వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత బాధ ప్రపంచం బాధగా మారింది. నిజానికి తండ్రిని కోల్పోయిన బాధ ఎవరికైనా ఉంటుంది. అందునా, అయినవాళ్లే (ఆమె ఆరోపిస్తున్నట్టు) దారుణంగా నరికి చంపితే, కనీసం దీనిలో బాధ్యులు ఎవరో కూడా తెలియకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది. అదే బాధ, అంతకుమించి అన్నట్టుగా సునీత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆరు ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఎవరు దోషులో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. సునీతపైకి చెబుతున్నా, …
Read More »పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ, ఢిల్లీలో హై టెన్షన్
2024 లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆ బాంబు పేలుస్తానని రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడాన్ని రాహుల్ గాంధీ, …
Read More »ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీకి కలిసివచ్చేదెంత
రాజకీయాల్లో చేరికలు, కూడికలు కామనే. వీటికి కూడా సమయం, సందర్భం ఉంటుంది. అయితే ఎలాంటి సందర్భం లేకుండానే తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికతో భవిష్యత్తులో భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశంపై కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ను మరింత తీవ్రం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్రావు …
Read More »నాడు కుప్పం నేడు పులివెందుల!
అధికారంలో ఉంటే ఒకరకంగా, అధికారం పోయాక మరొరకంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయన్న పేరుంది. దీనికి వైసీపీ చేస్తున్న రాజకీయాలే ఉదాహరణగా మారాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను మరిచిపోయినట్టు వ్యవహరిస్తోందని టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. దీనిలో ఎవరు గెలిచినా మహా అయితే ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. అయినప్పటికీ, …
Read More »తిరుమలలో రాజకీయాలేంది జగన్ మేనమామా?
జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిరుమలలో రాజకీయ చిందులు తొక్కారు. తిరుమల పవిత్రతకు ఓ నాయకుడిగా పెద్దపీట వేయాల్సిన ఆయన, టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని తిడుతూ, తిరుమల శ్రీవారి ఆలయం ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఆయన విమర్శలు గుప్పించారు. వాస్తవానికి తిరుమలలో రాజకీయ విమర్శలు చేయొద్దంటూ పాలక మండలి కొన్ని వారాల కిందట తీర్మానం …
Read More »పాలిటిక్స్ బాలేవు.. వద్దులే: కీలక వారసుల మాట..!
సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వారు తమ వారసుల కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు. వారసులు వస్తే రాజకీయాలు కొనసాగుతాయని, తమ హవా నిలబడుతుందని కూడా అంచనా వేసుకుంటారు. ప్రస్తుత మంత్రులుగా ఉన్నవారిలో టీజీ భరత్ వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రి అయ్యారు. ఇక ఎమ్మెల్యేల్లోనూ పదుల సంఖ్యలో వారసులు ఉన్నారు. అయితే రాను రాను వీరి సంఖ్య పెరుగుతుందని భావించేవారు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి సగానికి పైగా …
Read More »ఎస్.. మనం కూడా: జగన్ కీలక నిర్ణయం..!
రాజకీయాల్లో ఒకరిని అనుసరించడం తప్పుకాదు. తమకు అనుకూలంగా ఉంటే, ఎవరు దేనినైనా అనుసరిస్తారు. అనుకరిస్తారు కూడా. ఈ క్రమంలో తాజాగా వైసీపీ కూడా కాంగ్రెస్ పార్టీని అనుసరించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఒకే ఇంటి నెంబరుతో వేలాది ఓట్లు వేయించారని, ఒకే వ్యక్తి పేరుతో వేల ఓట్లు సృష్టించారని కూడా ఆరోపిస్తున్నారు. …
Read More »ట్రంప్ టారిఫ్ల సెగ.. అమెరికన్లకు మండుతోంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలపై విధిస్తున్న సుంకాలు ఇప్పుడు అక్కడి ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, దుస్తులు, బ్యాగులు వంటి రోజువారీ ఉపయోగపు వస్తువుల ధరలు పెరిగిపోయాయని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సుంకాల కారణంగా షాపుల్లో ఒకే వస్తువు ధర కొద్ది నెలల వ్యవధిలోనే గణనీయంగా పెరిగిందని వారు చెబుతున్నారు. ఈ పెరుగుదలపై సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెడుతూ, ట్రంప్ విధానాలపై విమర్శలు …
Read More »ప్రతిపక్షం తెలంగాణ లో ఒకే, ఏపీ లో వీకే
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారే ముఖ్యం. లేకపోతే ప్రభుత్వం అయినా, నాయకులు అయినా కళ్లెంలేని గుర్రాలే అవుతారు. అందుకే ప్రజాస్వామ్య దేశాల్లో భావప్రకటన స్వేచ్ఛకు పెద్దపీట వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ప్రశ్నించే విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు మారాయి, పాలన కూడా మారింది. అయితే, విపక్ష పాత్ర పోషించే విషయంలో రెండు రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణను …
Read More »జగన్ ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట
ప్రస్తుత కూటమి ప్రభుత్వ దూకుడు, అమలు చేస్తున్న సంక్షేమం, బలమైన గళం వినిపిస్తున్న నాయకులు ఒకవైపు. సైలెంట్గా వ్యవహరిస్తున్న నేతలు, అధినేతపైనే విమర్శలు చేస్తున్న నాయకులు, పార్టీ కార్యక్రమాలకు కడుదూరంగా ఉంటున్న సీనియర్లు మరోవైపు. ఇదే ఇప్పుడు ఏపీలో టీడీపీ, వైసీపీల్లో స్పష్టంగా కనిపిస్తున్న రాజకీయం. చంద్రబాబు చెబుతున్న మాటను కొందరు పక్కన పెట్టేస్తున్నా, చాలా మంది మాత్రం ఫాలో అవుతున్నారు. స్థానికంగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మెజారిటీ నియోజకవర్గాల్లో …
Read More »తమ్ముళ్లూ పారాహుషార్: ‘తొలి అడుగు’పై బాబు నిఘా
లూజుగా వ్యవహరించే, ఇష్టానుసారంగా వ్యవహరించే నాయకులకు ఎక్కడికక్కడ నట్లు బిగించే కార్యక్ర మం రాష్ట్రంలో కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన నిఘాను పెడుతూనే ఉన్నారు. తప్పులు చేస్తున్నవారిని హెచ్చరిస్తూ నే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ.. వాటికి అనుగుణంగా నాయకుల ను మలుస్తున్నారు. తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. …
Read More »ఆర్టీసీ ఫ్రీ: వైసీపీ అష్ట దిగ్బంధనం!
పార్టీని నడిపించేందుకే కాదు.. పార్టీని బలోపేతం చేసేందుకు కూడా సలహాలు కావాలి. కేవలం ప్రజల్లో ఏర్పడే సానుభూతిని నమ్ముకుని.. ముందుకు సాగే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు, పార్టీలకు కూడా లేదు. ఎందుకంటే.. ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో పట్టుకోవడం.. అంత ఈజీ కాదు. ఇప్పుడున్నట్టుగా.. వచ్చే రెండేళ్ల తర్వాత రాజకీయాలు ఉండవు. ప్రజల మూడ్ కూడా ఉండదు. నిన్న మొన్నటి వరకు వైసీపీ మాత్రమే.. సంక్షేమం అమలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates