టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తున్న తీరుపై అమితాసక్తి కనబరచారు. ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓగా కొనసాగుతున్న ఆల్ట్ మన్ నే మన భారత ఏఐ రంగం అంతగా ఆకర్షిచిందంటే నిజంగా… మన టెక్నలాజికల్ అప్ గ్రడేషన్ అద్భుతంగా ఉన్నట్టే. అందులో అనుమానం లేదు. ఎందుకంటే వరల్డ్ టాప్ టెక్ …
Read More »వైసీపీ నిర్ణయాలు తిరగదోడుదాం: బాబు మంత్రి వర్గం నిర్ణయం
వైసీపీ ప్రభుత్వం పర్యాటక, యువజన శాఖల విషయంలో అప్పటి మంత్రులు తీసుకున్న నిర్ణయాలు.. ఇచ్చిన జీవోలపై పునః సమీక్షకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వీటిని పునః పరిశీలించి నిర్ణయం తీసుకునేలా తాజాగా జరిగిన మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. దేశంలో డ్రోన్ వ్యవస్థకు జవసత్వాలు ఇవ్వాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. వచ్చే రెండేళ్లలో డ్రోన్ వ్యవస్థను బలోపేతం చేసే …
Read More »తెలంగాణ సర్కారుకు డబుల్ షాక్.. ‘సెంట్రల్’ చెట్ల కొట్టివేతపై స్టే
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల విషయంలో తెలంగాణ సర్కారుకు గురువారం డబుల్ షాక్ తగిలింది. ఈ భూముల పరిదిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెట్ల నరికివేతపై ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు అటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఇటు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కాసేపటికే.. హైకోర్టు మాదిరే సుప్రీంకోర్టు …
Read More »రేవంత్ మంత్రి వర్గ విస్తరణకు మళ్లీ బ్రేకులు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ అంశం.. మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 3(గురువారం) మంత్రి వర్గ విస్తరణ ఖాయమని అందరూ అనుకున్నారు. అంతే కాదు.. గత నెల చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డి.. హుటాహుటిన గవర్నర్ను కూడా కలిశారు. అప్పట్లోనే మంత్రి విస్తరణకు సంబంధించిన జాబితాను రేవంత్ గవర్నర్ కు ఇచ్చారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే.. గురువారం కూడా.. …
Read More »జగన్ టూర్ రాప్తాడులో అగ్గిని రాజేసింది!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఫ్యాక్షన్ కక్షలతో నిత్యం దాడులు, హత్యలతో ఆ నియోజకవర్గ పరిధిల రక్తమోడింది. అయితే గత కొంతకాలంగా అక్కడ అసలు ఫ్యాక్షన్ అనే పదమే వినిపించడం లేదు. నాడు టీడీపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం జరిగితే.. ఇప్పుడు టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయం నడుస్తోంది. నాడు టీడీపీని కాంగ్రెస్ పార్టీ ఓడించిందే లేదు. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ …
Read More »మిధున్ రెడ్డికి షాక్… బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు
వైసీపీ కీలక నేత, లోక్ సభలో ఆ పార్టీ పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి గురువారం భారీ షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఇప్పటికే ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ముగించగా… తాజాగా గురువారం ఈ వ్యవహారంపై …
Read More »అమరావతీ ఊపిరి పీల్చుకో.. డబ్బులొచ్చేశాయి
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చిదిమేయాలని వైసీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయని యత్నమంటూ లేదు. నాడు టీడీపీ సర్కారు ఎంపిక చేసిన అమరావతి తనకూ సమ్మతమేనని నమ్మ బలికిన జగన్… ఆ తర్వాత అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపితే… నిలుస్తుందో, లేదో తెలియని అమరావతికి నిధులెలా ఇస్తారంటూ ఆ సంస్థకు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ బ్యాంకు …
Read More »రోజా అరెస్టు పక్కా.. ఎవ్వరూ ఆపలేరట
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్ని నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా అరెస్టు తధ్యమని చెప్పిన ఆయన… ఏ క్షణంలో అయినా ఆమె అరెస్టు కావొచ్చంటూ ఆయన జోస్యం చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పేరిట జరిగిన క్రీడా పోటీల్లో రోజా భారీ ఎత్తున అవినీతికి …
Read More »విశాఖ టార్గెట్గా నారా లోకేష్ పావులు…!
ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖ జిల్లాపై మంత్రి నారా లోకేష్ పట్టు పెంచుతున్నారు. తరచుగా విశాఖ పట్నంలో పర్యటించడంతోపాటు.. జిల్లా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అదేసమయం లో ప్రజలకు కూడా చేరువగా ఉంటున్నారు. అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో 11 సార్లు నారా లోకేష్ విశాఖలో పర్యటించడం గమనార్హం. ప్రతిసారీ ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా నారా లోకేష్ ఆదివారం నుంచే విశాఖలో పర్యటిస్తున్నారు. …
Read More »కేటీఆర్ వ్యాఖ్యలు ‘రియల్’పై పిడుగుపాటేనా..?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న ఈ భూములను తాము అధికారంలోకి వస్తే… తిరిగి వర్సిటీకి అప్పగిస్తామని చెప్పిన కేటీఆర్… ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఈ భూములను కొనుగోలు చేసినా.. వాటిని వెనక్కు తీసుకుంటామని, …
Read More »మే వరకు ఆగుదాం.. జగన్ డెడ్లైన్!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రతువుకు డెడ్లైన్ పెట్టారు. ఇప్పటికి రెండు సార్లు ఇలా వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి జనవరి నుంచే ప్రజల మధ్యకు తాను వస్తానని.. చెప్పిన జగన్ తర్వాత ఫిబ్రవరి వరకు పొడిగించారు. దీంతో ఫిబ్రవరిలో అయినా.. తమ నాయకుడు ప్రజల మధ్యకు వస్తాడని.. తమను పట్టించుకుంటారని ప్రజల కంటే ఎక్కువగా పార్టీ కార్యకర్తలు ఎదురు చూశారు. కానీ, …
Read More »సుప్రీం చేరిన ‘సెంట్రల్’ పంచాయితీ.. కీలక ఆదేశాలు జారీ
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా… హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపైనే చర్చ నడుస్తోంది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములు తమవేనని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వాదిస్తోంది. అంతేకాకుండా ఆ భూములను పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటామంటూ ఏకంగా ఆ భూముల చదునుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు, కొన్ని ప్రజా సంఘాలతో పాటుగా విపక్షాలు వాదిస్తున్నాయి. చిక్కటి అడవితో అరుదైన జంతుజాలంతో పర్యావరణానికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates