Political News

జగన్ కు చంద్రబాబే ప్రచారం చేస్తున్నాడా ?

తెలుగుదేశంపార్టీలోనే కాదు జనాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబునాయుడు మాట్లాడని రోజు లేదు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది. మీడియా సమావేశాలు పెట్టినా, నేతలతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించినా చివరకు తనను కలవటానికి వచ్చిన నేతలతో మాట్లాడినా …

Read More »

ఫైర్ బ్రాండుకు జగన్ షాక్

పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుపొందిన నగిరి ఎంఎల్ఏ రోజాకు జగన్మోహన్ రెడ్డి షాకిచ్చారా ? తాజాగా ప్రభుత్వం భర్తీ చేసిన బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాన్ని చూస్తే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో రోజాకు బద్ధశతృవు అయిన కే. శాంతిని ఏరికోరి ఈడిగ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమించారు. పైగా కార్పొరేషన్ కు క్యాబినెట్ ర్యాంకు ఉంటుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒక్కసారిగా రోజా, శాంతి …

Read More »

అవును.. అచ్చెన్నాయుడికే టీడీపీ పగ్గాలు

అనుకున్నదే జరిగింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమైంది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఆయన్న ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక టీడీపీ పొలిట్ బ్యూరోలోకి మొత్తం 24 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణనే కొనసాగిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. …

Read More »

బాలయ్యకు వీళ్లు చేస్తోంది మంచా చెడా?

నందమూరి బాలకృష్ణ పేరు నిన్న సోషల్ మీడియాలో కొన్ని గంటల పాటు మార్మోగిపోయింది. బాలయ్యను దాన కర్ణుడిగా అభివర్ణిస్తూ అభిమానులు రెచ్చిపోయి ట్వీట్లు వేసేశారు. బాలయ్య సేవా భావాన్ని తెగ పొగిడేశారు. హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య కోటిన్నర రూపాయల సాయం అందజేశాడని, వెయ్యి మందికి ఆహారం అందిస్తున్నాడన్న వార్త కొన్ని గంటల్లోనే నెట్టింట తెగ చక్కర్లు కొట్టేసింది. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలింది. …

Read More »

ఎలాగైనా వంశీని ఓడిస్తారట

తెగించినోడికి తెడ్డే లింగం! కానీ, అన్నా.. ఏదైదే అదేజ‌రుగుతుంది!– తాజాగా కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే, టీడీపీ అస‌మ్మ‌తి నాయ‌కుడు, వైసీపీ సానుకూల నేత వ‌ల్ల‌భ‌నేని చేసిన వ్యాఖ్య‌లు ఇవేన‌ని నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక్క‌సారిగా ఆయ‌న ఇంత మాట ఎందుకు అన్నారు? నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అంద‌రినీ క‌లుపుకొని వెళ్తాన‌ని చెప్పిన వంశీలో మారిన వైఖ‌రి ఏంటి? ఇప్పుడు అంద‌రి ఆలోచింప చేస్తున్న ప్ర‌శ్న‌లు ఇవి. వ‌రుస విజ‌యాల‌తో …

Read More »

కేసీఆర్ దత్తపుత్రిక ఎంగేజ్ మెంట్.. ఎవరు వెళ్లారంటే?

సవతితల్లి చేతుల్లో దారుణ హింసకు గురై.. స్థానికుల అందించిన సమాచారంతో నరకం నుంచి బయటపడిన ఒక అమ్మాయి గుర్తుందా? చావుబతుకుల మధ్య ఉన్న ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిపించుకోవటమే కాదు.. ఆమెను తన దత్తపుత్రికగా స్వీకరిస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించటం.. ఆమె బాధ్యతల్ని స్వయంగా స్వీకరించటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆ అమ్మాయి ప్రత్యూష. సవతితల్లితో పాటు కన్నతండ్రి హింసకు బాధితురాలిగా మారిన ఆమె …

Read More »

నేతలు ఎక్కువైపోవటం వల్లే గొడవలు పెరిగిపోతున్నాయా ?

జిల్లాలో నేతల వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది.మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లను వైసిపినే గెలుచుకుంది. అలాగే నెల్లూరు ఎంపి సీటులో కూడా వైసిపినే జెండా ఎగరేసింది. గెలిచిన వాళ్ళలో అత్యధికులు హెవీ వెయిట్సే ఉండటంతో పార్టీలో సమన్వయం కొరవడిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ఒకళ్ళు చెబితే మరోకళ్ళు వినే పరిస్ధితి కూడా కనిపించటం లేదు. దాంతో జిల్లాలో నేతల పరిస్ధితి ఎవరికి …

Read More »

వైసీపీ-టీడీపీల్లో ఒక్క‌టే ర‌గ‌డ‌.. ఏజ్ ఫ్యాక్ట‌రే తేడా!!

ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల్లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కామ‌నే! మాకు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని కొంద‌రు.. మాకు ద‌క్క‌కుండా చేశార‌ని మ‌రికొంద‌రు.. అస‌లు మా మొహం చూసేవారు ఎవ‌ర‌ని ఇంకొంద‌రు.. ఇలా అసంతృప్తులు, ఆవేద‌న‌లు కోకొల్ల‌లు. అయితే, ఈ రెండు పార్టీల్లోనూ ఇలా ఆవేద‌న‌కు, ఆందోళ‌న‌కు గురవుతున్న‌వారిలో ఏజ్ ఫ్యాక్ట‌రే తేడా క‌నిపిస్తోంది. అదేంటంటే.. వైసీపీలో సీనియ‌ర్లు.. టీడీపీలో జూనియ‌ర్లు.. త‌మ‌ను ఎద‌గ‌నివ్వ‌డం లేద‌ని, త‌మ‌కు అస‌లు విలువే లేకుండా …

Read More »

ఆమెను వైసీపీలో ఎవరు పట్టించుకోవటం లేదట !

శ్రీకాకుళం మాజీ ఎంపి, కేంద్ర మాజీమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి గుర్తింపు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా ? అధికారపార్టీలోనే ఉన్నా అనుకున్నంత గుర్తింపు రావటం లేదా ? కిల్లి విషయాన్ని ఆరాతీస్తే పార్టీ నేతల్లోనే ఈ విషయాలు చర్చ జరుగుతున్నాయి. జిల్లా పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు, మంత్రులు, ఎంఎల్ఏలు కిల్లిని ఏమాత్రం పట్టించుకోవటం లేదట. ఆధిపత్య సమస్యలతోనే మాజీమంత్రికి పార్టీలోని చాలామంది సీనియర్ నేతలతో ఏమాత్రం పడటం లేదని …

Read More »

సబ్బం హరి టీఆర్పీ తగ్గిపోతోందా?

రాజకీయ నాయకుడిగా కంటే విశ్లేషకుడిగా ఎక్కువ ప్రచారంలో ఉన్న మాజీ ఎంపి సబ్బంహరి వైఖరి రోజురోజుకు విపరీతంగా మారిపోతోంది. వివిధ కారణాలతో జగన్మోహన్ రెడ్డిపై తనలో పేరుకుపోయిన కసిని ఆరోపణలు, విమర్శల రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రిపై సబ్బం చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మీడియాలో బాగా ప్రయారిటి ఇస్తుండటంతో ఈయన మరింత ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడుతున్నారు. తాజాగా సబ్బం చేసిన వ్యాఖ్యలేమిటంటే 2021 లో జగన్ ముఖ్యమంత్రిగా …

Read More »

జగన్ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకుంటుందా ?

గడచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ముంపు తీవ్రత వల్ల సుమారు రూ. 4450 కోట్ల విలువైన ఆస్తులు, పంటలకు నష్టం జరిగినట్లు రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపింది. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ జగన్ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. వరద సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నా, తిరిగి సాధారణ పరిస్ధితులు రావాలంటే కేంద్రం తక్షణమే రూ. వెయ్యికోట్లు మంజూరు చేయాలంటూ లేఖలో …

Read More »

చేతులు కాలాక‌.. జ‌గ‌న్ చ‌ర్య‌లు.. చోద్యం కాదా!

చేతులు కాలాక‌.. ఆకులు ప‌ట్టుకున్న చందంగా వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. పార్టీలో ఎవ‌రైనా హ‌ద్దు దాటితే.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి. లేక‌పోతే.. హెచ్చ‌రించి లైన్లో పెట్టుకోవాలి. కానీ, అంతా అయిపోయిన త‌ర్వాత‌.. చ‌ర్య‌లు తీసుకుంటే ఏంటి ప్ర‌యోజ‌నం అని ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా వైసీపీ నాయ‌కుడు, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ పూనుకొన్నార‌నేవార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించేందుకురంగం సిద్ధం చేస్తున్న‌ట్టు …

Read More »