Political News

వీళ్ళు డిసైడ్ అయిపోయారా ?

తెలంగాణా బీజేపీ నాయకత్వాన్ని ధిక్కరించటానికి నలుగురు నేతలు డిసైడ్ అయినట్లే అనుమానంగా ఉంది. అందుకనే కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశానికి నలుగురు నేతలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీంద్రనాధరెడ్డి గైర్హాజరయ్యారు. వీళ్ళు నలుగురు మొన్నటి నరేంద్ర మోదీ పర్యటనలో కూడా కనబడలేదు. పార్టీ మీటింగులకు కూడా పెద్దగా హాజరుకావటంలేదు. ఈ నలుగురి సమస్య ఏమిటో పార్టీ …

Read More »

12 సీట్లు – కమ్మ సామాజిక వర్గం డిమాండ్

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 12 టికెట్లు సాధించాల్సిందే అని కమ్మ సామాజికవర్గం టార్గెట్ గా పెట్టుకున్నది. తమ సామాజిక వర్గం 40 నియోజకవర్గాల్లో బలంగా ఉందని కమ్మ సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు. కనీసం 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములను శాసించేంత స్ధాయిలో ఉందని తెలంగాణా కమ్మ రాజకీయ ఐక్యవేదిక కన్వీనర్ గోపాలం విద్యాసాగర్ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఆధ్వర్యంలో వేదికలోని ముఖ్యులు ఢిల్లీకి …

Read More »

తాడో పేడో : విలీనానికి నో చెప్పేసిన షర్మిల

కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయటానికి వైఎస్ షర్మిల నో చెప్పేశారట. ఈ విషయాన్ని పార్టీ నేతలు చెప్పారు. విలీనం కోసం కాంగ్రెస్ అధిష్టానం విధించిన షరతులు షర్మిలకు ఆమోదయోగ్యంగా లేదట. అందుకనే విలీనం ప్రక్రియకు షర్మిల బ్రేకులు వేసేశారట. ఇందులో భాగంగానే ఈరోజు పార్టీ ఆపీసులో ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లోను పోటీ చేయాలని కూడా షర్మిల శుక్రవారం …

Read More »

ఐటీ కంపెనీ పెట్టండి..జగనన్నకు చెబుతా: కేటీఆర్

సీఎం జగన్ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి అనుకున్న రీతిలో పూర్తి అయి ఉంటే ఐటీ కంపెనీలు పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు క్యూ కట్టేవని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు పుణ్యమా అంటూ ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇటువంటి నేపథ్యంలోనే సీఎం జగన్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ …

Read More »

చంద్రబాబుపై నక్సల్స్ దాడి…లోకేష్ సంచలన ఆరోపణలు

రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, టీడీపీ నేతలు చాలాకాలంగా ఆందోళన చెందుతోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును హౌస్ రిమాండ్ కు ఇవ్వాలని కోరినా…కోర్టు అనుమతించలేదు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేష్…చంద్రబాబు భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి జైలుపై, చంద్రబాబుపై దాడి చేస్తామని ఎస్పీకి కొందరు నక్సలైట్లు లేఖ రాశారని లోకేష్ చెప్పారు. …

Read More »

‘కాంతితో క్రాంతి’కి లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి పిలుపు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు రాజమండ్రిలో చంద్రబాబుతో లోకేష్ మధ్యాహ్నం మూడు గంటలకు ములాఖత్ కాబోతున్నారు. నారా భువనేశ్వరితో పాటు బ్రాహ్మణితో కలిసి చంద్రబాబుతో లోకేష్ భేటీ కాబోతున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి రాజమండ్రికి లోకేష్ బయలుదేరారు. ఈ సందర్భంగా అడుగడుగునా లోకేష్ కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే, …

Read More »

పవన్ విషయంలో బీజేపీకి దిక్కుతోచటం లేదా ?

ఏపీ బీజేపీ నేతలకు దిక్కు తోస్తున్నట్టు లేదు. రాబోయే ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలా అన్న విషయం నేతలను పూర్తిగా అయోమయంలోకి నెట్టేస్తున్నట్లుంది. వారాహి యాత్రలో పెడనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాను ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో ముదినేపల్లిలో మాట్లాడుతూ తాను ఎన్డీయేలోనే ఉన్నట్లు చెప్పారు. నిజానికి ఎన్టీయేలో నుండి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని పవన్ …

Read More »

నిందితుల జాబితాలో ఆప్ ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. స్కామ్ లో చేతులుమారిన మొత్తం తక్కువే అయినప్పటికీ ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల కారణంగా స్కామ్ సంచలనంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు అత్యంత …

Read More »

బాలయ్య ఆధ్వర్యంలో రోడ్డు షోలా ?

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తొందరలోనే తెలంగాణాలో రోడ్డు షోలు మొదలవ్వబోతున్నాయా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తేవడంలో భాగంగా పార్టీ యాక్టివిటీస్ ను పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహణతో పాటు ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం, నల్గొండ, నిజామాబాద్ లో సభలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అలాగే కుకట్ పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఇవన్నీ …

Read More »

కాంగ్రెస్ కు ఊపునిచ్చిన సర్వే ?

తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపే వార్తనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మొట్టమొదటి సర్వే రిపోర్టు విడుదలైంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్ది అండ్ కో చెప్పుకుంటున్నారు. ఎలాగు పార్టీ నేతలే కాబట్టి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే చెబుతారు. ఇప్పటివరకు జరిగిన చాలా సర్వేల్లో కాంగ్రెస్ రెండో స్ధానంలోనే ఉంటుందని, కాకపోతే గ్రాఫ్ పెంచుకుంటోందని తెలిసింది. వివిధ కారణాలతో …

Read More »

బ్రేకింగ్: రాజ‌య్య‌, నందికంటిల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట నిల‌బెట్టుకున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో భాగంగా టికెట్ల కేటాయింపులో నెల‌కొన్ని అసంతృప్తికి చెక్ పెట్టే క్ర‌మంలో ప‌లువురు నేత‌ల‌కు కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వ‌నున్న‌ట్లు హామీ ఇచ్చిన గులాబీ ద‌ళ‌ప‌తి ఈ మేర‌కు నేడు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇలా నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన వారిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారు. వీరితో పాటుగా ఇటీవ‌లే పార్టీలో చేరిన …

Read More »

ఎన్డీఏలోనే ఉన్నాం: పవన్

ఎన్టీఏకు ఒక అడుగు దూరం జరిగానని పెడన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్డీఏతో పవన్ తెగదెంపులు చేసుకున్నట్లేనని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కైకలూరు లోని ముదినేపల్లి లో జరిగిన బహిరంగ సభలో ఎన్డీఏలో జనసేన …

Read More »