Political News

అద్దంకి అభ్యర్ధిని ప్రకటించిన జగన్

jagan

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రకాశంజిల్లా అద్దంకి అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్ధిని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బాచిన కృష్ణ చైతన్యే పార్టీ తరపున పోటీచేస్తారని నియోజకవర్గం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది చైతన్యే అని చెప్పి గెలుపుకు అందరు కృషిచేయాలని గట్టిగా చెప్పారు. వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి అందరం కష్టపడితే వైసీపీ గెలుపు పెద్ద కష్టంకాదన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం …

Read More »

బీజేపీలో ప్రకంపనలు!

రాష్ట్ర బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో కలిసి దియోధర్ విజయవాడకు చేరుకోవటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడి చేయడం, తర్వాత పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హోటల్ రూముకే ఒక రోజంతా పరిమితమైపోవటం అందరికీ తెలిసిందే. విశాఖ నుంచి విజయవాడ …

Read More »

చంద్ర‌బాబు ఊహించ‌ని ఘ‌ట‌న‌.. ఏం జ‌రిగిందంటే!

బ‌హుశ‌.. టీడీపీ అదినేత చంద్ర‌బాబు కూడా.. ఊహించి ఉండ‌రు. ఆయ‌న తాజాగా నిర్వ‌హించిన ప‌ల్నాడు ప‌ర్య‌ట‌న ఆసాంతం.. పూలవర్షం.. గజమాలలతో సత్కారాలు.. హార్షాతిరేకాలు.. యువత కేరింత..  మహిళలు హారతులతో ముందుకు సాగింది.  జిల్లా ప్రజలు బాబుకు బ్రహ్మారథం పట్టారు. పల్నాడు పర్యటన విజయవంతం కావడంతో పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాం నెలకొంది. పర్యటన ఆసాంతం యువకులు అధినేత వెంట పరుగులు తీశారు. దారి పొడవునా ఎక్కడికక్కడ చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. …

Read More »

మూడు రోజులు మునుగోడులోనే కేసీయార్

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల కోసం కేసీయార్ మూడు రోజులు క్యాంపు వేయబోతున్నట్లు సమాచారం. నోటిఫికేష్ విడుదలై అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత కేసీయార్ ఇంతవరకు మునుగోడువైపు చూడలేదు. అంతకుముందు ఒకసారి బహిరంగసభలో పాల్గొన్నారంతే. గడచిన ఎనిమిదిరోజులుగా ఢిల్లీలోనే మకాంవేసిన కేసీయార్ బుధవారమే హైదరాబాద్ కు తిరిగొచ్చారు. వెంటనే మునుగోడు ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రులు, నేతలతో సమీక్షించారు. ఈ సమీక్ష తర్వాత తాను మూడు రోజుల …

Read More »

త‌గ్గేదేలే.. 175/175 ఎందుకు రావు: జ‌గ‌న్ కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రం మొత్తం క్లీన్ స్వీప్ చేయాల‌నే ల‌క్ష్యాన్ని ఆయ‌న మ‌ళ్లీ మ‌ళ్లీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు చెబుతున్నారు. తాజాగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న స‌మీక్షించారు. వాస్త‌వానికి ఇక్క‌డ ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బ‌ల‌మైన నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ గెలిచి తీరాల‌ని.. జ‌గ‌న్ ల‌క్ష్యం నిర్ణ‌యించారు. అద్దంకి …

Read More »

ఇందుమూలంగా.. కామ్రెడ్స్ తేల్చింది ఏంటంటే!

అవును.. వ‌రుస‌గా ఐదు రోజులపాటు సీపీఐ ఆధ్వ‌ర్యంలో జాతీయ మ‌హాస‌భ‌లు విజ‌య‌వాడ వేదిక‌గా జ‌రిగాయి. పార్టీ కొత్త కార్య‌ద‌ర్శిగా.. డి.రాజానే తిరిగి ఎంపిక చేశారు. వాస్త‌వానికి ఈ స‌భ‌ల‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అనేక అంచ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో సీపీఐకి పుంజుకునే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో ఏపీలోనూ.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకుంటే.. క‌నీసంలో క‌నీసం.. ఒక్క స్థానంలో అయినా.. గెలుపు గుర్రం ఎక్క‌డం …

Read More »

వైసీపీ గేమ్ మొదలైపోయింది

2019 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దాని వల్ల రెండు పార్టీలకూ చేటు జరిగింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే రెంటికీ అంతటి దారుణ పరాభవం ఎదురయ్యేది కాదు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతటి ఘన విజయాన్ని అందుకునేది కాదు. ఓట్ల చీలిక వల్ల వైసీపీ బాగా ప్రయోజనం పొందితే.. చాలా సీట్లలో టీడీపీకి, జనసేనకు నష్టం జరిగింది. ఈసారి కూడా ఈ …

Read More »

ప‌వ‌న్ మీటింగ్‌లో మిస్స‌యిన వీడియో చూశారా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా మంగ‌ళ‌వారం.. త‌న పార్టీ కేంద్ర కార్యాల‌యం మంగ‌ళ‌గిరిలో మాట్లాడుతూ.. వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. కొడ‌క‌ల్లా.. చెప్పుతోకొడ‌తా.. అంటూ.. రెచ్చిపోయారు. మ‌రిన్ని కామెంట్లు కూడా చేశారు. ఇక‌, యుద్ధ‌మే అంటూ.. వైసీపీ నాయ‌కుల‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. అయితే.. దీనిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. కౌంట‌ర్లు ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఒక పార్టీ అధ్య‌క్షుడు మాట్లాడేతీరు ఇదే.. నువ్వు నీ కార్య‌క‌ర్త‌ల‌కు …

Read More »

ఎవ‌రి ఖ‌ర్గే.. కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎలా ఎదిగారు?

కాంగ్రెస్ అధ్య‌క్ష పీఠంపై ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర్ణాట‌క నాయ‌కులు.. 86 ఏళ్ల మ‌ల్లికార్జున ఖ‌ర్గే కూర్చొన‌బోతున్నారు. ఆయ‌న ఎన్నిక ముందుగానే ఊహించింది. అయినా.. ఎన్నిక‌లు జ‌రిగిన ద‌రిమిలా.. భారీ మెజారిటీతోఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. అయితే… ఇంత పెద్ద పోస్టుకు ద‌క్షిణాది నాయ‌కులు.. పైగా.. ద‌ళితుడు అయిన‌.. ఖ‌ర్గే ఎలా అందుకున్నారు? ఆయ‌న ఎదిగిన తీరు ఏంటి? అంతా.. ఆస‌క్తిక‌రం.. మల్లికార్జున ఖర్గే.. విద్యార్థి దశ నుంచే …

Read More »

జ‌న‌సేన‌లోకి క‌న్నా.. నేడో.. రేపో..?

Kanna Lakshmi Narayana

ఏపీ బీజేపీలో కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ క‌మ‌లం గూటికి రాం రాం చెప్ప‌నున్నారు. తాజాగా జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. దీనికి ముందు నుంచి కూడా.. ఆయ‌న‌కు ఎదుర‌వుతున్న వ‌రుస ప‌రాభ‌వాల నేప‌థ్యంలో.. క‌న్నా.. పార్టీ మారేందుకు రెడీ అయ్యార‌ని తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న కన్నా.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్య అనుచరులతో భేటీ అయినా.. పార్టీ …

Read More »

ప‌వ‌న్ ఎఫెక్ట్: బీజేపీలో సెగ‌లు..!

Pawan Kalyan and Somu Veeraju

తాజాగా టీడీపీతో చేతులు క‌లిపిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉదంతం.. ఏపీ బీజేపీలో.. సెగ‌లు పుట్టిస్తోంది. ఏమాత్రం ఓటు బ్యాంకులేని.. బీజేపీకి అండ‌గా ఉండేందుకు సిద్ధ‌మైన ప‌వ‌న్‌ను.. ఉద్దేశ పూర్వ‌కంగానే బ‌య‌ట‌కు పంపించార‌నే చ‌ర్చ‌.. బీజేపీలో జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.దీనికి క‌ర్త‌, క‌ర్మ, క్రియ కూడా.. ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజే అనే భావ‌న వినిపిస్తోంది. తాజాగా దీనిపై ఓ మీడియాతో మాట్లాడిన బీజేపీ మాజీ అధ్య‌క్షుడు.. క‌న్నా …

Read More »

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే:  రాహుల్ కామెంట్స్‌

Rahul Gandhi

ఏపీలో మూడు రాజ‌ధానులు అనేది బుద్ధిలేని ఆలోచ‌న అని కాంగ్రెస్  అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఒక రాష్ట్రం.. ఒక రాజ‌ధాని అనేదే కాంగ్రెస్ నినాద‌మ‌ని.. దానికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం భార‌త్ జోడోయాత్ర‌లో ఉన్న రాహుల్ గాంధీ.. క‌ర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఇదే స‌మ‌యంలో స్థానికంగా కొంద‌రితోనూ.. ఆయ‌న చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు రాజ‌ధాని విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంద‌ని.. అయితే.. …

Read More »