భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం పవన్ కు శస్త్ర చికిత్స జరగగా…ఆ మరునాడే ఆదివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా ముంబై వెళ్లి మరీ పవన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన బాబు… పవన్ త్వరగా …
Read More »బాలయ్యకు ఏదైనా ఒకటే…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్ (ఎక్స్కవేటర్)ను స్వయంగా నడిపి హంద్రి–నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. భారీ యంత్రాన్ని నడుపుతూ మట్టిని తొలగించిన బాలయ్య తీరు అక్కడికి వచ్చిన ప్రజలు, రైతులు, కార్యకర్తలను ఆకట్టుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా రైతులకు సాగునీటి భరోసా కల్పించే లక్ష్యంతో రూ.790 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హంద్రి–నీవా …
Read More »ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ.. కీలకమైన బూత్ లెవిల్ కార్యకర్తలు జనసేనకు కొరవడ్డారు. ఆది నుంచి కూడా క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల ఏర్పాటు, కార్యకర్తల నియామకంపై పార్టీ ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. దీంతో క్షేత్రస్థాయిలో డెవలప్ అయ్యేందుకు పార్టీకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీనికితోడు త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో …
Read More »రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నా… వారి ఇష్టా ఇస్టాలతో సంబంధం లేకుండా కూటమి సర్కారు పోలీసు బలగాలను మోహరించి ఆయా భూములను బలవంతంగా లాక్కుందన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. పెద్ద సంఖ్యలో రైతుల భూములను లాక్కునేందుకు అధికారులు పోలీసులతో కలిసి రాగా.. వారిని రైతులు అడ్డుకున్నారని, రైతులను పోలీసులు లాగి పడేశారని …
Read More »పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని భవిష్యత్తులో తాను నిజం చేస్తానని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జనాభాను నియంత్రించడం సరికాదని తేల్చి చెప్పారు. జనాభాను సంరక్షించే విధానాలు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఉత్తమ విద్య, ఆర్థిక వనరుల పెంపు వంటివాటికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. …
Read More »అమరావతిలో అలజడి… మళ్ళీ ఏం జరిగింది?
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు. తద్వారా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే.. రాజధాని తొలి విడత భూ సమీకరణలో కొందరు రైతులు భూములు ఇవ్వలేదు. తాము భూములు ఇచ్చేది లేదని భీష్మించారు. అయితే.. రైతులు ఇవ్వని భూముల కారణంగా.. రహదారులు వంకర టింకరగా నిర్మించాల్సి వస్తోంది. …
Read More »తెలంగాణ హంతకుడిది – జగన్ది ఒకే పోలిక: చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని కత్తితో పొడిచి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారన్న క్షకతో బాధితురాలి కుటుంబంతో సహా.. తనకుటుంబానికి చెందిన వారిని కూడా అతను దారుణంగా పొడిచి చంపాడు. ఈ కేసు స్థానికంగా తీవ్రసంచలనం సృష్టించింది. ఈ …
Read More »ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అసభ్య పదజాలాన్ని ప్రయోగించిన కేసులో అరెస్టు అయిన రావణ్ కు న్యాయ సహాయం చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్… తాజాగా ఓ ఇంటర్పవ్యూలో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రశ్న రావణ్ తో తనకు అంతగా సంబంధాలేమీ లేవని …
Read More »పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర చికిత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టింది. ఏళ్ల క్రితం అయిన గాయాలకు సంబంధించి పవన్ చాలా కాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2018లో రెండు భుజాలకు గాయాలు కాగా… వాటికి సంబంధించిన చికిత్సను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వాటిని మరింత కాలం వాయిదా వేయడం …
Read More »పల్లి పల్లి మంత్రి లోకేష్
పల్లి పల్లి లోకేశ్… ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో, లేదంటే లోకేశ్ అంటే ఇష్టం లేని వారో పెట్టిన పేరు కాదు. లోకేశ్ స్పీడును చూసి మంత్రముగ్ధులైన విదేశీ పారిశ్రామికవేత్తలు ఆయనకు పెట్టిన పేరు ఇది. పల్లి పల్లి లోకేశ్ అంటే… త్వరగా త్వరగా లోకేశ్ అని అర్థం. ఏ విషయంలో అయినా ఇలా చెబుతుంటే అలా నిర్ణయాలు తీసుకుంటున్న లోకేశ్ తీరు …
Read More »అక్క రాజ్యం చూపిస్తానంటున్న కవిత
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. “ఇప్పటి వరకు మీరు అన్న.. అన్న అంటూ అన్నరాజ్యం చూశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. అక్కరాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తా.“ అంటూ.. తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో.. ఎవరిని ఎంతగా గౌరవించాలో అంతా చేస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రం స్వరూపాన్నే మార్చేస్తామని చెప్పారు. …
Read More »‘భద్రాచలం రాముడి మీద ఆనా… ఈసారి కాంగ్రెస్ పార్టీకి 117!’
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. అంతేకాదు, 117 సీట్లలో గెలిచి తీరుతామని ఆయన చెప్పారు. భద్రాద్రి రామయ్యపై ఆన.. వచ్చే ఎన్నికల్లో మేం 117 స్థానాల్లో గెలిచి తీరుతాం. అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు భరోసా చివరి విడత నిధులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం సీఎం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates