Political News

దేశంలో ఫస్ట్ టైమ్: మావోయిస్టుల ఆయుధ కర్మాగారం స్వాధీనం!

మావోయిస్టులు అనగానే సహజంగా పోలీసు స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను తీసుకువెళ్తారని తెలుసు. లేదా ఒకేసారి గుంపుగా వచ్చి అధికారుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటారన్న వార్తలు కూడా కొన్ని సార్లు వచ్చాయి. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ నేపథ్యത്തിൽ వందల మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. మరికొందరు తెగించి పోరాడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో లొంగిపోయిన అనంతరం మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు …

Read More »

గుంతల రోడ్లే మేలంటోన్న బీజేపీ ఎంపీ

ఒక సగటు మనిషి చేసే కామెంట్లకు…బాధ్యత గల ప్రజాప్రతినిధులు చేసే కామెంట్లకు చాలా తేడా ఉంటుంది..ఉండాలి కూడా. కానీ, ఈ మధ్యకాలంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే…వారికన్నా కామన్ మ్యాన్ 100 రెట్లు నయం అనిపిస్తుంది. చదువూ లేదు…సంధ్యా లేదూ…అనే టైప్ పొలిటిషియన్లు టంగ్ స్లిప్ అయ్యారంటే పోనీలే అనుకోవచ్చు. కానీ, ఉన్నత విద్యావంతులు అయిన రాజకీయ నాయకులు కూడా నాలుక కరుచుకోవడం …

Read More »

వింత వ్యాఖ్యలతో ఆశ్చర్యానికి గురి చేసిన జగన్

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రోసారి వింత వ్యాఖ్య‌లు చేశారు. “అవును.. జ‌గ‌న‌న్న ఉంటే ఇలా జ‌రిగేది కాదు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికిఆయ‌న ఏ కాంటెస్టులో ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దుకానీ.. దీనికి రైతులు కొంద‌రు న‌వ్వుకున్నారు. ఇటీవ‌ల గూగుల్ డేటా కేంద్రంపైనా ఆయ‌న ఇలానే వ్యాఖ్యానించి సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌కు గుర‌య్యారు. తాజాగా కృష్ణాజిల్లాలో మొంథా తుఫాను ప్ర‌భావంతో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారిని …

Read More »

లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!

లండ‌న్ పర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం.. కీల‌క భేటీ నిర్వ‌హించారు. లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న‌ర్ (ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారి)తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంట‌ల‌కుపైగా సాగిన ఈ బేటీలో ప‌లు కీల‌క విష‌యాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించారు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా విక్ర‌మ్ దొరైస్వామి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌ను త‌ను విడిది చేస్తున్న హోట‌ల్‌కు పిలిపించుకున్న సీఎం చంద్ర‌బాబు.. అనేక విష‌యాల‌పై చ‌ర్చించారు. …

Read More »

రహదారుల నాణ్యత నేనే స్వయంగా చెక్ చేస్తా: పవన్

‘రహదారుల నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలి. నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్ళి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదు తనిఖీ చేస్తాము. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దు… ‘ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. సాస్కి నిధుల వినియోగించే ప్రణాళికపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన ఈ …

Read More »

లోకేశ్ దర్బార్..అర కిలోమీటరు క్యూ!

ప్రజా ప్రతినిధి…అంటే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలు ఎన్నుకున్న నేత. తమ నియోజకవర్గం నుంచి గెలిపించి శాసన సభకు పంపితే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి ఆ నేతకు ఓటేస్తారు. అసెంబ్లీలో కావచ్చు…బయట కావచ్చు…తమ ప్రాంత సమస్యలు తీరుస్తారని ప్రజలు నమ్మి వారిని గెలిపిస్తుంటారు. కానీ, చాలామంది ఎమ్మెల్యేలు గెలవగానే ప్రజల సమస్యలు పట్టించుకోవడం మానేస్తారు. ఇక, ఆ ఎమ్మెల్యే మంత్రి కూడా అయితే చాలా బిజీ అయిపోయి..ప్రజలతో …

Read More »

అజారుద్దీన్‌కి ఏమేమి శాఖలు ఇచ్చారంటే!

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్‌ గత నెల 31న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బెర్త్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పట్లో అజారుద్దీన్‌కు హోం శాఖ కట్టబోతున్నారనే ప్రచారం బలంగా సాగింది. ప్రస్తుతం హోం శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటం, జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు …

Read More »

వైసీపీ బలోపేతం.. అదే అసలు సమస్య..!

సంస్థాగతంగా పార్టీలను బలోపేతం చేసుకోవడం అనేది కీలక పార్టీలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకూ అత్యంత అవసరం. ఈ విషయంలో రెండో మాటేలేదు. గతంలో కంటే ఇప్పుడు వీక్‌గా మారిందన్న వాదన వినిపిస్తున్న వైసీపీ ఈ విషయంపై దృష్టి పెట్టింది. తరచుగా పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ సంస్థాగతంగా (లోకల్) పార్టీని బలోపేతం చేస్తామ‌ని చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలు, మండలాలు, గ్రామీణ స్థాయిలో నాయకులకు పదవులు ఇచ్చి …

Read More »

పవన్ ఏఐ ప్లాన్ పని చేసింది!

అటవీ పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలలో మనుషులు, జంతువుల మధ్య సమన్వయం ఉండడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఏనుగులు గ్రామాలలోకి వచ్చి పంట నష్టం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలా ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇచ్చింది. అంతటితో ఆగని …

Read More »

బీఆర్ఎస్ ‘హైడ్రా’ బాణం ఫలితాన్నిస్తుందా?

తరాలు మారాయి…రాజకీయాలు మారాయి…ఎన్నికల తీరు మారింది…ఎన్నికలలో నేతల ప్రలోభాలు..ఓటర్ల లాభాల లెక్కలూ మారాయి…అదే విధంగా ఎన్నికల ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తున్న రాజకీయ నాయకులు…ప్రత్యర్థులపై విమర్శలు సంధించేందుకు వినూత్న ప్రచారానికి తెర తీస్తున్నారు. ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వినూత్న ప్రయోగం వైరల్ గా మారింది. మాజీ ఐటీ శాఖా …

Read More »

ప్రతిపక్షం కోసం జగన్ ఉపయోగం లేని పోరాటం

వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మొండిపట్టు పట్టిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని హోదా కోసం జగన్ ఉపయోగం లేని పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని ఎంతమంది చెబుతున్నా జగన్ మాత్రం వినడం లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నారు. కానీ, 151 …

Read More »

ఇలా వెళ్లారు.. అలా 20 వేల కోట్ల పెట్టుబ‌డి తెచ్చారు!

రాష్ట్రానికి పెట్టుబ‌డుల వేటలో ఉన్న సీఎం చంద్ర‌బాబు మ‌రో అద్భుతం సాధించార‌నే చెప్పాలి. ఆయ‌న ప్ర‌స్తుతం లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లోనూ పెట్టుబ‌డులే కీల‌కంగా ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా 20 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులను దూసుకొచ్చారు. ఒక్క చిన్న ప్ర‌య‌త్నంతో చంద్ర‌బాబు ఈ విజ‌యం సాధించారు. ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు హిందూజా గ్రూప్ ముందుకు వ‌చ్చింది. …

Read More »