తెలుగులో ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్లలో ఒకరైన స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్యకు పాల్పడడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాక.. కవిత్వం రాయడం, సామాజిక సమస్యలపై బలంగా గళం విప్పడం లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడడం జర్నలిస్టు వర్గాలను షాక్కు గురి చేసింది. చాలా ఏళ్ల కిందటే భర్త నుంచి విడిపోయిన స్వేచ్ఛకు వయసు మీద పడ్డ తల్లిదండ్రులు, 13 …
Read More »కొండా వారి కళ్లు తెరుచుకున్నాయా?
కొండా మురళి.. రాజకీయంగా సీనియర్ నాయకుడు. మంత్రి సురేఖ భర్త. గతంలో కాంగ్రెస్లోనే ఉన్న ఆయన..తర్వాత వరుస గా పార్టీలు మారుతూ వచ్చారు. అయితే.. ఏ పార్టీలో ఉన్నా ఆధిపత్య రాజకీయాలకు ఆయన కేరాఫ్ అనే మాట ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు తెలియంది కాదు. వైసీపీ, బీఆర్ ఎస్ పార్టీలలోనూ కొండా ఫ్యామిలీ ఇలానే చేసింది. ఇక, ఇప్పుడు కూడా అవే పరిస్థితులు తెరమీదికి వచ్చాయి. దీంతో అధిష్టానం …
Read More »కొడాలి ప్లేస్…. రాము రీప్లేస్ ..!
దాదాపు ఏడాది కాలం తర్వాత తన సొంత నియోజకవర్గంలోకి ఎవరైనా నాయకుడు వస్తే ఆయనకు చెందిన కార్యకర్తలు, ఆయనకు చెందిన అనుచరులు, ఆయన అనుకూల వ్యక్తులు సంబరాలు చేసుకుంటారు. స్వాగతాలు పలుకుతారు. ఒక రకంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. రాకరాక వచ్చిన నాయకుడికి గజమాలలు వేసి స్వాగతాలు పలుకుతారు. ఇది గతంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కనిపించింది. ముఖ్యంగా గుడివాడ వంటి కీలక నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా …
Read More »ఏపీ బిజెపి రేసులో ఎంతమందంటే..
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీ అధిష్టానం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ పదవి కోసం నాయకులు పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా బిజెపి అధ్యక్షులను చూస్తే బీసీ సామాజిక వర్గాలకు ఆ పార్టీ పెద్దపేట వేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓసి సామాజిక వర్గం నాయకులు ఉన్నారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, మారుతున్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని బిజెపి బీసీ …
Read More »2 నుంచి ఏపీలో రప్పా…. రప్పా!!
మరో రెండు రోజులు.. ఖచ్చితంగా జూలై 2వ తేదీ నుంచి ఏపీలో రాజకీయాలు నిజంగానే రప్పా… రప్పా.. డైలాగును గుర్తుకు తేనున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మరింత జోరుగా హోరుగా రాజకీయ రగడ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎక్కడా లేని విధంగా ప్రతిపక్ష-అధికార పార్టీ మధ్య రాజకీయం మరింత సెగ పెరగనుంది. ఇప్పటికే వైసీపీ.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో పేరుతో ఇంటింటికీ వైసీపీ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. …
Read More »నాగార్జున 2 ఎకరాలు ఇచ్చారు-రేవంత్ రెడ్డి
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం.. ఈ క్రమంలో గత ఏడాది హైదరాబాద్లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నాగార్జునను కావాలనే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వర్గం ఆయనపై మండిపడితే.. ప్రభుత్వం సరైన పనే చేసిందంటూ ఇంకో వర్గం వాదించింది. దీనిపై నాగార్జున తర్వాతి రోజుల్లో ఎలా స్పందిస్తాడా.. కోర్టులో ఎలా పోరాడతాడా …
Read More »పిన్నెల్లికి వైసీపీ షాక్.. ఏం చేస్తున్నారంటే..!
వైసీపీ నాయకుడు, సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమిటి? అసలు ఆయన పార్టీలో ఉంటారా? లేక పార్టీ నుంచి తప్పిస్తారా? భవిష్యత్తులో ఆయన రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి? ఇది ఇప్పుడు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే జిల్లాకి ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఒకవైపు పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని అధినేత చెప్తున్నారు. సరే …
Read More »బ్రేకింగ్!… మహాన్యూస్ పై బీఆర్ఎస్ దాడి!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శనివారం మద్యాహ్నం తర్వాత ఓ దారుణ ఘటన జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు నగరంలోని జూబ్లీహిల్స్ లోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడికి దిగిన వారు బీఆర్ఎస్ వారేనా? అన్న అనుమానాలను కూడా మహాన్యూస్ ఎండీ వంశీ నివృత్తి చేశారు. తమ పార్టీ నేత కేటీఆర్ మీద తప్పుడు రాతలు రాస్తే ఊరుకుంటామా? అంటూ దాడి చేసిన …
Read More »కొండా మురళి అస్సలు తగ్గలేదు!
తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంచి పట్టు కలిగిన రాజకీయ నేతగా గుర్తింపు సంపాదిం చుకున్న మాజీ ఎమ్మెల్పీ కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇందుకోసం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు మురళి రాగా… కాంగ్రెస్ పార్టీ తన కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. వచ్చీరాగానే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలోని …
Read More »జగన్ దూకుడుతో టీడీపీ మరింత బల పడితే..?!
ఆశ ఉండొచ్చు. అది రాజకీయ నాయకుల లక్షణమే కాదు.. సాధారణ ప్రజల లక్షణం కూడా. కానీ… అత్యాసే ఎప్పుడూ ఎవరినై నా ముంచేస్తుంది. అది నాయకులనైనా.. వ్యక్తులనైనాకూడా! ఇప్పుడు అదే అత్యాస జగన్లోనూ కనిపిస్తోంది. ముందు తనప రిస్థితిని.. తన పార్టీ పరిస్థితిని అంచనా వేసుకునే విషయంలో విఫలమవుతున్నజగన్.. ఇప్పుడు టీడీపీపై దృష్టి పెట్టారు. తాజా గా జరిగిన ఓ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని …
Read More »జగన్ గుండెల్లో ‘పవన్’ గుబులు..
జగనేంటి.. గాబరా పడడం ఏంటి? ఆయనంత ధైర్యశాలి.. ఎదిరించే తత్వం ఉన్న నాయకుడు.. మొండి ఘటం… మరొకరు లేరని అనుకుంటున్నారా?!. కానీ.. అవన్నీ ఇప్పుడు పనిచేయడం లేదు. ఆ మొండి తనం.. ఆ ధైర్యం.. ఆ దీక్ష.. వంటివి కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే.. రాజకీయాలు.. ఓటు బ్యాంకు అలాంటివి మరి! ముఖ్యమంత్రి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుపై చేసినంత వేగంగా.. చురుగ్గా పవన్ పై విమర్శలు చేయలేకపోవడమే దీనికి కారణం. చంద్రబాబు …
Read More »ఏపీలో నిలకడ లేని నేతలు.. స్వయంకృత తప్పులు ..!
రాష్ట్రంలో ఒకప్పుడు సుదీర్ఘ రాజకీయాలు చేసి.. మంత్రి పదవులు అనుభవించిన పలువురు నాయకులు ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. నిలకడలేని అడుగులు, నిలకడలేని రాజకీయాలు చేసిన కారణంగా వారు ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ పెద్దగా గుర్తింపు పొందలేకపోతున్నారనేది వాస్తవం. ఇలాంటి వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్, అదేవిధంగా మేకతోటి సుచరిత, రావెల కిషోర్ బాబు వంటి కీలక నాయకులు కనిపిస్తున్నారు. చిత్రం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates