ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. యువ నాయకుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన నేత. అనేక కష్టాలు ఎదుర్కొన్నారు . అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయనే గాలి భాను ప్రకాష్. గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన భాను.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత మౌనంగా ఎదగడమే ముఖ్యమని భావిస్తూ అదే పంథాలో …
Read More »దేశంలో బిజీయెస్ట్ సీఎం చంద్రబాబే.. !
దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు 28 మంది ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే, దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రిల పనితీరును అదేవిధంగా రోజు మొత్తంలో వారు చేస్తున్న పనులను అంచనా వేసిన ఢిల్లీకి చెందిన సంస్థ దేశవ్యాప్తంగా అత్యంత బిజీగా ఉండేటటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని స్పష్టం చేసింది. ఈ విషయంలో కొన్ని కారణాలను కూడా వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ లో నిర్వహించిన …
Read More »సౌత్లో ‘ఆపరేషన్ లోటస్’ రీజనేంటి?
దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్తో సంబంధం ఉన్న వారికి బీజేపీ అధ్యక్ష పీఠాలను అప్పగిస్తోంది. ఇది చిత్రం కాదు.. చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగా విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఉత్తరాది పైనే దృష్టి పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకు, అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునే విషయంపైనే దృష్టి సారించింది. అలాంటి ఒక్కసారిగా దక్షిణాదిపై మక్కువ చూపిస్తోంది. దీనికి కారణం.. …
Read More »వివేకా కేసును ఎవరు ఆపుతున్నారు?
వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని గత నాలుగు రోజులుగా ప్రస్తావిస్తున్నారు. 2019, మార్చి 16న జరిగిన ఈ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరు? అనేది ఇంకా సస్పెన్సులోనే ఉంది. అనేక విచారణలు, అనేక దర్యాప్తు సంస్థలు దీనిలో పాలుపంచుకున్నా.. ఏళ్ల తరబడి విచారణలు జరిగినా.. విచారణ పరిధి ఏపీ నుంచి తెలంగాణకు చేరినా.. ఈ కేసు …
Read More »తేడా కొడితే బీఆర్ఎస్లోకే.. ‘కొండా’ పెద్ద వ్యూహం?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొండా మురళి, మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహార శైలితో స్థానిక నాయకులు రగులుతున్నారు. ఈ ఇద్దరిపై అధిష్టానానికి పిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే రెండు సార్లు వీరిని విచారించిన అధిష్టానం.. గట్టిగానే సమాధానం చెప్పింది. స్థానికంగా అందరినీ కలుపుకొని పోవాలని సూచించింది. వివాదాలకు కడుదూరంగా ఉంటూ.. పార్టీని డెవలప్ చేయాలని కూడా …
Read More »ఉలిక్కిపడ్డ వైసీపీ.. ఒకేసారి 113 మందిపై కేసు!
ఎలాంటి కేసులు వచ్చినా.. ఎంత మందిని జైల్లోకి నెట్టిన బేఫికర్ అంటూ.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే.. కేసులు పెడతారా పెట్టుకోండి.. అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక సమయంలో అనూహ్య పరిస్థితి ఎదురైంది. వైసీపీకి చెందిన కీలక నాయకులు సహా, నియోజకవర్గ ఇంచార్జ్లుగా ఉన్నవారికి మొత్తంగా 113 మంది ఒకేసారి పోలీసులు నోటీసులు జారీ …
Read More »కార్యకర్తలు హడలిపోతున్నారు
“ఐదేళ్లు అధికారంలో ఉండగా.. కార్యకర్తలను పట్టించుకోలేకపోయాం. ఇప్పటి నుంచి వారికి ప్రాధాన్యం ఇస్తాం. జగన్ 2.0లో కార్యకర్తలే ప్రధానం. వారిని ఇక పై వదిలి పెట్టను.” ఇదీ.. ఈ ఏడాది ప్రారంభంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు. ఇక, అప్పటి నుంచి కార్యకర్తల కేంద్రంగా కొంత మేరకు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. కానీ, వారి సంతృప్తి ఎలా ఉన్నా.. వివాదాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో కార్యకర్తల తల్లిదండ్రులు.. వారిని బయటకు …
Read More »జనసేన ఎమ్మెల్యేల్లో ఎంత మార్పు..
