Political News

జగన్ సర్కారుకు బ్యాడ్ డే

ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ.. జగన్ సర్కారుకు సుప్రీం కోర్టు షాక్.. ఇలాంటి వార్తలు గత ఏడాది కాలంలో ఎన్ని వచ్చాయో లెక్కే లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని కోర్టు సమర్థిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది తప్ప.. కోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలితే అది వార్తగానే అనిపించట్లేదు. ఇది మామూలే కదా అనుకునే స్థాయిలో జగన్ సర్కారుకు కోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి. తాజాగా రాజధాని వ్యవహారంలో …

Read More »

విశాఖ వెళదామంటే.. హైకోర్టు సీన్లోకి వచ్చేసిందిగా..

అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది ఏపీ రాజధాని తరలింపు వ్యవహారం. ఏపీకి ఒక రాజధాని బదులుగా.. ముచ్చటగా మూడు రాజధానుల ఏర్పాటు అంశం తెర మీదకు రావటం.. అందుకు ఏపీ అసెంబ్లీ ఓకే చేయటం.. రాష్ట్ర గవర్నర్ రాజముద్ర వేయటం వరకు జరిగిన విషయాలు తెలిసిందే. అనంతరం హైకోర్టు ఎంట్రీ వేళ.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడే ఏపీ సర్కారుకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు రాజధాని …

Read More »

అమరావతి: సీఎంతో పాటు, కేబినెట్ కి, బీజేపీ టీడీపీలకు నోటీసులు

అమరావతి రైతులు రాజధాని పరిరక్షణ కోసం ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు వ్యూహాత్మకంగా చట్టం అండగా పోరాడుతున్నారు. రైతుల్లో ఎక్కువమంది చట్టాలు, హక్కులపై అవగాహన ఉన్నవారే కావడంతో ప్రభుత్వాన్ని సులువుగా ఇరుకున పెట్టగలుగుతున్నారు. తాజాగా ఒక అనూహ్యమైన పిటిషను కొత్తకోణంలో హైకోర్టులో దాఖలైంది. ప్రభుత్వం రాజధాని తరలించడానికి దురుద్దేశపూరితమైన చట్టాలను చేసిందని, ఇందులో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములు అయ్యాయని పేర్కొంటూ కొందరు అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »

అదరగొట్టేసే నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ సర్కార్

తప్పులు జరుగుతున్నాయి.. మోసాలు చోటు చేసుకుంటున్నాయి.. నిబంధనల్ని అతిక్రమిస్తున్నారన్న విషయాలు తెలిసినప్పటికీ చూసీ చూడనట్లుగా ఉండటం చాలా ప్రభుత్వాలు చేసేవే. తప్పుల్ని సరిదిద్దేందుకు వీలుగా చట్టాల్ని మరిత కఠినతరం చేస్తే సరిపోతుంది. అలాంటివేమీ చేసేందుకు సిద్ధపడని ప్రభుత్వాల తీరుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు తీసుకున్న దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా నిర్మించే నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేసే విధానానికి బంద్ చేస్తూ సంచలన …

Read More »

ఏపీకి ఊపిరి ఆడటం లేదు !

కరోనా కేసుల విషయంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు చాలా రాష్ట్రాలకు భిన్నంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున టెస్టులు చేయించటం.. భారీగా క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు.. ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు వ్యవహారాలకు చెక్ చెప్పటం.. పేషెంట్లకు ఇచ్చే డైట్ వరకు అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు తానే స్వయంగా చూస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం ఇంత కష్టపడుతున్నా.. కొందరి కారణంగా ప్రభుత్వానికి.. ప్రజలకు జరుగుతున్న నష్టం అంతా …

Read More »

చీరాల టీడీపీ హీరో ఎవరు?

