ఏపీలో అధికార వైసీపీకి ప్రజా వ్యతిరేకత తప్పడం లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను జనం ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం చేయిస్తున్న పని అని వైసీపీ అనుమానిస్తోంది. దానితో విపక్షాన్ని డిఫెన్స్ లో పడేసేందుకు, రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు జగన్ పార్టీ తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.. ఈ మధ్య కాలంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా వెనుకాడటం లేదు.. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలి ధర్మాస ప్రసాద రావుకు …
Read More »ఇది.. వైసీపీ విధ్వంస నామ సంవత్సరం: చంద్రబాబు
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రతి ఏటా విధ్వంసాల సంవత్సరమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘2022కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం. జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతీ ఏడాదీ …
Read More »విధేయుడికి వీరతాడు.. సునీల్ కు ప్రమోషన్ ఇచ్చిన జగన్!
తనకు అనుకూలంగా వ్యవహరించేవారిని అందలం ఎక్కిస్తున్న సీఎం జగన్.. తాజాగా వీర విధేయుడిగా పేరు పొందిన ఐపీఎస్ అధికారి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సునీల్ కుమార్కు ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన సీఐడీ అదనపు డీజీపీగా ఉన్నారు. అయితే, ఇక నుంచి ఆయన పూర్తిస్థాయి డీజీపీగా ఇదే విభాగంలో పనిచేయనున్నారు. దీంతో అధికారాలతోపాటు.. వేతనం, ఇతర అలవెన్సులు లభించనున్నాయి. అయితే.. సీఐడీ అధికారి సునీల్ కుమార్.. చుట్టూ …
Read More »కేసీఆర్కు షాక్.. మరోవైపు నరుక్కొస్తున్న కాంగ్రెస్!!
కేంద్రంలో చక్రం తిప్పాలని ప్రయత్నం మీదున్న తెలంగాణ సీఎం KCRకు భారీ షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తోంది.. జాతీయ పార్టీ కాంగ్రెస్. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేయనున్నట్టు తెలిపింది. అంతేకాదు.. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Rahul కేవలం ప్రతిపక్షాల ఫేస్ మాత్రమే కాదని.. ఆయన కాబోయే ప్రధానమంత్రి అని …
Read More »నిజం తెలుసుకుని మాట్లాడు జగన్ రెడ్డీ: చంద్రబాబు వార్నింగ్
ఏపీ సీఎం Jagan కు ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాట, మరణాలపై సీఎం జగన్ నర్సీపట్నం సభలో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనలో డ్రోన్ షో చేస్తున్నారని, అందుకే తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబువి అన్నీ ‘షో’లేనని విమర్శించారు. ఈ నేపథ్యంలో జగన్కు కౌంటర్గా …
Read More »విశాఖను రాజధాని చేయకపోతే.. రాష్ట్రం చేయండి
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిని అంగీకరించేది లేదని.. ఎట్టి పరిస్థితిలో దీనికి తాము ఒప్పుకోబోమని ఆయన వ్యాఖ్యానించారు. “అమరావతినే రాజధాని చేయాలని ఏ పార్టీ అయినా.. అనుకుంటే.. విశాఖను చిన్న రాష్ట్రం చేసి మాకు ఇచ్చేయండి.. మా పాలనేదో మేమే చేసుకుంటాం.. మా బతుకులేవో మేమే బతుకుతాం! రాజధాని కోసం మా కష్టార్జితాన్ని కట్టాల్సిన అవసరం లేదు. పన్నుల రూపంలో దోచుకుని.. ఒక్కచోటే …
Read More »చంద్రబాబు స్క్రిప్టు రాస్తే.. పవన్ కల్యాణ్ యాక్టింగ్ చేస్తాడు
ఏపీ సీఎం జగన్.. చంద్రబాబుపైనా.. పనిలోపనిగా పవన్పైనా నిప్పులు చెరిగేశారు. చంద్రబాబు స్క్రిప్టు రాస్తే.. పవన్ యాక్టింగ్ చేస్తాడు.. అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రాజకీయం అంటే.. ఏంటో కూడా జగనే చెప్పేశారు. రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపించామని జగన్ అన్నారు. సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ ప్రజల సేవకులని చెప్పారు. రాజకీయం అంటే ఇదేనని స్పష్టం చేశారు. రాజకీయం …
Read More »ఉద్యోగుల పై అంత నమ్మకం లేదా జగనన్నా?!
ఏపీలో ఉద్యోగులను అన్ని విధాలా వేధిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన ఆదేశం జారీ చేసింది. ఉద్యోగులు ఎవరూ కూడా విధులకు వచ్చే సమయంలో తమ వద్ద రూ.500 నుంచి రూ.1000 కి మించి నగదును ఉంచుకోవడానికి వీల్లేదని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఇది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లోనే ఉంది. అయితే.. ఏ ప్రభుత్వం కూడా ఇలా ఎప్పుడూ ఆదేశించ లేదు. …
Read More »వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించారు.. చివరకు తన్నులు తిన్నారు!
వైసీపీ నేతలంటే నేతలే. ముఖ్యంగా సీమ ప్రాంత నేతలైతే.. మరింత ఘాటు! వారిని ఎవరూ ప్రశ్నించ కూడదు. ప్రశ్నిస్తే.. ఇంతకు ముందు తిట్లవరకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ వారిలోనూ ఆవేశం, ఆగ్రహం.. అన్నీ తరుముకొస్తున్నాయి. దీంతో ఏకంగా చేయిచేసుకుంటు న్నారు. చితక్కొట్టేస్తున్నారు వారి అనుచరులతో కొట్టిస్తున్నారు కూడా! రాజోలి జలాశయం భూసేకరణ పరిహారంపై ప్రశ్నించిన రైతులపై జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి …
Read More »వడ్డీతో సహా న్యాయం చేస్తా: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను సైకోగా అభివర్ణించారు. బీసీల పై కపట ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమ హక్కుల కోసం.. బీసీలు నోరు విప్పలేని పరిస్థితిని కల్పించింది.. జగన్ కాదా? అని ప్రశ్నించారు. బీసీలు మాట్లాడితే.. సైకో ముఖ్యంమంత్రి వారిని జైలులో పెట్టే పరిస్థితిని తీసుకువచ్చారు.. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 26మంది బీసీలను పొట్టనపెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రి …
Read More »లోకేష్ పాదయాత్రకు బ్రేకిస్తే.. మనకే తంటా.. వైసీపీ గుసగుస
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్టు ప్రక టించారు. యువగళం పేరుతో ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. అదేసమయంలో పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని నడవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక, రూట్ మ్యాప్ మాత్రం సిద్ధం కావాల్సి ఉంది. అయితే.. ఇంతలోనే.. వైసీపీ మంత్రి …
Read More »జగన్ మాయ: ఏడాదికి ఎకరానికి వెయ్యి ఆద్దె ఇస్తే చాలు!
గతంలో టీడీపీ ఆఫీస్ కోసం.. చంద్రబాబు హయాంలో స్థలం కేటాయించడాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు అదే పనిచేశారు. వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం 3 జిల్లాల్లో 55 కోట్ల రూపాయల విలువైన 4.75 ఎకరాల భూములను కేటాయించేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ జీవో ప్రకారం.. కడప, కోనసీమ, అనకాపల్లి జిల్లాల పరిధిలో అత్యంత విలువైన భూమిని అధికార వైసీపీకి కేటాయించారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates