Political News

జగన్ వ్యూహం అదుర్స్… ఎవరూ నోరెత్తడానికి లేదంతే

YS JAgan

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన వ్యూహంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏదైనా విషయంపై తాను ఓ క్లారిటీకి వచ్చేస్తే… ఇక ప్రత్యర్థులు గానీ, సామాన్య జనం గానీ… ఆ అంశంపై పెద్దగా మాట్లాడటానికి ఏమీ ఉండదని, అంతో ఇంతో మాట్లాడినా జగన్ పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవన్న వాదనలు ఇప్పుడు స్పష్టం అయిపోయాయి. విషయం ఎంత కీలకమైనదైనా.. తనదైన …

Read More »

భారత్ పై పాక్, చైనా బయో వార్ ?

మహమ్మారి వైరస్ దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలమవుతోన్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలన్నీ కకావికలమవుతున్నాయి. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్…ప్రజలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ను చైనా బయోవార్ లో భాగంగా తయారు చేసిందంటూ వదంతులు వచ్చాయి. అయితే, ఈ వైరస్ సహజంగానే జంతువులలో పుట్టిందని మరి కొందరు అంటున్నారు. వైరస్ సహజమైనా..కృత్రిమమైనా…జన జీవనం అతలా కుతలమవుతున్న సంగతి వాస్తవం….లక్షలాది మందిని …

Read More »

జగన్ ను ఇరకాటంలో పెట్టిన టీడీపీ పథకం ఇదేనా?

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, చేపడతామన్న సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను బట్టి ప్రజలు ఆయా పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తుంటారు. అందుకే, ఏ పార్టీ అయినా తాము ఇచ్చిన హామీలను, చేపడతామన్న సంక్షేమ పథకాలను సాధ్యమైనంత వరకు నెరవేర్చేలా చూస్తుంది. అయితే, ఇప్పటివరకు ఏపీలో అధికారం చేపట్టిన పార్టీలన్నీ రకరకాల ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయితే, అన్ని సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ లభించినా….వాటిలో …

Read More »

కన్నాకు షాక్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభాగంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చింది అధిష్టానం. రెండేళ్లకు పైగా పదవిలో కొనసాగుతున్న సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణపై వేటు వేసి సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించారు. ఈ విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ ‌సింగ్‌ ఉత్తర్వులు వెలువరించారు. వీర్రాజు …

Read More »

మార్చురీ నిండిపోయింది… కారణమే విచిత్రం

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే….తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి. అదే తరహాలో కరోనా…కరోనా…నువ్వేం చేస్తావు అంటే…కరోనా అనుమానితులు, కరోనా నుంచి కోలుకున్నవారినీ అంటరానివారిలా చూసేలా చేస్తాను…కరోనా నుంచి కోలుకున్న తల్లిదండ్రులను, తోబుట్టువులను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేలా చేస్తాను…కన్నవారి కడసారి చూపులకన్నా….తన ప్రాణాలు ఎక్కువనేలా చేస్తాను….అన్నీ ఉన్నా అనాథ శవాల్లాగా అంత్యక్రియలు జరపాల్సిన …

Read More »

జగన్ మార్క్ స్ట్రోక్… ఒక్క దెబ్బకు మూడు పిట్టలు?

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే ఏ ఒక్క అవకాశము వదలలేదు. వీలు చిక్కినప్పుడల్లా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న జగన్…తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా దేశానికి వెన్నెముక అయిన గ్రామాలకు దన్నుగా ఉన్న రైతులకు జగన్ పెద్దపీట వేశారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు పలు రకాలుగా రైతులను ఆదుకుంటున్నారు. ఇక, మరో …

Read More »

తమిళనాడు రాజధానిని మారుస్తున్నారా?

కొన్నిసార్లు అంతే.. ఏళ్లకు ఏళ్ల క్రితం హాట్ హాట్ గా జరిగిన చర్చల్ని గుర్తు చేసే అంశాలు చోటు చేసుకుంటాయి. తాజాగా తమిళనాడులో అలాంటి పరిస్థితే నెలకొంది. అంతకంతకూ పెరిగిపోతూ.. ఒక్క చెన్నైమహానగరంలోనే లక్షకు కాస్త దగ్గరగా పాజిటివ్ లు పెరిగిపోయిన వేళ.. రాష్ట్ర రాజధాని నగరాన్ని మార్చాలన్న పాత డిమాండ్ సరికొత్తగా తెర మీదకు వచ్చింది. దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితం తమిళనాడు రాజధానిని మార్చాలన్న ప్రతిపాదనపై జోరుగా …

Read More »

కేసీఆర్ డిఫెన్సులో పడేలా ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

రాజకీయ ప్రత్యర్థులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాడి ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు మంత్రాల మాదిరిగా మారటమే కాదు.. అప్పటివరకు ఉన్న ఆలోచనల్ని మర్చేలా చేస్తుంటాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని వార్డుల్లోకి వర్షపు నీరుతో పాటు.. మురుగు నీరు చేరటం.. సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో హల్ చేసిన ఈ వైనంతో కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారింది. ఉస్మానియా …

Read More »

హైదరాబాద్ లో ఒక్కరోజులో 50 కరోనా దహనాలు

తెలుగు మీడియాలో సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఒక అగ్ర పత్రిక ఈ రోజున సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. ఓపక్క తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మరణిస్తున్న రోజువారీ మరణాల్ని పదికి మించకుండా చూపించటం తెలిసిందే. అప్పుడప్పడు తప్పించి.. మిగిలిన రోజుల్లో మాత్రం పది కంటే తక్కువగా చూపిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవానికి ఏ మాత్రం సిద్ధం లేదన్న మాట బలంగా …

Read More »

వైసీపీలో విజయసాయికి `గంటా’ గండం !!?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి మాత్రం గంటా చేరిక ఖాయమని, సీఎం జగన్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జోరుగా వదంతులు వినిపిస్తున్నాయి. గంటా చేరికకు జగన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని, గంటా వైసీపీ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి అని వైసీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు …

Read More »

జగన్ కు ఒళ్లు మండేలా చేసిన రఘురామ రాజు

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా ఉంది నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారమంతా. ఎంతైనా జగన్ స్కూల్ కదా? ఒకసారి టార్గెట్ చేసిన తర్వాత.. మాటలతో.. చేతలతో చుక్కలు చూపించే సరికొత్త తీరును ఆయనిప్పుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఏపీ సీఎం జగన్ ఎలాంటి ఎత్తులు వేస్తారో.. సరిగ్గా అలానే వ్యవహరిస్తూ ఆసక్తికరంగా మారారు. బీజేపీ అధినాయకత్వానికి దగ్గరగా.. ప్రధాని మోడీకి.. …

Read More »

రాయపాటికి కొత్త చిక్కులు.. బ్యాంకుల వేలంతో ఉక్కిరిబిక్కిరి

సీనియర్ రాజకీయనేతగా సుపరిచితుడు రాయపాటి సాంబశివరావు టైం ఏ మాత్రం బాగున్నట్లు కనిపించట్లేదు. తాజాగా ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. వ్యాపారవేత్తలుగా రాణించిన రాజకీయ నేతల తొలితరానికి నిలువెత్తు రూపంగా రాయపాటిని అభివర్ణిస్తారు. అలాంటి ఆయన హామీదారుగా ట్రాన్స్ ట్రాయ్ లిమిటెడ్ సంస్థ పలు బ్యాంకుల వద్ద అప్పులు చేసింది. వీటి విలువ వందల కోట్లుగా ఉండటం గమనార్హం. సెంట్రల్ బ్యాంకు వద్ద సుమారు రూ.452 కోట్లకు పైనే ట్రాన్స్ …

Read More »