ఏపీ రాజధాని అమరావతి పరుగులు పెడుతోంది. ఈ నెల 13 నుంచి పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వానికి చేరాయి. దీనికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం కేటాయించింది. ఫలితంగా ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా తోడయ్యారు. దీంతో సుమారు 65 …
Read More »ద్వేషం అంటే బాబు… పొగడ్త అంటే వైఎస్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే అలవి కానంత ద్వేషం ఉందన్న వాదన ఎప్పటినుంచో ఉన్నదే. ఆ మాట నిజమేనని తాజాగా మరోసారు నిరూపితమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెస్పేనని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ తో సంబంధం …
Read More »వైసీపీ ఇప్పట్లో పుంజుకునేనా..
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్గా ఉన్నవారే.. నేడు అసలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం.. వైసీపీ గురించి మాట్లాడు కునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు.. ఏ ఇద్దరు కనిపించినా.. వైసీపీ గురించి.. జగన్ గురిం చిన చర్చ చేసేవారు. అదేసమయంలో నాయకుల దూకుడు.. మంత్రులు బూతుల గురించి కూడా.. చర్చ లు జరిగాయి. అయితే.. ఒక్కసారి …
Read More »సాయిరెడ్డి సొంత ఛానెల్ పేరు ఇదేనా?
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సొంత మీడియా వ్యవహారాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బ్రాడ్ కాస్టింగ్ పనులపై ఆయన బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్-బెంగళూరు-ఢిల్లీ అంటూ.. వారం వారం ఆయన చక్కర్లు కొడుతున్నారు. గతంలో ఓ కీలక ఛానెల్లో సీఈవోగా చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుగుతున్నాయని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ఏడాది దసరా నాటికి ‘వి-టీవీ’ పేరుతో సంస్థను స్థాపించే అవకాశం …
Read More »అన్న క్యాంటీన్లకు వైసీపీ సర్టిఫికెట్.. నిజం..!
ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఒకసారి చేపడితే.. బాగానే ఉంటుంది. ఒక రోజు లేదా.. ఒక వారం కొనసాగిస్తే .. బాగానే ఉంటుంది. కానీ, ఒకే కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టినా.. ప్రతి రోజూ కొనసాగించినా.. అందులో సహజంగానే నాణ్యత లోపిస్తుంది. పనిచేసేవారు కూడా.. ముభావంగానే.. ఉంటారు. టెక్నికల్గా మారిపోతా రు. ఇది సహజంగా ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలపై ఉన్న ప్రజా భిప్రాయం. కానీ, కూటమి సర్కారు పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్ల …
Read More »మద్యం కుంభకోణం: అందరూ జగన్ పేరే చెబుతున్నారు?
ఏపీలో వైైసీపీ జమానాలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా పరిగణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వారి అరెస్టుల సందర్భంగా కోర్టులకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఈ కుంభకోణం వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని… కుంభకోణంలో వసూలు అయిన …
Read More »రాజు గారి పై గంటా ఫైరింగ్… విషయమేంటి?
ఏపీలో అధికార కూటమిలోని రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో ఇద్దరు నేతలు నడిరోడ్డుపై వాదులాడుకున్నారు. ఒకరు మరొకరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే… ఆ మరొకరు ఫైర్ అవుతున్న నేతకు సర్ది చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ జిల్లా పరిధిలోని భీమిలి ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొనసాగుతుండగా… విశాఖ …
Read More »నిజమే.. బాబులా జగనే చేసి ఉంటే..?
నిజమే… వైసీపీ జమానాలో కొనసాగిన సంక్షేమ పథకాలపై వైరి వర్గాలు చేసిన విమర్శలు ఇప్పుడు నిజమేనేమోనని అనిపించక మానవు. అమ్మ ఒడి నిధులను నాన్నకు బుడ్డితో తిరిగి రాబట్టేశారు కదా అంటూ నాడు విపక్షాలు చేసిన విమర్శ బాగా పేలింది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి.. ట్రాఫిక్ నిబంధనల పేరిట ఆ నిధులనూ లాగేశారనీ విపక్షాలు నాడు ఆరోపించాయి. నాడు కొనసాగిన పరిస్థితులను బట్టి చూస్తే.. ఇవన్నీ …
Read More »ఇక.. సవాంగ్ సార్ వంతు..!
వైసీపీ హయాంలో తప్పులు చేశారని.. అవినీతికి పాల్పడ్డారని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్ అధికారులను కూటమిసర్కారు విచారిస్తున్న విషయం తెలిసిందే. వీరిపై కీలక నిర్ణయాలు తీసుకుని జైళ్లకు కూడా పంపిస్తోంది. ఇటీవల గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమా నిని మాజీ మంత్రి విడదల రజనీ బెదిరించి.. రూ.2.2 కోట్ల రూపాయలను గుంజిన వ్యవహారంలో ఐపీఎస్ అదికారి పల్లె జాషువాను విచారించిన విషయం తెలిసిందే. దీనిపై మరింత …
Read More »300 కోట్లకు బురిడీ కొట్టించిన వైసీపీ బుట్టా..
వైసీపీ నాయకురాలు, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక.. ఓ ఆర్థిక సంస్థను బురిడీ కొట్టించారు. 310 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్న ఆమె.. దీనిల కేవలం 40 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లింపు విషయంలో జాప్యం చేయడంతోపాటు.. సదరు రుణ సంస్థను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఆస్తుల వేలం ప్రక్రియ వరకు .. విషయం వచ్చేసింది. అయితే.. వెనుక వైసీపీ జెండా ఉండడంతో సదరు …
Read More »షాకింగ్: ఆ రాష్ట్రంలోనే 1000 మంది పాకిస్థానీలు!
జమ్ము కశ్మీర్లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్పై నిప్పులు చెరుగుతున్న భారత్.. మన దేశంలో తిష్టవేసిన పాకిస్థాన్ పౌరులను దేశం విడిచి పోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 30 నాటికి పాకిస్థాన్కు చెందిన ఏ ఒక్కరూ దేశంలో ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రాలను కూడా అలెర్ట్ చేసింది. ముఖ్య మంత్రులకు స్వయంగా కేంద్ర …
Read More »తిరుపతి ఎమ్మెల్యే తీరే వేరయా ..!
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఏడాది జనసేన పార్టీ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. సీమలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులకు పార్టీ టికెట్ ఇవ్వడం, ఆయన విజయం దక్కించుకోవడం తెలిసిందే. వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు.. జనసేనలో చేరిన ఆరణి.. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ఇదిలావుంటే.. ఆయన వ్యవహారంపై.. అనేక ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో రెండు కీలక విషయాలు ఉండడం గమనార్హం. జనసేననాయకులతో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates