Political News

మహా కుంభమేళాలో పవన్ పుణ్య స్నానం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించారు. మంగళవారం సతీసమేతంగా ప్రయాగ్ రాజ్ వెళ్లిన పవన్… సతీ సమేతంగానే పుణ్య స్నానాలు ఆచరించారు. పవన్ దంపతులతో పాటు పవన్ కుమారుడు అకీరా నందన్, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పుణ్య స్నానాల్లో పాలుపంచుకున్నారు. పుణ్య స్నానాల అనంతరం పవన్ తన చేతులతో అఖండ హారతిని పట్టుకుని కనిపించారు. గత …

Read More »

జైలుకు జ‌గ‌న్‌.. నేతల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌!

విజ‌య‌వాడ సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని తాజాగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అయితే.. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా.. రాజు వెడ‌లె ర‌వి తేజ‌ముల‌ల‌ర‌గ‌! అన్న‌ట్టుగా జైలుకు కూడా మందీ మార్బ‌లాన్ని వేసుకుని వ‌చ్చేశారు. స్థానిక నాయ‌కులు అయితే.. త‌మ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు జైలునే వేదిక‌గా చేసుకున్నారు. దీంతో విజ‌య‌వాడ నడిబొడ్డున ఉన్న ఈ జైలు ప్రాంతం మొత్తం నారా ర‌భ‌స‌గా మారింది. …

Read More »

వారు మాత్రమే మహిళలా?.. ట్రోల్స్ పై వంశీ సతీమణి ఫైర్!

సోషల్ మీడియా వేదికగా తనపైనా, తన కుటుంబంపైనా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని అపహరించి బెదిరించారంటూ వంశీని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… జైలులో …

Read More »

పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!: ర‌ఘురామ‌

“ఏం ర‌వి.. ఏం కోరుకుంటున్నావ్‌.. పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!“ – ఇదీ.. ఉత్త‌ర‌ప్ర‌దే శ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ‌మేళాకు వెళ్లిన‌.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ రాజు చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. టీడీపీ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బీటెక్ ర‌విని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు! దీనిపై ర‌వి కూడా హ్యాపీగా ఫీల‌య్యారు. అంతేకాదు.. అదే ప‌రిస్థితి వ‌స్తే.. ర‌ఘురామే నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా …

Read More »

వంశీతో జగన్ ములాఖాత్ పై టీడీపీ రియాక్షన్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, ఫిర్యాదుదారుడిపై బెదిరింపుల కేసులు వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నేరుగా విజయవాడ జైలుకు వెళ్లారు. జైలులో వంశీని పరామర్శించిన జగన్… ఆ తర్వాత బయటకు వచ్చి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారంటూ కూటమి సర్కారుపై ఆరోపణలు …

Read More »

బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలుకు వెళ్లారు. ఇటీవలే అరెస్టై జైల్లో ఉన్న తన పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మె్ల్యే వల్లభనేని వంశీ మోహన్ తో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన జగన్… అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతో పాటుగా అధికార యంత్రాంగానికి కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చేది తమ …

Read More »

జగన్ తో కలిసి వచ్చిన కొడాలి!… మాట, తీరు రెండూ మారాయి!

మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పెద్దగా బయటకే రాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని మంగళవారం బయటకు వచ్చేశారు. అయితే ఆయనేదో ఒంటరిగా బయటకు రాలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన బయటకు వచ్చారు. బయటకు రావడమేనా?… ఏకంగా మీడియాతోనూ ఆయన మాట్లాడారు. అయితే ఆ మాట తీరు …

Read More »

సీఈసీ ఎంపీకలో రాహుల్ మాట చెల్లలేదు!

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సీబీఐ డైరెక్టర్… ఈ మూడు పోస్టుల కంటే అత్యంత కీలకమైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకంలో ఓ సంప్రదాయం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పాటుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కూడా ఏకాభిప్రాయంతో ఈ ఎంపికలు జరిగితే బాగుంటుంది అన్నదే ఆ సంప్రదాయం. ఇందుకోసం ఈ పోస్టుల్లో పనిచేయాల్సిన అదికారుల కోసం హై …

Read More »

పోలీస్ స్టేషన్ వద్ద మంచు మనోజ్ రచ్చ… ఏం జరిగింది?

టాలీవుడ్ యువ నటుడు, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ సోమవారం రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో కనిపించిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణులతో నెలకొన్న ఆస్తి వివాదంలో మనోజ్ ఒంటరి పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలో మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ విషయంలో నెలకొన్న …

Read More »

`మూడు` ప‌థ‌కాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌… ఏపీ బ‌డ్జెట్‌లో మెరుపులు ఖాయం!

ఈ నెల 28 లేదా మార్చి 1న ఏపీ వార్షిక(2025-26) బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనిపై అన్ని వ‌ర్గాల‌లోనూ ఆశ‌లు మెండుగా ఉన్నాయి. విద్యార్థుల నుంచి గృహిళుల వ‌ర‌కు, రైతుల నుంచి పారిశ్రామిక వేత్త‌ల వ‌ర‌కు.. కేటాయింపుల‌పై ఎక్కువ‌గా ఎదురు చూస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సూప‌ర్ సిక్స్ హామీల‌పై నిధులు ఏరేంజ్‌లో కేటాయిస్తోంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యంపై ఇటు కూట‌మి పార్టీల్లోనూ.. అటు సాధార‌ణ …

Read More »

కొడాలి నాని ఎక్కడ?… ఫోన్లూ స్విచ్చాఫ్ అయ్యాయా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా తుది ఫలితం వెలువడక ముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ నాని దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన కనిపించిన దాఖలానే లేదని చెప్పాలి. గడచిన 8 నెలలుగా గుడివాడకు దూరంగానే ఉంటున్న నాని… ఎప్పుడన్నా అవసరం అయితే తప్పించి గుడివాడకు రాలేదు. అలా వచ్చిన సందర్భాల్లోనూ చడీచప్పుడు లేకుండా వచ్చిన …

Read More »

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాలు: చంద్రబాబు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి నగరం సోమవారం మహా కుంభ ఆప్ టెంపుల్స్ పేరిట ప్రారంభమైన సదస్సుతో ప్రత్యేక శోభను సంతరిచుకుంది. ఈ సభా వేదికగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ఇతర …

Read More »