Political News

”ఆ 11 మంది పశ్చాత్తాప పడతారనుకున్నా”

నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ సభ్యుల గైర్హాజరీపై మండిపడ్డారు. చివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై తీర్మానం కోసం సమావేశమైన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యుల గైర్హాజరీపై అయ్యన్న ఆసక్తికర …

Read More »

అమరావతి అగ్నిప్రమాదం వెనుక అసలు నిజం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో… రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా… ఈ ఘటన వెనుక రాజధానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఈ మంటలకు కారణం కావచ్చన్న వాదనలు వినిపించాయి. అయితే సదరు పైపులకు కాపలా …

Read More »

మళ్లీ జగన్ లాంటోళ్లు వస్తే… అమరావతిపై షర్మిల

మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నారని అన్నారు. ఈ తీర్మానం పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే అని కూడా వ్యాఖ్యానించారు. మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే..అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం …

Read More »

గుంటూరు రాజకీయం వేడెక్కుతుంది

గుంటూరు తూర్పు.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గం ఇదే!. అయితే.. దీనిపైనే ఎక్కువ‌గా టాక్ న‌డుస్తోంది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయి. 1) ప్ర‌స్తుత ఎమ్మెల్యే వైఖ‌రి. 2) వైసీపీలో ఏర్ప‌డుతున్న గ్యాప్‌. ఈ రెండు అంశాలు కూడా రాజ‌కీయంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయి. కూట‌మి పార్టీల త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో న‌జీర్ అహ్మ‌ద్ పోటీ చేసి విజ‌యం ద‌క్కించు కున్నారు. ఈయ‌న‌కు …

Read More »

ద‌క్షిణాదిపై కేంద్రం ప‌ట్టు.. ప్ర‌మోద‌మా? ప్ర‌మాద‌మా?

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం (కూట‌మి) ప‌ట్టు పెంచుకుంటోందా? రాజ‌కీయంగా వ్యూహాత్మక స్టెప్పులు వేస్తోందా? అంటే.. ఒన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉత్త‌రాదిపై ఇప్ప‌టికే బీజేపీ ప‌ట్టు బిగించింది. ఢిల్లీ నుంచి యూపీ వ‌ర‌కు.. ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, ఒడిశాల దాకా కూడా విస్త‌రించింది. నిజానికి ఒడిశాలో 30 ఏళ్ల బీజేడీ పాల‌న‌కు తెర‌దించి.. క‌మ‌లం విక‌సించింది. ఇక‌, ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు …

Read More »

టీడీపీ స్కూల్‌.. ఏడాదికి 300 రోజులు క్లాసులే

టీడీపీ అంటేనే రాజ‌కీయ విశ్వ‌విద్యాల‌యం అని సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా చెబుతుంటారు. త‌ర‌చుగా మంత్రి, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కూడా.. ఇదే విష‌యాన్ని చెబుతుంటారు. ఇప్పుడు మ‌రింత ఎక్కువ‌గా టీడీపీ స్కూల్‌ను బ‌లోపేతం చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాయకుల‌ను త‌యారు చేసేందుకు ఏడాదికి కేవ‌లం 50-70 రోజులు మాత్ర‌మే కేటాయించారు. నాయ‌కుల‌కు శిక్ష‌ణ‌, భ‌విష్య‌త్తు వ్యూహాల‌పై దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, ఇక నుంచి …

Read More »

క‌విత క‌ల్లోలం… ఏ పార్టీకి?!

ఒకరు పార్టీ పెట్టారంటే.. కొత్త‌గా వ‌చ్చే ఓట్లు అంటూఏమీ ఉండ‌వు. ఏదో ఒక పార్టీకి సానుకూలంగా ఉన్న ఓట్ల‌ను.. లేదా త‌ట‌స్థులుగా ఉన్న వారి ఓట్ల‌ను మాత్ర‌మే సొంతం చేసుకుని ఆ పార్టీ ముందుకు సాగాలి. ఉమ్మ‌డి ఏపీలో 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో స్థాపించిన ఈ కొత్త కుంప‌టిలో నాడు చేరింది.. …

Read More »

38 ఎంపీ స్థానాలు: ఎవరికీ కలిసొస్తాయి?

ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు 25. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవి మరో 13కు పెరిగి 38 వరకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీకి బలం ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించింది. వైసీపీ నాలుగు స్థానాలు …

Read More »

కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న కవిత… ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కొత్తగా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను …

Read More »

భద్రాచల ఆలయానికి 1000 కోట్లు

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో.. గోదావ‌రి న‌ది ఒడ్డున ఉన్న ప్ర‌ఖ్యాత భ‌ద్రాచ‌లం ఆల‌యాన్ని విస్త‌రించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మైంది. ఈ ప‌నుల‌కు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స‌తీస‌మేతంగా భూమి పూజ చేశారు. మొత్తంగా 3 ద‌శ‌ల్లో ఈ ఆల‌యాన్ని విస్త‌రించ‌నున్నారు. తాజాగా 351 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్ట‌నున్న తొలి ద‌శ ప‌నుల‌కు ఆయ‌న శ్రీకారం చుట్టారు. ఎందుకు? భ‌ద్రాచ‌లం ఆల‌యాన్ని విస్త‌రించాల‌న్న‌ది కొన్నాళ్లుగా జ‌రుగుతున్న …

Read More »

ర‌ఘురామ‌పై రాళ్ల దాడి… ఏం జ‌రిగింది?

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న తృటిలో త‌ప్పించుకున్నారు. కానీ.. ఆయ‌న అనుచ‌రులు, ప‌లువురు టీడీపీ కార్య‌కర్త‌లు, నాయ‌కులు గాయ‌ప‌డ్డారు. వాహనాల‌పై రాళ్లు ప‌డ‌డంతో అద్దాలు స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్నాయి. దీంతో హుటాహుటిన గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఏం జ‌రిగింది? శ్రీరామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాలోని ఆకివీడులో ఉన్న పెద్దరామాల‌యానికి డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ వ‌చ్చారు. అయితే.. …

Read More »

లాక్ డౌన్ భయాలకు కారణమెవరు?

కరోనా ప్రబలిన వేళ.. యావత్తు ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎలాంటి విపత్కర సరిష్థితులను ఎదురు చూశామన్న విషయం ప్రతి ఒక్కరికీ విదితమే. తాజాగా అలాంటి పరిస్థితులు లేకున్నా కూడా దేశంలో మరోమారు లాక్ డౌన్ తప్పదంటూ గడచిన రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో అయితే ఓ రేంజిలో చర్చ సాగుతోంది. వెరసి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదా అన్న …

Read More »