అమరావతి విషయంపై చర్చ పెట్టి.. అక్కడి మహిళలను తీవ్రంగా అవమానించిన వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్, వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పందించారు. ఈ వ్యవహారంపై జగన్, ఆయన సతీమణి భారతి ఇద్దరూ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అసలు రాజధానిపై మాట్లాడే అర్హత సాక్షి యాజమాన్యానికి లేదన్నారు. గతంలో అనేక సార్లు కూడా అవమానకరంగా ఇక్కడి వారిని మాట్లాడారని.. చెప్పారు. మూడు రాజధానులకు …
Read More »ఇంకా కాంప్లికేట్ చేసిన సజ్జల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓ పెద్ద తలనొప్పి మెడకు చుట్టుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానెల్లో ఇటీవలే కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు అమరావతి మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. అమరావతిని దేవతల రాజధాని అనడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అది వేశ్యల రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ఈ వ్యాఖ్యలపై నవ్వుతూ మాట్లాడ్డమే కాక.. …
Read More »‘ఆర్టీసీ’ బాదుడు.. రేవంత్ సర్కారుపై జనం టాక్ ఇదే!
తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మహాలక్ష్మి పథకం కింద.. రాష్ట్రంలో గత 15 నెలలకుపైగానే ఉచిత ఆర్టీసీ బస్సును మహిళలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే.. దీనివల్ల చాలా నష్టాలు వస్తున్నాయన్నది ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్న మాట. అయినప్పటికీ.. పంటిబిగువన ఆ భారాలను ప్రభుత్వం భరిస్తోంది. ఇక, ఆ …
Read More »కూతురి ఆరోపణలపై ముద్రగడ ఏమన్నారంటే?
తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారని, కానీ ఆయనకు సరైన చికిత్స అందించకుండా తన అన్నయ్య గిరి అడ్డు పడుతున్నాడని ఆరోపిస్తూ ముద్రగడ తనయురాలు క్రాంతి ఇటీవల పెట్టిన సోషల్ మీడియా పోస్టు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముద్రగడ క్యాన్సర్తో బాధ పడుతున్నట్లు ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఈ సంగతి ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. పైగా ఆయనకు సరైన చికిత్స అందట్లేదని తెలిసేసరికి …
Read More »సాక్షి జర్నలిస్ట్ అరెస్టుపై స్పందించిన జగన్
సాక్షి ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టును పెట్టారు. అందులో కొమ్మినేనిని 70 ఏళ్ల వృద్ధుడిగా, సీనియర్ జర్నలిస్టుగా ఆయన పేర్కొన్నారు. కొమ్మినేని అరెస్టుతో కూటమి సర్కారు కక్షసాధింపుల విష సంస్కృతిని పతాకస్థాయికి తీసుకెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు. …
Read More »అన్నీ నిజాలే చెప్పా: హరీష్ రావు
కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు సోమవారం హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయనను కమిషన్ సభ్యులు విచా రించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన హరీష్ రావు.. కమిషన్ సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకూ తాను.. అన్నీ నిజాలే చెప్పానని తెలిపారు. ముఖ్యంగా రీ డిజైనింగ్పై ఎక్కువగా గుచ్చి గుచ్చి ప్రశ్నించారని తెలిపారు. అయితే.. …
Read More »‘సాక్షి’పై తిరుగుబాటు.. విజయవాడలో టెన్షన్-టెన్షన్!
మహిళల తిరుగుబాటు ఎలా ఉంటుందో వైసీపీ అధినేత జగన్ మీడియాకు తెలిసి వచ్చింది. అమరావతి లో నివసించే మహిళలపై ఓ అనలిస్టు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలపై మహిళలు తిరగబడ్డారు. ఆదివా రం, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన మహిళలు.. సోమవారం.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుతో శాంతించలేదు. జగన్, ఆయన సతీమణి, సాక్షి మీడియా చైర్మన్ భారతిలు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనన్న పట్టుదలతో కదం తొక్కారు. విజయవాడ, ఆటో …
Read More »కొమ్మినేనికి బెయిల్ కూడా కష్టమే.. సాక్షిపైనా కేసు!
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు(కేఎస్ ఆర్) అరెస్టు నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసుల వివరాలను పోలీసులు వెల్లడించారు. అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం..అక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడం వంటివి సాక్షి టీవీలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరైనా.. నాడు యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు వీటిని అప్పటికప్పుడు ఖండించలేదన్నది ప్రధాన విమర్శ. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతానికి చెందిన తుళ్లూరు మహిళలు.. ఇచ్చిన …
Read More »వాళ్లు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్లే కదా: రఘురామ సీరియస్
అమరావతిలో మహిళలపై సాక్షి టీవీలో జరిగిన చర్చ.. ఈ సందర్భంగా వ్యాఖ్యాతగా ఉన్న కృష్ణంరాజు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమిస్తున్నారు. ఈ వేడి తగ్గకపోగా.. మరింత పెరుగుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. “ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్లే కదా!” అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ …
Read More »సాక్షి ఎఫెక్ట్: టీవీలను శుద్ధి చేసుకుంటున్నారు!
వైసీపీ అధినేత జగన్ సొంత మీడియా చానెల్ సాక్షిలో అమరావతి రాజధానిపై ఓ రాజకీయ వ్యాఖ్యాత, జర్నలిస్టు.. చేసిన అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు.. ప్రజల్లో ఎంత తీవ్రమైన ఆవేదన కలిగిస్తోందో.. వారి గుండెలు ఎలా రగిలిపోతున్నాయో.. చెప్పేందుకు.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరావతిలో ఉన్నవారంతా.. ‘ఆ తరహా’ మహిళలేనని సదరు వ్యాఖ్యాత కామెంట్లు చేయడం.. దానిని పూర్తిగా ఖండించకుండా.. యాంకర్ వ్యవహరించడంపై ప్రజలు నిప్పులు …
Read More »బిగ్ బ్రేకింగ్: సాక్షి యాంకర్ కొమ్మినేని అరెస్టు!
సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియాలో ఇన్పుట్ ఎడిటర్గా పనిచేస్తున్న యాంకర్.. కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి సోమవారం ఉదయం వెళ్లిన పోలీసులు.. ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే ప్రత్యేక వాహనంలో ఆయనను విజయవాడకు తరలించారు. అయితే..అరెస్టు సందర్భంగా కొమ్మినేనికి.. ఏపీ పోలీసులకు వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని.. ఏపీ పోలీసులను ఆయన ప్రశ్నించారు. అయితే.. అదంతా …
Read More »అమరావతి నిర్మాణమూ బాబుకు సంకటమే.. ఏంటి కష్టాలు…!
రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలకెత్తుకున్న చంద్రబాబు దీనిని 2027 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన భవనాలను.. ముఖ్య నిర్మాణాలను పూర్తి చేసి.. 2029 ఎన్నికల్లో అమరావతిని ప్రధాన అజెండా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా నవ నగరాలను పూర్తిచేయాలని అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటు పార్టీలోను.. అటు ప్రభుత్వంలోనూ చంద్రబాబు చర్చిస్తూనే ఉన్నారు. తన ప్రణాళికలను వారికి వివరిస్తున్నారు. అయితే.. వీటిని పార్టీలో నాయకులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates