Political News

మా పార్టీ నేత నీచంగా ప్రవర్తిస్తున్నారు: మాజీ మంత్రి అనిల్

సొంత పార్టీ లేదు.. వైరి పక్షము అన్నది లేదు. తమకు పడని వాళ్లు ఎవరైనా సరే.. తమ మాటల తూటాల తాకిడికి విలవిలలాడేలా వ్యాఖ్యలు చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. ప్రత్యర్థి పార్టీల విషయంలో అస్సలు తగ్గనట్టుగా వ్యవహరించే తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సొంత పార్టీ వారిపై కూడా విరుచుకుపడుతుంటారు. అధికారం చేతిలోకి వచ్చిన మూడేళ్లలోనే.. ఏపీలోని పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు సొంత …

Read More »

మోడీ ఆట ముగిసిందా?

Modi

అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో వ‌రుస‌గా కేంద్రంలో పాగా వేసి.. త‌న‌కు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ అగ్ర‌నేత‌, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆట ముగిసిందా?  తాను చెప్పిందే.. వేదం.. తాను చేసిందే శాస‌నం అనేలా.. వ్య‌వ‌హ‌రించిన‌.. ఆయ‌న తీరుపై వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్పుడు ఇలాంటి చ‌ర్చే జోరుగా సాగుతోంది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. మోడీ శ‌కం ముగుస్తోంద‌ని.. ఆయ‌న ఆట‌కు.. …

Read More »

మరోసారి బెడిసికొట్టిన జగన్ వ్యూహం

ఏపీ ఉద్యోగుల విష‌యంలో ముఖ్య‌మంత్రి జగ‌న్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. కంట్రి బ్యూట‌రీ పింఛ‌న్ స్కీంను ఎత్తి వేయ‌లేమ‌ని.. ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు దీనిని ర‌ద్దు చేయాల్సిందేన‌ని.. ఉద్యోగులు ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌రోసారి ఉద్య‌మాల‌కు రెడీ అవుతున్నారు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. ఉద్యోగుల‌ను త‌నదారిలోకి తెచ్చుకునేందుకు సీఎం జ‌గ‌న్ వ్యూహాలు వేస్తున్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు అవి బెడిసి కొడుతున్నాయి. తాజాగా మ‌రోసారి ఉద్యోగుల‌తో స‌ర్కారు …

Read More »

రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర‌.. ఈసారి డిజిట‌ల్ హంగులు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఇక్క‌డి రైతులు మ‌రోసారి పాద‌యాత్ర‌కు ఉప‌క్ర‌మించారు. గ‌తంలో తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రంప‌ర‌లో మ‌రోసారి  సెప్టెంబర్ 12 నాటికి రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతుల నిరసనలు వెయ్యి రోజులకు చేరుకున్న సందర్భంగా, ఐక్య కార్యాచ‌ర‌ణ‌ నేతలు భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. రైతు పరిరక్షణ సమితి నేతలు మరోమారు పాదయాత్ర చేపడతామని తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన యాప్ను …

Read More »

ఏపీ స‌ర్కారు.. మరో అప్పు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే.. అప్పులు ప్ర‌దేశ్‌గా మారిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డి వైసీపీ స‌ర్కారు మాత్రం ఈ వ్యాఖ్య ల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌డం లేదు. అయిన కాడికి.. అందిన కాడికి అప్పులు  చేస్తూనే ఉంది. తాజాగా మ‌రోసారి అప్పులు తెచ్చేసింది. ఈ సారి కూడా అంద‌రూ విస్మ‌యానికి గుర‌య్యేలా ఈ అప్పులు ఉండ‌డం గ‌మ‌నార్హం. అటు కేంద్రం నుంచి అప్పులు పెరిగిపోతున్నాయంటూ.. ఆందోళ‌న వ్య‌క్తం అయినా.. ఆర్బీఐ నుంచి కూడా …

Read More »

జ‌గ‌న్ అడ్డాలో ప‌వ‌న్ టూర్‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ నెల 20న సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా.. క‌డ‌ప‌లో అడుగు పెట్ట‌నున్నారు. కొన్నాళ్లుగా ప‌వ‌న్ .. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శిస్తున్నారు. దీనికి సంబంధించి రూ.10 కోట్ల మేర‌కు నిధులు కూడా పంచుతున్న విష‌యం తెలిసిందే. ఒక్కొక్క కుటుంబానికీ..రూ.10 ల‌క్ష‌లు చొప్పున‌.. ప‌వ‌న్ బాధిత కుటుంబాల‌కు అందిస్తున్నారు. …

Read More »

కోమ‌టిరెడ్డిపై.. కాంగ్రెస్ వ్యూహం !

