Political News

‘దొనకొండ‘ బంగారు కొండ కానుందా?

రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో ఒకటైన పల్నాడు ప్రాంతంలోని దొనకొండ పేరు కొద్ది సంవత్సరాల క్రితం వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కలిపి…దాదాపు 50 వేల ఎకరాలు భూములున్న ఈ ప్రాంతంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కాబోతోందని గత ప్రభుత్వం హయాంలో విపరీతమైన ప్రచారం జరిగింది. దీంతో, దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో విస్తారంగా అటవీ, ప్రభుత్వ భూములు ఉన్న …

Read More »

హైదరాబాద్ 150 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టనుందా?

తెలంగాణలో బాగా వర్షాలు పడే నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఈ సిటీలో ఏటా భారీ వర్షాలే పడుతుంటాయి. తెలంగాణలో వర్షాలు పడ్డాయంటే హైదరాబాద్‌లో కచ్చితంగా సగటు వర్షపాతం కంటే ఎక్కువే నమోదవుతుంది. ఈసారి వర్షాలు మరీ భారీగా పడుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో కొన్ని రోజుల పాటు వదలకుండా వర్షాలు కమ్ముకున్నాయి. మొదటి రోజు వర్షాల్ని బాగా ఆస్వాదించిన వాళ్లు.. రెండు మూడు రోజుల తర్వాత …

Read More »

బీజేపీలోకి వైసీపీ నేత‌.. మంత‌నాలు షురూ!

ఏమాటకామాటే చెప్పుకొవాలి. రెడ్డి సామాజిక వ‌ర్గం అంటే.. చెవులు కోసుకునే నాయ‌కుల్లో చాలా మంది మాటేమో కానీ.. గుంటూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన మోదుగుల వేణుగోపాల రెడ్డి.. మ‌న‌సు మారింద‌ని అంటున్నారు జిల్లాకు చెందిన రాజ‌కీయ పండితులు. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌గా సుప‌రిచితులైన మోదుగుల‌కు మిగిలిన రెడ్ల కంటే కూడా రెడ్డి సామాజిక వ‌ర్గంపై ఎన‌లేని మ‌క్కువ‌. అయినా.. ఆయ‌న రాజ‌కీయాలు టీడీపీతో ప్రారంభించారు. 2009లో గుంటూరు …

Read More »

ఏపిలో రాష్ట్రపతి పాలన ?

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ? అవుననే అంటున్నారు వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘరామ కృష్ణంరాజు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, చట్ట వ్యతిరేక విధానాలను చూస్తుంటే తనకు ఏపిలో రాష్ట్రపతి పలన విధించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా శాసన, కార్యనిర్వహక వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తోందంటూ మండిపోయారు. తనపై ఉన్న కేసుల నుండి తనను తాను రక్షించేకునే ప్రయత్నంలో …

Read More »

ప్రవాసులకు సవాలుగా మారిన ఆస్తుల నమోదు

తెలంగాణ రాష్ట్రంలోని వారంతా తమ ఆస్తుల్ని నమోదు చేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వటం.. అందుకోసం భారీ కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయేతర ఆస్తుల్ని నమోదు చేసుకుంటే.. వారికి బ్రౌన్ కలర్ బుక్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ అవకాశం ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. స్థానికులు పలువురికి ఆస్తుల నమోదులో బోలెడన్ని …

Read More »

బిహార్ లో గెలుపు ఎవరిదో చెప్పిన తాజా సర్వే

దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న అంశాల్లో బిహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు. మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికల మీద అన్ని పార్టీలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఆ రాష్ట్రంలో సొంతంగా పాగా వేయాలని బీజేపీ భావించినా..సాధ్యంకావటం లేదు. నితీశ్ పార్టీతో జత కట్టిన బీజేపీ.. తన సొంత బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అయినా గెలిచి తమ సత్తా చాటాలని మహాకూటమి ఆరాటపడుతోంది. ఇలాంటివేళ.. ప్రముఖ మీడియా …

Read More »

బీజేపీకి-ఖుష్పూకు కెమిస్ట్రీ కుదిరేనా? రీజ‌నేంటంటే!