2019 ఎన్నికలకు ముందు వరకు ఏపీలో టీడీపీకి బలమైన నేతలు…అంతే బలమైన కేడర్ ఉంది. గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన నాయకులు ఉన్నారు. అయితే, 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో అనధికారికంగా చేరిపోయారు. మరికొందరు వైసీపీ ఉక్కపోతకు తట్టుకోలేక ఫ్యాన్ గాలిలో సేద తీరేందుకు సిద్ధమవుతున్నారని టీడీపీ వర్గాలు …

Read More »

బ్యాంకులకు పొంచి ఉన్న డేంజర్ చెప్పిన దువ్వూరి

కరోనా వేళ.. దేశీయ బ్యాంకులు ఎదుర్కొనే ముప్పు గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు తెలుగోడు.. ఆర్ బీఐ మాజీ గవర్నర్ గా పని చేసిన దువ్వూరి సుబ్బారావు. బ్యాంకులకు మొండి బకాయిలు పెరిగిపోవటమే కాదు.. రానున్న రోజుల్లో ఇదో పెద్ద సమస్యగా మారుతుందన్న విషయాన్ని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులకు పెరుగుతున్న మొండి బాకీల్ని తగ్గించేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలన్న సూచనను చేస్తున్నారు. మొండి బాకీల్ని పరిష్కరించే …

Read More »

పాత దోస్తు.. కేసీఆర్ కు హ్యాండివ్వబోతున్నారా?

అవసరం రావాలే కానీ.. అప్పుడెప్పుడో వదిలేసిన పాత సంబంధాల్ని సైతం సరికొత్తగా కలుపుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన టాలెంట్ మరెవరికీ లేదంటారు. ఒకసారి అవసరం అయిపోయినా.. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకున్నా.. అప్పటివరకు నెత్తిన పెట్టుకునే వారిని పూర్తిగా పట్టించుకోవటం మానేసే విషయంలోనూ ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. గత ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. సీఎం కేసీఆర్ ఒక పెద్ద …

Read More »

కలెక్టర్లకు జగన్ క్లాస్… ప్రైవేట్ ఆసుపత్రుల దందానే రీజనంట

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాల కలెక్టర్లకు ఓ రేంజిలో క్లాస్ పీకారట. గతంలో మాదిరి ఉదాశీనంగా వ్యవహరిస్తే కుదరదని, అక్రమాలపై, అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా క్షమించేది లేదని కూడా జగన్ కలెక్టర్లకు గట్టిగానే వార్నింగిచ్చారట. ప్రత్యేకించి కరోనా బాధితులకు చికిత్సల పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగిస్తున్న దందాకు కళ్లెం వేయాల్సిందేనని, …

Read More »

రెవెన్యూ ప్రక్షాళన పై మాట నెగ్గించుకోనున్న కేసీఆర్?

ఏదైనా అంశంపై ఒకసారి ఫోకస్ పెడితే చాలు.. దాని లోతుల్లోకి వెళ్లటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. అత్యంత అవినీతి ఉన్న విభాగం ఏదన్న మాట వచ్చినంతనే అందరి నోటి నుంచి వచ్చే సమాధానం రెవెన్యూగా చెబుతారు. దీనికి తగ్గట్లే.. ఈ విభాగంలో చోటు చేసుకునే అవినీతి అంతా ఇంతా కాదు. ఈ ఆరోపణలకు తగ్గట్లే.. ఇటీవల కాలంలో పలు ఉదంతాలు బయటకు రావటం తెలిసిందే. మొన్నటికి …

Read More »

సోనూ కంటే ముందు మోడీ స్పందించాడు

సోనూ సూద్.. లాక్ డౌన్ టైంలో అత్యంత చర్చనీయాంశం అయిన పేరు. కరోనా ధాటికి అల్లాడుతూ, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న జనాలకు అతను చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే అక్కడితో ఆగిపోకుండా పరిస్థితులు చక్కబడ్డాక కూడా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చిందని తెలిసినా స్పందిస్తున్నాడు. వాళ్లకు అత్యవసరంగా సాయం అందిస్తున్నాడు. ఇలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు ఒక్క రోజు …

Read More »

అంబ‌టిపై హైకోర్టులో వైసీపీ నేత‌ల ఫిర్యాదు

Ambati Rambabu

ఏపీ హైకోర్టులో మ‌రోమారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అదే పార్టీకి చెందిన నేత‌లు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అంబ‌టి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలు చేశారు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి, …

Read More »