కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి మృతదేహాలను ఎవరూ తాకవద్దు. మృతదేహాల నుండి కరోనా మరింతగా వ్యాప్తిస్తుందని తేలింది. కనీసం అయినవారు కూడా ముట్టుకోలేని దారుణ పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారిని తీసుకెళ్లి ఖననం చేస్తోన్న విధానం అందరినీ కదిలిస్తోంది. ఎలాగూ చనిపోయాడు. పైగా ముట్టుకోవద్దు. కానీ ఖననం కోసం జాగ్రత్తలు తీసుకొని వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కనికరం చూపని ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా …
Read More »రాత్రి పబ్జీ గేమ్ ఆడి పొద్దున్నే సైకోలా: జగన్పై లోకేష్ తీవ్ర విమర్శలు
దేశంలో డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైయస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం మండిపడ్డారు. ఎక్కడ చూసినా విధ్వంసం బాగా ఉందని, అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. జగన్ రాత్రి పబ్జీ గేమ్ ఆడుతారని, పొద్దున్నే సైకోలా ప్రజలపై పడతారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు కుటుంబాన్ని కలిసి పరామర్శించిన అనంతరం లోకేష్ మాట్లాడారు. …
Read More »తమిళనాడును కుదిపేస్తున్న లాకప్ డెత్స్
justiceforjeyarajandfenix.. నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇద్దరు అమాయకులను పోలీసులు తీవ్రంగా హింసించి వారి మరణాలకు కారణమైన ఉదంతం తమిళనాడును కుదిపేస్తోందిప్పుడు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ అదే స్థాయిలో తమిళనాట ఉద్యమానికి దారి తీసేలా ఉందీ ఉదంతం. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తూ.. రాజకీయంగా కూడా దుమారానికి కారణమయ్యేలా కనిపిస్తున్న ఈ ఉదంతం పూర్తి …
Read More »కాపీ టు ఎలక్షన్ కమిషన్ – రాజు భలే ఇరుకున పెట్టేశాడే..
రఘురామకృష్ణం రాజు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎదురే లేనట్లు సాగిపోతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారాయన. కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరిని తూర్పారబట్టేస్తూ.. నాయకత్వాన్ని కూడా పూచికపుల్లలా తీసిపడేసేలా మాట్లాడేస్తున్నారాయన. ఓవైపు సొంతంగా విడుదల చేసిన వీడియోలు.. మరోవైపు టీవీ చర్చల్లో ఆయన ధాటికి వైకాపా నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కొన్నాళ్లు వేచి …
Read More »రాష్ట్రంలో మంత్రులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారు
తెలంగాణ రాష్ట్రంలో నేతల పరంగా, ఎమ్మెల్యేల సంఖ్య పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ గత కొద్దికాలంగా ముఖ్యమైన అంశాల విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ స్పందిస్తోందనేది విశ్లేషకుల కామెంట్. కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో అయితే, ఈ రెండు పార్టీల మద్య మాటల యుద్ధం మరింత పెరిగింది. తాజాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరో సంచలన కామెంట్ …
Read More »హోటల్ ఎపిసోడ్ తో జగన్ పరివారం తప్పు చేసిందా?
విభజన రేఖలు స్పష్టంగా ఉంటాయి. అదే రంగమైనా కానీ. దూకుడు రాజకీయాలు మొదలైన తర్వాత.. ప్రత్యర్థులపై పైచేయి సాధించటం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు ఈ మధ్యన ఎక్కువైందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రతి నాణెనికి బొమ్మ.. బొరుసు ఎలానో.. ప్రతి రంగంలోనూ బయటకు తెలిసే నిజాలతో పాటు.. బయటకు రాని చాలానే విషయాలు ఉంటాయి. ఒకవేళ.. తెలిసినా.. వాటిని బాహాటంగా చర్చించే ప్రయత్నం చేయరు. అలాంటి లక్షణ …
Read More »ఉలిక్కిపాటు – హైదరాబాదు ఖాళీ !!
