ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టుగా పేర్కొనే బనకచర్ల విషయంలో భారీ తేడా కొట్టింది. కర్నూలు జిల్లా బనకచర్ల ప్రాంతంలో భారీప్రాజెక్టును నిర్మించడం ద్వారా పోలవరం నుంచి నీటిని అక్కడకు తరలించి.. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు సాగు, తాగునీటిని అందించాలని సీఎం చంద్రబాబు తలపోశారు. ఈ ప్రాజెక్టును ఆయన `సీమకు గేమ్ ఛేంజర్`గా కూడా పేర్కొన్నారు. దీనిపై అనేక రూపాల్లో కసరత్తు కూడా చేశారు. కేంద్రానికి కూడా పలు …
Read More »రూపాయి ఖర్చు లేకుండా గెలవగలరా బాబూ
వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. అయితే.. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుంద న్నది ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో రూపాయే.. పరమాత్మ. రూపాయే ఓటరును కదిలించే ఆత్మ!!. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు ఏకంగా వచ్చే ఎన్నికల నాటికి రూపాయి కూడా పంచకుండానే ప్రజల మనసులు చూరగొనాలని.. ఎన్నిక ల్లో విజయం దక్కించుకోవాలని సూచించారు. సాధారణంగా ఎన్నికల్లో ఓటర్ల నాడిని పసిగట్టే ప్రక్రియలో రూపాయి …
Read More »విధేయత-విశ్వసనీయత- ‘మాధవుడి’కే కమల సారథ్యం!
ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠానికి ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు? సామాజికవర్గ సమీకరణకు ప్రాధాన్యం ఇస్తారా? లేక డబ్బులున్న వారికే కట్టబెడతారా? అనే సుదీర్ఘ చర్చలకు తెర దించుతూ .. బీజేపీ అధిష్టానం.. ఏపీ బీజేపీ సారథిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్(పీవీఎన్ మాధవ్)కు అవకాశం ఇచ్చింది. అయితే.. యథావిధిగా ఎన్నికల క్రతువు అయితే జరుగుతుంది. కానీ, ఇది లాంఛన ప్రాయమే. ఉత్తరాంధ్రలోని విశాఖకు చెందిన మాధవ్ ఎమ్మెల్సీగా …
Read More »మీకో దండం..బీజేపీకి రాజా సింగ్ గుడ్ బై
బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజా సింగ్ కు టికెట్ కూడా ఇవ్వరేమో అనుకున్నప్పటికీ…చివరకు ఆయనవైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆ తర్వాత కూడా బీజేపీపై రాజా సింగ్ సందర్భానుసారంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దానికితోడు బీజేపీ చీఫ్ పదవికి ఎన్నిక నిర్వహించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. అయితే, …
Read More »జగన్ కు ఆ దమ్ము లేదన్న షర్మిల
తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్భానుసారంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లని అన్నయ్యపై షర్మిల వేసిన సెటైర్లు వైరల్ గా కూడా మారాయి. మోదీకి జగన్ దత్తపుత్రుడు అని పలుమార్లు విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి మోదీని పల్లెత్తు మాట అనే దమ్ము, ధైర్యం జగన్ కు లేవని షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం …
Read More »అనూహ్యం..ఏపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ వీరే
ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఏ నేతలకు దక్కబోతోందని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఏపీలో మరోసారి దగ్గుబాటి పురంధేశ్వరికే పగ్గాలు అప్పగించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో చిన్నమ్మకే మరో చాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై …
Read More »చంద్రబాబు విశ్వరూపం.. అప్పుడే తెలుస్తుందా ..!
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని జోడు ఎద్దుల మాదిరిగా ఈ రెండిటిని ముందుకు నడిపిస్తున్నామని చెబుతున్నారు. సాధారణంగా ఏడాది పాలన తర్వాత ప్రజల్లో ఆకాంక్షలు ఉంటాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయలేదు అనే మాట ఒకవైపు వినిపిస్తున్నా.. మరోవైపు ఏడాదికాలెంలో కొన్ని మైనస్లు ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. …
Read More »‘పలాస’ లో ఏం జరుగుతుంది శిరీషగారూ?
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ హాట్ టాపిక్కే!. ఆ నియోజకవర్గంలో అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు ఎన్నికలకు ముందు కన్నా ఎక్కువగా పేలుతున్నాయి. అదే పలాస నియోజకవర్గం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గౌతు శిరీష విజయం దక్కించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గౌత శిరీష గతంలో ఓడిపోయినా.. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి హవాతోపాటు.. ప్రజల్లో …
Read More »బాబుకు తమ్ముళ్ల తలనొప్పులు మామూలుగా లేవుగా!
వైసీపీ హయాంలో మైనింగ్ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆనాడు మైనింగ్ శాఖ ఎండీగా పనిచేసిన అఖిల భారత సర్వీసులకు చెందిన వెంకట రెడ్డిని జైల్లో పెట్టారు. ఇప్పటికీ ఆయన బయటకు రాలేదు. మరోవైపు.. అప్పటి అక్రమాలపై ప్రభుత్వం నియమించిన అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు కనిపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. పైకి చంద్రబాబు ఎన్ని …
Read More »కూటమి ఎఫెక్ట్: ఏపీలో పర్యటిస్తున్న బీహార్ నేతలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలా విజయం దక్కించుకుంది? ఎంత ఒబ్బిడిగా ముందుకు సాగింది? ఎలాంటి పంథా అనుసరించింది? అనేవి ఆసక్తికర విషయాలు. ఎందుకంటే భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నాయకులు కలిసి కూటమిగా ఏర్పడి విజయం దక్కించుకున్నారు. ఇది ఒక ప్రయోగమని చెప్పాలి. అంతేకాదు భవిష్యత్తులో కూటమిగా ఏర్పడే పార్టీలకు ఇది ఒక కేసు స్టడీగా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీహార్ కు చెందిన కొంతమంది నాయకులు …
Read More »“మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారూ..“
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్-టీడీపీ యువ నాయకుడు, మంత్రినారా లోకేష్ మధ్య రాజకీయ ఫైట్ తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఎక్స్ వేదికగా జగన్ చేసే కామెంట్లకు, విమర్శలకు నారా లోకేష్ స్ట్రాంగ్ రిప్లయ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ చేసిన విమర్శలపై లోకేష్ స్పందిస్తూ.. “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారూ..“ అని సంచలన వ్యాఖ్య చేశారు. “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ మోహన్ రెడ్డి …
Read More »ఎర్రబెల్లి గారూ… ఎక్కడున్నారండీ?
తెలుగు నేల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేతల జాబితాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి కేంద్రంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాలు సాగిస్తున్న ఎర్రబెల్లి… 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా కనిపించడమే లేదు. ప్రస్తుతం వరంగల్ జిల్లా అధికార కాంగ్రెస్ లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక జట్టుగా, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates