Political News

రజినీ కాంత్.. నాన్న-పులి

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చ రెండు దశాబ్దాల కిందట మొదలైంది. 90ల్లోనే ఆయన రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాలు ఇచ్చారు. కానీ ఆ విషయంలో ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. వస్తానని చెప్పడు, రాననీ తేల్చడు. రాజకీయాల్లోకి రావాలని రజినీకి లోపల ఉన్నప్పటికీ.. జయలలిత, కరుణానిధి లాంటి రాజకీయ దిగ్గజాల్ని ఢీకొట్టేందుకు ధైర్యం చాలకే ఆయన ఆగిపోయారని సన్నిహితులు అంటారు. చివరికి జయలలిత మరణించి, కరుణానిధి మంచానికి పరిమితమైన …

Read More »

వైసిపి ఎంపి పై అనర్హత వేటుకు టీడీపీ డిమాండ్

సభను తప్పుదోవ పట్టిస్తు, న్యాయవ్యవస్ధపై నోటికొచ్చినట్లు మాట్లాడిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందే అంటూ టిడిపి డిమాండ్ చేసింది. రాజ్యసభలో జరిగిన చర్చపై విజయసాయి మాట్లాడుతూ అసందర్భంగా కోర్టుల్లో న్యాయమూర్తులపై బురదచల్లుతు, దుష్ప్రచారం చేయటం చాలా అభ్యంతరకరమంటూ టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ మండిపోయారు. హైకోర్టు జడ్జీలపై పార్లమెంటులో చర్చించటం, బురదచల్లటం, ఆరోపణలు చేయటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదంటూ కనకమేడల స్పష్టంగా చెప్పారు. తమ సొంత ప్రయోజనాలకోసం …

Read More »

పవన్ అభిమానులను టెన్షన్ పెట్టేసిన మోడీ

సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయమూ వార్తే. సోషల్ మీడియాలో ఒక ప్రముఖుడు ఇంకో ప్రముఖుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం.. అవతలి నుంచి బదులు రావడం.. రాకపోవడం.. ఇవి కూడా చర్చనీయాంశాలే అయిపోతున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, వ్యాపార వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ …

Read More »

ఎయిర్ ఇండియాను మళ్ళీ టాటా చేజిక్కించికుంటుందా ?

వివాదాస్పదమైన ప్రభుత్వ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా అటుతిరిగి ఇటు తిరిగి మళ్ళీ టాటాల చేతికే చిక్కేట్టుంది. దేశంలో అసలు తొలి విమానయాన సంస్ధ టాటా ఎయిర్ లైన్స్ ప్రారంభించిందే టాటా కంసెనీ అన్న విషయ అందరికీ తెలిసిందే. 1932లో జేఆర్డీ టాటా దేశంలో తొలి విమానయాన సంస్ధను ప్రారంభించటమే కాకుండా తొలి విమానాన్ని నడిపిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అటువంటి విమానయాన సంస్ధను ప్రభుత్వం టేకెన్ ఓవర్ చేసిన …

Read More »

మోదీకి బ‌ర్త్‌డే షాక్..కేంద్ర‌మంత్రి రాజీనామా

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఆయ‌న పుట్టిన రోజే ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ వైపు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతుండ‌గా మ‌రోవైపు కేంద్ర కేబినెట్ మంత్రి త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పేశారు! అందులోనూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా!!కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లును నిర‌సిస్తూ, కేంద్రమంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను …

Read More »

కేటీఆర్‌ షాక్‌… టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైండ్ బ్లాంక్‌

రాజ‌కీయాల్లో కొన్ని సార్లు ఎక్క‌డి నుంచో మ‌రెక్క‌డికో ఎత్తుగ‌డ‌లు క‌నెక్ట్ అవుతుంటాయి. తాజాగా తెలంగాణ‌లో రెండో అతిపెద్ద న‌గ‌రం అనే గుర్తింపు పొందిన న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌లో ఇదే జ‌రిగింది. జిల్లాకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు చెందిన క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూల్చి వేశారు. వ‌రంగల్‌లో ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వరంగల్‌లో వరదల సంభవించిన సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇక్కడ …

Read More »

ప్రభుత్వమా ? ప్రతిపక్షాలా ? తిరుపతిలో తేలిపోతుంది

జగన్మోహన్ రెడ్డి 16 మాసాల పరిపాలనకు, ప్రతిపక్షాల ఆరోపణలకు తొందరలోనే నిజమైన పరీక్ష ఎదురు కాబోతోంది. తిరుపతి వైసిపి లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. బల్లి మరణంతో తిరుపతి లోక్ సభ స్ధానం ఖాళీ అయ్యింది. కాబట్టి ఏదో రోజు ఉప ఎన్నికలు తప్పవు.  ఎంపి మరణాన్ని చీఫ్ ఎలక్షన్ కమీషనర్  కేంద్ర ఎన్నికల కమీషన్ కు చెప్పటం ఆలస్యం ఉపఎన్నికల …

Read More »

మంత్రిగారికి ప‌దవీ గండం… వైసీపీలో హాట్ టాపిక్‌!

ఔను.. వైసీపీలో ఈ టాపిక్‌పై జోరుగా చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో గ‌త ప‌దిహేను రోజులుగా సాగుతున్న ప‌రిణామాలు.. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదుర‌వుతున్న దూకుడు.. వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌.. ఆయా ప‌రిణామాల‌ను అరిక‌ట్ట‌డంలోను, ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌డంలోను పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా ఉంది. నిజానికి అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం ఘ‌ట‌న‌లో 10 మంది అధికారుల‌ను స‌స్పెండ్ చేశామ‌ని మంత్రి స్వ‌యంగా …

Read More »

ఏసిబి జోరుకు హైకోర్టు బ్రేక్.. తాత్కాలికమా ? శాశ్వతమా ?

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఎటువంటి విచారణ జరపకుండా హైకోర్టు బ్రేకులు వేసింది. టిడిపి హయాంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసి దమ్మాలపాటి శ్రీనివాస్ పైన ఏసిబి కేసు నమోదు చేసింది. అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం ద్వారా అనుచితమైన లబ్దిపొందారన్నది ఏసిబి అభియోగం. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన దమ్మాలపాటి సుమారు …

Read More »

పార్లమెంటు కట్టబోతున్న టాటా

ఇండియాకు ఇంకొన్నేళ్లలో కొత్త పార్లమెంటు భవనం రాబోతోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొత్త భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రతిష్టాత్మక టాటా సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడం విశేషం. ఈ కాంట్రాక్టు కోసం మొత్తం ఏడు సంస్థలు పోటీపడ్డాయి. మొత్తం రూ.899 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టకు టాటా గ్రూప్‌ అందరికంటే తక్కువగా రూ.861.90 కోట్లకు బిడ్ వేసింది. దాని తర్వాత లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) …

Read More »

ఏపీలో ముఖ్యమంత్రి ఉన్నాడా?…చంద్రబాబు ఫైర్

కొంతకాలంగా ఏపీలో హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులపై వరుస దాడుల ఘటనలు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంతర్వేది ఘటనతో ఏపీతో పాటు దేశంలోని హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, ఆ ఘటనపై ఏపీ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు దేవాలయాలకు సంబంధించి జరిగిన అన్ని ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం కావడం, …

Read More »

దేశంలో బెస్ట్ సీఎం జగన్:అలీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ భేటీ అయ్యారు. సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశానని, కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి తమ నాయకుడు వాకబు చేశారని అలీ మీడియాకు తెలిపారు. షూటింగ్స్ ప్రారంభం కావడానికి సమయం పడుతుందని సీఎం జగన్ కు వివరించినట్లు అలీ చెప్పారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్ చిన్న వయసులోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, …

Read More »