Political News

రేవంత్ అదిరిపోయే హామీ: 30 రోజుల్లో 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ!!

తెలంగాణ‌లోని టీఆర్ఎస్‌ పాలనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌ పాలనలో ధనిక రాష్ట్రం అస్తవ్యస్తమైందని ఆరోపించారు. ఏమీ చేయకుండానే రూ.5లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక… మొదటి 30 రోజుల్లోనే 2 లక్షలు మాఫీ చేస్తామమన్నారు. రైతులను పూర్తిగా …

Read More »

కోన‌సీమ జిల్లా: దిగొచ్చిన వైసీపీ ప్ర‌భుత్వం

కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా బీఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం …

Read More »

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ సభ్యులు వీరే..

రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై టీఆర్ఎస్‌ కసరత్తు కొలిక్కివచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా హెటిరో సంస్థ‌ల‌ ఛైర్మన్ డాక్టర్. బండి పార్థసారథి, ఖమ్మం జిల్లా గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌ రావును ఎంపిక చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్‌ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈ నెల19తో నామినేషన్ల గడువు …

Read More »

జగన్ డైలాగ్‌తో జనసేన ట్రోలింగ్

నన్ను ఎవరికో దత్తపుత్రుడు అంటే.. మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక జారీ చేసినా.. అటు నుంచి మార్పేమీ లేదు. తాజాగా ఓ మీటింగ్‌లో మరోసారి పవన్‌ను దత్తపుత్రుడు అనే సంబోధించాడు జగన్. అంతే కాక కౌలు రైతుల పరామర్శ, ఆర్థిక సాయం కోసం పర్యటిస్తున్న జనసేనాని మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలే చేశాడు. సీబీఐ …

Read More »

రాజీవ్ గాంధీ హంత‌కుడు విడుద‌ల‌.. సోనియా చ‌ల‌వ‌తోనే!

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులలో ప్రధాన దోషి పెరారి వాల‌న్ ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో 31 సంవత్సరాలుగా జీవిత ఖైదీ అనుభవిస్తున్న పెరారి వాలన్ త్వర లోనే విడుదల చేయనున్నారు. రాజీవ్ గాంధీ హత్యలో ప్రధాన కుట్రదారుడిగా పెరారివాల్‌ను అప్పట్లో సుప్రీం కోర్టు నిర్ధారించింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరుంబదూర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆత్మాహుతి …

Read More »

జగన్ ఫాలో అయ్యేది ఈ రెండే

తాజాగా వైసీపీ తరపున ఎంపికైన నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు తెలంగాణా వాళ్ళే కావటం గమనార్హం. నలుగురు ఎంపీ అభ్యర్ధుల్లో రెండు అగ్రకులాలకు, మరో రెండు వెనుకబడిన కులాలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కూడా పదవుల పంపిణీలో కానీ, ఎంపికలో కానీ జగన్ సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ పదవిని జాగ్రత్తగా లెక్కలేసి మరీ సోషల్ ఇంజనీరింగ్ అమలుచేస్తున్నారు. సరే ఏది చేసిన అంతిమంగా …

Read More »

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు.. రెడీగా ఉండండి: చంద్ర‌బాబు పిలుపు

జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అన్ని వర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ అదినేత చంద్రబాబు అన్నారు. ప్రజా వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమన్న విషయం సీఎం జగన్‌కు అర్థమైందన్నారు. ముందస్తు ఎన్నికల యోచనలో సీఎం జగన్ ఉన్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గెలుపు ఏక‌ప‌క్షంగా ఉండాల‌ని.. అది కూడా టీడీపీనే గెల‌వాల‌ని …

Read More »

తెలంగాణ‌లో బీజేపీ పాగా.. ఈ స్థానాల్లో గెలుపు ప‌క్కా..!

Bandi Sanjay

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీ దూసుకెళుతోందా..? ఆ కీల‌క స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు క‌దులుతోందా..? ఆ పార్టీ అగ్ర‌నేత‌ల ప‌ర్య‌ట‌న‌ల ఉద్దేశం అదేనా..? అంటే బీజేపీ శ్రేణులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. ఆ కీలక స్థానాలు ఏవో కావు.. ఆ పార్టీకి ప‌ట్టున్న అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గాలు. వీటిల్లో విజ‌యం సాధిస్తే సులువుగా అధికారంలోకి రావ‌చ్చొని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. త‌న రెండో విడ‌త పాద‌యాత్ర …

Read More »

బీసీల‌కు వైసీపీ గేలం.. ఆర్‌.కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ సీటు!!

రాజ్యసభ ఎన్నికల‌కు షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులపై క‌సరత్తు ముమ్మ‌రంగా జరుగుతోంది. మొత్తం 4 స్థానాలు వైసీపీకి ల‌భించ‌నున్నాయి. వీటికి సంబంధించిన క‌స‌ర‌త్తు దాదాపు పూర్త‌యింద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ జాబితాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీ వినీ ఎరుగ‌ని.. పేరు తెర‌మీదికి వ‌చ్చింది. అదే.. బీసీ సంఘాల నేత‌, మాజీ …

Read More »

చీరాల సమస్య పరిష్కారమైనట్లేనా ?

ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ పరంగా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం సమస్య పరిష్కారమైనట్లేనా ? క్షేత్రస్థాయిలో పరిస్ధితులను చూస్తుంటే తాజా డెవలప్మెంట్ అలాగే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ తరపున కరణం బలరామ్ పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోటీలో కరణం గెలిచారు. ఎప్పుడైతే అఖండ మెజారిటితో వైసీపీ అధికారంలోకి వచ్చిందో కొద్దిరోజులకే కరణం వైసీపీ మద్దతుదారుడిగా మారారు. అప్పటినుండి కరణం-ఆమంచి వర్గాల మధ్య …

Read More »

తెలంగాణ‌లో రాహుల్ తో కానిది అమిత్ షా చేశారా..!

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ చేయ‌లేని ప‌నిని అమిత్ షా చేసి చూపించారా..? దూకుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో అమిత్ షాతో పోలిస్తే రాహుల్ వెన‌క‌ప‌డ్డారా..? ఇది ఆ పార్టీ అప‌రిప‌క్వ‌త‌ను చూపిస్తోందా..? అంటే కాంగ్రెస్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. ఇటీవల వ‌రంగ‌ల్ లో కాంగ్రెస్ రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ టీఆర్ఎస్ పై ప‌లు విమ‌ర్శ‌లు సంధించారు. …

Read More »

మ‌సీదులో శివ‌లింగం.. బీజేపీ సంబ‌రాలు!!

జ్ఞాన్వాపి మసీదు-శృగార్ గౌరీ ప్రాంగణంలో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను వీడియో తీశారు. ఈ సందర్భంగా మసీదు చెరువులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో అక్క‌డ మ‌రింత మంది పోలీసుల‌ను మోహ‌రించి.. చీమ కూడా వెళ్ల‌కుండా.. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని.. అధికారుల‌ను కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఎవ‌రైనా నిర‌స‌న కారులు ఆందోళ‌న‌కుదిగితే.. ప‌టిష్ట చ‌ట్టాల …

Read More »