వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి శకునం ఏమీ బాగా లేనట్లు ఉంది. ఎందుకంటే… బుధవారం ఒక్కరోజే ఆయనకు ఏకంగా రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. అవి కూడా తన సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలోనే జరగడం నిజంగానే జగన్ కు డబుల్ స్ట్రోక్స్ అనే చెప్పాలి. త్వరలో టీడీపీ మహానాడు కడపలోనే …
Read More »చంద్రబాబు.. ఎస్టీలకు బంపర్ ఆఫర్…!
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును తలపోశారు. ఇక నుంచి చేపట్టే.. అన్ని నియామకాల్లోనూ.. ఎస్టీ ప్రాంతాల్లో వారినే పూర్తిగా నియమించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ.. ప్రభుత్వం చేపట్టే ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటివాటిలో 100కు వంద శాతం.. గిరిజన బిడ్డలకే అవకాశం కల్పించాలని …
Read More »మహానాడులో మార్పు లేదు..
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు లేవు. ఏటా మే నెల 27 నుంచి మొదలై మూడు రోజుల పాటు కన్నులపండువగా జరుగుతున్న మహానాడును ఈదఫా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్వహిస్తున్నారు. కడప నగరానికి అత్యంత సమీపంలో సీకే దిన్నే మండల కేంద్రంగా జరగనున్న …
Read More »భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత పై ఉసిగొల్పడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈసారి భారత ఆర్మీ కఠినంగా సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ దాడిలో తీవ్ర నష్టాన్ని చవిచూసిన పాకిస్థాన్ ఇప్పుడు మరో వివాదస్పద ప్రకటనతో వార్తల్లో నిలిచింది. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న …
Read More »అనంతపురంలో కియాను మించిన మరో పరిశ్రమ!
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల విడిభాగాల తయారీ యూనిట్ను తీసుకువచ్చిన ఆయన.. తాజాగా రెన్యూ ఎనర్జీ సంస్థను ఏపీకి తీసుకువచ్చారు. అది కూడా.. కియా ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లాలోనే ఇప్పుడు రెన్యూ ఎనర్జీ సంస్థనూతన ప్లాంటును ఏర్పాటు చేయనుండడం గమనార్హం. పునరుత్పాదక ఇంధన రంగానికి కేంద్రం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ …
Read More »కొడాలి నానికి అందరూ దూరమవుతున్నారు
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు దక్కించుకునేందుకు ఈ పట్టు బాగా పనిచేసింది. అయితే.. ఒక్క ఓటమితో ఈ పట్టు కదలిపోతోందన్న చర్చ తెరమీదికి వచ్చింది. ఇటీవల కీలక నాయకుడు, కొడాలికి రాజకీయ సహచరుడిగా మెలిగి, ఆయనకువెన్నుదన్నుగా ఉన్న కీలక నాయకుడు ఒకరు కొడాలికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. నిజానికి ఆయన చాలా బలమైన మద్దతుదారు. …
Read More »మొత్తానికి పాక్ చెర నుంచి విడుదలైన బీఎస్ఎఫ్ జవాన్
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. గత నెల 23న పొరపాటున అంతర్జాతీయ రేఖను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన ఆయన అక్కడి రేంజర్లకు చిక్కారు. దాంతో 3 వారాల పాటు పాక్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. చివరికి బీఎస్ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం అతన్ని అట్టారీ చెక్ పోస్ట్ …
Read More »జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి జకియా ఖానమ్ రాజీనామా
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటికి చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జకియా ఖానమ్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడారు కదా.. ఈమె పార్టీ వీడటంలో ప్రత్యేకతమేంది? …
Read More »గుమ్మనూరు టైమేమీ బాగోలేదబ్బా!
గుమ్మనూరు జయరాం… బడుగు వర్గాల నుంచి వచ్చి ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగిన నేతగా ఓ రేంజి రికార్డు ఆయన సొంతం. తొలుత మెగాస్టార్ చిరంజీవితో రాజకీయ అడుగులు వేసిన ఈ బీసీ నేత… ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కర్నూలు జిల్లా ఆలూరు జడ్పీటీసీగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి ఫ్యామిలీకి కంచు కోటగా ఉన్న ఆలూరులో జడ్పీటీసీగా ఎన్నికైన …
Read More »జగన్ ఆఫర్ కు 10 రోజులు.. పట్టించుకున్నవారేరీ.. ?
ఏపార్టీలో అయినా.. అధినేత ఒక మెట్టు దిగి వస్తే.. కార్యకర్తలు, నాయకులు రెండు మెట్లుదిగి వచ్చి అధినే తకు అనుకూలంగా మారతారు. మరి వైసీపీలోనూ ఇలానే జరిగిందా? అంటే.. ప్రశ్నలే మిగిలాయి. ఈ నెల 1న పార్టీ కార్యకర్తలు, నాయకులతో జగన్ భేటీ అయ్యారు. మేడే సందర్భంగా వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా పార్టీ బాధ్యతలనుఇక నుంచి మీకే అప్పగించాలని భావిస్తున్నా.. మీలో ఇంట్రస్ట్ ఉన్న వారు ముందుకు రండి. …
Read More »ప్రతీకార దినోత్సవం… మ్యాటరేంటి?
టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రాజు గారు.. ఆ తర్వాత వైసీపీ విధానాలు నచ్చక ఆ పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు. జగన్ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను ఆయన బహిరంగంగానే ఎండగట్టారు. ఫలితంగా సిట్టింగ్ ఎంపీగా ఉండి అరెస్టయ్యారు. పోలీసుల అదుపులో లాఠీదెబ్బలూ తిన్నారు. ఇప్పుడు …
Read More »జగన్ లిక్కర్ బ్యాచ్: ఇద్దరికి బెయిల్.. ఒకరి పట్టివేత
వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి, అప్పటి సీఎం జగన్కు ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ, విచారణ సాగుతున్న సమయంలో మైసూరులో పోలీసుల చేతికి చిక్కిన ప్రముఖ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates