టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. సతీమణి వసుంధరతో కలిసి వచ్చి నియోజకవర్గంలో నిర్వహించిన పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల పద్మభూషణ్ సత్కారం కూడా పొందడంతో బాలయ్య అభిమానులు.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన సత్కారం చేశారు. సోమవారంఉదయం నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య కొన్ని చోట్ల సభల్లోనూ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ …
Read More »జగన్ సన్నిహితులపై సుప్రీం కొరడా!
ఏపీలో మద్యం కేసు వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. మాజీ సీఎం జగన్కు సన్నిహితులు, ఆయన దగ్గర పీఏలుగా పనిచేసిన వారిని విచారించేందుకు రెడీ అయింది. దీంతో పలువురు తమను ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న ఉద్దేశంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. వాస్తవానికి వారిని ఇంకా విచారణకు పిలవలేదు. కానీ, రాజ్ కసిరెడ్డి ఉదంతం నేపథ్యంలో వారు …
Read More »అన్నదమ్ముల గొడవ… సర్దిచెప్పేవారే లేరా?
కేశినేని బ్రదర్స్ మధ్య రాజుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం ఏపీలో కలకలమే రేపుతోంది. పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా నాని కొనసాగగా.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నానిని ఓడించిన చిన్ని కొత్తగా బెజవాడ ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మొన్నటిదాకా అంతా బాగానే ఉన్నా.. విశాఖలో అర్సా కంపెనీకి భూముల కేటాయింపుతో ఒక్కసారిగా వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదానికి నాని శ్రీకారం చుడితే… చిన్ని కూడా ఘాటు …
Read More »అదిరిపోయేలా ‘మహానాడు’.. ఈ దఫా మార్పు ఇదే!
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ మహానాడును నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఒక్క కరోనా సమయంలోనే వర్చువల్గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక, పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మహానాడుకు భారీ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ సారి నిర్వహించే మహానాడుకు రెండు ప్రధాన ప్రత్యేకతలు ఉన్నాయని పార్టీనాయకులు …
Read More »అఫిషియల్ : ప్రధాని వస్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి!
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా చేశారు. అయితే.. ఇప్పుడు మరోసారి ప్రధాని రాకకు సంబంధించిన అధికారిక సమాచారం.. రాష్ట్రానికి చేరింది. ప్రధాన మంత్రి కార్యాలయ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేసమయంలో విశాఖపట్నం కలెక్టర్కు కూడా.. ఆదివారం సాయంత్రం లేఖ రాశారు. ‘ప్రధాని వస్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ప్రధాని వచ్చే …
Read More »జగన్ కు.. ‘వర్క్ ఫ్రమ్ బెంగళూరు’ టైటిల్!
వైసీపీ అధినేత జగన్ మరింత బద్నాం అవుతున్నారా? ఆయన చేస్తున్న పనులపై కూటమి సర్కారు ప్రజల్లో ప్రచారం చేస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. “ఒక తప్పు కాయొచ్చు..రెండు వరకు సరిపెట్టుకోవచ్చు. కానీ, పదే పదే తప్పులు చేసుకుంటూ పోతే.. జగన్ బద్నాం కాక ఏమవుతారు. ఇంతకన్నా ఏం చెప్పలేం” అని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో ఉండడం అనేది రాజకీయ నాయకుల లక్షణం. పైగా తనపాలనపై …
Read More »గుట్టు విప్పేస్తున్నారు.. ఇక, కష్టమే జగన్..!
ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. రాజకీయ పరిష్వంగాన్ని వదిలించుకుని.. గుట్టు విప్పేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో నేరాలు ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అన్న ప్రశ్నకు నిన్న మొన్నటి వరకు తెలియదు-గుర్తులేదు-మరిచిపోయాం.. అన్న వారే.. ఇప్పుడు నిజాలు కక్కేస్తున్నారు. కీలకమైన రెండు కారణాలతో గుట్టు బయట పెట్టేస్తున్నారు. ఈ పరిణామం వైసీపీ అధినేత జగన్కు ఉచ్చు బిగిసేలా చేస్తోంది. …
Read More »‘అతి’ మాటలతో ఇరుక్కున్న ‘నా అన్వేషణ’
తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. అన్వేష్. ‘నా అన్వేషణ’ పేరుతో అతను ఎన్నో దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్లో 24 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారతడికి. క్రేజీగా వీడియోలు చేస్తూ, బూతులు జోడించి దూకుడుగా కామెంట్రీ చెబుతూ ఫాలోవర్లను బాగానే పెంచుకున్నాడు అన్వేష్. ఈ మధ్య అతను బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వారి మీద యుద్ధం ప్రకటించి గట్టిగానే పోరాడుతున్నాడు. …
Read More »సైకో పోయినా… ఆ చేష్టలు మాత్రం పోలేదు
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో పోవాలి…సైకిల్ రావాలి అంటూ వినిపించిన ఈ నినాదం కూటమి విజయానికి ఓ బ్రహ్మాస్త్రం మాదిరిగానే పని చేసింది. రాజధాని అమరావతి పట్ల జగన్ వ్యవహరించిన తీరు సైకో మాదిరిగానే ఉందని టీడీపీ శ్రేణులు, రాజదాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు భావించారు తమలోని భావనను వారు రాష్ట్రవ్యాప్తం చేయడంలో …
Read More »పది నెల్లలో మూడు సార్లు ఏపీకి మోడీ.. మరి జగన్.. !
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు సార్లు ఏపీకి వచ్చారు. అంటే.. కేవలం పది మాసాల వ్యవధిలోనే ప్రధాని మూడు సార్లు.. రాష్ట్రంలో పర్యటించారు. ఇదేమీ చిన్న విజయం కాదు. సొంతగా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలకే ఆయన ఐదేళ్లలో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే పర్యటిస్తున్నారు. అలాంటిది.. ఏపీలో పది మాసాలు కాకుండానే మూడు సార్లు వచ్చారు. తొలిసారి చంద్రబాబు సీఎంగా …
Read More »బోరుగడ్డకు బెయిల్.. కానీ, జైల్లోనే!
వైసీపీ నాయకుడు, సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లను, వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషించిన కేసులో అరెస్టయి జైలు పాలైన బోరుగడ్డ అనిల్కుమార్కు అనంతపురం జిల్లా కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులో కూడా బోరుగడ్డపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనికి కూడా 14 రోజుల చొప్పున ఇప్పటికి …
Read More »గుండుతో సాయిరెడ్డి..
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి తెల్లటి జుట్టు, తెల్లటి గడ్డంతో కనిపించడం అందరికీ తెలిసిందే. ఆయన ఎంత బిజీగా ఉన్న ఎంత పనిలో ఉన్నా.. తన కాస్ట్యూమ్, బియార్డ్, హెయిర్ విషయంలో పక్కాగా ఉంటారు. ఎందుకంటే.. ఒక్కొక్క సారి ఆయన అనూహ్యంగా జాతీయ మీడియాతోనూ మాట్లాడుతుంటారు. దీంతో ఎప్పుడూ నీట్గా ఉంటారు. అయితే.. ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ.. విజయసాయిరెడ్డి హఠాత్తుగా గుండుతో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates