Political News

కేసీయార్ మీద బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసిందా ?

‘టిఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎంఎల్ఏలు మాతో టచ్ లో ఉన్నారు’ ..ఇది తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఇందులో నిజమెంతన్నది పక్కన పెట్టేద్దాం. మరంత మంది ఎంఎల్ఏలు నిజంగానే తమతో టచ్ లో ఉంటే మరెందుకని వాళ్ళందరినీ టోకుగా చేర్చేసుకోవటం లేదు ? ఎందుకనంటే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదనే ఆగుతున్నామని కతలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారపార్టీకి చెందిన ఎంఎల్ఏలను, …

Read More »

సినీ సూపర్ స్టార్ పొలిటికల్ డిజాస్టర్ ఎందుకు?

రాజకీయాల్లో రిటైరయ్యే ప్లాన్ వేసే వేళలో..పొలిటికల్ ఎంట్రీ గురించి ఆలోచించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. వందలాది సినిమాల్లో నటించిన రజనీకాంత్ కు ఎందుకీ విషయం అర్థం కాలేదు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సున్నిత మనస్కుడిగా ఉండే వెండితెర సూపర్ స్టార్ రీల్ లో బాక్సాఫీసు హిట్లను ఎన్నింటినో ఇచ్చారు. అలాంటి ఆయన పొలిటికల్ ఎంట్రీలోనే డిజాస్టర్ అయ్యేలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. డెబ్భై ఏళ్ల వయసు.. అంతకు ముందు …

Read More »

సొంతగూటికి చేరనున్న వంగవీటి రాధా?

బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలిసిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీకి ‘కాపు’లు కాపు కాస్తుంటారు. వంగవీటి రంగా ఉన్నంత కాలం బెజవాడ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించారు. ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాత్రం తన తండ్రి తరహాలో రాజకీయ గుర్తింపు సంపాదించుకోలేదన్న అభిప్రాయం ప్రజలలో ఉంది. మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ …

Read More »

భారతీయులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ ఇండియాలో అతి త్వరలోనే మొదలు కాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలవడానికి 2021 మార్చి వరకు ఎదురు చూడాల్సిందే అని ఇంతకుముందు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు కానీ.. అందుకు రెండు నెలల ముందే వ్యాక్సినేషన్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఆమోదం పొందిన ఆక్స‌్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు ఇండియాలోనూ అనుమతలు లభించగా.. ఒక్క రోజు …

Read More »

వ్యవసాయ చట్టాలపై చర్చలు ఎందుకు ఫెయిలవుతున్నాయి ?

కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రమంత్రులతో జరిపిన చర్చలు మళ్ళీ ఫెయిలయ్యాయి. తదుపరి చర్చలు జనవరి 4వ తేదీన జరిపేందుకు నిర్ణయమైంది. ఇఫ్పటికే అటు కేంద్రమంత్రులకు ఇటు రైతు సంఘాలకు మధ్య ఐదుసార్లు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. చర్చలు ఎప్పుడు జరిగినా విఫలమయ్యాయే కానీ ఒక్కసారి కూడా ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం రాలేదు. అందుకే తాజాగా జరిగిన చర్చలు కూడా ఫెయిలయ్యాయి. కేంద్రమంత్రులతో చర్చలు …

Read More »

అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ?

అన్నదమ్ముల తీరు ఇలాగే ఉంటుంది. తాము అనుకున్నది సాధించుకోవటానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కు బెదిరింపు రాజకీయాలు చేయటం బాగా అలవాటే. తాము కోరుకున్న పదవులు ఇవ్వకపోయినా లేదా టికెట్లు తమకు కానీ తాము చెప్పినవారికి కానీ దక్కదు అనుకున్న మరుక్షణం నుండే ఇటువంటి బెదిరింపులు మొదలుపెట్టేస్తారు. ఈ విషయాలు గతంలో చాలాసార్లు జరిగాయి. ఇదంతా ఎందుకంటే రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరబోతున్నట్లు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రకటించారు. …

Read More »

కేంద్రంలో పెరిగిపోతున్న 4వ తేదీ టెన్షన్

జనవరి 4వ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే రైతుసంఘాలతో చర్చలకు నిర్ణయమైన తేదీ 4వ తేదీనే కాబట్టి. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుసంఘాలు గడచిన 38 రోజులుగా జరుగుతున్న ఉద్యమం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కావాలంటే సవరణలు మాత్రం చేస్తామని ప్రదానమంత్రి నరేంద్రమోడి తెగేసి చెప్పారు. ఈ కారణంగానే ఇటు …

Read More »

బాలయ్య డైలాగ్‌తో హైదరాబాద్ పోలీసుల పంచ్

నీట్‌గా నీతులు చెబితే ఈ తరం యువతకు ఎక్కదు. వాళ్లు పట్టించుకోరు. కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించి, ట్రెండీగా చెబితేనే విషయం వాళ్ల బుర్రల్లోకి వెళ్తుంది. ఈ విషయాన్ని బాగానే అర్థం చేసుకున్న హైదరాబాద్ పోలీస్ వర్గాలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నడిపే తీరు నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. సినిమాలు, క్రికెట్ లాంటి యువతకు నచ్చే అంశాలతో ముడిపెట్టి తాము చెప్పాలనుకున్న విషయాల్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తుంటారు. …

Read More »

ఆలయ ఆస్తుల ధ్వంసానికి జగన్ బాధ్యత వహించాలి: పవన్

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని చారిత్రక రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన పెను ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. రామతీర్థం ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం, పోలీసుల తీరు వివాదాస్పమైంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నా జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తిన …

Read More »

బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరన్నదానిపై కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు మల్లగుల్లాలు పడ్డారు. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందుండగా….మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు …

Read More »

జేడీయులో ముసలం..17 మంది ఎంఎల్ఏల తిరుగుబాటు ?

బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అదికార ఎన్డీయేలోని జేడీయుకి చెందిన 17 మంది ఎంఎల్ఏలు తిరుగుబాటు బాటలో ఉన్నట్లు రాజకీయాల్లో గుప్పుమన్నాయి. ఆర్జేడీ సీనియర్ నేత శ్యామ్ రాజక్ మాట్లాడుతూ నితీష్ కుమార్ పై తిరుగుబాటు చేయటానికి 17 మంది ఎంఎల్ఏలు సిద్దంగా ఉన్నట్లు చేసిన ప్రకటన బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజంగానే 17 మంది ఎంఎల్ఏలు నితీష్ పై తిరుగుబాటు చేస్తారా ? లేదా ? …

Read More »

జగన్ లేఖపై జస్టిస్ రమణ వివరణ కోరిన సీజేఐ బొబ్డే

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం జగన్ చేసిన అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ పరంగా జగన్ లేఖ సంచలనం రేపింది. దేశపు అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకి జగన్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అందులోనూ, బాబ్డే తర్వాత సీజేఐ రేసులో ఉన్న జస్టిస్ రమణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ లేఖ రాయడం కలకలం …

Read More »