Political News

సీఎంను నిర్ణ‌యించేదెవ‌రు? ఎందుకీ దాగుడుమూత‌లు?  

ఏపీ బీజేపీ విష‌యంలో రాజ‌కీయ చ‌ర్చలు జోరందుకున్నాయి. సీఎంను నిర్ణ‌యించేది ఎవ‌రు? అనే ప్ర‌శ్న ప్ర‌ధానంగా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యంపై ఇప్పుడే మాట్లాడొద్ద‌ని.. పార్టీ జాతీయ అధ్య‌క్షులు.. జేపీ న‌డ్డా తేల్చి చెప్పారు. కానీ, ఇదేస‌మ‌యంలో బీజేపీలోనే ఉన్న కొంద‌రు నాయ‌కులు ఇప్ప‌టికే మ‌నం.. జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్నాం కాబ‌ట్టి.. ఉమ్మ‌డి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే.. పార్టీలో మ‌రింత ఊపు వ‌స్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కానీ, …

Read More »

ముందే కూస్తున్న రాజకీయ కోయిలలు

ఆంధ్రావ‌నిలో విభిన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొని ఉంది. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల దూరం ఉండ‌గానే ప్ర‌ముఖ పార్టీల నాయ‌కులు వేదిక‌ల‌పై విభిన్న ధోర‌ణుల్లో వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. వీటిని ప్ర‌జ‌లు అర్థం చేసుకోవ‌డంలోనే విజ్ఞ‌త ఉంది. వాస్తవానికి ఎన్నిక‌ల వేళ చెప్పాల్సిన మాట‌లే ఇవి కానీ ముందుగానే అప్ప‌గిస్తున్నారు. ఎన్నిక‌ల వేళ చేయాల్సిన ప‌నులే ఇవి కానీ ముందుగానే రాజకీయ రాద్ధాంతాలు చేస్తున్నారు. వీటి కార‌ణంగా అస్థిర‌త ఒక‌టి ఏర్ప‌డ‌డం ఖాయం. …

Read More »

వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ సీరియ‌స్ క్లాస్‌

టార్గెట్ మార‌ద‌ని.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలని, ఈ విష‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని.. ఇక‌పై అంతా మీ ఇష్టం అని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మన లక్ష్యమని.. ఇది కష్టం కాదని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని …

Read More »

రాజధాని నిర్మాణం.. ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసిందా?

ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే కనీసం ఐదేళ్ళు పడుతుందని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్లో చెప్పింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటానికి, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేయటానికి, రాజధాని నగరం నిర్మించటానికి ప్రభుత్వానికి హైకోర్టు ఆరు మాసాలు మాత్రమే సమయమిచ్చింది. హైకోర్టు తీర్పు ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం గతంలోనే ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దానికి …

Read More »

KCR: 40 మంది ఎమ్మెల్యేలకు షాక్?

వచ్చే ఎన్నికల్లో 40 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వకూడదని కేసీయార్ డిసైడ్ చేసినట్లు సమాచారం. 119 నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఎంఎల్ఏల పరిస్దితి, ప్రతిపక్షాల ఎంఎల్ఏల పరిస్ధితులపై రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత  ప్రశాంత్ కిషోర్ (పీకే) తాజా నివేదికను కేసీయార్ కు అందించారట. రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఒకటికి పదిసార్లు ఇప్పటికే పీకే బృందం సర్వేలు జరిపింది. అనేక సర్వేలు నిర్వహించి,  వివిధ కోణాల్లో విశ్లేషించి తయారు …

Read More »

పార్టీలో గ్రూపులు కనిపించకూడదు: చంద్ర‌బాబు వార్నింగ్

టీడీపీ నేతల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు తరువాత పార్టీ పటిష్టత, ఇంచార్జ్ ల పనితీరుపై చంద్రబాబు వరుసగా సమీక్షలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని నాలుగు పార్లమెంట్ ల పై అధినేత సమీక్ష జరిపారు. నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని చంద్రబాబు అదేశించారు. వీటితో పాటు ప్రజా సమస్యలపై …

Read More »

అర్థం ప‌ర్థం లేని బీజేపీ రాజ‌కీయం… అంతా గంద‌ర‌గోళం…!

ఏపీలో బీజేపీ వ్యూహం ఏంటి? ఎలా ముందుకు వెళ్తుంది? ఏవిధంగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంది?.. ఇలాంటి అనేక ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా పొత్తుల‌పై ఎవ‌రూ మాట్లాడొద్దంటూ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తేల్చి చెప్పారు. అంటే.. పొత్తుల విష‌యంలో ఇప్ప‌టి నుంచి ఎవ‌రూ మాట్లాడ‌కుండా.. ఆయ‌న నోరు క‌ట్టేశారు. ఇది.. రాజ‌కీయంగానే కాకుండా.. పార్టీ ప‌రంగా ఏమేర‌కు మేలు చేస్తుందో …

Read More »

‘ఇంగ్లీష్ మీడియం వ‌ల్లే.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు త‌ప్పారు’

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందనే విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ ఏడాది మాల్ ప్రాక్టీస్కు బ్రేక్ పడటంతో పదిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వ …

Read More »

క‌ర్ణాట‌క‌ను కుదిపేస్తున్న `చెడ్డీ` రాజ‌కీయం

ఆర్‌ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే నిక్కర్లను పోగుచేసి కాంగ్రెస్‌ కార్యాలయానికి పంపుతున్నారు. ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. కర్ణాటకలో ఓ చిత్ర‌మైన వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అదే చెడ్డీ వివాదం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (ఆర్‌ఎస్ఎస్‌)కు వ్యతిరేకంగా చెడ్డీలను తగులబెట్టాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే నిక్కర్లను …

Read More »

నడ్డాపై ఒత్తిడి పెంచేస్తున్న జనసేన

ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించాలంటూ జనసేన నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ పేరును ప్రకటించాలని రాసిన ప్ల కార్డులను జనసేన నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నడ్డా సోమవారం విజయవాడకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మంగళవారం రాజమండ్రి గర్జన బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన నేతలు …

Read More »

సీఎం పవన్.. రెండువైపులా షాక్?

మొత్తం మీద ఇటు తెలుగుదేశం పార్టీయే కాదు మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాకులు గట్టిగానే తగిలాయి. టీడీపీ నేతల నుంచి షాకులు తగిలాయంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ మిత్రపక్షం బీజేపీ నుంచి ఇంతటి షాక్ తగలటమే ఆశ్చర్యంగా ఉంది. త్యాగాలు చేసేది లేదని, పల్లకి మోసేదిలేదని చెబుతూ వచ్చిన పవన్ హఠాత్తుగా మూడు ఆప్షన్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మూడు …

Read More »

జూబ్లీ హిల్స్ అత్యాచార ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియాక్ష‌న్ ఇదే!

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో మైనర్‌పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా.. మృగాళ్లకు అలాంటి ఆలోచనలే రాకుండా సంస్కరణలు తేవాలని కోరారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా.. మృగాళ్లకు …

Read More »