Political News

టీడీపీ-జ‌న‌సేన పొత్తును కాపు నాయ‌కులు యాక్సెప్ట్ చేయ‌లేక పోతున్నారా?

ఏపీలో వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల‌కుండా చూస్తామ‌ని చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో కాపు నాయ‌కులు ఈ పొత్తు ను అంగీక‌రించ‌లేక పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు అయితే ఖ‌రారైంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం కూడా ఖాయ‌మై పోయింది. ఇక‌, ఇప్పుడు మిగిలింది.. సీట్ల పంప‌కాలు మాత్ర‌మే. ఈ ద‌శ‌కు …

Read More »

2024 ఎల‌క్ష‌న్స్‌: చంద్ర‌బాబు ధైర్యం ఇదే… !

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి తీరుతుంద‌ని.. ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌కు ఇటీవ‌ల కాలంలో మ‌రింత ప‌దును పెరిగింది. అది కూడా.. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రింత‌గా చంద్ర‌బాబులో ఆత్మ విశ్వాసం పుంజుకుంది. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు ధైర్యానికి కార‌ణాలు తెలుస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌రిగిన …

Read More »

తెలంగాణ ఎఫెక్ట్‌.. ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు దారెటు?

ఔను.. మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీలో అన్ని ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. తెలంగాణ‌లో అయినా.. ఏపీలో అయినా.. మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పురుష ఓట‌ర్ల‌తో పొలిస్తే.. ఎక్కువ గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హిళ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని.. ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్నారు. అమ‌లు కూడా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. మ‌హిళ‌లు అధికార పార్టీల‌ను ఆద‌రించ‌లేదు. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో త‌ప్ప‌.. …

Read More »

ఎంపీ రేసు.. ఈటల ఇక్కడ, చీకోటి అక్కడ?

లోక్ సభ ఎన్నికలు మరోసారి తెలంగాణలో పొలిటికల్ వార్ కు తెరలేపుతున్నాయి. ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో బరిలో దించే అభ్యర్థులపై ఆయా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో సీట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్యంత కీలకమైన మల్కాజిగిరి స్థానం …

Read More »

తెలంగాణ‌లో ఫెయిల్‌.. ఏపీలో స‌క్సెస్ అయ్యేనా?

తెలంగాణలో ప్ర‌భుత్వం మారింది. త‌మ‌నే గెలిపిస్తార‌ని.. తాము చేసిన అబివృద్ధి దేశంలో ఎక్క‌డా ఎవ‌రూ చేయ‌డం లేద‌ని.. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని. ప‌దే ప‌దే చెప్పుకొన్న కేసీఆర్‌ను ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టేశారు. ఎన్నో సెంటిమెంట్లు ప్లే చేసినా.. వాటిని కూడా ప్ర‌జ‌లు ప‌ట్టించుకో లేదు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. రెండు అంశాల‌ను కీల‌కంగా తీసుకున్న కేసీఆర్‌.. అవైనా త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని అనుకున్నారు. అయితే.. అవి కూడా ఫ‌లించ‌లేదు. …

Read More »

ష‌ర్మిల ఎఫెక్ట్‌.. టీడీపీకి లాభ‌మెంత‌…!

ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిగా మారాయి. ఇప్ప‌టికే వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ రాజ‌కీయాలు సెగ‌లు పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌మ‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను టీడీపీ అక్కున చేర్చుకుంటోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే జ‌న‌సేన‌తో టీడీపీ జ‌త‌క‌ట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలూ కూడా క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. ఇక‌, ఇప్పుడుమ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఆది నుంచి టీడీపీ వ్య‌తిరేకిస్తున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి …

Read More »

కాకినాడ‌లో పొలిటిక‌ల్ సునామీ.. జంపింగులు రెడీ!

స‌ముద్ర తీరం వెంబ‌డి ఉన్న కాకినాడలో రాజ‌కీయ సునామీ ప్రారంభ‌మైంది. అధికార పార్టీ వైసీపీ టికెట్ పై గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ముగ్గురు కీల‌క ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇత‌ర పార్టీల్లో చేరేందుకు త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. దీనికి కార‌ణం.. వారి గ్రాఫ్‌, స‌ర్వేల ఆధారంగా.. వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి టికెట్ కేటాయించేం దుకు నిరాక‌రించ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఈ జాబితాలో జూనియ‌ర్లు, …

Read More »

ఎవరొచ్చినా చేర్చుకుందాం.. తగ్గి పనిచేద్దాం

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు తగ్గాలని పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. అదేంటీ పార్టీ విజయం కోసం రెచ్చిపోయి పని చేయాలని చెప్పాలే కానీ తగ్గమని చెప్పడమేంటని అనుకుంటున్నారు. దీని వెనుక బాబు వ్యూహం ఉంది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడం కోసం అధికార వైసీపీ సహా ఇతర పార్టీల నుంచి ఎవరొచ్చినా సరే కండువా కప్పేయాల్సిందేనని బాబు …

Read More »

బొబ్బిలిలో చిన్న‌బోతున్న‌చిన అప్ప‌ల‌నాయుడు!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం బొబ్బిలిలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్ప‌ల‌నాయుడుపై సొంత పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు ఎక్కు పెడుతున్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీలో క్షేత్ర‌స్తాయి నాయ‌కులు ఎమ్మెల్యేపై ఆగ్ర‌హంతో పార్టీకి రాం రాం చెబుతున్నారు. ఇటీవ‌ల‌ నియోజకవర్గ పరిధిలోని రామభద్రపురం నుంచి పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరిలో ఇద్దరు సర్పంచులు కూడా ఉండటంతో ఎమ్మెల్యే శంబంగి అలెర్ట్ అయ్యారు. జ‌నాల‌తో క‌ల‌వ‌కే.. …

Read More »

‘2019లో మ‌నం చాలా పెద్ద తప్పు చేశాం’

Mekapati

“2019లో వైసీపీ కోసం కాదు.. జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఇలా చేసి మ‌నం చాలా పెద్ద త‌ప్పు చేశాం“ అని వైసీపీ నుంచి కొన్నాళ్ల కింద‌ట స‌స్పెన్ష‌న్కు గురైన రెబ‌ల్ ఎమ్మెల్యే, ఇటీవ‌ల టీడీపీలో చేరిన మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈయ‌న నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కడపలో ప‌ర్య‌టించిన మేక‌పాటి.. మాజీ మంత్రి …

Read More »

వార్నింగ్ ఇస్తున్న రేవంత్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేస్తే వదిలేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్.. వివిధ విభాగాల్లో సమీక్షలపై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ మాత్రం తప్పు దొరికినా, ఎవరైనా తేడాగా ప్రవర్తించినా రేవంత్ మండిపడుతున్నారని తెలిసింది. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసే ఏ అధికారినైనా వదిలి పెట్టేదే లేదని చెప్పారు. సీఎం అయిన …

Read More »

వైసీపీకి జ్యోతుల చంటిబాబు గుడ్ బై?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని టీడీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే . జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఆ క్రమంలోనే 11 మంది సిట్టింగ్ల స్థానాలను మార్చారని టిడిపి నేతలు అంటున్నారు. మరో 70 మంది వరకు సిట్టింగ్లను మార్చే యోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ రాని వైసీపీ నేతలు పక్క పార్టీ వైపు చూస్తున్నారని టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే …

Read More »