ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారం నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అరెస్టు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో, అసలెవరీ ధనుంజయ రెడ్డి అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి…జగన్ జిరాక్స్ అని తెలుస్తోంది. రాజకీయ, పాలనాపరమైన వ్యవహారాల్లో …
Read More »కాంగ్రెస్ వద్దంటే మాత్రం థరూర్ కు అర్హత లేదా?
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే దిశగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష కమిటీకి కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ నియమితులు అయ్యారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తన అనుమతి లేకుండా తన పార్టీ ఎంపీని అఖిల పక్షానికి ఎలా నేతృత్వం వహించమని చెబుతారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు నొసలు …
Read More »ఎమ్మార్వో 10 లక్షలు తీసుకుంది.. అందుకే తిట్టా: ఎమ్మెల్యే
ఏపీలోని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర.. ఇక్కడి ఎమ్మార్వో(తహసీల్దార్)కు వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తనను బూతులు తిట్టాడని పేర్కొంటూ.. తహసీల్దార్ జయలక్ష్మి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వాట్సాప్ కాల్ చేసి.. బండ బూతులు తిట్టాడని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే.. ఇలా ఎందుకు తిట్టాల్సి వచ్చింది? అసలు తెరవెనుక ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం ఎమ్మార్వో చెప్పలేదు. ఇక, శనివారం ఉదయం మీడియా …
Read More »రిటైర్డ్ జడ్జీతోనూ కుదర్లే.. కాకాణి లొంగిపోవాల్సిందే
అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో అందినకాడికి దోచుకున్న నేతలు… ఆ తర్వాత ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏపీలోని తాజా పరిస్థితులను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఐదేళ్ల పాటు వైసీపీ అదికారంలో సాగగా.. ఆ పార్టీ నేతలు అందిన కాడికి దండుకున్నారు. వైసీపీ అదికారం నుంచి దిగిపోగానే.. వాటిపై కేసులు నమోదు అయిపోయాయి. కొందరు నేతలు జైలుకెళ్లారు. మరికొందరు కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిళ్లు తెచ్చుకున్నారు. ఇంకొందరు అయితే అటు …
Read More »బెజవాడ జైలర్ బదిలీ!.. జైల్లో ఏం జరుగుతోంది..?
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా జైలు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే… గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, బెజవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ లిక్కర్ స్కాం నిందితులు, ఏపీపీఎస్పీ అక్రమాల కేసు నిందితులు, టీడీపీ కార్యాలయాలపై దాడుల కేసుల నిందితులు.. ఇలా అన్నీ రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసుల నిందితులు అక్కడే ఉంటున్నారు. ఉన్నట్టుండి… శుక్రవారం సాయంత్రం రాష్ట్ర …
Read More »ఇది జీవన్ రెడ్డి మార్కు నిరసన!
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అంటేనే… సీనియర్లు, జూనియర్ల మధ్య నిత్యం ఆధిపత్య యుద్ధం నడుస్తూనే ఉంటుంది.ఈ తరహా విభేదాలు పార్టీకి పెద్దగా నష్టం చేయకున్నా… పార్టీకి చెందిన పలువురు కీలక నేతలకు మాత్రం అప్పటికప్పుడు ఊహించని షాకులు ఇస్తూ ఉంటాయి. ఈ తరహా పరిణామాలపై అసలు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాక ఆయా కీలక స్తానాల్లో ఉన్న నేతలు తలలు పట్టుకుంటున్న దాఖలాలు కోకొల్లలు. అలాంటి …
Read More »అనారోగ్యంతోనూ ‘తిరంగా’లో పవన్ కల్యాణ్
పహల్ గాం ఉగ్రవాద దాడికి ప్రతిగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు జరిపిన ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా తిరంగా ర్యాలీల పేరిట భారీ ప్రదర్శనలను చేపట్టింది. విజయవాడలో చేపట్టిన ఈ ర్యాలీకి సీఎం నారా చంద్రబాబు నాయుడితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. …
Read More »పోలవరానికి ఇక బ్రేకులు లేవంతే!
పోలవరం ప్రాజెక్టు.. ఏపీకి జీవనాడి కిందే లెక్క. పోలవరం పూర్తి అయితే రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలకు లెక్కే లేదు. ఈ కారణంగానే కూటమి సర్కారు పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కూటమి సర్కారుకు మరింతగా ఊతం ఇచ్చేలా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు… ప్రత్యేకించి ప్రదాన మంత్రిత్వ కార్యాలయం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పోలవరానికి ఇకపై అడ్డంకులే రాకుండా ఉండేలా వ్యూహం రచించేందుకు స్వయంగా ప్రధాని …
Read More »‘నాన్ లోకల్’ రద్దు… సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మొన్నటిదాకా కొనసాగిన నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లోని సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు 15 శాతం సీట్లను నాన్ లోకల్ కోటాకు కేటాయిస్తూ వస్తున్న విధానానికి ఏపీ సర్కారు చరమ గీతం పాడేసింది. ఇప్పటిదాకా 85 …
Read More »వైసీపీ లిక్కర్ స్కాం: ఆ ఇద్దరు అరెస్టు
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి.. జగన్ పాలనలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి, ఆయనకు ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా చేసిన కృష్ణమోహన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అరెస్టు చేసింది. ఈ విషయాన్ని వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అధికారులు వివరించారు. అరెస్టు నేపథ్యంలో విజయవాడలో ఎలాంటి ఘర్షణలకు తావు …
Read More »సెలబ్రిటీల నుంచి దేశ భక్తి ఆశించొద్దు: పవన్
ఉగ్రవాదాన్ని విడిచి పెట్టకపోతే.. పాకిస్థాన్లోని ప్రతి ఇంట్లోకీ దూరి మరీ కొడతామంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాయాది దేశాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇదే సమయంలో సెలబ్రిటీలు(సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు) నుంచి దేశభక్తిని ఆశించొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన తిరంగా(జాతీయ పతాకం) ర్యాలీలో పాల్గొన్న ఆయన.. అనంతరం బెంజి సర్కిల్లో నిర్వహించిన సభలో మాట్లాడారు. పాకిస్థాన్ ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తోందన్నది పక్కా వాస్తవమని పేర్కొన్నారు. …
Read More »వైసీపీ ఫిక్స్!.. జగన్ అరెస్ట్ ఖాయం!
ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కూడినా ఒకటే చర్చ జరుగుతోంది. అదేంటంటే… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు తప్పదట కదా అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఈ చర్చ ఇప్పుడు జనాన్ని దాటేసి వైసీపీ నోళ్లలోనూ గట్టిగానే వినిపిస్తోంది. జగన్ ను అరెస్టు చేసేందుకే మద్యం కుంభకోణాన్ని కూటమి సర్కారు అత్యంత సీరియస్ గా తీసుకుని మరీ సాగుతోందని కూడా వైసీపీ నేతలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates