Political News

ఇంతకీ పవన్ శతృవులెవరు?

తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకమాటన్నారు. అదేమిటంటే వైసీపీని ఓడించటానికి తన శతృవులతో కూడా కలుస్తానని. ప్రస్తుతం ఏపీ రాజకీయ పార్టీలను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని మాత్రమే పవన్ శతృవుగా భావిస్తున్నారు. మరి జగన్ ని ఓడించటానికి అవసరమైతే శతృవుతో కూడా చేతులు కలుపుతానని అనటం ఏమిటి ? పవన్ కు జగన్ కాకుండా ఇంకా శతృవులున్నారా ? ఇపుడీ విషయంపైనే చర్చలు మొదలయ్యాయి. …

Read More »

జగన్.. లిక్కర్ కింగ: కేంద్ర మంత్రి

రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర‌స్థాయిలో నిప్పు లు చెరిగారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన జగన్‌కు జీఎస్‌టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా …

Read More »

కేసీఆర్‌ రాజ‌కీయం ఔట్: అమిత్ షా

తెలంగాణలోని మునుగోడు అభివృద్ధికి మోడీ సర్కారు కట్టుబడి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ సమరభేరిలో పాల్గొన్న అమిత్షా.. ఇటీవ‌ల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కాషాయ కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజగోపాల్‌రెడ్డిబీజేపీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదే నాంది అని వివరించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ వచ్చి తీరుతుందని ఉద్ఘాటించారు. …

Read More »

రామోజీతో భేటీ.. జూనియ‌ర్‌తో డిన్న‌ర్‌..

తెలంగాణ‌లోని కీల‌క‌మైన మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి.. నిర్వ‌హించి సభ నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో భేటీ అవ్వాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మునుగోడు సభ ముగించుకున్న అమిత్‌షా కాసేపట్లో రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లారు. ఫిల్మ్‌సిటీలో రామోజీరావుతో అమిత్‌షా భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీనేనని బీజేపీ చెబుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో …

Read More »

జగన్ భయపడేది ఒక్క నరేంద్ర మోడీకి మాత్రమే

Somu Veerraju

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో నివ్వెర పోయేలా రాజ‌కీయాలు మార‌తాయ‌ని.. అన్నారు. తాజాగా ఆయ‌న ఏపీలోని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్‌ను గద్దె దింపే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో అందరూ నివ్వెరపోయేలా పరిణామాలు ఉంటాయని తెలిపారు. విగ్రహాలు, రథాలు ధ్వంసంపై బీజేపీ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రాయలసీమ యాత్ర …

Read More »

అవ‌స‌ర‌మైతే.. శ‌తృవుల‌తోనూ క‌లుస్తాం

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తామ‌ని చెప్పారు.  విధ్వంస‌క‌ర పాల‌న‌ను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైతే.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌తోనూ, శ‌తృవుల‌తోనూ క‌లుస్తామ‌ని వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లో అవ‌స‌రాన్ని బ‌ట్టి.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను బ‌ట్టి.. ఒక్కొక్క‌సారి శ‌తృవుల‌తోనూ క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని పవన్‌ …

Read More »

తోకపార్టీగా మిగిలిపోవటం ఖాయమా?

వామపక్షాల్లో పోరాట స్పూర్తి తగ్గిపోయినట్లే ఉంది. ఎప్పుడైతే పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం మొదలుపెట్టారో అప్పుడే వామపక్షాల పతనం మొదలైంది. అధికారంలో ఉండే కాంగ్రెస్, టీడీపీ లేదా టీఆర్ఎస్ తో పొత్తులకు అర్రులు చాచారో అప్పటినుండే ప్రజాసమస్యలపై పోరాటాలను పక్కనపెట్టేశారు. ఎంతసేపు అధికారంలో ఉన్నపార్టీతో లాలూచీ రాజకీయాలు, లాబీయింగ్ తో వ్యక్తిగత లబ్దికి పాకులాడటం మొదలుపెట్టారో అప్పుడే జనాల్లో కూడా వామపక్షాలపై నమ్మకం పోయింది. ఇపుడు ఇదంతా ఎందుకంటే మునుగోడు …

Read More »

కేసీఆర్ ఎందుకు వెనకాడినట్లు?

అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో స్వయంగా కేసీఆర్ పాల్గొన్నారు. ఎటూ బహిరంగ సభకు వస్తున్నారు కాబట్టి అభ్యర్ధిని ప్రకటిస్తారని అందరు ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసేశారు. పావుగంట సేపు మాట్లాడిన కేసీయార్ అభ్యర్ధి గురించి అసలు ఏమీ ప్రస్తావించలేదు. టీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించమన్నారే కానీ పలానా అభ్యర్ధిని పోటీలోకి దింపుతున్నట్లు చెప్పలేదు. అభ్యర్ధిని పరిచయం చేయటానికి …

Read More »

చంద్ర‌బాబు వైఖ‌రితో త‌మ్ముళ్ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అనుస‌రిస్తున్న వైఖ‌రితో త‌మ్ముళ్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారా? అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయకులు.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా.. నాయ‌కుల‌తో స‌మీక్ష‌లు చేస్తున్నారు. వ‌రుసగా సాగుతున్న ఈ ప‌రిణామాల‌తో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌లు హుషారుగా ఉన్నారు. ఎందుకంటే.. ఈ స‌మీక్ష‌ల్లో చంద్ర‌బాబు.. కొంద‌రికి టికెట్లు ఖ‌రారు చేస్తున్నార‌నే వార్త‌లు రావ‌డ‌మే. అది కూడా.. …

Read More »

ఈడీ కాక‌పోతే.. బోడీ తెచ్చుకో..: KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ మాట్లాడారు. ”నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రగతిశీల …

Read More »

రాజ‌ధాని ఎఫెక్ట్‌.. ఆ మూడు స్థానాల్లో టీడీపీ

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరులో వైసీపీ హ‌వా జోరుగా సాగింది. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి ఏర్పాటుతో త‌మ‌కు తిరుగులేద‌ని అనుకున్న టీడీపీకి ఇక్క‌డ చాలా దెబ్బ త‌గిలింది. కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్ర బాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఇక్క‌డ పరాజ‌యం పాల‌య్యారు. దీంతో ఇంత చేసినా.. త‌మ‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చిందేంట‌ని.. టీడీపీ ఖంగుతింది. …

Read More »

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నోట ఇప్ప‌టి వ‌ర‌కు రాని కొత్త వ్యాఖ్య ఒక‌టి వ‌చ్చింది. ఏపీ రాజ‌కీయాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు.. అన్న జ‌గ‌న్‌.. త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని.. చెల్లెలు మ‌రో రాష్ట్రంలో పార్టీ పెట్టారే త‌ప్ప‌.. త‌మ ప్రాంతం ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను మాత్రం విస్మ‌రించార‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. పద్యం పుట్టిన రాయలసీమ నేలలో …

Read More »