Political News

భ‌ర్త‌ల‌కు తోడుగా.. భార్యామ‌ణులు.. తెలంగాణ ఎన్నిక‌ల్లో కొత్త ట్రెండ్‌..!

భ‌ర్త‌ల‌కు తోడుగా భార్యామ‌ణులు కూడా ప్ర‌చారం చేసే ట్రెండ్ తెలంగాణ‌లో పెరిగింది. ఒక‌ప్పుడు .. ఏపీ వ‌రకే ప‌రిమిత‌మైన ఈ ట్రెండ్‌.. తాజా ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించింది. వాస్త‌వానికి తెలంగాణ‌లో మ‌హిళా చైత‌న్యం త‌క్కువ‌నే అంటారు. అందుకే.. ప్ర‌స్తుతం 2300 మంది పోటీలో ఉంటే.. వీరిలో 210 మంది మాత్రమే మ‌హిళా అభ్య‌ర్థులు ఉన్నారు. అంటే.. ఎంత త‌క్కువో అర్థ‌మ‌వుతుంది. ప‌దిశాతం మంది కూడా లేరు. అయితే.. ఇప్పుడు ప్ర‌చారంలో …

Read More »

టీడీపీ ఓట్ల కోసం కండువా క‌ప్పేసుకున్నారు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయ‌డం లేదు. ఈ విష‌యం అంద‌రికీతెలిసిందే. అలాగ‌ని.. ఏ పార్టీకీ బ‌హిరంగ మ‌ద్ద‌తు మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. ఇది కూడా తెలిసిందే. అయితే.. పేరు చెప్ప‌కుండానే.. ఈ టీడీపీ సానుకూల ఓట్ల కోసం.. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. చంద్ర‌బాబు అనుకూలంగా బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కులు ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. ఇక‌, కాంగ్రెస్ నేత‌లు కూడా …

Read More »

వీళ్లు అయోధ్య‌-వాళ్లు తిరుమ‌ల‌.. ఎవ‌రిని ఏమ‌నాలి?

రాజ‌కీయాల్లో ఏమైనా చేయొచ్చు.. ఏమైనా మాట్లాడొచ్చు.. అనే వారికి ఇవి మ‌చ్చుతున‌కలు. బీజేపీ నేత‌లు ప్రారంభించిన‌.. గుడియాత్ర‌ల వ్య‌వ‌హారం.. ఏపీ వర‌కు పాకిపోయింది. మ‌మ్మ‌ల్ని గెలిపించ‌డం.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నానికి అయ్యే ఖ‌ర్చు భ‌రించి.. ఉచితంగా రాముడి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని. కేంద్ర మంత్రి అమిత్‌షా.. మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో ప్రచారం చేశారు. హిందువుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, అమిత్ షానే కాదు.. యూపీ సీఎం యోగి …

Read More »

‘క్రైస్త‌వుడైన జ‌గ‌నే మ‌రోసారి సీఎం కావాలి’

“రాష్ట్రంలో మ‌రోసారి జ‌గ‌నే రావాలి. ఆయ‌న పాల‌న చాలా బాగుంది. క్రైస్త‌వుల పాల‌న‌లో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్ర‌జ‌లు ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారు. కాబ‌ట్టి క్రైస్త‌వుడైన జ‌గ‌న్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని మ‌న‌మంతా కోరుకుందాం. మాజీ మంత్రి క‌న్న‌బాబు వంటి వారు కూడా.. క్రైస్త‌వుడైన జ‌గ‌నే సీఎం కావాల‌ని కోరుకుంటున్నారు” -అని తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా …

Read More »

35 వేల పోలింగ్ కేంద్రాలు.. 3 లక్ష‌ల మంది సిబ్బంది!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నెల 30న 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఎన్నిక‌ల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాదు.. నిరంతరం.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఎన్నిక‌ల అధికారులు ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తున్నారు. ఎలక్షన్ ప్రిపరేషన్‌పై ఎన్నిక‌ల సంఘం నిశితంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత‌.. తెర‌మీద‌కు వ‌చ్చే …

Read More »

చంద్రబాబు బిజీ బిజీ

తొందరలోనే చంద్రబాబునాయుడు ఫుల్లు బిజీ అవ్వబోతున్నారు. దేశంలోని ప్రముఖ లాయర్లలో ఒకరైన సిద్ధార్ధలూథ్రా కొడుకు పెళ్ళి రిసెప్షన్ కు భువనేశ్వరితో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుని మళ్ళీ 29 రాత్రికి తిరుపతికి చేరుకుంటారు. 30వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం, సింహాచలం దేవస్ధానాలను కూడా దర్శించుకుంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన అయిపోయిన తర్వాత …

Read More »

కాంగ్రెస్ అభ్యర్ధులకు భరోసా ఇచ్చారా ?

పోలింగ్ మరో 48 గంటలుందనగా కాంగ్రెస్ అభ్యర్ధులకు అలర్ట్ మెసేజెస్ అందుతున్నాయట. ఇంతకీ అందులో ఏముందంటే మరో 48 గంటలు జాగ్రత్తగా ఉండండి, పోల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుంటే గెలుపు మీదే అని మెసేజెస్ లో ఉన్నట్లు సమాచారం. చివరినిముషంలో ఏమరుపాటు వద్దని చాలా అలర్టుగా ఉండండని వస్తున్న సమాచారం అగ్రనేతల నుండి కాదు. పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు నుండి. హైదరాబాద్ లోని ఒక హోటల్లో సునీల్ …

Read More »

నా దగ్గరకు రాకూడదు అని కెసిఆర్ కి ఎవరో చెప్పారు: మోడీ

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను హాజరైన బహిరంగ సభల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్యపై మాత్రం పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మోడీ నోటి నుంచి వచ్చిన ఆ మాటలో నిజం ఎంతన్న ప్రశ్నతో పాటు.. మోడీ చేసిన సదరు వ్యాఖ్యపై సీఎం కేసీఆర్ తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాల్సిందేనని స్పష్టం …

Read More »

20 ఏళ్ల ప్ర‌త్య‌ర్థులు.. మ‌ల్‌రెడ్డి వ‌ర్సెస్ మంచి రెడ్డి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనేక చిత్ర‌మైన సంగ‌తులు వెలుగు చూస్తున్నాయి. ప‌దే ప‌దే ఓడిపోతున్నా.. అలుపెర‌గ‌కుండాపోటీ చేస్తున్న‌వారు కొంద‌రైతే.. ఒకే అభ్య‌ర్థిపై గ‌త 20 ఇర‌వై ఏళ్లు త‌ల‌ప‌డుతున్న నాయ‌కులు మ‌రికొంద‌రు ఉన్నారు. ఇలాంటివారిలో ఇప్పుడు ఎక్కువ‌గా ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తున్న నాయ‌కులు మంచిరెడ్డి, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి. వీరిద్ద‌రూ 2004 నుంచి ప్రత్య‌ర్తులుగా చెరో పార్టీ ప‌క్షాన పోటీ చేయ‌డం.. ఒక‌రు గెల‌వ‌డం సాధార‌ణంగా మారింది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి …

Read More »

తెలంగాణ ఎన్నిక‌లు.. ఆ విష‌యాలు మ‌రిచారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలూ అనేక ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అనేక హామీలు గుప్పించాయి. మేనిఫెస్టోల్లో ఉచితాల‌ను నూరిపోశాయి. నువ్వు ఒక‌టిస్తే..నే నాలుగిస్తా! అన్న చందంగా నాయ‌కులు, పార్టీలు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. మొత్తానికి ఎన్నిక‌ల క్ర‌తువు కూడా.. మ‌రో రెండు రోజ‌ల్లో జ‌ర‌గ‌నున్న పోలింగ్ ప్ర‌క్రియ‌తో ప‌రిస‌మాప్తం కానుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. రెండు కీల‌క విష‌యాల‌ను ఇప్పుడు …

Read More »

అంబ‌టికి భారీ సెగ త‌గులుతోంది

ఏపీ వైసీపీ నాయ‌కుడు, మంత్రి అంబ‌టి రాంబాబుకు భారీ సెగ త‌గులుతోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న కు జెండా మోసి.. ఆయ‌న గెలుపులో పాలు పంచుకున్న నాయ‌కులే .. ఇప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. ఆయ‌న వ‌ద్దు.. అని తేల్చి చెప్పేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు మ‌రో 100 రోజులు ఉండ‌గానే.. అంబ‌టిపై తీవ్ర సెగ‌లు క‌క్కుతుండ‌డంతో అధిష్టానం అలెర్ట్ అయింది. వెంట‌నే వారిని బుజ్జ‌గించాల‌ని పై స్థాయి …

Read More »

పూజ‌లు-ప్రార్థ‌న‌లు-ప్ర‌చారాలు : మోడీ స‌మ‌గ్ర రూపం!

పైకి ఏమీ చెప్ప‌రు. వ్యూహం ఏంటో పెద‌వి దాట నివ్వ‌రు. కానీ, ప‌ని మాత్రం జ‌రిగిపోతుంది. అంతా ప‌క్కా స్కెచ్చే.. ప‌క్కా ప్ర‌ణాళికే. ఎక్క‌డా తేడారాదు. తేడా లేదు. ఇదీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్లాన్ అంటే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వ‌చ్చిన ఆయ‌న తిరుమ‌ల‌కు వెళ్తార‌ని ఎవ‌రైనా అనుకున్నారా? అస‌లు నిముషం కూడా తీరిక‌లేని ఈ స‌మ‌యంలో అందునా.. అధికారం లోకి రావాలని ల‌క్ష్యంగా …

Read More »