Political News

రాజ్యసభలో కమల్ నోట తెలుగు మాట

తమిళ లెజెండరీ నటుడు కమల్ హాసన్.. కొన్నేళ్ల ముందు కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కానీ ఎన్నికల్లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కమల్ పార్టీ ‘మక్కల్ నీది మయం’ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయినా కమల్ ఏమీ పార్టీని మూసేయలేదు. రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి ఆయన మద్దతుదారుగా మారారు. ఆ పార్టీనే ఆయన్ని రాజ్యసభకు పంపింది. తాజాగా బడ్జెట్ …

Read More »

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి వ‌చ్చిన పవ‌న్ క‌ల్యాణ్‌.. సీఎంతో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన అనేక అంశాల‌పై వారు దృష్టి పెట్టారు. అదేస‌మ‌యంలో వైసీపీ కుల రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తుండ‌డంపైనా చ‌ర్చించారు. ఈ విష‌యాల‌ను ఆషామాషీగా వ‌దిలేయ‌డానికి వీల్లేద‌ని బ‌ల‌మైన ఎదురు దాడితోనే నిలువ‌రించాల‌ని ఇరువురు నిర్ణ‌యించారు. ఇవీ అంశాలు! 1) …

Read More »

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌జ‌లు ఛీత్క‌రించిన విష‌యంతెలిసిందే. దీంతో 151 స్థానాల నుంచి 11 స్థానాల‌కు వైసీపీ ప‌రిమితం అయింది. ఇలా ఎందుకు జ‌రిగింది? అనేది సుస్ప‌ష్టం. నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరు, దుర్భాష‌లు, అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు.. ఎక్క‌డిక‌క్క‌డ దౌర్జ‌న్యాలు, …

Read More »

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చేయడం వంటి చర్యలు ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదేం పద్ధతి? అంటూ హైకోర్టు పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులను నడిరోడ్డుపై నడిపించడం అంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత? …

Read More »

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ ఆన్‌లైన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు.. తేడా కొడుతున్నాయి. నాస్తిక‌త్వం-స‌నాత‌న ధ‌ర్మంపై నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లు.. ఆయ‌న డ్యూయ‌ల్ మ‌న‌స్త‌త్వానికి అద్దం ప‌డుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. గ‌తంలో అంత బ‌లంగా తాను నాస్తికుడిన‌ని.. చెప్పిన నాగ‌బాబు తాజాగా తాను స‌నాత‌న హిందువున‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లే …

Read More »

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం ఆయన అంబటి రాంబాబు గృహాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తరచూ బూతులు మాట్లాడుతూనే ఉన్నారని, అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబును తిట్టాడనే కారణంతో అంబటి …

Read More »

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా, ఈ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదిక తర్వాత మరింతగా రాజకీయ కాక పెరిగింది. నివేదికకు ముందు, తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ తప్పులేదని వైసీపీ, కాదు తప్పు చేసిందే ఆ …

Read More »

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ అంశంపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు గుర్తొస్తారు.. అధికారం పోగానే కాపులు గుర్తుకొస్తారని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అభద్రతాభావంతో …

Read More »

ఆ మహిళ తో వీడియోలు వ్యక్తిగత విషయమంటోన్న MLA

తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, దానిని పార్టీకి ఆపాదించవద్దని శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. తనపై కేసు నమోదైన విషయం తనకు తెలియదన్నారు శ్రీధర్. అయినా సరే, ఎటువంటి కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు. వాళ్లు ఎన్ని కేసులు …

Read More »

జ‌గ‌న్ వ‌స్తుంటే… జ‌నం గుండెల్లో ద‌డ‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌నలు ప్ర‌జ‌లకు గుదిబండ‌లుగా మారాయా? ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తుంటే.. త‌మ‌కు ఇబ్బందిగా ఉంద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబ‌టి రాంబాబు సీఎం చంద్ర‌బాబు పై చేసిన దుర్భాష‌ల నేప‌థ్యంలో కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో …

Read More »

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదని, అదనంగా వసూలు చేస్తున్నారని, ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించాల‌ని చెప్పినా ఎవరూ స్పందించడం లేదన్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పవన్ హెచ్చరించారు. లిక్కర్ వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి …

Read More »

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన సంగతి తెలిసిందే. సిట్ నివేదికలోని అంశాలపై టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. అయితే, సిట్ నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయని ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. నెయ్యి వివాదంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా టెండర్‌ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. లడ్డు తయారీ కోసం …

Read More »