కాంగ్రెస్‌ను ధిక్క‌రించి.. బీజేపీ బాట ప‌ట్టిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని అష్ట‌దిగ్బంధ‌నం చేసేలా కాంగ్రెస్ వ్యూహ‌ర‌చ‌న ప్రారంభించింది. ఆయ‌న‌కు ఊపిరాడ‌కుండా చేసే ల‌క్ష్యంతో ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న అనుచ‌రులుగా ఉన్న వారికి కాంగ్రెస్ చెక్ పెడుతోంది. ఇప్పటికే మునుగోడు మండలాల అధ్యక్షులను తొలగించారు. నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్రెడ్డిని తొలగిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి ఆదేశాలు జారీ …

Read More »

రాజగోపాల్ చెప్పినట్లే జరుగుతోందా?

మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేసేటపుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదైతే చెప్పారో ఇపుడు అదే జరుగుతోందా ? కేసీఆర్ వైఖరి చూస్తుంటే జనాలు అవుననే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడేళ్ళుగా తన నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం తాను ఎన్ని ప్రతిపాదనలు అందించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రాజగోపాల్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనపుడు ఇక ఎంఎల్ఏగా ఉండి ఉపయోగం ఏమిటని అన్నారు. తాను రాజీనామా చేస్తే అన్నా కేసీఆర్ …

Read More »

చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌పాటే..

రాజ‌కీయాల్లో రోజుల‌న్నీ.. ఒకే విధంగా ఉండ‌వు. నిన్న ఉన్న‌ట్టుగా ఈ రోజు.. ఈ రోజు ఉన్న‌ట్టు రేపు కూడా ఉండే అవ‌కాశం లేదు. ఈ విష‌యాన్ని నాయ‌కులు గ్ర‌హించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా.. త‌మ త‌మ విధానాల‌ను మార్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మాత్రం ఇలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. పార్టీ అధినేత  చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. నాయ‌కులు పెడ‌చెవిన పెడుతున్నారు. …

Read More »

మోడీ భయపడుతున్నారా?

బీజేపీలో సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ తో బలమైన బంధాలు కలిగిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంటే నరేంద్ర మోడీ భయపడుతున్నారా ? పార్టీలో జరిగిన తాజా పరిణామాలు చూసిన తర్వాత సర్వత్రా అదే చర్చ జరుగుతోంది. మొదటి నుండి గడ్కరీ అంటేనే మోడీ కాస్త దూరంగా ఉంటున్నారు. తన మంత్రివర్గంలో గడ్కరీని దూరంగా పెట్టింది లేదు. అలాగని నెత్తినెక్కించుకున్నదీ లేదు. మొత్తం మంత్రివర్గంలో మోడీ తర్వాత అమిత్ షా దే …

Read More »

కేసీఆర్ మీద కేసు పెట్టే ధైర్యముందా?

ఒక వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేయాలి ? ఆ ఆరోపణలపై అధ్యయనం చేయాలి. అవినీతి జరిగిందని అనుమానమొస్తే శాఖాపరమైన విచారణ జరిపించాలి. అవినీతి నిర్ధారణైతే వెంటనే సదరు వ్యక్తిపై కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టాలి. మామూలుగా జరిగే విధానమిదే. మరిప్పుడు అలాంటిదేమీ లేకుండా డైరెక్టుగా సంబంధిత శాఖ మంత్రే ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిర్ధారిస్తే ఏమి చేయాలి ? వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై …

Read More »

అప్పుల్లో కొట్టుమిట్టాడే టాప్ 5 రాష్ట్రాలు

ఆర్థికంగా దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న శ్రీలంక దేశాన్ని బూచిగా చూపిస్తూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్న ప్రభుత్వాల్ని దెబ్బ తీసేందుకు వీలుగా చేస్తున్న ప్రచారంలో పస లేదన్న విషయం తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న విధానాల కారణంగా పెద్ద ఎత్తున అప్పులు అవుతున్నాయని.. రాష్ట్రం మరో శ్రీలంక మాదిరి మారుతుందంటూ చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న విషయం తాజా నివేదిక …

Read More »