Political News

కీలక నేతలకు క్లాసు ?

రాబోయే ఎన్నికల్లో పార్టీలోని కీలక నేతలంతా తప్పకుండా పోటీ చేయాల్సిందే అని బీజేపీ ఏపీ ఇన్చార్జి శివప్రకాష్ స్పష్టంగా చెప్పేశారు. ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే విషయమై అవలంభించాల్సిన విధివిధానాలపై రెండురోజుల పాటు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం శని, ఆదివారాల్లో పార్టీ ఆఫీసులోనే జరుగుతోంది. ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ చాలామంది నేతలు మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా కీలకం …

Read More »

ఏపీ స‌చివాల‌యం తాక‌ట్టు.. బాబు రియాక్ష‌న్ ఇదే!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్ర స‌చివాల‌య్యాన్ని రూ.370 కోట్ల అప్పు కోసం తాక‌ట్టు పెట్ట‌డాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇంత‌క‌న్నా త‌ప్పుడు ప‌ని, దుర్మార్గం మ‌రొక‌టి లేద‌ని పేర్కొ న్నారు. ఇది రాష్ట్రానికి అత్యంత‌ అవమానకరమని పేర్కొన్నారు. ‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. …

Read More »

అసమ్మతి నేతలను బీజేపీ పట్టించుకోలేదా ?

తెలంగాణాలో విడుదలైన బీజేపీ ఎంపీ అభ్యర్ధుల మొదటిజాబితాను చూసిన తర్వాత ఇదే విషయం అర్ధమవుతోంది. మొదటిజాబితాలో పార్టీ అగ్రనేతలు తొమ్మిది స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. సికింద్రాబాద్ నుండి కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్ కు టికెట్లు దక్కాయి. వీరుముగ్గురు ప్రస్తుతం పై నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగో స్ధానం ఆదిలాబాద్ లో ఎంపీ …

Read More »

సీనియర్ తమ్ముళ్ళు అడ్డం తిరుగుతున్నారా ?

నియోజవర్గాలను మార్చి పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించటం లేదు. రాబోయే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో సర్దుబాట్లు చేయాల్సిన అవసరం అధినేతకు వచ్చింది. వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దాంతో వాళ్ళని అకామిడేట్ చేయటం కోసం సీనియర్ తమ్ముళ్ళని నియోజకవర్గాలు మారమని చంద్రబాబు అడుగుతున్నారు. అందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. తమ నియోజకవర్గాల్లోనే తాము పోటీ చేస్తామని గట్టిగానే …

Read More »

కాంగ్రెస్ కూడా పర్వాలేదే

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో చాలా పార్టీలు హడావిడి చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ కూటమి, బీజేపీలో చాలా హడావుడి జరుగుతోంది. పోటీ చేయాలనే ఆశక్తి ఉన్న వారినుండి దరఖాస్తులు స్వీకరించటం, స్క్రీనింగ్ చేయటం, నియోజకవర్గానికి ముగ్గురు నేతలను ఎంపికచేయటం లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీలో దరఖాస్తుల గోల లేకపోయినా సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేల్లో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిన నేతలతో అధినేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు …

Read More »

సమస్యను చిన్నదిగా చూపిస్తున్నారా ?

మేడిగడ్డ బ్యారేజి సమస్యను చాలా చిన్నదిగా చూపించేందుకు బీఆర్ఎస్ నానా అవస్థలు పడుతోంది. శుక్రవారం నాడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ నాయకత్వంలో సుమారు 200 మంది నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజి తర్వాత సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను కూడా కేటీయార్ బృందం పరిశీలించింది. కేటీయార్ బృందం పరిశీలనలోనే కుంగిన పిల్లర్లతో పాటు పగుళ్ళిచ్చిన బ్యారేజి గోడలు కనబడ్డాయి. ఆ పగుళ్ళు …

Read More »

ఈ తమ్ముడు బాగా కష్టపడాల్సిందేనా ?

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బాగా కష్టపడాల్సిన నియోజకవర్గాల్లో కడప జిల్లాలోని రాయచోటి కూడా ఒకటి. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి నాలుగుసార్లు వరుసగా గెలుస్తునే ఉన్నారు. ఐదోసారి కూడా గెలిచే విషయంలో గడికోట బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ మీద తెలుగుదేశంపార్టీ తరపున మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పోటీచేయబోతున్నారు. చాలాకాలంగా నియోజకవర్గంలో …

Read More »

బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో ఏపీకి నిల్..పొత్తు కోసమేనా?

మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఈ రోజు ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తాప్ డే విడుదల చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికలలో 400 సీట్లు సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. బిజెపికి అవలీలగా 370కి పైగా …

Read More »

పోటీ నుంచి తప్పుకున్న మహాసేన రాజేష్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు అటు ఇటుగా ఇంకో 40 రోజుల సమయమే మిగిలింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుండగా.. ఇటీవలే తెలుగుదేశం-జనసేన కూటమి కూడా తొలి జాబితాను విడుదల చేసింది. అందులో అందరి దృష్టినీ ఆకర్షించిన పేర్లలో మహాసేన రాజేష్ ఒకటి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పి.గన్నవరం నుంచి అతడికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆర్థికంగా బలహీనుడినైన తనకు అండగా నిలవాలంటూ …

Read More »

గ్రేటర్ పరిధి పెరగబోతోందా ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ప్రభుత్వం పెంచబోతోందా ? ప్రభుత్వ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోయే ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం లేదా లీకులు ఇవ్వటం ఆశ్చర్యంగానే ఉంది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమనే విషయంపై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. గ్రేటర్ చుట్టుపక్కలున్న 30 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలను కూడా …

Read More »

సర్వేలకే అత్యంత ప్రాధాన్యతిస్తున్నారా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు తొందరలోనే రెండో జాబితాను రిలీజ్ చేయబోతున్నారు. మరో వారంలోనే 30 మంది అభ్యర్ధుల పేర్లుండచ్చని పార్టీవర్గాల సమాచారం. దాదాపు వారంరోజుల క్రితం రిలీజ్ చేసిన మొదటిజాబితా పార్టీలో కలకలం రేపింది. ఎందుకంటే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావు, బోడె ప్రసాద్, పల్లా శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి 30 మంది సీనియర్లకు టికెట్లు దక్కలేదు. దక్కలేదంటే పై నేతలు పోటీచేస్తున్న …

Read More »

మంగళగిరిలో కీలకమైన మార్పు

రాబోయే ఎన్నికలకు సంబంధించి పోటీచేయబోయే అభ్యర్ధులతో జగన్మోహన్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల జాబితాను రిలీజ్ చేశారు. ఇందులో రెండుపేర్లు చాలా ఇంట్రెస్టింగుగా ఉన్నాయి. అవేమిటంటే నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇన్చార్జిగా లావణ్యను ప్రకటించటం. విజయసాయిరెడ్డి పేరు తెరమీదకు రావటం అనూహ్యమనే అనుకోవాలి. ఇక్కడ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరుతున్నారు. అందుకనే కొత్తగా అభ్యర్ధిని దింపాల్సొచ్చింది వైసీపీకి. అనేక రకాల సర్వేలు, కాంబినేషన్లను ఆలోచించిన …

Read More »