Political News

హ‌ర్ష‌కుమార్ ఏ పార్టీకీ సెట్ కాలేదా?..

అమ‌లాపురం మాజీ ఎంపీ.. సీనియ‌ర్ నాయ‌కుడు, ఎస్సీ నేత‌.. జీవీ హ‌ర్షకుమార్ రాజ‌కీయాల‌పై మ‌ళ్లీ చ‌ర్చ ప్రారంభ‌మైంది. పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో మ‌రోసారి ఆయ‌న చ‌ర్చ నీయాంశంగా మారారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్ టికెట్‌పై అమ‌లాపురం నుంచి రెండు సార్లు విజ‌యం సాధించారు హ‌ర్ష‌కుమార్‌. 2004, 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంపీగా విజ‌యం సాదించారు. అప్ప‌టి కీల‌క నాయ‌కుడు వైఎస్‌కు అనుంగు అనుచ‌రుడిగా కూడా హ‌ర్ష‌కుమార్ పేరు తెచ్చుకున్నారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న …

Read More »

అంతా ఆయ‌నే.. చ‌క్రం తిప్పుతున్న స‌జ్జ‌ల‌!

సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. వైసీపీలో నాయ‌కుడు, వ్యూహాత్మ‌క నేత‌, సీఎం రాజ‌కీయ స‌ల‌హాదారు. ఇంత వ‌రకేనా ఆయ‌న విధులు. అంటే.. కాద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఆయ‌న షాడో చీఫ్ మినిస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పార్టీలో కొన్నాళ్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. నేరుగా సీఎం జ‌గ‌న్‌కు చెప్పుకొనే అవ‌కాశం ఏనాడో పోయింద‌ని నేత‌లు బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకొనేందుకు సీఎం అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని.. ఏదైనా ఉంటే.. …

Read More »

ఈ ఎంఎల్ఏ చివరకు ఎవరికీ కాకుండా పోయాడా ?

జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పరిస్దితిని గమనించిన వాళ్ళకు ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు (ఎస్సీ) నియోజకవర్గంలో గెలిచిన రాపాక పరిస్దితి ఇపుడు గందరగోళంలో పడిందని సమాచారం. గెలిచిన జనసేన పార్టీని కాదని వైసిపికి దగ్గరైన రాపాకకు ఇపుడు అధికారపార్టీలో ఆదరణ కరువైందట. గెలిచిన దగ్గర నుండి తన వ్యవహారశైలి కారణంగా వైసీపీకి అనుబంద సభ్యునిగానే రాపాక కంటిన్యు అవుతున్నారు. తనకు …

Read More »

చేతులు కలిపిన ప్రత్యర్ధులు..జగన్ లెక్క సెట్టవుతుందా ?

జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రత్యర్ధులిద్దరు చేతులు కలపటం బాగానే ఉంది. కానీ క్షేత్రస్ధాయిలో ఈ కలయిక వర్కవుటవుతుందా ? ఇదే ఇపుడు గన్నవరం నియోజవకర్గంలో అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. మొన్నటి జగన్ పర్యటన తర్వాత ప్రత్యర్ధులిద్దరు మళ్ళీ ఎక్కడా కలవలేదని సమాచారం. మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు లేవదీశారు. తర్వాత పార్టీకి దూరమైపోయి వైసీపీకి దగ్గరయ్యారు. నియోజకవర్గంలో సమస్యంతా ఇక్కడే …

Read More »

ఓటు బ్యాంకును స్థిరం చేసుకోవటానికి జగన్ మాస్టర్ ప్లాన్

ఏ పార్టీ హామీ ఇచ్చినా, ఏ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా అంతిమలక్ష్యం అధికారం అందుకోవటమే. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువయిపోతున్న మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇటువంటి వ్యూహాలే కనబడుతున్నాయి. మన రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇదే ఓటుబ్యాంకు రాజీకీయాలతో ఆచరణ సాధ్యంకాని హామిలిచ్చి 2014లో చంద్రబాబు లబ్దిపొందిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత …

Read More »

చైనాను ‘స్మార్టు’గా దెబ్బ కొట్టేందుకు వ్యూహం

సరిహద్దుల్లో ప్రతిరోజు చికాకులు సృష్టిస్తు అనవసరంగా ఉధ్రిక్తతలను పెంచుతున్న డ్రాగన్ ను దెబ్బకొట్టడానికి కేంద్రప్రభుత్వం స్మార్టుగా ఆలోచిస్తోంది. చైనాను ఆర్ధికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పావులు కదుపుతోందని సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే 177 చైనా యాప్ లను నిషేధించిన కేంద్రం తొందరలోనే స్మార్ట్ మొబైల్ ఫోన్లను నిషేధించటంపైన కూడా గట్టిగా ఆలోచిస్తోందట. యాప్ ల నిషేధం వల్లే చైనాకు వేలకోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మరింతగా …

Read More »

పార్టీ నేతల్లో మొదలైన ‘ఏలూరి’ టెన్షన్

ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీలో ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు టెన్షన్ మొదలైందిట. ఈమధ్యనే ఏలూరిని చంద్రబాబునాయుడు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షునిగా నియమించిన విషయం తెలిసిందే. నియామకం జరిగి 15 రోజులు అవుతున్నా ఎంఎల్ఏ ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదట. జిల్లా పార్టీలోని సీనియర్లను కూడా కలవలేదట. తనతో రోజు టచ్ లో ఉండే క్యాడర్ ని తప్ప ఇంకెవరినీ కలవటం లేదట. సరే ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అని విషయం …

Read More »

జ‌గ‌న్ అతివిశ్వాసం.. కొంప ముంచేస్తుందా?

అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్‌.. అనేది సామెత కాదు.. నిజం అంటారు పెద్ద‌లు. వ్య‌క్తుల జీవితాల్లో అయినా.. రాజ‌కీయ నేత‌ల్లో అయినా.. పార్టీల‌కైనా.. అతి ఎక్క‌డా ప‌నిచేయ‌ద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో అతిగా ప్ర‌చారం చేసుకున్న చంద్ర‌బాబు.. చివ‌రికి ఏమ‌య్యారో.. అంద‌రికీ తెలిసిందేన‌ని అంటున్నారు. అదేవిధంగా ఇత‌ర పార్టీలతోనూ ఆయ‌న అతిగానే చె‌ట్టాప‌ట్టాలే సుకుని ముందుకు సాగార‌ని, అతిగానే న‌మ్మార‌ని ఇవ‌న్నీ.. ఆయ‌న‌కు ఎక్క‌డా ప‌నిచేయ‌క‌పోగా.. చివ‌రికి ఆయ‌నే బోనులో నిల‌బ‌డాల్సి …

Read More »

తిరుపతిలో పోటికి సై అంటున్న టీడీపీ

నిన్నా మొన్నటి వరకు ఎన్నికల్లో పోటి చేసే విషయంపైనే ముఖం చాటేసిన సీనియర్ నేతలు తాజాగా పోటికి సై అంటున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పార్టీ పోటి చేస్తుందని ప్రకటించారు. మాజీమంత్రి ప్రకటనతో సీనియర్ నేతలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సోమిరెడ్డి ప్రకటనను తిరుపతిలోని సీనియర్ నేతలెవరు ఏమాత్రం ఊహించలేదని సమాచారం. తిరుపతి …

Read More »

ఈ మాజీ మంత్రిది ఒంటరి పోరాటమేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశంపార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా కొవ్వూరు మాజీ ఎంఎల్ఏ, మాజీమంత్రి జవహార్ నియమించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా జవహర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బలమైన వర్గం ఇంకా వ్యతిరేకిస్తున్న కారణంగా మాజీ మంత్రి ఒంటరైపోయారు. నియోజకవర్గాల పునర్ విభజనలో భాగంగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారింది. టీచర్ గా పనిచేస్తున్న జవహర్ 2014 ఎన్నికలకు …

Read More »

ప‌ద‌వి ఉంటుందో.. పోతుందో..

రాజ‌కీయాల్లో దూకుడు ఉండాలి.. అదేస‌మ‌యంలో ఒకింత జాగ్ర‌త్త‌, ఆలోచ‌న కూడా ఉండాలి. ఈ రెండు లేక‌పోతే.. ముంచుకొచ్చే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అంటారు రాజ‌కీయ పండితులు.. ఇదిగో ఇప్పుడు ఇలా ముంచుకొచ్చే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవడం ఎలా అని త‌ల‌ప‌ట్టుకున్నార‌ట‌.. వైసీపీలో కీల‌క నాయ‌కుడు, మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగ నాథ‌రాజు. రైస్ మిల్లింగ్ రంగంలో కొన్ని ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్న‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి …

Read More »

అదే పనిగా మాట్లాడుతున్నారు…

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాలి. ఎంత రాజకీయాల్లో ఉన్నప్పటికీ అదే పనిగా నోటికి పని చెప్పటం అంత బాగోదు. అవసరమైన వేళ.. అవసరమైనంత మేర మాట్లాడితే దానికి ప్రజలు ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. టార్గెట్ కత్తి పట్టుకొని.. అదే పనిగా విమర్శలు.. ఆరోపణలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. స్థాయిని తెలుసుకొని అందుకు తగ్గట్లు మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. ఇటీవల కాలంలో నరసాపురం ఎంపీ.. …

Read More »