Political News

ఇక‌, ఉద్యోగుల వంతు.. ‘సోష‌ల్ కేసు’ల‌కు స‌ర్కారు సిద్ధం!

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులు, సామాజిక బాధ్య‌త ఉన్న‌వారు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శించినా.. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను త‌ప్పుబ‌ట్టినా.. లేక సోష‌ల్ మీడియాలో ఏదైనా కామెంట్లు చేసినా.. వెంట‌నే రాత్రికి రాత్రి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డిక‌క్కడ అరెస్టులు.. కోర్టులు.. దెబ్బ‌లు.. కామ‌న్ అయిపోయాయి. వ‌య‌సుతో సంబంధం లేదు.. సీనియార్టీతో అంత‌క‌న్నా ప‌ట్టింపు లేదు.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే చాలు.. వారిని లాగిప‌డేయాల్సిందే! ఇదే తంతుగా మూడేళ్లుగా ఏపీలో పోలీసులు …

Read More »

గ‌న్న‌వ‌రం టికెట్ ప‌ట్టాభికి ఇస్తున్నారా?

ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఏకైక విష‌యం గ‌న్న‌వ‌రం. ఇక్క‌డి టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అనుచ‌రులు.. దాడులు చేయ‌డం.. ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేయ‌డం.. వాహ‌నాల‌కు నిప్పు పెట్ట‌డం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీల‌క బాధితుడిగా మిగిలింది.. పార్టీ అధికార ప్ర‌తినిధి.. క‌మ్మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన కొమ్మారెడ్డి ప‌ట్టాభి. కొన్నాళ్లుగా ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయడం.. స‌వాళ్లు విస‌రడంలోనూ ప‌ట్టాభిముందున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌ట్టాభిని టార్గెట్ …

Read More »

ఆ నలుగిరిపై 26న ఫిర్యాదు

ఏపీ బీజేపీలో అసమ్మతి రోజు రోజుకు పెరుగుతోంది. కన్నా లక్ష్మీ నారాయణ నిష్క్రమణ తర్వాత కమలం పార్టీలోని అసమ్మతి వాదులంతా గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. సోము వీర్రాజు సంగతి తేల్చేయ్యాల్సిందేనని, ఆయన నాయకత్వంలో పనిచేయలేమని చెప్పేందుకు రెడీ అవుతున్నారు. వీర్రాజు, జీవీఎల్ సహా నలుగురు నేతల పెత్తందారీతనాన్ని భరించలేకపోతున్నామని బీజేపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. మంగళవారం మీటింగ్ కేన్సిల్ వీర్రాజుకు వ్యతిరేకంగా అసమ్మతి వాదులు మంగళవారం ఒక మీటింగ్ ఏర్పాటు …

Read More »

కాపుల కోటలో వెలమదొర.. సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారా?

ఏలూరు ఎంపీ, వైసీపీ నేత కోటగిరి శ్రీధర్ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగుతారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మార్పులు ఆళ్ల నానికి అనుకూలం కావొచ్చేమో కానీ కోటగిరి శ్రీధర్‌కు ఏమాత్రం అనుకూలం కాదని.. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ దాదాపు …

Read More »

‘ఆమెకు అప్పులున్నాయి సర్.. టికెట్ నాకే ఇవ్వండి’

టీడీపీలో ఆళ్లగడ్డ అసెంబ్లీ టికెట్‌కు తీవ్రమైన పోటీ ఉంది. భూమా అఖిలప్రియ మరోసారి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తుండగా ఏవీ సుబ్బారెడ్డి కూడా ఇక్కడి నుంచే టికెట్ కోరుతున్నారు. అఖిల తండ్రి నాగిరెడ్డి ఉన్న కాలంలో ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న సుబ్బారెడ్డికి.. నాగిరెడ్డి మరణం తరువాత ఆ కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. అంతేకాదు.. అఖిల ప్రియ, సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. తనను …

Read More »

ఇద్దరూ అధిష్టానానికి దగ్గరే.. టికెట్ ఎవరికో మరి?

తెలంగాణలోని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అక్కడి నుంచి మళ్లీ టికెట్ ఆశిస్తుండగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా మెదక్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ ప్రజల్లో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని, తామే బరిలో ఉంటామని చెప్తుండడంతో కార్యకర్తలు, ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. అటు పద్మ దేవేందర్ రెడ్డి, ఇటు సుభాష్ …

Read More »

సత్తెనపల్లి టీడీపీలో కన్నా టెన్షన్

మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా తేలిపోయింది. దానికి తగ్గట్టుగా రెండు మూడు రోజులుగా కన్నా..సత్తెనపల్లిలో తిరుగుతూ టీడీపీ నేతలందరినీ పలుకరిస్తున్నారు. పొరుగున ఉన్న పెద కూరపాడు నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించినప్పుడు సత్తెనపల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు… కన్నా రాకతో సత్తెనపల్లి టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారంతా ఇప్పుడు సైడైపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. …

Read More »

కాపుల ఓట్లు ఎటు… ఒక్క‌టే టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

కాపు ఓటు బ్యాంకుఎటు వైపు? రాష్ట్రంలో 25 శాతంగా ఉన్న కాపుల‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? ఎవ‌రు ప్రాధాన్యం ఇస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. తాజాగా రెండు రోజుల కింద‌ట ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిలో జ‌రిగిన కాపు నాడు స‌మావేశంలో ఎటు వైపు మొగ్గు చూపాల‌నే విష‌యంపై కాపులు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. వైసీపీ, టీడీపీలు కూడా కాపుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ …

Read More »

ముఖ్య‌మంత్రి ప‌వ‌నే.. తేల్చేసిన హ‌రిరామ‌జోగ‌య్య‌

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా..టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే మాత్రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని.. కాపు సేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగయ్య తేల్చి చెప్పారు. తాజాగా ఆయ‌న ఎన్నిక‌ల కు సంబంధించి ఒక స‌ర్వే రిపోర్టును మీడియాకు విడుద‌ల చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్ప‌కూల‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. జ‌గ‌న్‌కు ఆయ‌న పార్టీకి కేవ‌లం 55 స్థానాల్లోనే విజ‌యం …

Read More »

కన్నా బాటలోనే విష్ణుకుమార్ రాజు

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడిన తరువాత ఆ పార్టీలోని మరికొందరు అసంతృప్తులూ అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన కన్నా ఇంటికి విష్ణుకుమార్ రాజు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో పరిస్థితులు ఏమాత్రం బాగులేవని.. పార్టీలోని సమస్యలను హైకమాండ్‌కు ఎన్నిమార్లు …

Read More »

ప‌ట్టాభి స‌హా 16 మందిపై హ‌త్యాయ‌త్నం కేసులు..

గ‌న్న‌వ‌రంలో కాలిపోయింది.. టీడీపీ వాహ‌నాలు. గ‌న్న‌వ‌రంలో దాడికి గురైంది టీడీపీ కార్యాల‌యం. గ‌న్న‌వ‌రంలో బూతులు తిట్టించుకుంది.. టీడీపీ నాయ‌కులు. గ‌న్న‌వ‌రంలో భౌతిక దాడికి గురైంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు. సో.. బాధితులు ఎవ‌రు? అంటే.. ప‌దో త‌ర‌గ‌తి పిల్లాడిని అడిగినా.. టీడీపీ నేన‌ని చెబుతాడు. కానీ… ఏపీ పోలీసులు మాత్రం.. టీడీపీ నేత‌లేన‌ని అంటున్నారు. వారిపైనే కేసులుపెట్టారు. అవి కూడా హ‌త్యాయ‌త్నం కేసులు పెట్టారు. మ‌రికొంద‌రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు …

Read More »

ఏపీలో 100 సీట్లు గెలిచే పార్టీ ఇదే

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 151 సీట్లు గెలిచింది. కానీ, 2024 ఎన్నికల్లో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని గ్యారంటీ లేదు. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైపన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.. అయితే, 100 సీట్ల మార్క్‌కు చేరుకుంటుందా అంటే అదీ చెప్పడం కష్టమే. ఇక 2019లో చచ్చీచెడీ సింగిల్ సీటు కొట్టిన జనసేన వచ్చే ఎన్నికల్లో …

Read More »