Political News

జ‌గ‌న్ ‘పేటెంట్‌’ను లాగేసుకున్న చంద్ర‌బాబు..!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఒక్క‌రికి మాత్ర‌మే ప‌రిమితం అనుకునే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. ఒక‌ప్పుడు రూ.2కే కిలో బియ్యం అనేది ఎన్టీఆర్ నినాదం. త‌ర్వాత‌.. అది ఆయ‌న‌కు పేటెంట్‌గా కూడా మారిపోయింది. అయితే.. త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు కూడా దీనిని చెర‌ప‌లేక‌పోయాయి. ఇక‌, చంద్ర‌బాబు..ఐటీ-విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇది కూడా ఆయ‌న‌కు పేటెంట్‌గా మారింది. అయితే.. త‌ర్వాత కాలంలో ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా.. ఆయ‌న‌కు ఉన్న పేటెంట్‌ను …

Read More »

కూటమి పాలనకు ఏడాది.. ప్లస్ లు, మైనస్ లు ఇవిగో

ఏపీలో టీడీపీ రథసారథిగా జనసేన, బీజేపీలతో కలిసి ఏర్పడ్డ కూటమి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసింది. 175 సీట్లలో 164 సీట్లను కైవసం చేసుకున్న కూటమి..బలీయమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి పాలనకు బుధవారంతో ఏడాది పూర్తి కాగా… గురువారం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది. వాస్తవంగా సంకీర్ణ ప్రభుత్వాలంటే.. అలకలు, రాజీలు, సర్దుబాట్లు… ఇలా చాలానే ఉంటాయి. అయితే కూటమి సర్కారులో …

Read More »

కూట‌మి ప‌థ‌కానికి జ‌గ‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్‌

గ‌త ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింది కూట‌మి ప్ర‌భుత్వం. ఐతే ఏ ప్ర‌భుత్వ‌మైనా అన్ని హామీల‌నూ నిల‌బెట్టుకోవ‌డం సాధ్యం కాదు. ఐతే కొన్ని ప్ర‌ధాన‌మైన హామీల‌ను అయినా నెర‌వేరిస్తే జ‌నాల మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ప్ర‌తిప‌క్షాలకు విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం త‌గ్గుతుంది. ఐతే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా అన్ని విష‌యాలూ స‌మీక్షించుకుని కూట‌మి ప్ర‌భుత్వం ఒక్కో హామీని నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. …

Read More »

70 శాతం మందికి బాబు, ప‌వ‌న్‌ల‌పైనే న‌మ్మ‌కం.. !

రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం గమనార్హం. వాస్తవానికి ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని ప్రజలు చాలా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని ఏమాత్రం సంతృప్తిగా లేరని పదేపదే చెబుతున్నారు. ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా, ఎప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడినా కూడా ఆయన ఇదే మాట చెబుతున్నారు. దీంతో నిజంగానే స‌ర్కారుపై వ్య‌తిరేక‌త పెరిగిందా? అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. అయితే …

Read More »

మంగ్లీ ఎఫెక్ట్‌: పెద్దోళ్ల‌కు పోలీసుల సీరియ‌స్ వార్నింగ్‌

ప్ర‌ముఖ గాయ‌కురాలు మంగ్లీ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం రాత్రి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప‌రిధిలోని ఓ రిసార్ట్‌లో త‌న స్నేహితుల‌ను పిలిచి పార్టీ ఇచ్చారు. అయితే.. ఇది టీ పార్టీనో.. మందు పార్టీనో అయితే.. ఏమ‌య్యేదో ఏమో.. కానీ, ఆ పార్టీలో గంజాయి గుప్పుమంది. దీంతో ఈ వ్య‌వ‌హారం రచ్చ‌కెక్కింది. అంతేకాదు.. డ్ర‌గ్స్ తీసుకున్నార‌న్న చ‌ర్చ కూడా మొదలైంది. ఇప్ప‌టి వ‌ర‌కు మంగ్లీ అంటే.. తెలంగాణ స‌మాజంలో …

Read More »

వైసీపీలో 65 శాతం మంది కోరిక ఇదేనా .. !

రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగి.. ఏడాది పూర్త‌యింది. ఈ క్ర‌మంలో అటు ప్ర‌బుత్వానికి ఎంత‌గా కీల‌క‌మో.. ఇటు ప్ర‌తిప‌క్షంగా కూడా.. ఈ స‌మ‌యం వైసీపీకి ఆ పార్టీ అధినేతకు అంతే కీల‌కం. ఈ విష‌యంలో ఎలాంటి తేడా లేదు. ఎవ‌రికైనా ఈ ఏడాది కాలంలో గ్రాఫ్ ఎలా ఉంద‌న్న‌ది ముఖ్యం. దీనిపై అధికార పార్టీ ప‌లు రూపాల్లో స‌ర్వేలు చేయించుకుంటోంది. ప్ర‌జ‌ల నాడి తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేస్తోంది. ఇక‌, వైసీపీ …

Read More »

నిమ్మల ర్యాగింగ్ ను వైసీపీ తట్టుకోగలదా..?

మొన్నటిదాకా ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ చిన్న వేడుక జరిగినా… నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు… అంటూ డప్పులు కొడుతూ, టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఓ రేంజిలో అడుకున్నారు. సరే… ఏం చేద్దాం? రాజకీయాలు అన్నాక.. ఓ సారి మాట పడాల్సి వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు చిరుతలా లంఘించాలి. మొన్నటిదాకా ఈ విషయంలో బాల్ వైసీపీ కోర్టులో ఉంటే… ఇప్పుడు …

Read More »

బిగ్ బ్రేకింగ్: జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు

ఏపీలో ఇప్పుడు పెను కలకలమే రేపిన సాక్షి చర్చా కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా అమరావతిని వేశ్యల రాజధాని అంటూ జుగుత్సాకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని లోటస్ లో నివసించే కృష్ణంరాజు తనపై కేసు నమోదు కాగానే ఇల్లు వదిలి పారిపోయారు. నేరుగా విశాఖకు వెళ్లి అక్కడ ఆయన తలదాచుకున్నారు. ఈ కేసులో సాక్షి ఇన్ పుట్ ఎడిటర్, డీటేబ్ హోస్ట్ గా …

Read More »

హోం శాఖ రేవంత్ ద‌గ్గ‌రే.. కొత్త మంత్రుల‌కు ఏమిచ్చారంటే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల కింద‌ట త‌న కేబినెట్‌ను విస్త‌రించిన విష‌యం తెలిసిందే. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు స‌హా.. అనేక మందిని సంప్ర‌దించి, అధిష్టానంతో చ‌ర్చించిన త‌ర్వాత‌.. ముగ్గురంటే ముగ్గురికి మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. వీరిలో నూ ఇద్ద‌రు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఉన్నారు. వాస్త‌వానికి ఐదు నుంచి ఆరుగురికి అవ‌కాశం ఉన్నా.. కేవ‌లం ముగ్గురికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, వీరికి తాజాగా …

Read More »

యూపీఐ చెల్లింపులపై బాదుడు?…కేంద్రం క్లారిటీ ఇదే!

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా లెక్కలేనన్ని యూపీఐ యాప్ లు అందుబాటులోకి రావడంతో భారత్ లో మెజారిటీ జనం నగదుగా డబ్బు చెల్లించడం దాదాపుగా మానేశారు. ఈ పేమెంట్ యాప్ లలో దేనినో ఒకదాని ద్వారా వారు తమ చెల్లింపులు చేస్తున్నారు. ఈ తరహా పేమెంట్లలో భారత్ దూసుకుపోతోందని చెప్పక తప్పదు. కొందరైతే దాదాపుగా అన్ని యాప్ లను కూడా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ తరహా యూపీఐ పేమెంట్లపై చార్జీలు వేస్తారని ప్రచారం జరుగుతోంది. …

Read More »

పీఎస్సార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు

బాటీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేదింపులు, గ్రూప్- 1 మూల్యాంకనంలో అవకతవకల వ్యవహారాల్లో గత కొంత కాలం క్రితం అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన పీఎస్సార్ ఆంజనేయులుకు బుధవారం స్వల్ప ఊరట లభించింది. అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు పీఎస్సార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెరసి చాలా కాలం తర్వాత పీఎస్సార్ కు ఒకింత …

Read More »

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్: మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం తాలూకు నష్టాన్ని పూడ్చుకుంటూ…మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేయడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో హామీపై చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తల్లికి వందనం పథకంలో భాగంగా …

Read More »