త‌మిళ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా.. ఎంత‌టి వారిపైనైనా.. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించే నేత‌గా గుర్తింపు పొందిన ప్ర‌ముఖ న‌టి.. ఖుష్బూ.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్య రీతిలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం.. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో పార్టీ మారిన తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఆమె అనుచ‌రులుగా ఉన్న‌వారికికూడా చిత్రంగాను, విచిత్రంగాను అనిపించింది. దీనికి కార‌ణం.. ముస్లిం మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఖుష్బూ.. …

Read More »

లోకేష్ ధైర్యం చేశాడంటున్నారు

మొత్తానికి నారా లోకేష్ చాలా ధైర్యమే చేశారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ ను వదిలి చంద్రబాబునాయుడుతో కలిసి లోకేష్ కూడా అమరావతికి వచ్చారు. అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమం 300 రోజులు పూర్తియిన సందర్భంగా లోకేష్ కొన్ని రాజధాని గ్రామాల్లో పర్యటించారు. తండ్రి, కొడుకులు అమరావతికి వచ్చి ఐదు రోజులవుతున్నా ఇప్పటి వరకు పార్టీ నేతలెవరినీ కరకట్ట మీదున్న ఇంట్లోకి అనుమతించలేదు. చంద్రబాబు రాష్ట్రంలోకి వచ్చారన్న కారణంతో …

Read More »

ఏపిలో రాష్ట్రపతి పాలన ?

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ? అవుననే అంటున్నారు వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘరామ కృష్ణంరాజు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, చట్ట వ్యతిరేక విధానాలను చూస్తుంటే తనకు ఏపిలో రాష్ట్రపతి పలన విధించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా శాసన, కార్యనిర్వహక వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తోందంటూ మండిపోయారు. తనపై ఉన్న కేసుల నుండి తనను తాను రక్షించేకునే ప్రయత్నంలో …

Read More »

మళ్ళీ ఢిల్లీకి వెళుతున్న జగన్..పెరిగిపోతున్న టెన్షన్

జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారు. గడచిన 20 రోజుల్లో జగన్ ఢిల్లీకి వెళ్ళటం ఇది మూడోసారి. మొదటిసారి ఢిల్లీకి వెళ్ళిన జగన్ రెండు రోజుల్లో రెండుసార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. తర్వాత వారం రోజులకే పిలుపు రావటంతో మళ్ళీ దేశ రాజధానికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయ్యారు. దాదాపు 50 నిముషాల పాటు జరిగిన భేటిలో కీలక విషయాలు మాట్లాడుకున్నట్లు ప్రచారం …

Read More »

కొత్త అధ్యక్షలపై అప్పుడే అసంతృప్తా ?

అనంతపురం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతల్లో అప్పుడే అసంతృప్తులు పెరిగిపోతున్నాయా ? జిల్లా రాజకీయాలు చాలా ఇంట్రస్టింగ్ గా మారిపోతున్నాయి. జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల జిల్లా అధ్యక్షులను చంద్రబాబునాయుడు ప్రకటించిన దగ్గర నుండి గుంభనంగా ఉన్న అసంతృప్తి మెల్లిగా బయటపడుతోందని సమాచారం. హిందూపురం జిల్లా నియోజకవర్గానికి అధ్యక్షునిగా మాజీ ఎంఎల్ఏ బికే పార్ధసారధిని అనంతపురం జిల్లా నియోజకవర్గం అధ్యక్షునిగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ను చంద్రబాబు నియమించారు. వీళ్ళద్దరినీ …

Read More »

బీజేపీకి అంతుచిక్క‌ని ప‌వ‌న్‌.. ఏం జ‌రుగుతోందంటే!

రాజ‌కీయాల్లో వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు కామ‌నే! అయితే, ఇది ప్ర‌త్య‌ర్థుల‌పై వేసే ఎత్తుగ‌డ‌ల‌కు నిద‌ర్శ‌నం. కానీ, మిత్ర‌ప‌క్షంతో నూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారా? మిత్ర‌ప‌క్షంతో ఉంటూనే.. మ‌రో పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హారిస్తారా? ఇప్ప‌డు బీజేపీలో జ‌రుగుతున్న అంత‌ర్మ‌థ‌నం ఇదే! ప్ర‌స్తుతం త‌మ‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూసి.. బీజేపీ నాయ‌కులు మురిసిపోతున్నార‌నేది వాస్త‌వం. ఆయ‌న వ‌ల్ల త‌మ పార్టీకి 1 శాత‌మైనా ఓటు బ్యాంకు పెర‌గ‌క‌పోతుందా.. కుదిరితే క‌ప్పుకాఫీ …

Read More »