కూటమి పార్టీల్లో కీలకమైన జనసేనలో నాయకులు చడీ చప్పుడు లేకుండా పనిచేసుకుంటున్నారు. పైకి ఎవరూ మీడియా ముందుకు రారు. సంచలన ప్రకటనలు కూడా చేయరు. అంతేకాదు.. ఏం చేసినా.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు క్రెడిట్ దక్కాలని కోరుకుంటున్నారు. దీంతో వారు ఒకరకంగా ఆదర్శంగాను.. మరో రకంగా.. పనిమంతులుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే.. ఆరణి శ్రీనివాసులు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే పేరు వచ్చింది. దీంతో పార్టీ ఆయనకు …
Read More »నిజమే!.. కోటం రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిందే!!
ఔను.. నిజమే.. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిందే!. టీడీసీ సానుభూతి పరుల నుంచి సీనియర్ల వరకు ఈ మాటే వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆదేశాలతో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో నాయకులు ప్రజలను కలుస్తున్నారు. అయితే.. కొందరు నాయకులు ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే.. మెజారిటీ నాయకులు చాలా కష్టంగా నిర్వహిస్తున్నారు. సమయం చూసుకుని.. ఓ గంటో రెండు గంటలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని మమ అనిపిస్తున్నారు. ఇంకొందరు …
Read More »వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!
ఆలు లేదు.. చూలు లేదు..అన్నట్టుగా ఉంది వైసీపీ నాయకుల వ్యవహారం. తాము అధికారంలోకి వస్తే.. అన్న మాట నుంచి వచ్చేస్తే వరకు నాయకులు రెచ్చిపోతున్నారు. ఎన్నికలు ముగిసి ఏడాది మాత్రమే గడిచిందని.. మరోసారి ఎన్నికలు జరిగేందుకు నాలుగేళ్ల సమయం ఉందన్న విషయాన్ని వారు మరిచిపోయారో.. లేక నటిస్తున్నారో.. తెలియదు కానీ.. వైసీపీ నేతలు వేస్తున్న వేషాలు.. నెటిజన్లకు మంటపుట్టిస్తున్నాయి. దీంతో ‘వార్నీ యేషాలో.. వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!’ అని …
Read More »అమరావతిపై భారీ అప్డేట్.. అప్పటికల్లా పూర్తి!
ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ ఇచ్చింది. వైసీపీ హయాంలో తీవ్రనిర్లక్ష్యానికి గురైన అమరావతి రాజధాని పనులను కూటమి సర్కారు వచ్చాక పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు.. ఇదివరకే తీసుకున్నభూములు సరిపోవని గుర్తించిన సర్కారు.. మరో 44 వేల ఎకరాలను సమీకరించేందుకు(ల్యాండ్ పూలింగ్) రెడీ అయింది. అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటు, క్రీడా నగరం వంటి వాటికి ఈ …
Read More »బీఆర్ఎస్లో కేటీఆర్.. జీరో.. ఓ రేంజ్లో సీతక్క ఫైర్
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై మంత్రి సీతక్క.. ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అసలు ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు.. ఆ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందన్నారు. లేని పార్టీ గురించి మాట్లాడుకోవడం వృథా అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేటీఆర్.. బీఆర్ఎస్లో నెంబర్ 2 కాదన్న ఆమె.. ‘జీరో’ అని పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సీతక్క.. బీఆర్ఎస్లో నెంబర్ గేమ్ జరుగుతోందన్నారు. తానే నెంబర్ 2 అని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates