Political News

ప‌థ‌కాలు ఇస్తున్నా.. గ్రాఫ్ పెర‌గలేదా..?

వైసీపీ నిర్వ‌హించిన తాజా అంత‌ర్గ‌త స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఇస్తున్నామ‌ని.. త‌మ‌కు తిరుగులేద‌ని.. గ‌త ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేశాయ‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు..చేస్తున్న అప్పులు కూడా.. పేద‌ల కోసం.. ప్ర‌జ‌ల కోస‌మేన‌ని చెబుతున్నది కూడా తెలిసిందే. దీంతో త‌మ గ్రాఫ్ దేదీప్య‌మానంగా విరాజిల్లుతోంద‌ని ప్ర‌భు త్వ పెద్ద‌లు చెబుతున్నారు. అయితే.. తాజాగా పార్టీ చేయించిన అంత‌ర్గ‌త స‌ర్వేలు.. ఐప్యాక్‌.. …

Read More »

గాంధీజీ రాక్షసుడిగా దుర్గా మాత విగ్రహం..వివాదం

భారత దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే అనే హిందూ అతివాది హతమార్చిన సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో గాంధీజీని కొన్ని హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో జాతిపితకు ఘోర …

Read More »

Big breaking : మునుగోడు ఎన్నిక డేట్ వచ్చేసింది

మునుగోడు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం తీర్థం పుచ్చుకోవడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇక, సిట్టింగ్ స్థానాన్ని పదిలం చేసుకోవాలని …

Read More »

కేసీయార్ ప్రకటనకు అర్థమేంటి ?

కొత్త జాతీయ పార్టీని ప్రకటించబోతున్న కేసీయార్ పెద్ద పార్టీల్లో దేనితోను కలవదలచుకున్నట్లు లేదు. ఎందుకంటే ఆదివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ తమకు బీజేపీ మాత్రమే ప్రత్యర్ధిగా చెప్పారు. జాతీయ స్ధాయిలో బీజేపీతో మాత్రమే పోటీ పడాలని కేసీయార్ చెప్పటంలో రెండు అనుమానాలు మొదలయ్యాయి. మొదటిదేమో తాను ఎవరితోను కలవదలచుకోలేదన్నది. ఇక రెండోదేమో ఏ పెద్ద పార్టీ కూడా కేసీయార్ తో చేతులు కలపటానికి సిద్ధంగా లేదని. ఈ …

Read More »

పాలిటిక్స్‌పై చిరు సెల్ఫ్ ట్రోల్

దాదాపు మూడు ద‌శాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలిన రారాజు మెగాస్టార్ చిరంజీవి. సినీ రంగంలో అనిత‌ర సాధ్య‌మైన స్థాయిని అందుకుని, అంద‌రి వాడిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ఆయ‌న‌.. రాజ‌కీయాల్లో మాత్రం చేదు అనుభ‌వం ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ పార్టీ పెట్టాక అతి త‌క్కువ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి అయిపోదామ‌ని ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ ఘోర …

Read More »

కేసీఆర్ కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్‌.. ఎవ‌రు పెట్టారంటే!

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం కుదిరింది. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. విజయదశమి రోజున తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం తెలపనున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమైన గులాబీ దళపతి.. జాతీయ పార్టీపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్‌ …

Read More »

ఉత్త‌రాంధ్ర‌ ప్ర‌జ‌లు రాజ‌ధాని రైతులు కాళ్లు విర‌గ్గోడతారు

ఏపీ రాజ‌ధాని అమ‌రావతి రైతుల‌పై వైసీపీ మంత్రులు, నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కాకినాడ దిశ‌గా సాగుతున్న రైతుల మ‌హాపాద‌యాత్ర 2.0ను అడ్డుకోవాల‌ని.. సాక్షాత్తూ.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. నిజానికి మంత్రిగా బాధ్య‌తాయుత స్థానంలో ఉన్న ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించ‌డం.. వివాదానికి దారితీసింది. అయినా.. ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. ఇక‌, తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదే రేంజ్‌లో …

Read More »

పీకే మొదటి అడుగు వేశారా ?

రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) పాదయాత్ర మొదలుపెడుతున్నారు. ఈరోజు అంటే అదివారం నాడు బీహార్లో తన యాత్రను మొదలు పెట్టబోతున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పశ్చిమ చంపారన్ జిల్లాలో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. 1917లో గాంధి మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వాలోనే పీకే కూడా ఉద్యమం మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర సుమారుగా 18 నెలలుగా జరగబోతోంది. చాలాకాలంగా వ్యూహకర్తగా తెరవెనుకకు …

Read More »

కేసీయార్ ది ఒంటరి పోరాటమేనా ?

KCR

జాతీయ పార్టీ పెట్టి నేషనల్ పాలిటిక్స్ లోకి ప్రవేశించాలని అనుకుంటున్న కేసీయార్ ఒంటరి పోరాటం చేయాలని అనుకుంటున్నారా ? అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో, సీనియర్ నేతలతో కేసీయార్ ఈరోజు అంటే ఆదివారం కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈలోపు అందుకు అవసరమైన సన్నాహాలన్నింటినీ కేసీయార్ చేస్తున్నారు. సరే జాతీయ …

Read More »

అట్లుంటది బండ్ల గణేష్ తో..

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కరలేదు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం బండ్ల గణేష్ వార్తలో నిలుస్తుంటారు. ఇటీవల ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ నాగరాజుతో జరిగిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఫైర్ అయిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూరీ జగన్నాథ్ గురించి, పోసాని కృష్ణమురళి గురించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయితే, ఆ ఇంటర్వ్యూలో …

Read More »

అడుగడుగునా పీకే టీం ?

వైసీపీ తరపున నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఐ ప్యాక్ బృందం డైరెక్టుగానే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పీకే బృందం ఇంతకాలం మంత్రులు, ఎంఎల్ఏలతో సంబంధం లేకుండా లోపాయికారీగా తమ పనిని చాపకింద నీరులాగ చేసుకుని వెళ్ళేది. తమ సర్వే నివేదికలను వారం వారం జగన్మోహన్ రెడ్డికి అందిస్తుండేది. కానీ అక్టోబర్ 1వ తేదీ నుండి సర్వే టీములోని సభ్యులు డైరెక్టుగా మంత్రులు, ఎంఎల్ఏలు, …

Read More »

నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యిమందితో టీడీపీ యాక్ష‌న్ ప్లాన్‌…!

టీడీపీ ఇప్పుడు ఈ ప‌నిమీదే బిజీ బిజీగా ఉంది. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి.. వెయ్యి మంది కార్య‌క‌ర్త‌ల‌ను రెడీ చేస్తోంద‌ట‌. ఇప్ప‌టికే.. చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. వీరిలో కొంద‌రు వ‌యోభారంతోనూ.. మ‌రికొంద‌రు.. ఇత‌ర కార‌ణాల‌తోనూ.. ప‌క్క‌న ఉన్నా.. కార్య‌క‌ర్త‌ల‌ను మాత్రం నిరంతరం ఎంగేజ్ చేసేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి..అంత‌ర్గ‌తంగా.. కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకుంటున్నార‌ని అంటున్నారు. పార్టీలో సుదీర్ఘ‌కాలంగా ఉన్న యువ‌త‌ను.. ముఖ్యంగా ఇప్పుడు ఉండ‌వ‌ల్లిలోని టీడీపీ కార్యాల‌యానికి …

Read More »