అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయం మరోసారి భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త మలుపుని తేవడమే కాక, సంబంధాలను మరింత ఉద్రిక్తత వైపు నెట్టేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో భారత్పై ఇప్పటికే 25 శాతం ఉన్న టారిఫ్ను 50 శాతానికి పెంచినట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ యాజమాన్యం రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని …
Read More »ట్రంప్ దెబ్బకు వెనక్కి తగ్గిన అమెజాన్, వాల్మార్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 50 శాతం సుంకాలు భారత దిగుమతి వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా అమెజాన్, వాల్మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి అమెరికన్ రిటైల్ దిగ్గజాలు భారత్ నుంచి వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల స్టాక్ను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ సంస్థలు భారత టోకు వ్యాపారులకు లేఖలు, మెయిల్స్ పంపిస్తూ, తదుపరి సూచనలు వచ్చేవరకు ఎగుమతులను నిలిపేయాలని కోరాయి. దీంతో ఎగుమతి రంగం తీవ్ర ఆందోళనలో పడింది. …
Read More »అమరావతికి గెజిట్… బాబుకు ఇదో సంకటం!
అమరావతి… నవ్యాంధ్ర రాజధాని. అయితే, దీనిని సుస్థిరంగా ఉంచాలన్నది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆలోచన. దీనికిగాను కేంద్రంతో ఒప్పించి, మెప్పించి గెజిట్ జారీ చేయించాలనీ, తద్వారా ఎవరు వచ్చినా అమరావతి జోలికి పోకుండా రాజధానిని కదపకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కోరుతున్నారు. కొన్నాళ్ల క్రితం మరిన్ని భూములు కావాలంటూ ప్రభుత్వం ప్రతిపాదన చేసిన సమయంలో రైతులు ఈ విషయాన్ని …
Read More »మాకు మరో మార్గం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతోనే అడుగులు వేస్తున్నారు. అయితే.. ఆయనకు సరైన మార్గమే ఇప్పుడు కనిపించడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా రేవంతే చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ విషయంలో పట్టుదలతోనే ఉన్నామని.. బీసీలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాజాగా గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రపతికి బిల్లు పంపించినా.. ఆమోదం తెలపడం లేదన్నారు. అయినప్పటికీ… తమ ప్రయత్నాలు తాముచేస్తామని …
Read More »వివేకా హత్య కేసు..సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు
వివేకా హత్య సీబీఐ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇక, జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే కడప ఎస్పీ అశోక్ కుమార్ ను వివేకా తనయురాలు సునీత రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఆదినారాయణ …
Read More »ఆశ-నిరాశల్లో.. రేవంత్ ప్రయాస!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తాజాగా ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు. అయితే.. ఆయనకు వెంటనే సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మంత్రివర్గంలో సీటును ఆశించి భంగ పడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ‘మీరుచేయాల్సింది చేయకుండా.. కేంద్రంపై ఎందుకు విరుచుకుపడతారు” అని తీవ్ర వ్యాఖ్యలేచేశారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా ఫొటోలను, కేసీఆర్ తన హయాంలో ఇందిరా పార్కు వద్ద చేసిన ధర్నా ఫొటోలను కలిపి.. …
Read More »పట్టించుకోండి బాబూ: నిధుల కోసం తమ్ముళ్ల తంటాలు
“నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. రూపాయి లేక.. ఇబ్బందులు పడుతున్నాం. కొంచెం కరుణిం చండి.” అంటూ.. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు సీఎంవో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీలోని ప్రతినియోజకవర్గంలోనూ అభివృద్ది చేసేందుకు నిధులు ఇస్తామని.. గత ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే .. సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత.. కొన్నాళ్లపాటు మౌనంగా ఉన్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల …
Read More »కేసీఆర్ కోసం.. తెలంగాణ సమాజం వెయిటింగ్?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? ప్రజలను ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడతారు? ఇదీ.. తెలంగాణలోని పట్టణాల నుంచి గ్రామాల వరకు కూడా వినిపిస్తున్న మాట. ఈ వ్యవహారంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు కూడా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ గత రెండు మూడు వారాలుగా తీవ్రస్థాయిలో హల్చల్ చేస్తున్న అంశాలే కావడంతో ఇటు …
Read More »‘సీఎం ఫొటో’పై రగడ.. 10 లక్షలు వదిలించుకున్న ఎంపీ!
రాజకీయాలకు కొన్ని హద్దులు ఉంటాయి. ఎక్కడ విమర్శించాలో.. ఎక్కడ తగ్గి ఉండాలో నాయకులు తెలుసుకోవాలి. అంతేకానీ .. ప్రతి విషయాన్నీ.. రాజకీయం చేస్తే.. ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో.. తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగంకు సుప్రీంకోర్టు భారీ స్థాయిలో సమాధానం చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు వర్తించే తీర్పు కావడం గమనార్హం. అందుకే తాజాగా జరిగిన ఈ వ్యవహారానికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు.. భవిష్యత్తులో …
Read More »ముందు ఈ సంగతి చూడండి: పవన్ కల్యాణ్కు కామ్రెడ్స్ లేఖ!
‘ముందు ఈ సంగతి చూడండి’.. అంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఉద్దేశించి సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు సుదీర్ఘ లేఖ సంధించారు. “మీ అవసరానికి రాజకీయాలను వాడుకుంటున్నారు. కానీ, మీ అవసరం ఉంది.. ప్రస్తుతం పంచాయతీల్లో.. ముందు ఈ సంగతి చూడండి.” అని వ్యాఖ్యానించారు. పంచాయతీలు ప్రస్తుతం కోలుకునే దశలో లేవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా 1121 కోట్ల రూపాయలను పంచాయతీలకు ఇచ్చిందని.. ఈ …
Read More »‘కేసీఆర్ స్వార్థ జీవి… నేను అమ్ముడు పోలేదు’
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు కూడా కాకముందే ఆ పార్టీ తాజా మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్పైనా, తనను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్ను స్వార్థ జీవిగా గువ్వల అభివర్ణించారు. కేసీఆర్ స్వార్థానికి తాను బలి అయ్యానన్నారు. తనను అసమర్థ నాయకత్వం ఓడించిందంటూ బీఆర్ఎస్ అధిష్ఠానంపై నిప్పులు చెరిగారు. …
Read More »ఏపీలో కొత్త జిల్లాలు.. నెల రోజులే డెడ్లైన్!
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించింది. అయితే.. దీనికి సంబంధించిన కసరత్తును నెల రోజుల్లోగా పూర్తి చేయాలని తాజాగా సీఎం చంద్రబాబు డెడ్లైన్ విధించారు. వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాలకు ప్రజల అభిరుచులు, డిమాండ్లకు అనుగుణంగా పేర్ల మార్పు వంటివాటిపై కసరత్తు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇటీవల నియమించారు. ఈ వ్యవహారంపై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates