Political News

వైసీపీలో రెండో ర‌కం నేత‌లు.. నిఘా ఉన్నా బ‌లాదూర్!

అధికార వైసీపీలో రెండో ర‌కం నేత‌లు ఉన్నారా? పార్టీలో ఉంటూ.. పార్టీ పంచ‌న అధికారం చ‌లాయిస్తూ.. పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. అంతేకాదు, వీరి విష‌యంలో సంచ‌ల‌న అంశం ఏంటంటే.. ఇలాంటి వారిపై పార్టీలో నిఘా ఉండ‌డం! అయినా కూడా నేత‌లు ఎక్క‌డా ఆగ‌డం లేద‌ని, వారు ఏంచేయాల‌ని అనుకుంటున్నారో.. అది చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఆ రెండో …

Read More »

బాబుకు త‌ల‌నొప్పులు వారి నుంచే.. కానీ, మార్చే ప‌రిస్థితి లేద‌ట‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబును ద‌గ్గ‌ర‌గా చూసిన వారు.. ఒక మాట చెబుతారు. ఆయ‌న అతి మొహ‌మాట‌స్తుడ‌ని, న‌మ్మితే.. ఎంత‌టి వారినైనా నెత్తిన పెట్టుకుంటార‌ని, అదేస‌మ‌యంలో అలాంటివారు ఎన్ని త‌ప్పులు చేసినా.. చివ‌ర‌కు త‌న కాళ్ల‌కింద‌కే నీళ్లు వ‌చ్చేలా చేసినా.. స‌హిస్తార‌ని.. అంటారు. బ‌హుశ .. ఇది నిజం కావొచ్చు! ఎందుకంటే.. చంద్ర‌బాబు న‌మ్మిన‌వారు.. ఆయ‌న నెత్తిన పెట్టుకున్న‌వారు చాలా మంది.. త‌ల‌నొప్పిగా మారారు. పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గంలోనూ వారి వ‌ల్ల వివాదాలే …

Read More »

అసంతృప్తితోనే చద‌ల‌వాడ రాజ‌కీయ రిటైర్మెంట్‌!

ఏపీ రాజ‌కీయాల్లో చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తిని గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న ఆయ‌న ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లో ఉన్నారు. అయితే, ఆయ‌న రాజ‌కీయాల‌లో అవ‌కాశవాద ధోర‌ణిని అవ‌లంబించార‌నే టాక్ ఉంది. త‌న ఇష్టాల‌ను గౌర‌వించే పార్టీలో ఉండ‌డ‌మే ఆయ‌న ఇష్ట‌ప‌డ‌తార‌ని, లేక‌పోతే.. పార్టీ ఎలాంటిదైనా.. ఆయ‌న ప‌ట్టించుకోర‌ని ఆయ‌న అనుచ‌రులు అంటారు. చ‌ద‌ల‌వాడ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇది నిజ‌మేన‌ని అనిపిస్తుంది. …

Read More »

రాజధాని కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం చేస్తారా ?

రాజధాని అమరావతి కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం చేస్తారా ? ఇదో ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే రాజధాని అమరావతికి అనుకూలంగాను వ్యతిరేకంగాను చాలా కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. మొత్తంమీద రాజధాని వివాదంపై సుమారు 144 కేసులు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు రోజువారి విచారాణకు రెడీ అయ్యింది. ఈ నేపధ్యంలోనే విజయవాడకు చెందిన లా స్టూడెంట్ వేమూరు లీలాకృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లీలాకృష్ణ బెనారస్ యూనివర్సిటిలో లా చదువుతున్నారు. …

Read More »

ఖుష్బూ వ్యాఖ్యలపై దుమారం

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది ఒకప్పటి నటి, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన ఖుష్బూ తన పాత పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే భాజపా తీర్థం పుచ్చుకున్న ఆమె.. వెంటనే తన పూర్వ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. తాను ఇన్ని రోజులూ మానసిక వికలాంగుల పార్టీలో ఉన్నానని.. …

Read More »

బండారుతో కాకినాడ టీడీపీ బ‌తికిపోయిందా!

బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి..టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్‌. పైగా తూర్పుగోదావ‌రి జిల్లాలో పేరున్న నేత‌. టీడీపీలో నేత‌ల‌ను క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా కూడా ఆయ‌న‌కు పేరుంది. ఇటీవ‌ల టీడీపీ పార్ల‌మెంట‌రీ జిల్లాల ఇంచార్జ్‌ల‌ను నియ‌మించిన‌ప్పుడు.. అత్యంత కీల‌క‌మైన కాకినాడ పార్ల‌మెంటు ఇంచార్జ్ పోస్టును బండారు కు అప్ప‌గించింది. నిజానికి ఆయ‌న కోరుకున్న‌ది ఇంత‌క‌న్నా మెరుగైన పోస్టే.. అయినా.. ప్ర‌స్తుతానికి స‌ర్దుకుపోతున్నారు. ఇక‌, కాకినాడ‌లో టీడీపీ విష‌యానికి వ‌స్తే.. కేడ‌ర్ …

Read More »

జగన్ ఫిర్యాదుపై దేశవ్యాప్తంగా రాజుకుంటున్న వేడి

న్యాయవ్యవస్ధలోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై దేశవ్యాప్తంగా వేడి రాజుకుంటోంది. ఫిర్యాదుకు అనుకూలంగాను, వ్యతిరేకంగా న్యాయనిపుణులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కొందరేమో ఫిర్యాదు చేసినందుకు జగన్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరేమో ఫిర్యాదుపై కచ్చితంగా విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ జరిపించాల్సిందే అంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఇదే విషయమై జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి. ఇంతకీ …

Read More »

కొత్త అద్దె బిల్లు: చెప్పినట్లు ఇల్లు ఖాళీ చేయకుంటే డబుల్ అద్దె

తమ హయాంలో పలు కొత్త చట్టాల్ని తీసుకొస్తున్న మోడీ సర్కారు.. తాజాగా ప్రజలందరూ ప్రభావితమయ్యే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా కొత్త అద్దె చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ముసాయిదానుతాజాగా విడుదల చేసి.. అభ్యంతరాల్ని వెల్లడించాల్సిందిగా కోరుతున్నారు. కేంద్రం తీసుకురావాలని భావిస్తున్న ఈ కొత్త అద్దె చట్టాన్ని పరిశీలించి.. రాష్ట్రాలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కేంద్రం కోరింది. ఇళ్లను అద్దెకు ఇచ్చే …

Read More »

మంత్రి వెల్లంపల్లికి సీరియస్

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు సీరియస్ గా ఉంది. అందుకే అర్జంటుగా విజయవాడ నుండి హైదరాబాద్ లోని అపోలో ఆసుప్రతికి తరలించారు. దాదాపు 15 రోజులుగా వెల్లంపల్లి కరోనా వైరస్ కు చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ఆరోగ్య పరిస్ధితిలో ఎటువంటి డెవలప్మెంట్ కనబడలేదని సమాచారం. పురోగతి కనబడకపోగా మరింత క్షీణించినట్లు డాక్టర్లు గుర్తించారు. దాంతో విజయవాడలో లాభం లేదనుకున్న డాక్టర్లు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత …

Read More »

ఏపీ కాంగ్రెస్… ఉలుకులేదు, పలుకులేదు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేనా? మునుప‌టి ప్రాభ‌వంలో పావ‌లా వంతైనా ద‌క్కేనా? ఇదీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌ను వేధిస్తున్న కీల‌క ప్ర‌శ్న‌. ఒక‌ప్పుడు దాదాపు ప్ర‌తి ఇంటిపై ఎగిరిన కాంగ్రెస్ జెండా, అజెండా కూడా.. ఇప్పుడు వీధుల్లోనూ క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఏపీలో పుంజుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెండు ప్ర‌యోగాలు చేసింది. 2012లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. పార్టీని ముందుకు న‌డిపించే వ్యూహంలో సీమ ప్రాంతానికి పెద్ద‌పీట …

Read More »

విన్నారా? ఆ గ్రామంలో వరదకూ వార్షికోత్సవరమట

వివాహ వార్షికోత్సవం….ఏదైనా సంస్థ వార్షికోత్సవం….ప్రైవేటు పాఠశాలల వార్షికోత్సవం…ఇలా ఎన్నో రకాల వార్షికోత్సవాల గురించి విన్నాం. ఈ వార్షికోత్సవాలన్నీ సంతోషంతో జరుపుకునేవి. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం దగ్గరలో ఉన్న గొల్లప్రోలు గ్రామ ప్రజలు మాత్రం బాధతో ఓ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఆ వార్షికోత్సవానికి విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు. గత 30 సంవత్సరాలుగా తమ గ్రామం వరదనీటిలో మునిగిపోతుందని, ఈ ఏడాది కూడా మునిగిపోయిందని ఆ గ్రామస్థులు …

Read More »

రెడ్ల బాట‌లో నెల్లూరు టీడీపీ.. క‌మ్మ‌ల‌ను ప‌క్క‌న పెడుతున్నారా?

ఏ రోటికాడ ఆ పాటే! అనే సామెత రాజ‌కీయాల‌కు స‌రిగ్గా న‌ప్పుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు రాజ‌కీయాల్లో సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం ఎక్కువైపోయింది. ఒక‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన సామాజిక వ‌ర్గాల హ‌డావుడి.. స‌మీక‌ర‌ణ‌లు ఇప్పుడు జిల్లాల‌కు కూడా వ్యాపించింది. ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా అంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి కంచుకోట అనేక ప‌రిస్థితి కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అధికార వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరును క్లీన్ స్వీప్ చేసింది. …

Read More »