ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మించిన నాయకుడు లేడని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. మోడీ 75వ పుట్టిన రోజును పురస్కరించుకుని పవన్ కల్యాణ్.. గతానికి భిన్నంగా.. మరో రెండు అడుగులు ముందుకు వేసి.. సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. దీనిలో పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఆయన మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీని ‘విశ్వ విజేత’గా అభివర్ణించారు. ఆయన దేశంలోనే కాకుండా.. అంతర్జాతీయంగా …
Read More »జోగి రమేష్ అరెస్టు.. రీజనేంటి?
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత.. మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. ఆయనను స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. తన అరెస్టును జోగి తప్పుబట్టారు. తాను ప్రజల కోసం రోడ్డుమీదకు వస్తే.. పోలీసులు అక్రమార్కులను కాపాడేందుకు తనను అరెస్టు చేశారని అన్నారు. ఇక, జోగి అరెస్టును నిరసిస్తూ.. వైసీపీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీంతో …
Read More »ఏపీకి సాగిలపడేది లేదు: రేవంత్
కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సాగిలపడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “వాళ్లు మన మెతకతనం చూసి.. ఏవైనా కట్టుకుంటారు. అన్నింటికీ.. ఒప్పుకొంటామా?” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడేది లేదని చెప్పారు. చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని.. రైతులు, ప్రజలే ఈ ప్రభుత్వానికి ప్రధానమని తేల్చి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి …
Read More »కడపలో కూటమి కుస్తీ.. మామూలుగా లేదే.. !
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కుస్తీలు ఓ రేంజ్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి. స్థానికంగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రెడ్డప్ప గారి మాధవి పై టిడిపి సహా బిజెపి, జనసేన నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఆమె తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, తను తీసుకున్న నిర్ణయమే సరైనదిగా భావిస్తున్నారని గతంలోని టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అధికారులను కూడా తిట్టడం అదేవిధంగా కౌన్సిల్ …
Read More »`పది` సూత్రాలతో పరుగులు పెట్టాలి: చంద్రబాబు
జిల్లాలు అభివృద్ధి చెందితేనే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు రోజుల పాటు అమరావతిలోని సచివాలయంలో నిర్వహించి కలెక్టర్ల సదస్సు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు విషయాలపై మరోసారి కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాల అభివృద్ధికి ఇప్పటికే రోడ్ మ్యాప్ను రెడీ చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఓ పది సూత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఆయన వాటిని కలెక్టర్లు …
Read More »బీజేపీ అంటే ఏంటో జగన్కు అర్థమైందా…?
రాజకీయాల్లో అవసరం ఉంటే ఒకవిధంగా ఉంటారు.. అవసరం తీరాక మరో విధంగా ఉంటారు.. అనేది వాస్తవం. ఈ విషయంలో బీజేపీ నాయకత్వం మరింత ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాలకు.. ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పొత్తులు పెట్టుకుని.. తర్వాత.. తమ ఇష్టప్రకారం వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, తమ అవసరానికి వాడుకుని.. వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో వైసీపీకి అర్థం కావాల్సింది.. బీజేపీ రాజకీయం. …
Read More »సొంత జిల్లాపై ప్రేమ ఇదేనా… జగన్ ..!
వైసిపి అధినేత జగన్ సొంత జిల్లా కడపలో టిడిపి నాయకులు మరో ప్రచారం ప్రారంభించారు. తన సొంత జిల్లా పై ఎనలేని ప్రేమ ఉందని, తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తారని వైసీపీ నాయకులు జగన్ గురించి పదేపదే ఇక్కడ చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి సమస్యలు కూడా వినిపిస్తారు. అయితే, అధికారంలో ఉన్నంతవరకు ఎలా ఉన్నా అధికారం కోల్పోయిన …
Read More »`వివేకా` కేసు మళ్లీ విచారణ… సునీత టార్గెట్ ఎవరు?
2019లో దారుణ హత్యకు గురైన ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ బాబాయి.. వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కేసు విచారణను సీబీఐ గతంలోనే ముగించింది. దీనికి సంబంధించి కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అయితే.. వివేకాకుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత మాత్రం.. ఈ కేసు విచారణను పునః ప్రారంభించాలని.. తమకు అనేక అనుమానాలు ఉన్న వ్యక్తులను అసలు విచారించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ …
Read More »భక్తుల సొమ్ము.. భగవంతుడికే: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలకు.. భక్తులు తరచుగా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. ఏపీలో అయితే తిరుమల, సింహాచలం, విజయవాడ దుర్గమ్మ, తెలంగాణలోఅయితే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి.. ఇలా.. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలకు భక్తులు విరివిగా విరాళాలు ఇస్తారు. ఆ సొమ్ముతో దేవాలయాలు.. వివిధ కార్యక్రమాలు చేస్తుంటాయి. భక్తుల సౌకర్యం కోసం.. కల్యాణ మండపాలు.. క్యూలైన్ల ఏర్పాట్లు.. తాగునీటి వసతులు.. భోజన సదుపాయాలు కూడా కల్పిస్తాయి. అదేసమయంలో వివిధ ప్రాంతాల్లో మరిన్ని ఆలయాలు …
Read More »`ఇంజనీర్ అంబేడ్కర్`ను అరెస్టు చేశారు!
విద్యుత్ కనెక్షన్ కావాలంటే లంచం.. మీటరు మార్చాలంటే లంచం.. బిల్లు కట్టేందుకు సమయం కోరితే లంచం.. డబుల్ ఫేజ్ నుంచి సింగిల్ ఫేజుకు మార్చాలన్నా లంచం.. చిరు ఉద్యోగి బదిలీ కోరితే లంచం.. దిగువ స్థాయి ఉద్యోగి ప్రమోషన్ కోరితే లంచం.. ఇలా అన్నింటా.. లంచం.. లంచం.. అంటూ.. అవినీతి అనకొండలా చెలరేగిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిక్స్(ఏడీఈ) అంబేడ్కర్ను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. …
Read More »పవన్ కల్యాణ్కు చంద్రబాబు ప్రశంసలు.. ఏమన్నారంటే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు ప్రశంసించడం కొత్తకాదు. పలుసందర్భాల్లో జరిగిన కార్యక్ర మాలు.. సభల్లో పరస్పరం ప్రశంసించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే.. తాజాగా రెండో రోజు కలెక్టర్ల సదస్సు లో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేస్తున్న కృషిని, ఆయన నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, …
Read More »జనవరి నుంచే క్వాంటం హబ్గా అమరావతి!
ఏపీ రాజధాని అమరావతి.. జనవరి నుంచే క్వాంటం హబ్గా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో క్వాంటం కంప్యూటింగ్పై సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. అమరావతిని క్వాంటం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థిర నిశ్చయంతో ఉన్నామని చెప్పారు. గ్లోబల్ క్వాంటం డెస్టినేషన్గా ఏపీని మార్చాలనే దిశగా పనులు చేపడుతున్నామన్నారు. దీనికోసం రెండు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates