని (శ్రీ వెంకటేశ్వరరావు) వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే రెండు ప్రధాన చిక్కులు ఎదురవుతున్నాయి. మొదటిది.. తానే ప్రకటించుకున్న శపథం. గత ఎన్నికల సమయంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ కొడాలి నాని శపథం చేశారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates