Political News

మోదీని మంత్రముగ్ధుడిని చేసిన లోకేశ్ స్పీచ్

అమరావతి పునర్నిర్మాణ వేదిక మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అదిరిపోయే ప్రసంగం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముగ్గురు కేంద్ర మంత్రులు, మరో ముగ్గురు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆసీనులు అయిన వేదిక మీద నుంచి లోకేశ్ కీలక ప్రసంగం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నమోగా అభివర్ణించిన …

Read More »

జగన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అంగరంగ వైభవంగా, ఓ వేడుకలా, ఓ పండుగలా జరుగుతున్న ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న జగన్ ఓ మంచి అవకాశాన్ని తన చేజేతులారా మిస్ చేసుకున్నారనే చెప్పాలి. అమరావతిలో కన్నులపండువగా జరుగుతున్న ఈ వేడుకకు హాజరు కావాలంటూ కూటమి సర్కారు స్వయంగా ఆహ్వానించినా జగన్ ఆ ఆహ్వానాన్ని మన్నించలేదు. శుక్రవారం జరుగుతున్న …

Read More »

చింత‌మ‌నేనా.. మ‌జాకా.. 100 బ‌స్సులు.. వెయ్యి బైకులతో అమ‌రావ‌తికి!

ఏంచేసినా త‌న‌కంటూ స్పెష‌ల్‌గా ఉండే.. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. తాజాగా ఏపీ రాజధాని అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభ ఘ‌ట్టానికి కూడా త‌న‌దైన శైలిలో స్పందించారు. ఒక్క ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచే 100 బ‌స్సుల‌ను అమరావ‌తికి త‌ర‌లించారు. అదేవిధంగా యువ‌త ముందుకు రావ‌డంతో దాదాపు వెయ్యికి పైగా బైకుల‌ను కూడా..అమ‌రావ‌తికి పంపించారు. బ‌స్సుల్లో ఒక్కొక్క బ‌స్సుకు 30 మంది చొప్పున 3 …

Read More »

అమరావతి పండుగ!… అన్ని దారులూ అటువైపే!

ఏపీకి శుక్రవారం నిజంగా ఓ పండుగే. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పున:ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం అమరావతి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఏపీలోని కూటమి సర్కారు మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అమరావతి రాజధాని కళ ఉట్టిపడేలా ఏర్పాట్లను కూడా ఘనంగా చేసింది. మునుపెన్నడూ లేనంత అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల …

Read More »

‘అమరావతి రీస్టార్ట్’ కు మోదీ అదిరేటి గిఫ్ట్!

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగవైభవంగా జరగనుంది. ఏపీ ప్రజలు పండుగలా భావిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న మోదీ… తాను అమరావతిలో అడుగుపెట్టడానికి ఓ రోజు ముందుగానే అమరావతి రిస్టార్ట్ కు ఇదో చిన్న గిఫ్ట్ అంటూ కేంద్రం నుంచి ఓ కీలక ప్రకటనను చేయించారు. అమరావతి చుట్టూరా ఏర్పాటు కానున్న అవుటర్ రింగ్ రోడ్డును గతంలో ప్రకటించినట్లుగా …

Read More »

అమరావతికి రక్షణ కవచంలా ‘గుల్లలమోద’

శత్రు దుర్బేధ్యంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో భారత్ తన సాధనా సంపత్తిని పెంచుకుంటోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్షిపణి పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచుకుంటోంది. అందులో భాగంగా ఏపీలో ఓ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం అటు జాతీయ భద్రతతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా రక్షణ కవచంగా మారనుందని చెప్పక తప్పదు. అమరావతికి కూతవేటు దూరంలో ఏర్పాటు …

Read More »

10 మాసాలు.. అమ‌రావ‌తి వేదిక‌గా చంద్ర‌బాబు 10 రికార్డులు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి 10 మాసాలు అయిపోయాయి. తాజాగా రాజ‌ధాని అమ‌రావతికి ప‌నులను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఈ ప‌ది మాసాల్లో సాధించిన ప్ర‌గ‌తిని, రికార్డుల‌ను ఈ వేదిక‌గా భారీ స్క్రీన్ల‌పై ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. మొత్తం 20 కి పైగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటిని స‌భ‌కు వ‌చ్చే వారు ఎక్క‌డ నుంచైనా చూసేలా …

Read More »

ఈ దేశాలకు వెళ్ళేవారికి పెద్ద షాక్ : పెరగనున్న టికెట్ ధరలు?

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్ గాంలో జరిపిన దాడి పలు అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పటి భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన అన్ని రకాల సంబంధాలకు తెర పడిపోగా… ఇరు దేశాలు తమ గగన తలాలను ప్రత్యర్థి దేశాల విమానాలకు మూసివేశాయి. ఫలితంగా అటు పాక్ తో పాటు ఇటు భారత్ కు చెందిన విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. పాక్ ప్రయాణికుల పరిస్థితిని అలా పక్కనపెడితే… భారత్ నుంచి ఉత్తర …

Read More »

జ‌గ‌న్‌కు స‌ల‌హాలు: తిట్టొద్దు.. వెళ్లిపోతారు..!

వైసీపీలో ఏం జ‌రుగుతోంది? అంటే.. వినేవారు వింటున్నారు.. ఎవ‌రి మానాన వారు ఉంటున్నారు. ఈ మాట ఎవ‌రో కాదు.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్న‌వారే చెబుతున్న మాట‌. ఈ క్ర‌మంలో ఎవ‌రినీ తిట్టొద్ద‌ని.. తిడితే.. వారు వెళ్లిపోతార‌ని.. కీల‌క స‌ల‌హాదారు జ‌గ‌న్‌కు సూచించారు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో వ‌రుస‌గా భేటీ లు నిర్వ‌హిస్తున్న అధినేత‌.. జిల్లాల్లో నాయ‌కుల ప‌నితీరును ప్ర‌శ్నిస్తున్నారు. ముందుగానే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఈ …

Read More »

కొత్త‌గా రెక్క‌లొచ్చేశాయ్‌.. అమ‌రావ‌తి ప‌రుగే..!

అమ‌రావ‌తి రాజ‌ధానికి కొత్త‌గా రెక్క‌లు తొడిగాయి. సీఎం చంద్ర‌బాబు దూర‌దృష్టికి.. ఇప్పుడు ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డి దారులు క్యూక‌ట్టారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చి.. ఇక్క‌డ అమ‌రావ‌తి ప‌నులకు శంకుస్థాప‌న చేస్తున్న నేప‌థ్యంలో దీనికి మ‌రింత హైప్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు ఇక్క‌డ పాగా వేసేందుకు రెడీ కాగా.. తాజాగా అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌, చేస్తున్న ప్ర‌చారం క‌లిసి వ‌చ్చాయి. దీంతో అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దుబాయ్‌కి …

Read More »

జ‌గ‌న్ ఇలానే ఉంటే.. మ‌రో ప‌దేళ్లు ఇంతే ..!

త‌ప్పులెన్నువారు త‌మ త‌ప్పులెరుగ‌రు.. అన్న సామెత వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యంలో అక్ష‌రాలా నిజమ‌వుతోంది. అనేక మంది నాయ‌కులు, అధికారులు పోలీసుల కేసుల్లో చిక్కుకున్నారు. కొంద‌రు ఇప్ప‌టికీ జైళ్ల‌లోనే ఉన్నారు. వీరికి బెయిల్ కూడా ల‌భించ‌డం లేదు. ఇక‌, అధికారుల సంగ‌తి స‌రేస‌రి! ఎప్పుడు ఎలాంటి కేసు త‌మ‌కు చుట్టుకుంటుందో అని వైసీపీ హ‌యాంలో చ‌క్రం తిప్పిన అధికారులు బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ప‌రిణామాలు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ …

Read More »

అమరావతి కూలీల కడుపు నింపుతోంది!

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిర్మాణ రంగ పనులతో కోలాహలంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఈ రాజధాని నిర్మాణ పనుల్లో తెలుగు కార్మికులే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు… అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. అమరావతిలో తమ జీవనోపాధిని చూసుకుంటున్నారు. తమ కడుపునూ నింపుకుంటున్నారు. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా అమరావతి పరిధిలో ఏ కార్మికుడిని కదిలించినా.. అమరావతి లాంటి …

Read More »