ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదని సీఎం జగన్ మండిపడ్డారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు. రైతు భరోసా పథకం గతంలో ఉండేదా?. మూడేళ్లలో అర కోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా? అని ప్రశ్నించారు. …
Read More »సొంత ఊళ్లో బొత్సకు ఝలక్ ! అయినోళ్లే దెబ్బేశారే !
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత ఊళ్లోనే ఝలక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు వేల మంది కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిపోయారు. ఈ అనూహ్య పరిణామంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. మంత్రి బొత్స పోకడలు నచ్చక వీరంతా పసుపు కండువాలు కప్పుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గత కొద్దికాలంగా చీపురుపల్లి నియోజకవర్గంలో సొంత మనుషులే మంత్రిని నమ్మడం లేదని కూడా తెలుస్తోంది. మంత్రికి …
Read More »కాంగ్రెస్ సారథిగా ప్రియాంక గాంధీ! ప్రకటనే లేటు!
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు.. ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీకేనా?.. ఆమెకే పగ్గాలు అప్పగించనున్నా రా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టేందుకు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నవసంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఆరు కమిటీలు కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలనే అంశం తెరపైకి వచ్చింది. అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ …
Read More »కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. రాహుల్ దేశవ్యాప్త పాదయాత్ర!
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. ఉదయ్పుర్లో నిర్వహిస్తున్న చింతన్ శిబిర్లో ఈ విషయంపై చర్చించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏడాది చివర్లో ఈ పాదయాత్ర ఉండనుందని పేర్కొన్నారు. మొత్తం అన్ని రాష్ట్రాలను కలుపుతూ రాహుల్ పాదయాత్ర సాగనుందనని తెలిపారు. సుమారు రెండేళ్లపాటు… …
Read More »సర్కారు వారి అప్పు !
ఆంధ్రావని అప్పులపై మళ్లీ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పబ్లిక్ కోసం చేసిన అప్పును పబ్లిక్ గానే తెలియజేయాలని, దాచేందుకు వీల్లేదని చెబుతూ, బడ్జెట్ లో లెక్క చూపని అప్పుల లెక్క తేల్చాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏపీజీ) ఓ లేఖ రాసింది. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు మరోసారి డైలామాలో పడిపోయింది. ఇప్పటికే ఏపీ చేసిన లేదా చేస్తున్న అప్పులపై తామేమీ షూరిటీ ఉండమని, ఆ …
Read More »ఆ ధైర్యానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. ఆయనే రఘు రామ కృష్ణం రాజు. నరసాపురం ఎంపీ. ఆయన బర్త్ డే ఇవాళ. శుభాకాంక్షలు చెబుతూ రాస్తోన్న ప్రత్యేక కథనం ఇది. మొదట్నుంచి ఆయన శైలి వేరు. గెలిచాక కూడా అలానే ఉన్నారాయన. ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రా ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలుచేసినా ఆయనకే చెల్లు. అదేవిధంగా కొన్ని సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసిన దాఖలాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వ్యవహార శైలి …
Read More »ఏపీలో ఆ స్కీం బడ్జెట్ 25 కోట్లు, పబ్లిసిటీకి 60 కోట్లట
తన పథకాల గురించి జగన్ సర్కారు పబ్లిసిటీ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఏపీలో ఉంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ న్యూస్ పేపర్లు ఫాలో అయ్యే వారికి ప్రతి నెలా ఏదో ఒక పథకం ప్రారంభిస్తున్నట్లు.. భారీగా నిధుల్ని కేటాయించినట్లు.. దానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం గురించి మొదటి పేజీ మొత్తాన్ని కవర్ చేస్తూ యాడ్ ఇవ్వటం కనిపిస్తుంది. అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ఈ …
Read More »కాంగ్రెస్లో మళ్లీ పీవీ జపం.. తెలంగాణ కోసమేనా?
రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్`లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టించుకోని పాత నాయకులను ఇప్పుడు స్మరిస్తున్నారు. అదేసమయంలో మైనార్టీ వర్గాలపై అమిత ప్రేమను ఒలకబోస్తున్నారు. ఈ రెండు పరిణామాలు కూడా కాంగ్రెస్ వ్యవహారంపై చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అవసాన దశలో ఉన్నదనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా …
Read More »దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తారు: సోనియా
రాజస్థాన్లోని ఉదయ్పుర్లో కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ ప్రారంభమైంది. 430 మంది కాంగ్రెస్ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ, ఉపాధి, పార్టీ సంస్థాగత ప్రక్షాళన అంశాలపై వీరంతా చర్చించి తీర్మానాలు చేయనున్నారు. చింతన్ శిబిర్లో రూపొందించిన తీర్మానాలకు సీడబ్ల్యుసీ ఆమోదం లభించిన తరువాత సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఈ చింతన్ శిబిర్కు నాయకులు ఎంతటి వాళ్లయినా.. సెల్ ఫోన్లు తీసుకురావద్దని …
Read More »48 గంటల్లో క్షమాపణ చెప్పు.. లేదా జైలు తప్పదు: కేటీఆర్ వార్నింగ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఈనెల 11న చేసిన ట్విట్టర్ లో ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నిరాధర ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదా పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈమేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్కి కేటీఆర్ నోటీసులు …
Read More »‘ఒకే కుటుంబం- ఒకే టికెట్’
చింతన్ శిబిర్లో ఇప్పుడు గాంధీల కుటుంబానికే పెద్ద చింత ఎదురయింది. దేశవ్యాప్తంగా కుటుంబ పాలనకు చెక్ పెట్టాలని భావిస్తున్న పార్టీ కుటుంబంలో ఒకరికే టికెట్ అని ప్రకటించింది. అయితే.. ఈ సమస్య.. తొలిగా.. సోనియా కుటుంబానికే పెద్ద చిక్కు తీసుకువచ్చింది. ఈ కుటుంబంలో ఇప్పటి వరకు ఇద్దరు సోనియా, రాహుల్ పోటీ చేస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో కుమార్తె, అల్లుడు.. ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »జంపింగులకే.. జగన్ వీరతాళ్లు.. వైసీపీలో మంటలు
వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురి జాబితా రెడీ అయిందా? ఇప్పటికే అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం జగన్ ఖరారు చేశారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఏపీ నుంచి రాజ్యసభకు తాజాగా నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ సభ్యులను ఖరారు చేసే పనిని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ సీట్లు ఖాళీ అవుతున్నాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates