Political News

మైనంపల్లి.. పంతం నెగ్గింది కానీ పరీక్ష మిగిలింది

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పంతం నెగ్గించుకున్నారు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం పదవిని కూడా పణంగా పెట్టి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మైనంపల్లి పంతం నెగ్గించుకున్నారు. తన కొడుకుతో పాటు తనకు కాంగ్రెస్ టికెట్లు వచ్చేలా చూసుకుని ఎన్నికల సమరానికి సై అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో మైనంపల్లితో పాటు ఆయన తనయుడు రోహిత్ రావుకు టికెట్లు దక్కాయి. మైనంపల్లికి సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, …

Read More »

టిక్కెట్లు రాని వారికోసం పోరాడ‌తా: కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌క‌టించిన తొలి జాబితాలో కోమ‌టి రెడ్డికి పార్టీ సీటు ప్ర‌క‌టించింది. అయితే.. కొంద‌రు ఆశావ‌హులు, ముఖ్యంగా కీల‌క నేత‌ల వార‌సుల‌కు పార్టీ టికెట్లు ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టిక్కెట్లు రాని వారి త‌ర‌ఫున తాను అధిష్టానం వ‌ద్ద …

Read More »

మ‌న‌దే గెలుపు… తొంద‌ర ప‌డొద్దు: కేసీఆర్

“మ‌న‌దే గెలుపు.. ఎవ‌రూ తొంద‌ర ప‌డొద్దు.. యాగీ చేయొద్దు” అంటూ.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో 51 మందికి ఆయ‌న స్వ‌యంగా బీఫాంలు పంపిణీ చేశారు. మిగిలిన బీఫాంలు కూడా సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు. నామినేష‌న్ల‌కు ఇంకా స‌మ‌యం ఉంద‌ని ఎవ‌రూ ఖంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అభ్య‌ర్థులు కోప‌తాపాలు ప‌క్క‌న పెట్టాల‌ని సీఎం కేసీఆర్ …

Read More »

బీసీల‌కు జై కొట్టిన‌ కాంగ్రెస్.. మెజారిటీ సీట్లు వారికే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ త‌న వ్యూహాన్ని మార్చుకుంది. అధికార పార్టీకి షాక్ ఇస్తూ.. అదేస‌మ‌యంలో తాను అధికారంలోకి వ‌చ్చేందుకు ఉన్న మార్గాల‌ను సుగ‌మం చేసుకుంటూ.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో 28 శాతం సీట్ల‌ను బీసీల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో తాజాగా విడుద‌ల చేసిన‌.. జాబితాలో మెజారిటీ సీట్ల‌ను వారికే కేటాయించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల‌కు …

Read More »

బాబు విష‌యంలో వైసీపీ వైఖ‌రి అమానుషం: ప‌వ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆరోగ్యం విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి అమానుషంగా ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్థితిపై వ‌స్తున్న వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని అన్నారు. తాజాగా మంగ‌ళ‌గిరి వ‌చ్చిన ప‌వ‌న్‌.. అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని దుయ్య‌బ‌ట్టారు. సీనియ‌ర్ నాయ‌కుడు, ఈ దేశంలోనే ఎన్న‌ద‌గిన నేత అయిన చంద్ర‌బాబును ఓ …

Read More »

అంచనాలు తప్పాయి.. కాంగ్రెస్ తొలిజాబితాలో సిత్రాలెన్నో!

అందరూ ఎంతో ఆశగా చూసిన తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా ఆదివారం ఉదయం వచ్చేసింది. గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ జాబితా పేరుతో నడుస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. తొలి జాబితాలో 78 పేర్లు ఉంటాయని ఒకరు.. కాదు యాభైకు పైనే పేర్లు ఉంటాయని ఇంకొకరు. ఇవన్ని తప్పు 40 లోపే మొదటి జాబితా ఉంటుందని మరికొందరు తమ వాదనలు వినిపించారు. ఇలా ఎవరి లెక్కలు వారు.. ఎవరి …

Read More »

దుమ్మురేపేలా కేసీఆర్ ఎన్నిక‌ల మేనిఫెస్టో

తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న రీతిలో ఎన్నిక‌ల క‌ద‌న‌రంగంలో దూక‌నున్నారు. నేడు పార్టీ కార్యాల‌య‌మైన‌ తెలంగాణ భవన్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయనున్న కేసీఆర్, పార్టీ తరపున ఎన్నికల ప్రచార ఖర్చులకు చెక్కులు ఇవ్వనున్నారు. దీంతోపాటుగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు కూడా. అయితే, మేనిఫెస్టో ఓట్ల వర్షం …

Read More »

చంద్రబాబు సెల్ లో ఏసీ పెట్టాలని కోర్టు ఆదేశం

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డీహైడ్రేషన్ తో పాటు స్కిన్ ఎలర్జీతో చంద్రబాబు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రభుత్వ వైద్యులు జైల్లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ …

Read More »

ప్రవళిక సూసైడ్ ఇష్యూలో కొత్త ట్విస్ట్

తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, గ్రూప్-2 నోటిఫికేషన్ వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని ప్రభుత్వంపై విపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక ఆత్మహత్య గురించి పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే …

Read More »

బీఆర్ఎస్ లోకి పొన్నాల..ప్రకటనే తరువాయి

కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు మరో నెలన్నర గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో పొన్నాల తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు షాకిచ్చింది. అయితే, తనకు టికెట్ రాదని తెలియడంతోనే పొన్నాల రాజీనామా చేశారని టాక్ వస్తోంది. ఇక, రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన పొన్నాల..పార్టీలో తనకు తగినంత గౌరవం దక్కడం లేదని, అందుకే రాజీనామా …

Read More »

కోర్టు ఆదేశిస్తే.. చంద్ర‌బాబు గ‌దిలో ఏసీ పెడ‌తాం: డీఐజీ

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఆరోగ్యం విష‌యంలో వ‌స్తున్న సంచ‌ల‌న వార్త‌ల నేప‌థ్యంలో ఇటు ప్ర‌భుత్వ వైద్యులు, అటు జైళ్ల శాఖ డీఐజీ ర‌వికిర‌ణ్ కూడా స్పందించారు. హుటాహుటిన మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి.. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్తితిని వారు వివ‌రించారు. తొలుత వైద్యులు మాట్లాడుతు.. చంద్ర‌బాబు ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌న్నారు. అయితే, ఆయ‌నకు గ‌తంలో ఎలాంటి జ‌బ్బులు ఉన్నాయో …

Read More »

కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన యువతి ఆత్మహత్య

ఎన్నికల వేళ చోటు చేసుకునే కొన్ని పరిణామాలు అనూహ్య పరిస్థితులకు తెర తీస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది గులబీ పార్టీ. ఉరుము మెరుపుల్లేకుండా ఒక్కసారిగా పిడుగుల జడివాన పడితే ఎంతటి ఇబ్బందో అలాంటి కష్టాన్నే ఎదుర్కొనే పరిస్థితి తాజాగా ఎదురైంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న గులాబీ సర్కార్.. తాము ఇవ్వని హామీల్ని సైతం నెరవేర్చుకున్నట్లు చెప్పినా.. నిరుద్యోగం.. నిరుద్యోగ భ్రతి.. ఉద్యోగాల కల్పన విషయంలో వెనుకబడి ఉండటమే కాదు.. …

Read More »