నివురు గప్పిన నిప్పులా ఉన్న భాగ్యనగరం ఒక్కసారిగా టెస్టులు పెంచడంతో తన అసలు రూపాన్ని చూపించింది. పదులతో మొదలైన కేసులు వందలకు వేలకు చేరుతున్నాయి. గత వంద రోజుల్లో ఈరోజు తెలంగాణ అత్యధిక స్కోరును నమోదు చేసింది. గత 24 గంటల్లో చేసిన టెస్టుల్లో ఏకంగా 920 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11364 కి చేరింది. 737 కేసులు హైదరాబాదులోనే రావడం సంచలనం అవుతోంది. …
Read More »బిన్ లాడెన్ ని అమరవీరుడని కీర్తించిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ తన అసలు రూపం బయటపెట్టుకుంది. టెర్రరిస్టు దేశం అనే ఆరోపణలను నిజం చేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడిగా కీర్తించింది. స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. అంటే వాళ్లంతట వారే ప్రపంచ ఉగ్రవాదిని అమరవీరుడు అనడం అంటే ఉగ్రవాదలకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించడమే అని అర్థం. ఈ …
Read More »హైదరాబాద్ వాసులకు అదిరిపోయే షాకిచ్చిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ వాసుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా కలకలంపై ఆదిలో తీపికబురు ఇచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో… కేసుల తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవడానికి 50 వేల టెస్ట్లు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తాజాగా ఈ టెస్టులకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రంలో టెస్ట్లు పెరగడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య …
Read More »దీనికి వైసీపీ క్యాంప్ సమాధానం ఏంటో మరి
రఘురామకృష్ణంరాజు… నరసాపురం ఎంపీ. ఇప్పుడు ఆయనో హాట్ టాపిక్. వైసీపీ ఎంపీ అయినప్పటికీ…సొంత పార్టీ నేతలకే ఆయన పంటి కింద రాయి. కలకలం సృష్టించే కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేయడం, నరసాపురం టీడీపీకి కంచుకోటేనని ప్రకటించడం, తనకు ప్రాణహాని ఉందంటూ లోక్సభ స్పీకర్కు లేఖ రాయడం వంటి చర్యలెన్నింటితో వైసీపీ నేతలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు బీపీ పుట్టిస్తున్నారు. తాజాగా ఆయనకు …
Read More »ఏపీ సీఎంపై అభిమానం లేదు…జగన్ అంటేనే అభిమానం
ఇరు రాష్ట్రాల్లోని సమకాలీన రాజకీయ నాయకుల్లో మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న ప్రత్యేకత వేరు. సుత్తి లేకుండా …ముక్కు సూటిగా …చెప్పదలుచుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగిన నేర్పు ఉన్న నేత ఉండవల్లి. అంతటి వాగ్ధాటి…విషయ పరిజ్ఞానం ఉన్న ఉండవల్లిని సీఎం నుంచి సీనియర్ నాయకుల వరకు గౌరవిస్తారు. టీడీపీ హయాంలో బాబు సీఎంగా ఉన్నపుడు పోలవరం లెక్కలపై….టీడీపీ, చంద్రబాబులను విమర్శించిన ఉండవల్లిని, …
Read More »పతంజలి వాళ్లు అసలు కరోనా వైరస్ పేరే ఎత్తలేదట
కరోనా వైరస్కు మందు కనిపెట్టేశామంటూ పతంజలి సంస్థ చేసిన ప్రకటన దేశంలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అలోపతి మందు కోసం లక్షల మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ నిర్దిష్టమైన మందును కనిపెట్టలేదు. వైరస్ ప్రభావాన్ని కొంత మేర తగ్గించే మందులేవో తెచ్చారు తప్ప.. దీంతో వైరస్ పూర్తిగా తగ్గిపోతుందని ఎవ్వరూ చెప్పడం లేదు. ఇలాంటి తరుణంలో పతంజలి సంస్థ కేవలం 545 రూపాయల …
Read More »