రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. పరిస్థితులు, ప్రభావాలు ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునేలా చేస్తాయి. ముఖ్యంగా రాజకీయాలలో అవకాశం-అవసరం అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఏ చిన్న అవకాశం చిక్కినా.. పార్టీలు వదులుకునేందుకు ఛాన్స్ ఇవ్వవు. ఇదే.. కూటములు కట్టేందుకు.. పొత్తులు పెట్టేందుకు అవకాశం ఏర్పడేలా చేస్తుంది. తెలం గాణ విషయంపైనా తాజాగా ఇదే చర్చ తెరమీదికి వచ్చింది. ఏపీలో కూటమి కట్టిన బీజేపీ-జనసేన-టీడీపీలు సక్సెస్ అయ్యాయి. గత …
Read More »మా మంచి ఎమ్మెల్యే… రాజు గారి దూకుడు మామూలుగా లేదే..!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం మడకశిర. ఇక్కడి నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న టిడిపి యువ నాయకుడు ఎంఎస్ రాజు. ఈయన అసాధారణ రీతిలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఆయన సొంత నియోజకవర్గం సింగనమల. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఈక్వేషన్స్ కారణంగా ఆయనను చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పంపించారు. కూటమి హవాతో పాటు తనకున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం బలంతో ఎమ్మెస్ రాజు విజయం దక్కించుకున్నారు. అయితే ఆయన …
Read More »వార్తల్లోకి మాజీ జస్టిస్ చంద్రచూడ్.. ఏం జరిగింది?
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ డీవై చంద్రచూడ్ అకస్మాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. సుదీర్ఘకాలంగా న్యాయ వ్య వస్థలో ఉన్న చంద్రచూడ్ కుటుంబం ఎప్పుడూ.. ఇలా వార్తల్లోకి ఎక్కలేదు. పైగా.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విషయంలో ఇలా.. ఎప్పుడూ కూడా వార్తలు రాలేదు. విమర్శలు కూడా రాలేదు. కానీ, హిస్టరీలో ఫస్ట్ టైమ్ అన్నట్టుగా.. జస్టిస్ చంద్రచూడ్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోను.. న్యాయ వర్గాల్లోనూ …
Read More »తండ్రికి తగ్గ తనయుడు.. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే గ్రాఫ్ ఇదే ..!
ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. యువ నాయకుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన నేత. అనేక కష్టాలు ఎదుర్కొన్నారు . అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయనే గాలి భాను ప్రకాష్. గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన భాను.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత మౌనంగా ఎదగడమే ముఖ్యమని భావిస్తూ అదే పంథాలో …
Read More »దేశంలో బిజీయెస్ట్ సీఎం చంద్రబాబే.. !
దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు 28 మంది ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే, దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రిల పనితీరును అదేవిధంగా రోజు మొత్తంలో వారు చేస్తున్న పనులను అంచనా వేసిన ఢిల్లీకి చెందిన సంస్థ దేశవ్యాప్తంగా అత్యంత బిజీగా ఉండేటటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని స్పష్టం చేసింది. ఈ విషయంలో కొన్ని కారణాలను కూడా వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ లో నిర్వహించిన …
Read More »సౌత్లో ‘ఆపరేషన్ లోటస్’ రీజనేంటి?
దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్తో సంబంధం ఉన్న వారికి బీజేపీ అధ్యక్ష పీఠాలను అప్పగిస్తోంది. ఇది చిత్రం కాదు.. చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగా విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఉత్తరాది పైనే దృష్టి పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకు, అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునే విషయంపైనే దృష్టి సారించింది. అలాంటి ఒక్కసారిగా దక్షిణాదిపై మక్కువ చూపిస్తోంది. దీనికి కారణం.. …
Read More »వివేకా కేసును ఎవరు ఆపుతున్నారు?
వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని గత నాలుగు రోజులుగా ప్రస్తావిస్తున్నారు. 2019, మార్చి 16న జరిగిన ఈ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరు? అనేది ఇంకా సస్పెన్సులోనే ఉంది. అనేక విచారణలు, అనేక దర్యాప్తు సంస్థలు దీనిలో పాలుపంచుకున్నా.. ఏళ్ల తరబడి విచారణలు జరిగినా.. విచారణ పరిధి ఏపీ నుంచి తెలంగాణకు చేరినా.. ఈ కేసు …
Read More »తేడా కొడితే బీఆర్ఎస్లోకే.. ‘కొండా’ పెద్ద వ్యూహం?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొండా మురళి, మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహార శైలితో స్థానిక నాయకులు రగులుతున్నారు. ఈ ఇద్దరిపై అధిష్టానానికి పిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే రెండు సార్లు వీరిని విచారించిన అధిష్టానం.. గట్టిగానే సమాధానం చెప్పింది. స్థానికంగా అందరినీ కలుపుకొని పోవాలని సూచించింది. వివాదాలకు కడుదూరంగా ఉంటూ.. పార్టీని డెవలప్ చేయాలని కూడా …
Read More »ఉలిక్కిపడ్డ వైసీపీ.. ఒకేసారి 113 మందిపై కేసు!
ఎలాంటి కేసులు వచ్చినా.. ఎంత మందిని జైల్లోకి నెట్టిన బేఫికర్ అంటూ.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే.. కేసులు పెడతారా పెట్టుకోండి.. అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక సమయంలో అనూహ్య పరిస్థితి ఎదురైంది. వైసీపీకి చెందిన కీలక నాయకులు సహా, నియోజకవర్గ ఇంచార్జ్లుగా ఉన్నవారికి మొత్తంగా 113 మంది ఒకేసారి పోలీసులు నోటీసులు జారీ …
Read More »కార్యకర్తలు హడలిపోతున్నారు
“ఐదేళ్లు అధికారంలో ఉండగా.. కార్యకర్తలను పట్టించుకోలేకపోయాం. ఇప్పటి నుంచి వారికి ప్రాధాన్యం ఇస్తాం. జగన్ 2.0లో కార్యకర్తలే ప్రధానం. వారిని ఇక పై వదిలి పెట్టను.” ఇదీ.. ఈ ఏడాది ప్రారంభంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు. ఇక, అప్పటి నుంచి కార్యకర్తల కేంద్రంగా కొంత మేరకు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. కానీ, వారి సంతృప్తి ఎలా ఉన్నా.. వివాదాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో కార్యకర్తల తల్లిదండ్రులు.. వారిని బయటకు …
Read More »జనసేన ఎమ్మెల్యేల్లో ఎంత మార్పు..
కూటమి పార్టీల్లో కీలకమైన జనసేనలో నాయకులు చడీ చప్పుడు లేకుండా పనిచేసుకుంటున్నారు. పైకి ఎవరూ మీడియా ముందుకు రారు. సంచలన ప్రకటనలు కూడా చేయరు. అంతేకాదు.. ఏం చేసినా.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు క్రెడిట్ దక్కాలని కోరుకుంటున్నారు. దీంతో వారు ఒకరకంగా ఆదర్శంగాను.. మరో రకంగా.. పనిమంతులుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే.. ఆరణి శ్రీనివాసులు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే పేరు వచ్చింది. దీంతో పార్టీ ఆయనకు …
Read More »నిజమే!.. కోటం రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిందే!!
ఔను.. నిజమే.. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిందే!. టీడీసీ సానుభూతి పరుల నుంచి సీనియర్ల వరకు ఈ మాటే వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆదేశాలతో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో నాయకులు ప్రజలను కలుస్తున్నారు. అయితే.. కొందరు నాయకులు ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే.. మెజారిటీ నాయకులు చాలా కష్టంగా నిర్వహిస్తున్నారు. సమయం చూసుకుని.. ఓ గంటో రెండు గంటలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని మమ అనిపిస్తున్నారు. ఇంకొందరు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates