Political News

ఆఫీసులోకి అడుగు పెట్టాలంటే భయపడుతున్నాడా ?

తెలుగుదేశంపార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి కొత్తగా అధ్యక్షుడిగా అపాయింట్ అయిన మాజీ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాస్ భయపడిపోతున్నారట. విశాఖ నడిబొడ్డున ఉన్న పార్టీ కార్యాలయంలోకి రాకుండా గాజువాకలోని తన కార్యాలయంలోనే ఉంటున్నారట. గాజువాక నుండి గతంలో గెలిచిన పల్లాకు స్వతహాగా ఇంజనీరు కూడా. అందుకే కాస్త వాస్తు విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. నగరం మధ్యలో ఉన్న పార్టీ కార్యాలయానికి వాస్తుదోషం ఉన్న కారణంగా తాను నగరంలోని కార్యాలయంలోకి అడుగుపెట్టేది …

Read More »

జూపూడికి కీల‌క ప‌గ్గాలు.. వైసీపీలో చ‌ర్చ‌!

ఎస్సీ నాయ‌కుడు, మాల మ‌హానాడు నేత‌, జూపూడి ప్ర‌భాక‌ర్‌కు మ‌ళ్లీ ద‌శ తిర‌గ‌నుందా? ఆయ‌న‌కు మ‌ళ్లీ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు వైసీపీ అధిష్టానం దృష్టిపెట్టిందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న జూపూడి.. 2014లో ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆయ‌న వివిధ కార‌ణాల‌తో ఓడిపోయారు. ముఖ్యంగా వైసీపీలోని ఓ వ‌ర్గం ఆయ‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని …

Read More »

ఇలా అయితే, ఇంకోసారి జేసీపై గెలవడం కష్టమే

ఒక రికార్డు సృష్టించ‌డం ఎంత క‌ష్ట‌మో.. దానిని నిల‌బెట్టుకోవ‌డం కూడా అంతే క‌ష్టం. రికార్డు సృష్టించ‌డం లో ఉన్న శ్ర‌ద్ధ‌.. దీనిని నిల‌బెట్టుకోవ‌డంలో చూపించ‌డం లేద‌ని, ఈ విష‌యంలో వైసీపీ నాయ‌కులు విఫ‌ల‌మవుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అనంత‌పురం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఇక్క‌డి తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో మూడున్నర ద‌శాబ్దాలుగా జున్నూరు చంటి(జేసీ) దివాక‌ర్‌రెడ్డి హ‌వా చ‌లాయిస్తున్నారు. 30 ఏళ్ల‌పాటు దివాక‌ర్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఇక‌, …

Read More »

గ‌రం గ‌రంగా గుంటూరు ఎంపీల వ్య‌వ‌హారం!

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గుంటూరులోని మూడు కీల‌క పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. రెండు చోట్ల వైసీపీ విజ‌యం సాధించింది. న‌ర‌సారావుపేట‌, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు, యువ నేత‌లు లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు, నందిగం సురేశ్‌లు విజ‌యం సాధించారు. వీరిపై స్థానికంగా ఎంతో బాధ్య‌త ఉంది. పైగా రాజ‌ధాని వివాదం నేప‌థ్యంలో ఇక్క‌డ పార్టీ తిరిగి పుంజుకునేలా.. ప్ర‌స్తుత వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించి, మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌జ‌లను ఒప్పించే బాధ్య‌త కూడా అంతో ఇంతో …

Read More »

టార్గెట్ చేసి ఎంపిపై దాడులు చేయించారా ?

వైసీపీలో తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఇళ్ళు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసి చీటింగ్ కేసులు పెట్టటంతో జగన్మోహన్ రెడ్డి పాత్రుందా ? అంటే… అవుననే మండిపడితున్నారు ఎంపి రాజు గారు. తనను టార్గెట్ చేసి సీబీఐతో దాడులు చేయించి కేసులు పెట్టించారంటూ ఎంపి ఆరోపించారు. మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి కోసం జగన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ …

Read More »

జగన్ కేసులపై విచారణ స్పీడందుకుంటుందా ?

ఆదాయానికి మించిన ఆక్రమాస్తులున్నాయని నమోదైన కేసుల్లో జగన్మోహన్ రెడ్డిపై శుక్రవారం ఈడీ కోర్టులో విచారణ జరుగుతుందా ? ఈ అంశంపై అందరిలోను ఉత్కంఠ మొదలైంది. నేరచరితులైన ప్రజా ప్రతినిధులపై రోజువారీ విచారణలు జరగాలంటూ హైకోర్టు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రెగ్యులర్ కోర్టులోనే జగన్ కు సంబంధించిన అనేక కేసులు వివిధ కోర్టుల్లో విచారణలు …

Read More »

త‌మిళ రాజ‌కీయాల్లో మోడీ కీల‌క వ్యూహం.. ప‌ళ‌ని ఎంపిక వెనుక ఏం జ‌రిగింది?

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తికర ఘ‌ట్టం పూర్త‌యింది. వ‌చ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో అధికార అన్నాడీఏంకే పార్టీలో సీఎం అభ్య‌ర్థి విష‌యంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎడ‌తెగ‌ని పీకులాట చోటు చేసుకుంది. నేనంటే నేనేన‌ని, సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌న్నీర్ సెల్వంలు పోటీ ప‌డ్డారు. వీరిలో ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో ఈ విష‌యం అన్నాడీఎంకేలో …

Read More »

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి

ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స కోసం చేరిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అత్యంత వ్యూహాత్మక నేతగా పేరుపొందిన రాంవిలాస్ పాస్వాన్ (74) మృతి చెందారు. ఆయన గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. ఈరాత్రి తుది శ్వాస విడిచారు. దేశంలో మంచి పేరు సంపాదించిన ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్… దాదాపు …

Read More »

బ‌ల‌రాం – ఆమంచి వివాదానికి జ‌గ‌న్ మార్క్ ట్రీట్మెంట్ ఇదేనా ?

ప్రకాశం జిల్లాలోని చీరాల రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. టీడీపీ తిరుగుబాటు ఎంఎల్ఏ కరణం బాలరామ్-వైసీపీ నేత ఆమంచి కృఫ్ణమోహన్ మధ్య విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. వీళ్ళద్దరి మధ్య ఏదో రూపంలో సర్దుబాటు చేయకపోతే భవిష్యత్తులో పార్టీలో తీరని నష్టం వస్తుందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు సమాచారం. ఇఫ్పటికే చీరాల రాజకీయ పరిస్దితితులపై జగన్ దగ్గర ఫుల్ రిపోర్టుంది. దాంతో వీళ్ళద్దరిని పిలిపించి పంచాయితీని సెటిల్ …

Read More »

నవంబర్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ?

రానున్న నవంబర్ నెలలో కేంద్రమంత్రి విస్తరణవర్గ ఉంటుందా ? ఏమో వైసిపి తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు చెబుతున్న ప్రకారం అలాగే అనుకోవాల్సుంటుంది. అసలు కేంద్రమంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరం ఏమిటి ? ఇప్పటికిప్పుడు అయితే అలాంటి అవసరం ఏమీ లేదనే అనిపిస్తోంది. ఎన్డీఏలో నుండి అకాలీదళ్ బయటకు వెళ్ళిపోయింది. దాంతో ఆ పార్టీ తరపున మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. దాంతో ఓ …

Read More »

గోల్డ్ స్కాం చార్జిషీటులో సిఎం పేరు..కేరళలో సంచలనం

కొద్ది కాలంగా కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గోల్డ్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. గోల్డ్ స్కాం నిందితుల విషయంలో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటులోని పేర్లలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరుండటం సంచలనంగా మారింది. స్కాంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ కు సిఎంతో సన్నిహిత సంబంధాలుండటంతో ముఖ్యమంత్రి పాత్రతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల పాత్రపై మరింత లోతుగా విచారణ జరపాలని …

Read More »

24 ఓట్ల కోసం పోలింగ్ బూత్ !

ఫలితం ముందే ఫిక్స్ అయిన వేళ.. సదరు ఎన్నిక మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిస్థితి ఇలానే ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ మాజీ ఎంపీ కవిత బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యింది. 824 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు అధికార టీఆర్ఎస్ …

Read More »