ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్ నాగబాబు ఫైరయ్యారు. జనసేన అంటే.. వైసీపీకి చలి జ్వరమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జనసేన అంటే.. వైసీపీకి ఎందుకు అంత భయపడుతోందో తమకైతే అర్ధం కావడం లేదన్నారు. వైసీపీకి ఉన్న ఆభయమే.. జనసేన కార్యకర్తలపై దాడులకు ప్రేరేపిస్తోందని వ్యాఖ్యానించారు. తాజాగా రాజమండ్రిలో పర్యటించిన నాగబాబు.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో …
Read More »పీకేతో కలిసే పయనం.. కేటీఆర్ కీలక ప్రకటన
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలనాల పరంపర కొనసాగుతోంది. నాలుగు రోజుల వ్యవధిలో మూడు సార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కావాల్సిన వ్యూహాలను అందజేశారు. పీకే కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయం అవడమే ఓ ట్విస్టు అనుకుంటే గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చి, టీఆర్ఎస్ …
Read More »కాంగ్రెస్లోకి పీకే.. తెర వెనుక తెలుగోడు!
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన ప్రస్తుత పనులకు బైబై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనుండటం దాదాపుగా ఖరారు అయిపోయిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి ప్రజెంటేషన్ ఇవ్వనుండటం అనే ఎపిసోడ్తో మొదలైన చర్చ… `ఎలాంటి షరతులు లేకుండా పీకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు` అని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు బహిరంగంగా మీడియా ముందు ప్రకటించే వరకు చేరింది. ఇక మిగిలింది …
Read More »జైల్లో షటిల్ ఆడుకున్న వాళ్లా.. నాకు నీతులు చెప్పేది: జనసేనాని ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంచల్గూడ జైల్లో షటిల్ ఆడుకున్నవాళ్లా.. నాకు నీతులు చెప్పేది! అంటూ.. మండిపడ్డారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. తాజాగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాల …
Read More »జగన్ సంచలన నిర్ణయం.. అమరావతిలో నిర్మాణాలు షురూ
అమరావతి వద్దంటే వద్దని భీష్మించిన ఏపీలోని జగన్ సర్కారు.. ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో దిగి వచ్చింది. రాజధాని అమరావతిలో పనులు ప్రారంభించింది. రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు.. అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఈ భవనాలను నిర్మించిన ఎన్సీసీ సంస్థకే.. నిర్మాణ పనులను అప్పగించారు. శాసనసభ్యుల నివాసాల్లో టైల్స్, నీటి పైపులు, విద్యుత్ కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నిర్మాణ సామాగ్రిని రాయపూడికి …
Read More »కేఏ పాల్.. మళ్లీ ఏసేశాడుగా!!
క్యామెడీ రాజకీయాలకు కేరాఫ్గా మారిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. మళ్లీ నవ్వులు పూయించారు. తనకు దేశంలో ఉప ప్రధాని పదవిని ఆఫర్ చేశారని.. కానీ, తనే ఆ పదవిని వద్దన్నానని.. ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులంతా.. పోటీ పడి మరీ దోచుకుంటున్నారని పాల్ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన మొత్తం గాడి తప్పిందని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి …
Read More »ఏపీ అంటే జగన్.. చంద్రబాబేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నంతనే అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదంటే ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తప్పించి మరే నేత ప్రధాన మీడియాకు కనిపించదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎవరెన్ని చెప్పినా ఏపీ మీడియాలో రెండు పెద్ద కుంపట్ల ఉన్నాయని చెప్పాలి. ఈ కుంపట్లు జగన్.. చంద్రబాబు ఆప్షన్ లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవటమే తప్పించి.. అందుకు భిన్నంగా ఏపీకి మేలు చేస్తున్నవారు.. కష్టంలో ఉన్న వారికి …
Read More »నన్ను మాజీ మంత్రి అని పిలవొద్దు: కొడాలి నాని
ఏపీలోని వైసీపీ ప్రబుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని తనను మాజీమంత్రి అని పిలవొద్దని .. మీడియాకు గట్టిగా చెప్పారు. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలిసారి ఆయన అడుగు పెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గం …
Read More »జగన్ మిస్సయిన పాయింట్ తో దూసుకెళ్తున్న పవన్
రాజకీయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న అవకాశాన్ని వదిలినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. అందుకే.. తమకు లబ్థి చేకూర్చే విషయాల్ని అస్సలు మిస్ కావు రాజకీయ పక్షాలు. అలాంటిది ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. అడిగిన వారికి.. అడగని వారికి.. ఉన్నా లేకున్నా.. కాదనకుండా తాయిలాల మీద తాయిలాలు ఇస్తూ మెస్మరైజ్ చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాష్ట్రం అప్పుల కుప్పలా మారుతుందన్న హెచ్చరికల్ని పట్టించుకోకుండా …
Read More »పవన్ యాత్రకు చిక్కులు.. ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తున్న ‘జేసీబీ’
జాతీయ.. అంతర్జాతీయంగా ‘జేసీబీ’ యంత్రం కారణంగా సాగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమార్కులు.. నేరస్తులు.. ఆందోళనతో ఆరాచకాన్ని క్రియేట్ చేసే వారి ఇళ్లను జేసీబీలతో ధ్వంసం చేయటం.. యూపీలో సక్సెస్ ఫార్ములాగా మారిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాంటి విధానాలకు తెర తీస్తున్నారు. దీంతో.. జేసీబీలతో ఆరాచక పాలన సాగిస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జేసీబీలను వినియోగిస్తున్న వైనాన్ని చూసిన ఏపీ …
Read More »పదే పదే ఈనాడుతోనే వైరమా? జగన్!
ఆయనొక మీడియా సంస్థకు అధినేత.. ఇంకా చెప్పాలంటే ఆయనకు అంగీకారం ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈనాడు సపోర్ట్ కూడా కోరుకున్న నాయకుడు. వైఎస్సార్ తరువాత మళ్లీ అంతటి స్థాయిలో ఇన్నాళ్లకు ఈనాడు పేపర్ చూపిస్తూ, సంబంధిత ప్రధాన వార్తలు, శీర్షికలూ చదువుతూ ఓ సీఎం హోదాలో కోపం అయ్యారు జగన్. అదే ఇవాళ్టి టర్నింగ్ పాయింట్ .. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ కూడా ! నాలుగు మీడియా సంస్థలపై జగన్ …
Read More »‘KCR కేబినెట్ నుంచి నన్ను తప్పించేందుకు కుట్రలు’
కమ్మ సామాజికవర్గంపై కుట్రలు చేస్తున్నారని.. అదే సామాజికవ ర్గానికి చెందిన తనను కేసీఆర్ కేబినెట్ నుంచి తప్పించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని.. తెలంగాణ రవాణా శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో కమ్మలను కమ్మలే కాపాడుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మంత్రి.. చిన్న విషయాలను కొందరు రాద్దాంతం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates