Political News

పొలిటిక‌ల్ పోరులో జ‌న‌సేన వెనుక‌బ‌డిందా?

పొలిటిక‌ల్ మీట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన వెనుక‌బ‌డిందా? గ‌డిచిన వారం రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పుంజుకునేందుకు ఇత‌ర ప‌క్షాలు ప్ర‌య‌త్నించిన రీతిలో ప‌వ‌న్ ప్ర‌య‌త్నించ‌లేదా? పైగా మిత్ర ప‌క్షం బీజేపీతోనూ ఆయ‌న క‌లివిడిగా ఉండ‌లేక పోతున్నారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లను టీడీపీ, బీజేపీలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డంతోపాటు.. …

Read More »

సంకేతాలు వ‌చ్చేశాయ్‌.. మాగంటి లైన్ క్లియ‌ర్‌ ?

ఏలూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత‌గా చ‌క్రం తిప్పుతున్న మాజీ ఎంపీ.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, విస్తృత ప‌రిచ‌యాలు ఉన్న మాగంటి కుటుంబంలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారిపోయా యి. ఆయ‌న సైకిల్ దిగుతున్నార‌నే ప్ర‌చారం ఇటీవ‌ల కాలంలో ఊపందుకున్నా.. అలాంటివ‌న్నీ.. బూట‌క‌మ‌ని, వెబ్ మీడియాకు ప‌నీపాటా లేకుండా రాత‌లు రాస్తోంద‌ని ఈస‌డించుకున్న టీడీపీలోని ఓ వ‌ర్గం.. తాజాగా వెలువడుతున్న సంకేతాల‌తో షాక్‌కు గుర‌వుతోంది. అజాత శ‌తృవుగా పేరు తెచ్చుకున్న మాగంటి …

Read More »

చంద్రబాబు అడుగుజాడల్లో జగన్ .. గుణపాఠం నేర్చుకోలేదా ?

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే నడుస్తున్నాడా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు చేసిన దానికి జగన్ ఇపుడు చేస్తున్న దానికి కాస్త తేడా ఉన్నా మొత్తం మీద రిజల్టయితే ఒకటే. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ. అదేనండి టిడిపి నేతలను వైసిపిలోకి చేర్చుకునే విషయం గురించే ఇదంతా. నిజానికి టిడిపి నేతలను వైసిపిలో చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు ఎంతమాత్రం లేదనే …

Read More »

మేం టీఆర్ఎస్ లా కాదు…హరీశ్ కు బాలినేని కౌంటర్

కేంద్రం చేపట్టిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విద్యుత్ సంస్కరణలకు ఏపీ వంటి కొన్ని రాష్ట్రాలు సుముఖంగా ఉండగా తెలంగాణతోపాటు మరి కొన్ని రాష్ట్రాలు విముఖంగా ఉన్నాయి. ఆ సంస్కరణలకు అనుగుణంగా ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకుగాను స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన …

Read More »

బీజేపీది బ‌లుపా? వాపా?

రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేసిన ప్ర‌య‌త్నంలో ఒక అడుగు ముందుకు ప‌డిందా? ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీలో నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. మాట్లాడ‌డం లేదు.. ఎవ‌రికి వారే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అన్న విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డిందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. సోము వీర్రాజు పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, నేత‌ల‌ను బుజ్జ‌గించ‌డం, …

Read More »

‘జగన్ వ్యక్తిగత కోపాన్ని తీర్చుకుంటున్నాడు’

రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక చీకటి అజెండా అమలవుతోందా ? ఏమో చంద్రబాబునాయుడు చేసిన తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా నేతలతో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాలపై ఓ అజెండా ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ మండిపోయారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరిపైనో కోపముంటే… దానికోసం వ్యవస్ధలను నిర్వీర్యం చేయటం, ఆలయాలపై దాడులు చేయటం సరికాదంటు హితవుపలికారు. కింజారపు …

Read More »

పార్టీ నేతలకు భారీ టార్గెట్ ఇచ్చేసిన కేటీఆర్

దేశమంతా కరోనా ఒకవైపు.. మరోవైపు బాలీవుడ్ డ్రగ్స్ రచ్చ భారీగా నడుస్తున్న వేళ.. తెలంగాణలో అదనంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి ఎన్నికతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ఎన్నికలతో పాటు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా వచ్చే ఎన్నికలన్నింటిలోనూ విజయం తమ సొంతమయ్యేందుకు వీలుగా టీఆర్ఎస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. పట్టభద్రుల ఎన్నికలు గతానికి మించి పోటాపోటీగా …

Read More »

రాబోయే రోజుల్లో రచ్చ ఎంతో చెప్పేసిన ట్రంప్

తొలిసారి అమెరికన్లు రచ్చ రాజకీయాల్ని చూడబోతున్నారా? లోపల ఎలా చచ్చినా పైకి మాత్రం హుందాగా తమ రాజకీయాలు ఉన్నట్లుగా కలరింగ్ ఇవ్వటం మామూలే. కాకుంటే.. మనకు మాదిరి పోలింగ్ బూతుల్ని స్వాధీనం చేసుకోవటం.. తుపాకులతో హల్ చల్ చేయటం.. రక్తం వచ్చేట్లు కొట్టుకోవటం.. కత్తులతో స్వైర విహారం చేయటం.. బాంబులు విసురుకోవటం లాంటివి చూడం. కానీ.. ఈసారి అలాంటివి కాకుండా.. కొత్త తరహా రచ్చలకు కేరాఫ్ అడ్రస్ గా అమెరికా …

Read More »

తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు

కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా పలు రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో బార్లు, పబ్బులు, క్లబ్బులు వంటివి మూతబడ్డాయి. అన్ లాక్ లో భాగంగా కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని కొన్ని రాష్ట్రాలు కేసుల తీవ్రతను బట్టి బార్లు, క్లబ్బులు, పబ్బులు తెరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ త్వరలోనే బార్లను బార్లా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. …

Read More »

బాబుకు స‌వాలుగా మారిన పొన్నూరు రాజ‌కీయం.. రీజ‌నేంటంటే!

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండ‌వ‌నే విష‌యం తెలిసిందే. ఎప్పుడు ఎలా మార‌తాయో.. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్ప‌డ‌మూ క‌ష్ట‌మే. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి టీడీపీకి చెందిన కీల‌క‌మైన నాయ‌కుడి వ‌ద్ద క‌నిపిస్తోంద‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం.. టీడీపీకి కంచుకోట‌. ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి నుంచి నేటి న‌రేంద్ర కుమార్ వ‌ర‌కు టీడీపీకి వెన్నుద‌న్నుగా నిలిచారు. వ‌రుస విజ‌యాల‌తో ఇక్క‌డ మ‌రోపార్టీ ఊసు, …

Read More »

భారతీయులను ముద్దాడుతున్న బిడెన్

రాబోయే నవంబర్ 3వ తేదీన జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓట్లే కీలకమవబోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భారతీయ అమెరికన్లపై డెమొక్రటిక్ అభ్యర్ధి గా అధ్యక్షునిగా పోటి చేస్తున్న జో బిడెన్ మాటలు వింటే భారతీయుల ఓట్లకు గాలం వేస్తున్నట్లే అనిపిస్తోంది. జో బిడెన్ మాట్లాడుతూ అమెరికా ఆర్ధికాభివృద్ధికి భారతీయ అమెరికన్ల కృషి ఎంతో ఉందని చెప్పారు. అధ్యక్ష …

Read More »

మోడీ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పేశారు

సెలవు రోజుల్లోనూ పని చేయటం.. విదేశీ ప్రయాణాలు చేసే వేళలో.. ఉదయం సమావేశాల్లోనూ.. రాత్రిళ్లు విమానాల్లోనూ నిద్రపోయే అలవాటున్న మోడీకి అంతటి శక్తి ఎలా వస్తుంది? ఆయన ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లుగా కనిపించరు. అంత ఫిట్ గా ఎలా ఉంటారు? అన్న ప్రశ్న చాలామందిలో వినిపిస్తూ ఉంటుంది. తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ ను చెప్పేశారు ప్రధాని మోడీ. తాజాగా పలువురు ఫిట్ నెస్ నిపుణులు..క్రీడాకారులతో కలిసి వీడియో …

Read More »